హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఒక అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ బలం తమకుందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని పోటీలో నిలిపినట్టు ఆయన వెల్లడించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయిరెడ్డి సోమవారం హైదరాబాద్ లో ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ ను కలిశారు.
ఈ సందర్భంగా రాజ్యసభ నామినేషన్ కు సంబంధించిన పత్రాలను ఎలక్షన్ కమిషన్ కు అందజేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలపై కూడా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ సరిపోయేంత బలం లేకుండా ఎవరూ ఫిర్యాదు చేయరన్నారు. అలా పోటీ చేస్తే తెలంగాణలో ఏంజరిగిందో అందరికీ తెలుసన్నారు. సరిపోయేంత బలం లేకపోయినా పోటీ చేయడం అనైతికమన్నారు. ఒక అభ్యర్ధిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్య కంటే..ఎక్కువ బలం వైఎస్ఆర్ సీపీకి ఉందన్నారు.
ఈ సందర్భంగా రాజ్యసభ నామినేషన్ కు సంబంధించిన పత్రాలను ఎలక్షన్ కమిషన్ కు అందజేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలపై కూడా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ సరిపోయేంత బలం లేకుండా ఎవరూ ఫిర్యాదు చేయరన్నారు. అలా పోటీ చేస్తే తెలంగాణలో ఏంజరిగిందో అందరికీ తెలుసన్నారు. సరిపోయేంత బలం లేకపోయినా పోటీ చేయడం అనైతికమన్నారు. ఒక అభ్యర్ధిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్య కంటే..ఎక్కువ బలం వైఎస్ఆర్ సీపీకి ఉందన్నారు.
0 comments:
Post a Comment