ఆయన వ్యాఖ్యలపై మేం ఈసీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం. దీనిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఈసీ చర్యలు తీసుకోకముందే నైతిక బాధ్యతగా కోడెల శివప్రసాదరావు రాజీనామా చేయాలి. నేరం ఆయనే బహిరంగంగా అంగీకరించారు. రూ.11 కోట్లు ఖర్చు పెట్టామని రూ.1100 కోట్లు సంపాదనే లక్ష్యంగా కోడెల వ్యవహరిస్తున్నారు. సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుమారుడు, కుమార్తె విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు.
గిన్నీస్ బుక్కులో నమోదైనట్లుగా చెప్పుకుంటున్న మరుగుదొడ్లలో కూడా కమిషన్లు తీసుకున్న నీచమైన స్థాయికి దిగజారారు. శ్మశానాల నిర్మాణంలో కూడా కమిషన్లు తీసుకుంటున్నారు. శవాలపై బొగ్గులు ఏరుకున్నట్లుందని సినిమాల్లో డైలాగులున్నాయని, ఇపుడు శ్మశానాల్లో కూడా కమిషన్లు కాజేసే వాళ్లు బయలుదేరారు. రిజిస్ట్రేషన్ శాఖ, పోలీసు శాఖల్లో కూడా కమిషన్లు తీసుకుంటున్నారు. కోడెల కుమారుడైతే సివిల్, భూ తగాదాల్లో జోక్యం చేసుకుని పోలీసు బలగాలతో ఓ వర్గం కొమ్ముకాస్తూ కోట్లాది రూపాయలు ఖరీదు చేసే భూములను కాజేస్తున్నారు.' అని అంబటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాగా గత ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చు చేశానని కోడెల శివప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కోడెల ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ‘నేను మొదట రాజకీయాల్లోకి వచ్చి 1983 ఎన్నికల్లో పోటీ చేసినపుడు రూ. 30 వేలు ఖర్చయ్యింది. ఆ 30 వేలల్లో కూడా గ్రామాలు, ప్రజల నుంచి చందాలు వచ్చాయి. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చయ్యింది' అని తెలిపారు.
కాగా గత ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చు చేశానని కోడెల శివప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కోడెల ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ‘నేను మొదట రాజకీయాల్లోకి వచ్చి 1983 ఎన్నికల్లో పోటీ చేసినపుడు రూ. 30 వేలు ఖర్చయ్యింది. ఆ 30 వేలల్లో కూడా గ్రామాలు, ప్రజల నుంచి చందాలు వచ్చాయి. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చయ్యింది' అని తెలిపారు.
0 comments:
Post a Comment