బాబు, లోకేశ్ కన్నుసన్నల్లోనే కుంభకోణం : కాకాని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు, లోకేశ్ కన్నుసన్నల్లోనే కుంభకోణం : కాకాని

బాబు, లోకేశ్ కన్నుసన్నల్లోనే కుంభకోణం : కాకాని

Written By news on Thursday, June 23, 2016 | 6/23/2016


బాబు, లోకేశ్ కన్నుసన్నల్లోనే కుంభకోణం : కాకాని
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ కన్నుసన్నల్లోనే సదావర్తి సత్రం భూముల కుంభకోణం జరిగిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో ఆయన గురువారం విలేకర్లతో మాట్లాడుతూ...ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు.

సదావర్తి సత్రం భూముల వేలంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కాకాని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నిజనిర్థారణ కమిటీని అడ్డుకోవడం సబబుకాదన్నారు. ఈ నెల 26న మరోసారి సదావర్తి సత్రం భూముల్లో కమిటీ పర్యటిస్తుందని ఆయన చెప్పారు.
Share this article :

0 comments: