హైదరాబాద్: చెప్పులు వేయించే సంస్కృతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిపై వేయిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడికి ఉసికొల్పుతున్నారని వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తన పేరును చెప్పులనాయుడిగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రెండేళ్ల పాలన వైఫల్యాలపై ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం తప్పా అని నిలదీశారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.
0 comments:
Post a Comment