హైదరాబాద్: సదావర్తి సత్రం భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి గౌతం రెడ్డి డిమాండ్ చేశారు. ఈ భూ కుంభకోణంలో పెదబాబు, చినబాబు హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో.. ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టని చలమలశెట్టి నిరంజన్ బాబుకు వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. ఆయనకు ఉన్న పొలాల్లో వేల నోట్లు కాస్తున్నాయా అని గౌతం రెడ్డి ప్రశ్నించారు. సదావర్తి భూ కుంభకోణంపై బహిరంగ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
Home »
» ఆయన పొలాల్లో వేల నోట్లు కాస్తున్నాయా
ఆయన పొలాల్లో వేల నోట్లు కాస్తున్నాయా
Written By news on Sunday, July 3, 2016 | 7/03/2016
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment