విశాఖ: ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మాజీమంత్రి బలిరెడ్డి సత్యారావు మనమరాలు బిందు మౌనిక వివాహానికి హాజరయ్యారు. నగరంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ హాల్ లో బిందు మౌనిక వివాహం జరిగింది. ఈ వేడుకకు హాజరైన వైఎస్ జగన్ నూతన వధూవరులు బిందు మౌనిక-గిరిధర్ లను ఆశీర్వదించారు. అనంతరం వైఎస్ జగన్ సర్క్యూట్ హౌస్ లో పార్టీ సమన్వయకర్తలతో సమావేశం అయ్యారు. గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంతో పాటు, పలు అంశాలపై చర్చించారు. రాత్రి 7.45 గంటలకు తిరిగి వైఎస్ జగన్ హైదరాబాద్ బయల్దేరతారు.
Home »
» బిందు మౌనిక-గిరిధర్ కు వైఎస్ జగన్ ఆశీర్వాదం
బిందు మౌనిక-గిరిధర్ కు వైఎస్ జగన్ ఆశీర్వాదం
Written By news on Thursday, August 11, 2016 | 8/11/2016
విశాఖ: ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మాజీమంత్రి బలిరెడ్డి సత్యారావు మనమరాలు బిందు మౌనిక వివాహానికి హాజరయ్యారు. నగరంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ హాల్ లో బిందు మౌనిక వివాహం జరిగింది. ఈ వేడుకకు హాజరైన వైఎస్ జగన్ నూతన వధూవరులు బిందు మౌనిక-గిరిధర్ లను ఆశీర్వదించారు. అనంతరం వైఎస్ జగన్ సర్క్యూట్ హౌస్ లో పార్టీ సమన్వయకర్తలతో సమావేశం అయ్యారు. గడప గడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంతో పాటు, పలు అంశాలపై చర్చించారు. రాత్రి 7.45 గంటలకు తిరిగి వైఎస్ జగన్ హైదరాబాద్ బయల్దేరతారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment