పీవీ సింధుకు రెండెకరాల భూమి : విజయ్ చందర్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పీవీ సింధుకు రెండెకరాల భూమి : విజయ్ చందర్

పీవీ సింధుకు రెండెకరాల భూమి : విజయ్ చందర్

Written By news on Saturday, August 20, 2016 | 8/20/2016


హైదరాబాద్: ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధుకు బహుమతుల వర్షం కురుస్తోంది. తాజాగా ఆమెకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ చందర్ రెండెకరాల భూమిని కేటాయిస్తున్నట్లు శనివారం ప్రకటించారు.

కరుణామయుడు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ భూమిని ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్ ఫాంహౌస్ కు సమీపంలోని కరకపట్లలో ఈ భూమి ఉందన్నారు. పీవీ సింధు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా డాక్యుమెంట్స్ అందజేస్తామని విజయ్ చందర్ తెలిపారు.
Share this article :

0 comments: