
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడున్న పది జిల్లాల పాలనే గాడిన పడలేదన్నారు. తాజాగా కొత్త జిల్లాలంటూ గ్రామాల మధ్య కూడా చిచ్చు పెడుతున్నారని శివకుమార్ ధ్వజమెత్తారు. ఇప్పుడు జిల్లాల కోసం పోరాడాల్సి వస్తుందని ఆయన అన్నారు. కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై ఇప్పటికే వేలాది ఫిర్యాదులు అందాయని శివకుమార్ పేర్కొన్నారు.
0 comments:
Post a Comment