చంద్రబాబు మాటలు హాస్యాస్పదం: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు మాటలు హాస్యాస్పదం: వైఎస్ జగన్

చంద్రబాబు మాటలు హాస్యాస్పదం: వైఎస్ జగన్

Written By news on Thursday, September 1, 2016 | 9/01/2016


చంద్రబాబు మాటలు హాస్యాస్పదం: వైఎస్ జగన్
అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం గోరంట్లలో వేరుశెనగ రైతులతో మాట్లాడారు. ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. వేరుశెనగ రైతుల సమస్యలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెయిన్ గన్ వ్యవస్థ పదేళ్లుగా అందుబాటులో ఉన్నా తానే సృష్టించినట్లు చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. పంట ఎండిపోయే వరకూ బాబు స్పందించలేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
18వేల ఎకరాల్లోనే పంట ఎండిపోయినట్లు తప్పుడు లెక్కలు చూపుతున్నారన్నారు. నెలరోజులుగా ఎండిన పంటలను కాపాడటంలో ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యానికి రైతులు నిండా మునిగిపోయారని వైఎస్ జగన్ విమర్శించారు. రెయిన్ గన్ లతో పంటను కాపాడామని ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టేందుకే చంద్రబాబు హడావుడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పంటను ఎలాగూ కాపాడలేకపోయిన ప్రభుత్వం కనీసం ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: