గుంటూరు : వ్యవసాయం దండగన్న అభిప్రాయం నుంచి సీఎం చంద్రబాబు ఇంకా బయటకు రాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు.
గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని వరద ముంపు ప్రాంతాల్లో గురువారం ఆయన పర్యటించారు. భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను, కూలిన ఇళ్లను పరిశీలించిన బొత్స బాధితులను పరామర్శించారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో వరద నష్టం గురించి చంద్రబాబు కనీసం చర్చించకపోవడం బాధాకరమన్నారు.
0 comments:
Post a Comment