దురుద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దురుద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర

దురుద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర

Written By news on Friday, September 2, 2016 | 9/02/2016


భూమనకు సీఐడీ నోటీసులు
హైదరాబాద్: తుని ఘటన కేసులో వైఎస్సార్ సీపీ నాయకుడు భూమన కరుణాకరరెడ్డికి ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

తుని ఘటన కేసులో తనకు నోటీసులివ్వడం దురుద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర అని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు సర్కారు వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.  

జనవరి 31న ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో కాపు ఐక్యగర్జన సభ నిర్వహించిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Share this article :

0 comments: