హైదరాబాద్ : ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించామనడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మాత్రం ప్రెస్ మీట్ ...మేం ఆహ్వానిస్తున్నామని అంటారా అని ఆయన ప్రశ్నించారు.
గురువారం సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ రెండుసార్లు అసెంబ్లీ తీర్మానాలు చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని ప్రత్యేక ప్యాకేజీపై ప్రభుత్వం తరఫున ప్రకటన చేస్తామని, ప్రకటన అనంతరం ప్రతిపక్షం తమ అభ్యంతరాలు చెప్పవచ్చని అన్నారు. అయితే తక్షణమే ఈ అంశంపై చర్చను ప్రారంభించాలని వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టింది.
కాగా కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తామంటే సంతోషమని, ఒకవేళ హోదా ఇవ్వలేకపోతే దానికి సమానంగా నిధులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ చేసిన ప్రకటనపై బుధవారం అర్ధరాత్రి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కాగా కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తామంటే సంతోషమని, ఒకవేళ హోదా ఇవ్వలేకపోతే దానికి సమానంగా నిధులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ చేసిన ప్రకటనపై బుధవారం అర్ధరాత్రి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
0 comments:
Post a Comment