2019 ఎన్నికల ఎజెండా ప్రత్యేక హోదానే: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 2019 ఎన్నికల ఎజెండా ప్రత్యేక హోదానే: వైఎస్ జగన్

2019 ఎన్నికల ఎజెండా ప్రత్యేక హోదానే: వైఎస్ జగన్

Written By news on Tuesday, October 25, 2016 | 10/25/2016


2019 ఎన్నికల ఎజెండా ప్రత్యేక హోదానే: వైఎస్ జగన్
కర్నూలు : వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల ఎజెండాగా మారుస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కర్నూలులో జరుగుతున్న యువభేరి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అందరు కలిసి పోరాడితేనే ప్రత్యేక హోదా ఖచ్చితంగా వచ్చి తీరుతుందన్నారు. సాధ్యం కాదనుకున్న తెలంగాణను ప్రజలు తమ ఉద్యమంతో సాధించుకున్నారని, అలాగే సమిష్టి పోరాటంతో ప్రత్యేక హోదాను కూడా సాధించుకు తీరుదామని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుందని వైఎస్ జగన్ అన్నారు. హోదా కోసం పోరాటం కొనసాగిద్దామని, రాబోయే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ను వైఎస్ఆర్ సీపీ ఎంపీలు స్తంభింపచేస్తారన్నారు. బడ్జెట్ సమావేశాల్లోనూ ప్రత్యేక హోదాపై పోరాడతామని, అప్పటికీ కేంద్రం స్పందించకపోతే బడ్జెట్ సమావేశాల తర్వాత ఎంపీలు రాజీనామాలు చేస్తారన్నారు. ఆ తర్వాత హోదా నినాదంతోనే ఉప ఎన్నికలకు వెళతామన్నారు. మళ్లీ గెలిచి ప్రత్యేక హోదా నినాదాన్ని పార్లమెంట్ లో వినిపిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని కొనసాగిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
Share this article :

0 comments: