
తుని: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేటలో గత 85 రోజులుగా 144 సెక్షన్ అమలుచేస్తున్నారని, దానివల్ల పెళ్లిళ్లు, చావులతో సహా దేనికీ వెళ్లనివ్వకుండా ఇబ్బందులు పడుతున్నారన్నారని తుని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దివీస్ బాధితులను పరామర్శించేందుకు దానవాయిపేటకు వెళ్లారు. మంగళవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో బాధితులను ఉద్దేశించి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడారు. సభలో ఆయన ఏం మాట్లాడారంటే..
- గత 85 రోజులుగా ఇక్కడ 144 సెక్షన్ అమలు చేస్తూ స్థానికులను ఇబ్బందులు పెడుతున్నారు
- దొంగలు, దోపిడీదారులు, కుట్రదారుల మీద ఇలాంటి చర్యలు తీసుకుంటారు. సుమారు 670 ఎకరాలను ప్రభుత్వం దోచుకుంటుంటే ఇవ్వబోమన్నందుకు నానా ఇబ్బందులు పెడుతున్నారని ప్రజలు చెప్పారు
- ఈ భూమి తప్ప వేరే దారి లేదని ప్రజలు చెబుతుంటే వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు
- పోలీసులు రెండు ఎకరాల భూమిని కాపాడుకోలేకపోతున్నారు గానీ, పేద ప్రజల భూములు లాక్కోడానికి ముందు ఉంటున్నారు
- ఇక్కడకు దగ్గరలోనే ఒక శ్మశానం ఉందని.. చివరకు దాన్ని కూడా టీడీపీ నాయకులు ఆక్రమించేశారు
- అలాంటివాటి మీద చర్యలు తీసుకోకుండా.. అమాయక రైతుల మీద పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు
- ఈ ప్రాంతవాసులు ఎంతో మనోధైర్యంతో పోరాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దివీస్ పరిశ్రమ వద్దని చెబుతున్నారు
- చంద్రబాబు మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నట్లు చెబుతున్నారు
- ఎకరం 35 లక్షల రూపాయల విలువతో ఈ భూమి మొత్తం 670 కోట్ల విలువ చేస్తుందని, దాన్ని 35-40 కోట్లకే చంద్రబాబు తనకు కావల్సిన వాళ్లకు కట్టబెడుతున్నారు
- మీరు సీఎం అయిన తర్వాత ఈ 30 నెలల్లో రాష్ట్రంలో ఏదైనా పరిశ్రమ వచ్చిందా, కొత్తగా ఏమైనా ఉద్యోగాలిచ్చావా?
- తుని ఎమ్మెల్యే తోక కోస్తానని ఇటీవల విజయవాడలో ఒక నాయకుడిని చేర్చుకునే సందర్భంలో చంద్రబాబు అన్నారు. అలాంటి వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగవు
0 comments:
Post a Comment