విజయనగరం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు అమలు చేయకపోవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో రాజీపడటం, విద్యార్థులను మోసం చేయడం వంటి విషయాలను విద్యార్థులు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా విజయనగరంలో సోమవారం నిర్వహించిన యువభేరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. చంద్రబాబు చేసిన మోసాల గురించి విద్యార్థులు ఏం మాట్లాడారంటే..
హిమబిందు, బీటెక్ మూడో సంవత్సరం
రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకుని వస్తానని చెప్పి చంద్రబాబు వందలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశీ పర్యటనలు చేశారు. ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అన్నా?
వైఎస్ జగన్
ఫర్నాజ్, ఎంబీఏ
వైఎస్ జగన్
శౌర్య, ఇంజినీరింగ్ ఫైనలియర్
సూర్య, ఇంజినీరింగ్ రెండో సంవత్సరం
వైఎస్ జగన్
ఎన్నికల సయమంలో చంద్రబాబు చేసిన వాగ్ధానాలను (ఎన్నికల సభల్లో రికార్డు చేసిన వీడియోలు) ఈ సందర్భంగా వినిపించారు. అప్పుడు చంద్రబాబు ఏం చెప్పారంటే..
వైఎస్ జగన్
నిఖిల, బీటెక్
వైఎస్ జగన్
హిమబిందు, బీటెక్ మూడో సంవత్సరం
రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకుని వస్తానని చెప్పి చంద్రబాబు వందలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశీ పర్యటనలు చేశారు. ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అన్నా?
వైఎస్ జగన్
- చంద్రబాబు వచ్చీరాని ఇంగ్లీష్ లో మాట్లాడితే పరిశ్రమలు రావు
- ప్రత్యేక హోదా వల్లే వస్తాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే పెట్టుబడులు వస్తాయి
- వందల కోట్లు ఖర్చు చేసి చార్టెడ్ విమానాల్లో విదేశీ పర్యటనలు చేస్తే రావు
- ప్రత్యేక హోదా కోసం అందరం కలిసికట్టుగా పోరాడుతాం
- దేవుని దయ వల్ల మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుంది
ఫర్నాజ్, ఎంబీఏ
- స్టూడెంట్స్ అందరూ చదవాలని వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు
- చంద్రబాబు ఏమో ఎన్నికలపుడు ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తామని చెప్పారు
- ఎన్నికల్లో గెలిచాక అర్థపర్థంలేని పథకాలతో ఎలా తగ్గించాలా అని చూస్తున్నారు
- మీరు సీఎం అయ్యాక మా అందరికీ స్కాలర్ షిప్ లు వచ్చేలా చూడండి
వైఎస్ జగన్
- మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని పూర్తిగా విప్లవాత్మకంగా అమలుచేస్తాం. అన్ని యువభేరిల్లో ఇదే మాట చెబుతున్నాం
- ఫీజు రీయింబర్స్ మెంట్ ను తగ్గించేందుకు చంద్రబాబు లేనిపోని నిబంధనలు పెడుతున్నారు
- బీసీలు, ఎస్సీలు, పేదలపై ప్రేమ ఉందంటారు. వాళ్లకు చేసింది మాత్రం ఏమీ లేదు
శౌర్య, ఇంజినీరింగ్ ఫైనలియర్
- ప్రత్యేక హోదా సంజీవిని కాదు అని టీడీపీ నాయకులు చెబుతున్నారు. సంజీవిని కానప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్, గల్లా జయదేవ్ వంటి వారు పక్క రాష్ట్రాల్లో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారు?
- ఇంకా ఎన్నాళ్లు మమ్మల్ని మోసం చేస్తారు. మోసపోవడానికి ఎవరూ రెడీగా లేరు
- అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అన్నా
సూర్య, ఇంజినీరింగ్ రెండో సంవత్సరం
- ప్రత్యేక హోదా విషయంలో రాజీపడేదిలేదని చంద్రబాబు చెప్పారు. కేంద్రం ప్యాకేజీ ఇవ్వగానే కరిగిపోయారు
- చంద్రబాబుకు 30 ఏళ్లకుపైగా రాజకీయ అనుభవం ఉండి యువతను మోసం చేస్తున్నారు
వైఎస్ జగన్
- చంద్రబాబు మోసం చేయడం వింత కాదు
- ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. ఎంతోమందిని మోసం చేశారు
- యువతనే కాదు చాలా మందిని మోసం చేశారు
ఎన్నికల సయమంలో చంద్రబాబు చేసిన వాగ్ధానాలను (ఎన్నికల సభల్లో రికార్డు చేసిన వీడియోలు) ఈ సందర్భంగా వినిపించారు. అప్పుడు చంద్రబాబు ఏం చెప్పారంటే..
- ఐదేళ్లు కాదు పదిహేనేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలి
- రైతుల రుణాలను మాఫీ చేస్తాం
- డ్వాక్రా సంఘాలను ఆదుకుంటాం. వారి రుణాలను మాఫీ చేస్తాం
- జాబు కావాలంటే బాబు రావాలి
- నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది
- చదువుకున్న వారికి ఉద్యోగాలు రాకుంటే నిరుద్యోగ భృతి ఇస్తాం
- బెల్ట్ షాపులను రద్దు చేస్తాం
వైఎస్ జగన్
- చంద్రబాబు మోసం చేయనివారు ఎవరైనా ఉన్నారా?
- రైతులను, డ్వాక్రా మహిళలను, చదువుకున్న యువతను మోసం చేశారు
- నిజంగా చంద్రబాబు లాంటి వ్యక్తి ఎవరైనా స్వాతంత్ర్యం రాక ముందు ఉన్నట్టయితే స్వాతంత్ర్యం అవసరం లేదనే వారు
- మనకంటే బ్రిటీషోళ్లు అద్భుతంగా పరిపాలిస్తారని చెప్పేవారు
నిఖిల, బీటెక్
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన దేశం మనది. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని మేం ఇంజినీరింగ్ చేస్తున్నాం
- మన రాష్ట్రంలో ఇంజినీర్లు లేరని చంద్రబాబు రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ వాళ్లకు అప్పగించారు
- మన రాష్ట్రంలో ప్రతిభావంతులైన ఇంజినీర్లు లేరా?
వైఎస్ జగన్
- నీకున్న తెలివితేటలు కూడా చంద్రబాబుకు లేవు తల్లీ
- సింగపూర్ వాళ్ల కు కాంట్రాక్టు అప్పగిస్తే అవినీతికి పాల్పడవచ్చని చంద్రబాబు ఆలోచన
- సింగపూర్ వాళ్లకు ఇస్తే కరెప్షన్ విషయం బయటకు రాదు. అటు నుంచి అటే చంద్రబాబు ఎకౌంట్ లో వేస్తారు
0 comments:
Post a Comment