హైదరాబాద్: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మంగళవారం వైఎస్ఆర్ సీపీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో కలసి పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ నేతలు పాల్గొన్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్ఆర్ సీపీలో చేరనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
సోమవారం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కందుల దుర్గేష్ వైఎస్ఆర్ సీపీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కొడుకు మహేశ్ రెడ్డి ఇటీవల వైఎస్ జగన్ ను కలిసి పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు. ఇతర పార్టీల నుంచి వైఎస్ఆర్ సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి.
0 comments:
Post a Comment