హైదరాబాద్ : ఈ ఏడాది (2016)లో ప్రజలు సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. ఆమె శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బాబు గొప్పలు చెప్పుకోవడం తప్ప, సాధించింది ఏమీ లేదన్నారు. ‘ప్రజలు ఇబ్బందులు పడుతూ, కష్టాల్లో ఉంటే మీకు సంతోషంగా ఉందా?. మీ నల్లడబ్బు వైట్ మనీ అయినందుకు మీరు సంతోషిస్తున్నారా?.
కేసుల నుంచి తప్పించుకుంటున్నందుకు సంతోషమా?. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ 21మంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకు సంతోషమా?. ఇలాంటి ఏడాది మునుపెన్నడూ చూడలేదని ప్రజలు బాధపడుతున్నారు. 2016 సంవత్సరం ఏపీకి పెద్ద విపత్తు. వచ్చే ఏడాది అయినా కనీసం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి’ అని వాసిరెడ్డి పద్మ ఈ సందర్భంగా చంద్రబాబుకు సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షంగా ప్రజల గొంతుకై నిత్యం పోరాడుతోందని ఆమె పేర్కొన్నారు.
0 comments:
Post a Comment