వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ యువసేన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ యువసేన

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ యువసేన

Written By news on Saturday, December 3, 2016 | 12/03/2016


వైఎస్సార్‌సీపీలోకి   టీడీపీ యువసేన
సాగర్‌నగర్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితోనే సాధ్యమని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. గడపగడపకు వైఎస్సార్‌లో భాగంగా శుక్రవారం కై లాసగిరి పోలీస్ క్వార్టర్స్, కో ఆపరేటివ్ లే అవుట్ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా జోడుగుళ్లపాలెంకు చెందిన టీడీపీ యువసేన సభ్యులు 70 మందిని వైఎస్సార్‌సీపీలో చేరారు. వారిని వంశీకృష్ణ శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.

ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తూ అహర్నిశలు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీలోకి చేరడం ఆనందంగా ఉందని జి.దుర్గారావు, రాఘవరాం, ఎం. అమర్‌నాథ్, బి.బద్రీ, సీహెచ్.సతీష్ తదితరులు పేర్కొన్నారు.పార్టీ బలోపేతానికి ఐక్యంగా కృషి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆరో వార్డు పార్టీ అధ్యక్షుడు లొడగల రామ్మోహన్, కార్యదర్శి ఉమ్మిడి నాగేశ్వరరావు, గరికిన నూకరాజు, జోడుగుళ్లపాలెం వాడబలిజ సంఘం ప్రధాన కార్యదర్శి గరికిన అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: