07 February 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

చంద్రబాబు వద్దని జనం గగ్గోలు

Written By news on Saturday, February 13, 2016 | 2/13/2016


'చంద్రబాబు వద్దని జనం గగ్గోలు'
శ్రీకాకుళం: ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని దివంగత మహానేత వైఎస్ఆర్ చాటిచెప్పగా, చంద్రబాబు లాంటి సీఎం వద్దని ప్రజలు గగ్గోలు పెడుతున్నారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.

పైడిభీమవరంలో జగన్ ప్రసంగిస్తూ.. చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలను ఎండగట్టారు. 'ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బ్యాంకులో తాకట్టు ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబుకు ఓటేయాలన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలన్నింటినీ విస్మరించారు. చంద్రబాటు అంతటి మోసగాడు దేశంలోనే లేడన్నమాట ప్రతి రైతు నోటా వినిపిస్తోంది. డ్వాక్రా అక్కచెల్లెమ్మలను అడిగితే తమ జీవితంలోనే ఇంతటి అన్యాయస్తుడిని చూడలేదంటున్నారు. ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబు రావాలని టీడీపీ వాళ్లు టీవీల్లో ప్రచారం చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక కొత్త జాబులు రాకపోగా, ఉన్న జాబులను ఊడగొడుతున్నారు. నిరుద్యోగ భృతి ఏదని అడిగితే చంద్రబాబు ఖాళీ చేతులూపుతున్నారు. చంద్రబాబు పరిపాలన గురించి మూడు మాటల్లో చెప్పాలంటే మోసం, మోసం, మోసంలా ఉంది' అని జగన్ అన్నారు.

గేట్లు తెరిస్తే మిగిలేది వారిద్దరే!


గేట్లు తెరిస్తే  మిగిలేది వారిద్దరే!
లోకేష్ వ్యాఖ్యలకు వైఎస్సార్ సీపీ  జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌ ఖండన
తెలంగాణలో టీడీపీని కాపాడుకోలేక అసత్య ప్రచారాలు

 
నక్కపల్లి: ఏపీలో తెలుగుదేశం పార్టీ గేట్లు తెరిస్తే తెలంగాణలో పరిస్థితే ఏర్పడుతుందని పార్టీలో చంద్రబాబునాయుడు, లోకేష్ తప్ప ఎవరూ మిగలరని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. శుక్రవారం ఆయన నక్కపల్లిలోని పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీపై నారా లోకేష్ వ్యాఖ్యలను  ఖండించారు. ముందు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై అసత్య ప్రచారం మానుకుని తెలంగాణలో టీడీపీని కాపాడుకుంటే చాలునని పేర్కొన్నారు. తెలంగాణలోని టీడీపీ ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్‌లో చేరటం ఖాయమని అమర్‌నాథ్ అంటూ అక్కడ పార్టీని, ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చేతకాక  ఏపీలో  ైవె ఎస్సార్‌సీపీని అస్థిర పరిచే విధంగా చంద్రబాబునాయుడు, లోకేష్ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. 2019లో అధికారం వైఎస్సార్‌సీపీదేనని స్పష్టం చేశారు. ఏ ఒక్కరూ పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు. హైదరాబాదర్ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు టీడీపీకి చెంపపెట్టన్నారు. దీనికి సిగ్గుపడకుండా  తండ్రి కొడుకులిద్దరూ ఏపీలో ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ, నిరుద్యోగ భృతి, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, కాపులను బీసీల్లో చేర్చడం, ఇంటికో ఉద్యోగం వంటి హమీలు నెరవేర్చకపోవడంతో తగినగుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొల్ల బాబూరావు మాట్లాడుతూ తెలంగాణలో సైకిల్‌కు పంక్చర్ అయిందని, ఏపీలో యాక్సిడెంట్ అవడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు టీడీపీని వదిలించుకుంటున్నారని, ఏపీ ప్రజలు ఎప్పుడు వదిలించుకోవాలా అని చూస్తున్నారన్నారు. సమావేశంలో పార్టీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి,పీఏసీఎస్ అధ్యక్షుడు మధువర్మ, ఎంపీటీసీ వెలగా ఈశ్వరరావు,  సర్పంచ్‌లు సూరాకాసుల గోవిందు, కొర్లయ్య పాల్గొన్నారు.
 

నేడు శ్రీకాకుళం జిల్లాకు జగన్


నేడు జిల్లాకు జగన్ రాక
పతివాడపాలెం, పైడి భీమవరంలలో వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ
వంశధార నిర్వాసితులకు సంఘీభావం
పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి వెల్లడి

 శ్రీకాకుళం అర్బన్ : వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి శనివారం జిల్లాకు రానున్నారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుమార్తె వివాహం సందర్భంగా జరిగే కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి తెలిపారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో జగన్‌మోహన్‌రెడ్డి 8.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జిల్లాకు వస్తారన్నారు. మార్గమధ్యలో 9.30 గంటలకు పైడిభీమవరం, 10 గంటలకు పతివాడపాలెం ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరిస్తారని ఆమె పేర్కొన్నారు.  11 గంటలకు ఆమదాలవలస బ్రిడ్జి వద్ద పార్టీ నాయకులంతా జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలకనున్నారన్నారు. 11.30 గంటలకు మండల కేంద్రమైన సరుబుజ్జిలిలో కూడా జగన్‌కు ఘనస్వాగతం పలకనున్నారన్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు హిరమండలం వద్దనున్న వంశధార నిర్వాసితులు వైఎస్ జగన్‌ను కలిసి తమ కష్టాల్ని చెప్పుకుంటారని ఆమె తెలిపారు. అనంతరం కొత్తూరు మండలం మాతలలో కలమట వెంకటరమణ స్వగృహానికి వెళ్లి నూతన వధూవరుల్ని ఆశీర్వదించనున్నారు.
 
ఘనస్వాగతం పలికేందుకు సన్నాహాలు
ఆమదాలవలస: జగన్ పర్యటన విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ైెహ పవర్ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం పార్టీ శ్రేణులను కోరారు. పట్టణంలోని స్వగృహంలో శుక్రవారం విలేకరల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆమదాలవలస పట్టణ శివార్లలోగల టీ.ఎస్.ఆర్ జూనియర్ కళాశాల ఎదుట పాల కొండ రోడ్ వద్ద ఆయనకు నియోజకవర్గ వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపాలిటీ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటారన్నారు.

నియోజకవర్గంలో గల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాసంఘాలువారు పెద్ద ఎత్తున పాల కొండ రోడ్‌లోగల టీ.ఎస్.ఆర్ కళాశాల వద్దకు చేరుకోవాలని  పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ ప్లోర్ లీడర్  బొడ్డేపల్లి రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అనుకోని అతిథి..!


అనుకోని అతిథి..!
జగన్‌మోహన్‌రెడ్డి రాకతో
 పరవసించిన పెళ్ళి ఇళ్లు
సామాన్యుల పెళ్ళికి జననేత
 రావడంతో పట్టలేని సంతోషం


 సాక్షి, గుంటూరు
: పెళ్లంటే నూరేళ్ల పంట... ప్రతి వ్యక్తి జీవితంలో మరుపురాని, మర్చిపోలేని తీపి జ్ఞాపకం పెళ్లి.. అటువంటి పెళ్ళి తమ జీవితకాలం గుర్తుండిపోతుంది. ఆ పెళ్ళికి వారు ప్రాణంగా అభిమానించే నాయకుడు స్వయంగా వచ్చి దీవెనలు అందజేసి వారి ఆతిథ్యం స్వీకరిస్తే ఇక ఆ జంటకు ఆ మధుర జ్ఞాపకాలు కలకాలం నిలిచిపోతాయి. అలా పెళ్లి చేసుకున్న జంటలు తుళ్ళూరు మండలం ఉద్దండరాయునిపాలెం, వడ్డమాను గ్రామాలకు చెందిన వారు కాగా వారి పెళ్ళికి హాజరైన విశిష్ట అతిథి, అభిమాన నాయకులు వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తుళ్ళూరు మండలం ఉద్దండరాయునిపాలెం, వడ్డమాను గ్రామాల్లో సామాన్య కార్యకర్తల వివాహ వేడుకలకు హాజరయ్యారు. తుళ్ళూరు మండల యువజన విభాగం కన్వీనర్ నందిగం సురేష్ మేనల్లుడు చలివేంద్రం నాగేంద్రబాబు, ఝాన్సీ వివాహం,  అదేమండలం  వడ్డమాను గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త గొట్టం శివారెడ్డి కుమారుడు గొట్టం చంద్రశేఖరరెడ్డి అనురాధ వివాహాలకు జగన్‌మోహన్‌రెడ్డి  హాజరయ్యారు. అనుకోని అతిథి తమ ఇంట్లో వివాహానికి హాజరుకావడంతో ఆనందంతో వారు ఉబ్బితబ్బిబయ్యారు. ప్రతిపక్ష నేత  సామాన్యుల పెళ్ళికి జననేత జగన్ రావడంతో గ్రామం మొత్తం పెళ్ళింటి వద్దకు చేరుకొని ఆయన్ను చూసేందుకు, కరచాలనం చేసేందుకు, పోటీ పడ్డారు.

 జన్మలో మర్చిపోలేను

 నా మేనల్లుడు వివాహానికి వస్తానంటూ వైఎస్ జగన్‌మోహనరెడ్డి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సామాన్య కార్యకర్తలమైన మా ఇంట్లో జరిగే వివాహానికి ఆయన హాజరుకావడం అత్యంత అద్భుతంగా ఉంది. కలలో కూడా ఆయన వస్తారని ఊహించలేదు. ఆ రోజును నేను నా జన్మలో మర్చిపోలేను.    -నందిగం సురేష్, మండల పార్టీ కన్వీనర్

మేమంతా జగన్ వెంటే ఉంటాం..


నీవైపు రావడానికి ఏంటి నీ గొప్ప?
నీవైపు రావడానికి ఏంటి నీ గొప్ప?
చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా
మేమంతా జగన్ వెంటే ఉంటాం..

 
 హైదరాబాద్: అధికారంలోకి వచ్చినరోజు నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్ని తమ వైపునకు లాక్కోవడానికి చంద్రబాబు నయానోభయానో బెదిరిస్తూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కరూ అటువైపు వెళ్లలేదంటే ఆయనేంటో, ఆయన నాయకత్వమేంటో తెలుసుకోవాలని పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని విన్నాం. అలాగే పచ్చపార్టీకి చెందిన సీఎం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలంతా తమ పార్టీలోకి వచ్చేసినట్టు భ్రమపడుతున్నారు.

ఆ భ్రమను ప్రజలకూ కలిగించాలన్న ప్రయత్నాన్ని నిన్న చానల్స్‌లో చూశాం.  కానీ ఒక్కరూ కలవలేదంటే ఒక్కసారి ఆయన గురించి ఆయనే ఆలోచించుకోవాల్సిన అవసరముంది’ అని అన్నారు. అయినా తమ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు వైపునకు వెళ్లడానికి ఆయన గొప్పేంటని ఆమె ప్రశ్నించారు.   అవి నీతి, వంచనకు, వెన్నుపోటుకు, విశ్వాసఘాతుకానికీ కేరాఫ్ అడ్రస్సైన చంద్రబాబు వద్దకు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ వెళ్లరన్నారు. జగన్ వెంట ఉన్నవారందరమూ ఆయన అధికారంలో ఉన్నప్పుడు వచ్చినవారం కాదని రోజా గుర్తుచేశారు. ప్రజలు అధికారమిచ్చినప్పుడు రాజన్నరాజ్యం తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్న జగన్‌వెంటే తాముంటామన్నారు. రాజశేఖరరెడ్డి, జగన్, వారి కుటుంబసభ్యులకోసం ప్రాణాలిచ్చేవారు లక్షలమంది ఉన్నారని.. చంద్రబాబుకోసం ప్రాణాలు తీసుకునే ఆయన అనుచరుల పేర్లు ఇద్దరివి చెప్పగలరా? అని ప్రశ్నించారు.

 కమిటీ తీరుపై స్పీకర్‌కు లేఖ రాస్తా
 తన సస్పెన్షన్ తదనంతర పరిమాణాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ సమావేశాలు జరుగుతున్న తీరుపై స్పీకర్‌కు లేఖ రాయబోతున్నట్టు రోజా పేర్కొన్నారు. తాననని వాటిని, అన్నట్టుగా సృష్టించి, సోషల్‌మీడియాకు విడుదల చేశారన్నారు. అవి ఎడిట్ అయినట్టు.. నాలుగైదురకాల చీరెల్లో తాను మారిమారి ఉన్నట్టు వీడియోలో తెలుస్తుందన్నారు. జీరోఅవర్‌లో ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చిన ఒక లీకేజీపై చర్చ జరిపి అదేదో తాను తప్పు చేసినట్టు ఫిక్స్‌అయిపోయి, తనకు ఇంకేదో శిక్ష వేయాలన్న ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పీకర్‌కు లేఖ ఇవ్వడంతోపాటు సైబర్‌క్రైం కార్యాలయంలోనూ ఫిర్యాదు చేయబోతున్నానని చెప్పారు. అసెంబ్లీలో తనపై ఎవరు వీడియో చిత్రీకరణ చేశారన్న దానిపై అసెంబ్లీ కార్యదర్శి వివరణ కోరితే.. ఆయన్నుంచి నిర్లక్ష్యపు సమాధానం వచ్చిందన్నారు. అసెంబ్లీ కార్యదర్శిపై చార్జిషీటున్నా విధుల్లో కొనసాగడంపై త్వరలో గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిపారు.

టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు

Written By news on Friday, February 12, 2016 | 2/12/2016


'టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు'
గుంటూరు: టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. వారు ఏక్షణమైనా తమ పార్టీలోకి రావొచ్చని చెప్పారు. టీడీపీ మునిగిపోయే ఓ నావలాంటిదని వైఎస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. గుంటూరు జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్టారెడ్డి, ఆర్కె, ముస్తాఫా, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..'టీడీపీలోకి చేరాలని ఏ ఎమ్మెల్యే అనుకోరు. టీడీపీ ఎమ్మెల్యేలను చూస్తే ప్రజలు ఈసడించుకుంటున్నారు.

గడిచిన రెండేళ్లలో టీడీపీ ఏ ఒక్క మంచిపని చేయలేదు. కొన్ని మీడియా సంస్థలు కావాలనే మా పై దుష్ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణలో టీడీపీ క్లోజ్ కావడంతో ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి కుయుక్తులు పలుకుతున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు ఇస్తాం. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. ఎప్పుడైనా వారు మా పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది' అని వారు అన్నారు. 

టీడీపీ పల్లకీ కాదు.. పాడే అని త్వరలో తెలుస్తుంది


'టీడీపీ పల్లకీ కాదు.. పాడే అని త్వరలో తెలుస్తుంది'
హైదరాబాద్: ఏం చూసి టీడీపీలోకి చేరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. కౌరవులకన్నా ఒక సంఖ్య ఎక్కువే ఉన్న మీరంతా చేస్తుంది ఓ పనికి రాని పాలన అని ఆమె దుయ్యబట్టారు. ప్రజలంతా టీడీపీ ఎమ్మెల్యేలను అసహ్యించుకుంటున్నారని, అలాంటి ఎమ్మెల్యేలున్న పార్టీలోకి తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా చేరతారని ప్రశ్నించారు.

ఇదంతా ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం అన్నారు. తమపై గోబెల్స్ ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై చట్టపరంగా ముందుకు వెళతామని, దయచేసి అలాంటి ప్రచారానికి ఏ మీడియా దిగొద్దని అన్నారు. 35 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడికి హైదరాబాద్ ప్రజలు చుక్కులు చూపించారని అన్నారు. ఆయన హైదరాబాద్ నెంబర్ వన్ తానే చేశానని చెప్పుకుంటే నిజంగానే ప్రజలు ఆయనకు ఒక్కటే సీటు మిగిల్చారని చెప్పారు.

భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబుకు రెండు ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే మిగులుతాయని అన్నారు. చంద్రబాబునాయుడి పార్టీ ఓ మునిగిపోయే పడవ అని అందులోకి ఎవరు పోయినా మరింత వేగంగా అది మునిగిపోతుందని జోస్యం చెప్పారు. ఆ పార్టీలో ఉన్నవారంతా తామున్నది పల్లకిలో అని భావిస్తున్నారని, అది పాడే అనే విషయం త్వరలోనే తెలుస్తుందని రోజా చెప్పారు. ఇంకా ఆమె చంద్రబాబు నాయుడిని ఏమేం ప్రశ్నించారంటే..
  • ఏం చూసి మా ఎమ్మెల్యేలు మీ పార్టీలోకి వస్తారు?
  • నీ పార్టీలో అసలు ఏం సరుకు ఉంది?
  • మంచి కార్యక్రమాలు చేయలేక మీరంతా చతికిలబడ్డారు
  • అవినీతి, వంచెన, విశ్వాసఘాతుకం, వెన్నుపోటుకు పేరు పెట్టిన నీ పార్టీలోకి ఎవరు వస్తారు.. రాక్షస సంతతి వారు మాత్రమే వస్తారు.
  • జన్మభూమి పేరిట కమిటీలు వేసి ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి ఫించన్లు రద్దు చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారు.
  • ఎమ్మెల్యేలను లాక్కోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.
  • నిలదీస్తే సస్పెన్షన్ వేశారు, లేదంటే కేసులు పెట్టారు, ప్రలోభాలు పెట్టారు.. కానీ ఒక్కరైనా నీ పార్టీలోకి వచ్చారా?
  • ఇప్పుడున్న తమ ఎమ్మెల్యేలంతా వైఎస్ జగన్ వెనుక ఉంది అధికారం చూసి కాదు కష్టాలు చూసి.
  • ప్రజలకు అండగా వైఎస్‌ జగన్ ఉన్నారు. రాజన్న పాలన తీసుకురావాలనుకుంటున్నారు.
  • చంద్రబాబు అస్తమించే సూర్యుడు.. వైఎస్ జగన్ ఉదయించే సూర్యుడు
  • చంద్రబాబు పాత టైప్ రైటర్.. వైఎస్ జగన్ హైస్పీడ్ ఆపిల్ కంప్యూటర్ అంటూ ఆమె చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

ఫలించిన ఒంగోలు ఎంపీ వైవీ కృషి


ఫలించిన ఒంగోలు ఎంపీ వైవీ కృషివైవీని ఆహ్వానిస్తున్నబ్రెజిల్ ప్రతినిధి లెవ్రోస్
ఒంగోలు జాతి పశుసంపద పరిరక్షణకు బ్రెజిల్ సంసిద్ధత

ఒంగోలు టూటౌన్: ఒంగోలు జాతి పశుసంపద అభివృద్ధికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేస్తున్న కృషి ఫలించింది. పశుసంపద వృద్ధికి ఎంతోకాలంగా బ్రెజిల్ అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి ఇచ్చేందుకు ఆ దేశం అంగీకరించింది. అందులో భాగంగా బ్రెజిల్‌లో ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు జరిగే ‘ఎపోజెబ్ ఎక్స్‌పో’కు హాజరవ్వాలంటూ ఎంపీ వైవీకి ఆహ్వానమందింది. ఆహ్వాన పత్రికను బ్రెజిల్ దేశ ప్రతినిధి డాక్టర్ జోస్ ఓటాలియా లెవ్రోస్ గురువారం హైదరాబాద్‌లో ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఆయన నివాసంలో కలసి అందజేశారు.

ఒంగోలు జాతి పశుసంపద అభివృద్ధికి బ్రెజిల్ శాస్త్రవేత్తలు అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి అందించాలని గతేడాది నవంబర్ 14న ఆ దేశ వ్యవసాయశాఖ మంత్రిని న్యూఢిల్లీలో కలసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ‘ఎపోజెబ్ ఎక్స్‌పో’కు హాజరవ్వాలని ఎంపీ వైవీకి బ్రెజిల్ ఆహ్వానం పంపింది. పశుసంపద అభివృద్ధికి బ్రెజిల్ వినియోగించే శాస్త్ర సాంకేతిక పరికరాల్ని ఎక్స్‌పోలో ప్రదర్శిస్తారు. ఈ ఎక్స్‌పోలోనే భారత ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకునేందుకు బ్రెజిల్ సిద్ధంగా ఉందని ఎంపీ తెలిపారు. ఎక్స్‌పోకు కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్, రాష్ట్ర వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావును కూడా ఆహ్వానించారన్నారు.

పారని పాచిక


బెడిసికొట్టిన చంద్రబాబు ‘ఎల్లో’ వ్యూహం
ప్రలోభాలను, ప్రచారాలను తిప్పికొట్టిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు


సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సంక్షోభం చుట్టుముట్టిముట్టినప్పుడల్లా ప్రజల దృష్టిని మరల్చడానికి ఏదో ఒక  దుష్ర్పచారాన్ని లేవదీయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మించినవారు లేరు. మనసెరిగిన అనుంగు చానళ్లను, పత్రికలను ఉపయోగించుకుని ఈ ప్రచారాన్ని ఆయన పతాకస్థాయికి చేరుస్తారు.

పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను ఇలాంటి గోబెల్స్ ప్రచారంతోనే ఆయన వెన్నుపోటు పొడవడం అందరికీ తెలిసిన విషయమే. తొలిసారి సీఎం అయినప్పటి నుంచి ఎప్పుడు సంక్షోభం తలెత్తినా ఆయనది ఇదే బాణి. మరోసారి అలాంటి వ్యూహాన్ని ప్రయోగించబోయిన చంద్రబాబు ఇపుడు బొక్కబోర్లాపడ్డారు. ఆయన వేసిన పాచిక పారలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తెలుగుదేశం పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారంటూ అనుకూల పత్రికల్లో పతాక శీర్షికల్లో వండి వార్చిన కథనాలు బెడిసికొట్టాయి.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో ఈ దుష్ర్పచారాలను ఖండించడంతో ఊహించని పరిణామానికి అధికార పార్టీ అధినేతకు దిమ్మతిరిగింది. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను  ప్రలోభపెట్టడానికి ఆయన రంగం సిద్ధం చేశారని వినిపిస్తోంది. రెండేళ్లలో సంపాదించిన అవినీతి సొమ్మును విచ్చలవిడిగా వెదజల్లయినా కొద్దిమంది ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆకర్షిద్దామనుకున్న ‘పథకం’ నీరుగారింది.
 
ఊపిరి సలపనీయని సంక్షోభాలు
ఇపుడు ఒకటోరెండో కాదు అనేక సంక్షోభాలు తెలుగుదేశం పార్టీని చుట్టుముట్టాయి. ఊపిరిసలపనీయనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణలో పార్టీ మొత్తం ఖాళీ అయిపోయింది. ఎమ్మెల్యేలంతా ఒక్కరొక్కరుగా జారిపోతున్నారు. పార్టీ శాసనసభాపక్షనేతనే కాపాడుకోలేని పరిస్థితి. లీడర్లలోనూ కేడర్‌లోనూ నిస్పృహ ఆవరించింది. హామీలు నిలుపుకోని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కాపుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తింది. వారికి వ్యతిరేకంగా బీసీలను రంగంలోకి దింపాలన్న ప్రయోగం బెడిసికొట్టింది.

దళితులపై మనసులో ఉన్న చులకనభావం మీడియా ముఖంగా బైటపడడం చిక్కులు తెచ్చిపెట్టింది. ఇవేకాదు.. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఒక్క సీటుకు పరిమితం కావడం, జూన్‌లోగా రాజధానికి ఉద్యోగులను తరలించడం అసాధ్యంగా మారడం, రాజధాని పరిధిలో సొంత సామాజికవర్గమే తిరుగుబాటు బావుటా ఎగురవేయడం వంటివి కూడా బాబుకు తలనొప్పిగా మారాయి.

వీటని మించి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడికక్కడ వేగవంతమవుతున్నాయి. వ్యవసాయ రుణాలు, డ్రాక్వా సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని మాయమాటలతో  ముంచేసిన చంద్రబాబు సర్కారును ఆయా వర్గాలు ఈసడించుకుంటున్నాయి. టీడీపీ హామీలను నమ్మి ఓట్లు వేసి మోసపోయామని, వాటి గురించి పట్టించుకోకుండా  విదేశాల చుట్టూ తిరుగుతూ, తన సొంత కోటరీ ప్రయోజనకాలకే పెద్దపీట వేస్తూ, అవినీతికి ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబు ప్రతిష్ట నానాటికీ దిగజారుతోంది.
 
కాపాడని గోబెల్స్ ప్రచారం : సంక్షోభాలన్నీ చుట్టుముట్టడంతో చంద్రబాబు తన పాత వ్యూహాలకు పనిచెప్పారు. కోస్తా, రాయలసీమల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తెలుగుదేశంలో చేరడానికి క్యూ కడుతున్నారంటూ అనుకూల పత్రికల్లో పతాక శీర్షికల్లో గోబెల్స్ కథనాలను మొదలుపెట్టారు. బడ్జెట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో మొదలుకానున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికి, తెలంగాణలో పోయిన పరువును కాపాడుకోవడానికి ‘ఆపరేషన్ ఆకర్ష్ ప్రచారా’నికి తెరతీశారు. పార్టీలోకి వచ్చేవారెవరూ లేకపోయినా కోస్తాలో కొందరు, రాయలసీమలో మరికొందరు ఎమ్మెల్యేల పేర్లను ప్రచారంలోకి తీసుకువచ్చారు.అప్రమత్తమయిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు దుష్ర్పచారాన్ని తీవ్రంగా ఖండించారు.

పత్రికలలో వండివార్చిన కథనాలపై చానళ్లలో చర్చలు జరపడం ద్వారా ఒకరకమైన ఉద్విగ్న పరిస్థితులు సృష్టించి బైటపడదామనుకున్న చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టింది. ఒక మంత్రిని ప్రయోగించి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేను హైదరాబాద్ రప్పించి భేటీ జరిపి ఆ ఒక్క ఉదంతంతో ఏదో అద్భుతం చేద్దామని చేసిన ప్రయోగం వికటించింది.

నియోజకవర్గ సమస్యలపై చర్చించడం కోసమే ముఖ్యమంత్రిని కలిశాను తప్ప మరో ప్రత్యేకత ఏమీ లేదని సదరు ఎమ్మెల్యే స్పష్టం చేయడంతో చంద్రబాబుకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిందని సమాచారం. జలీల్‌ఖాన్ సీఎంను కలసిన సమయంలో కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ కూడా అక్కడే ఉన్నారు. ఆ విషయాన్ని మాత్రం ఎల్లోమీడియా ఉద్దేశపూర్వకంగా దాచేసింది.
 
దుష్ర్పచారాన్ని తిప్పికొట్టిన ఎమ్మెల్యేలు
వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చంద్రబాబు అనుకూల మీడియా చేస్తున్న దుష్ర్పచారం విషయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు వేగంగా స్పందించారు. ఎక్కడికక్కడ పత్రి కా విలేకరుల సమావేశాలు పెట్టి పరిస్థితిని వివరించా రు. అందుబాటులో ఉన్న చానళ్లకు కూడా తమ వైఖరేం టో తెలియజేశారు. తమకు వ్యతిరేకంగా జరుగుతున్న గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టారు. చంద్రబాబు మైండ్‌గేమ్‌పై విమర్శల వర్షం కురిపించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలలో కొంతమంది స్పందన ఇలా ఉంది...
 
ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం వైఎస్సార్ సీపీలోనే  ఉంటా. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తా. ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించేందుకు వెళితే పార్టీ మారుతున్నట్లేనా ?
     - జలీల్‌ఖాన్, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే
 
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడిగా తుదివరకు వైఎస్ జగన్ వెంటే ఉంటా. నిలువెత్తు డబ్బు ఇచ్చినా పార్టీ మారను. వారిది స్వీయ మానసికానందం. మునిగిపోయే నౌకలో ఎవరైనా ఎక్కుతారా?      - మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
                      నూజివీడు ఎమ్మెల్యే

 
తప్పుడు ప్రచారాలు చేస్తే పరువునష్టం దావా వేస్తాం. చంద్రబాబు నీచరాజకీయాలు మానుకోవాలి. గోబెల్స్ ప్రచారాలు కట్టిపెట్టాలి. ప్రజల్లో ఆదరణ, నమ్మకం కోల్పోయిన చంద్రబాబు మైండ్‌గేమ్ ఆడుతున్నారు.
- ముత్తుముల అశోక్‌రెడ్డి, పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్‌రాజు, జంకె వెంకటరెడ్డి.  ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు
 
పత్రికలను ఉపయోగించుకున బాబు ఆడుతున్న మైండ్‌గేమ్ ఇది. నిజానికి టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలే వైఎస్సార్‌సీపీలోకి వలస రానున్నారు. తెలంగాణలో పోయిన పరువు కోసం చంద్రబాబు ఇలాంటి ప్రచారాలకు తెరతీశారు.
 - కాకాణి గోవర్ధన్ రెడ్డి, సర్వేపల్లి (నెల్లూరు) ఎమ్మెల్యే

Popular Posts

Topics :