21 February 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ప్రలోభాలకు లొంగను, వైఎస్ఆర్ సీపీలోనే

Written By news on Saturday, February 27, 2016 | 2/27/2016


'ప్రలోభాలకు లొంగను, వైఎస్ఆర్ సీపీలోనే'
శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మండిపడ్డారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలు టీడీపీకి వస్తున్నారంటూ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను వైఎస్ఆర్ సీపీలోనే కొనసాగుతానని, ప్రలోభాలకు లొంగనని ఎమ్మెల్యే కంబాల జోగులు స్పష్టం చేశారు.


మరోవైపు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ నేత నారాయణస్వామి మాట్లాడుతూ వెన్నుపోటుదారులే పార్టీని వదిలివెళ్లారన్నారు. పార్టీని వదిలివెళ్లిన వారికి రాజకీయ భవిష్యత్తు లేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ మారినవారు నమ్మకద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఎన్నికలొస్తే బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నారాయణస్వామి వ్యాఖ్యానించారు.

పార్టీ ఫిరాయింపులపై రాజ్యాంగ సవరణ చేయాలి


'పార్టీ ఫిరాయింపులపై రాజ్యాంగ సవరణ చేయాలి'
శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శనివారం శ్రీకాకుళంలో నిప్పులు చెరిగారు. రాజకీయాలను చంద్రబాబు వ్యాపారంగా మార్చేశారని ఆరోపించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ పోతే మళ్లీ రాచరిక కాలంనాటి వ్యవస్థ పునరావృతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డ ప్రతిది న్యాయ వ్యవస్థకు లోబడే ఉంటుందన్నారు. అసెంబ్లీ స్పీకర్ కూడా అందుకు మినహయింపు కాదని ధర్మన ప్రసాదరావు స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై రాజ్యాంగ సవరణ చేయాలని ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు.

బాబూ.. మీ ఎమ్మెల్యేలపై విశ్వాసం లేదా?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 20 నుంచి 50 కోట్ల రూపాయల వరకు పెట్టి ఎమ్మెల్యేలను కొంటున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు అనైతిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తెరలేపారని విమర్శించారు. కావాల్సిన మెజార్టీ టీడీపీకి ఉన్నా, తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని, చంద్రబాబుకు ఆయన పార్టీ ఎమ్మెల్యేలపై విశ్వాసం లేదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

తప్పు చేసిన వాడి మొహం చంద్రబాబుదైతే.. తప్పు చేయనివాడి మొహం వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలా ఉంటుందని అన్నారు. చంద్రబాబు అవినీతిని త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతామని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు వెంటనే పదవులకు రాజీనామా చేయాలని, లేదంటే వారిపై అనర్హత వేటుపడటం ఖాయమని హెచ్చరించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని చెప్పారు.

వైఎస్సార్ కుటుంబాన్ని చూసే ఓట్లేశారు


‘వైఎస్సార్ కుటుంబాన్ని చూసే ఓట్లేశారు’
తిరుపతి మంగళం: పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేసి వారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, తండ్రి ఆశయ సాధన కోసం శ్రమిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబాన్ని చూసే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు డబ్బులు, పదవులు ఆశ చూపించి టీడీపీలోకి లాక్కోలేదని ప్రమాణం చేస్తారా? అని సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. టీడీపీలోకి వెళ్లినవారికి ఎలాంటి పదవులు ఇవ్వకుంటే, అప్పుడు వారు తమ పార్టీ నుంచి స్వచ్ఛందంగా వెళ్లారని నమ్ముతామన్నారు.

రెండేళ్లలో చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిలేదని విమర్శించారు. స్థానిక ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ముఖ్యమంత్రి సత్తా బయటపడుతుందని అన్నారు. ఇసుక, మద్యం, భూదందా, పట్టిసీమ, గోదావరి పుష్కరాలు, కొత్త రాజధాని వంటి వాటిలో రూ.వేల కోట్లు దండుకున్నారని, ఆ డబ్బుతో సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీని అడ్డం పెట్టుకుని గెలిచిన వారు దమ్ముంటే పదవులకు రాజీనామాలు చేసి, టీడీపీ తరపున గెలవాలని చెవిరెడ్డి సవాల్ విసిరారు. ఆదరించి పిల్లనిచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచి పదవిని లాక్కున్న దుర్మార్గుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. తమ పార్టీని వదిలి వెళ్లిన వారికి భవిష్యత్తులో రాజకీయ సన్యాసం తప్పదని హెచ్చరించారు. కొనుగోలు చేయడం కోసం మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు డబ్బుతో వస్తే ఓటుకు నోటు’ కేసులో లాగా ఏసీబీకి పట్టించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు చెవిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

మహానేత స్వప్నం.. కృష్ణపట్నం


మహానేత స్వప్నం.. కృష్ణపట్నం
నేడు జాతికి అంకితం
 కృష్ణపట్నం నుంచి సాక్షి ప్రతినిధి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కలల ప్రాజెక్టు ‘కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం’ వెలుగులు విరజిమ్మబోతోంది. అవిభక్త రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చాలన్న సంకల్పంతో కేంద్రంతో పోరాడి అనుమతులు తెచ్చిన ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్ చేతుల మీదుగానే పునాది పడింది. దేశంలో మరెక్కడా లేని విధంగా 1,600 మెగావాట్లతో (ఒక్కొక్కటీ 800 మెగావాట్లు) సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టును విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు.

వైఎస్ కాలంలోనే రెండు యూనిట్ల పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. గతేడాది వాణిజ్య ఉత్పత్తిలోకి అడుగు పెట్టిన ఈ ప్రాజెక్టులను శనివారం సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ఏపీ జెన్‌కో ఎండీ విజయానంద్ తదితరులు హాజరవుతున్నారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి అదనంగా రోజుకు 39 మిలియన్ యూనిట్లు అందుబాటులోకి రాబోతున్నాయి.

మంత్రి పదవి పోతుందన్న భయంతోనే ..


మంత్రి పదవి పోతుందన్న భయంతోనే విమర్శలు
మంత్రి పల్లెపై పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ       
సమస్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజం


నల్లమాడ: మంత్రి పల్లె రఘునాథరెడ్డి పదవి పోతుందన్న భయంతోనే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని పుట్టపర్తి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మండలంలోని నల్లసింగయ్యగారిపల్లిలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.  ఆయన మాట్లాడుతూ మంత్రి పల్లె పుట్టపర్తి నియోజకవర్గ అభివృ ద్ధికి  పాటు పడాలే తప్ప జగన్‌పై విమర్శలు చేయడం తగదన్నారు.  చంద్రబాబు వద్ద మెప్పు పొంది మంత్రి పదవిని కాపాడు కోవడానికే పల్లె నాటకం ఆడుతున్నారన్నారు.

పల్లె తక్షణమే పదవికి రాజీనామా చేసి ధైర్యం ఉంటే పుట్టపర్తి నియోజకవర్గంలో తన మీద పోటీ చేసి గెలుపొందాలని ఆయన సవాల్ విసిరారు.  జగన్ కాలిగోటికి కూడా పల్లె దీటు రాడన్నారు.  టీడీపీలోకి చేరిన భూమానాగిరెడ్డి కుటుంబానికి మంత్రి పదవి దక్కుతుందన్న భయం పల్లెకు పట్టుకుందన్నారు. నియోజకవర్గంలో   పగటి పూట తిరగడానికి కూడా మంత్రి భయపడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉంట్ల బ్రహ్మానందరెడ్డి, జిల్లా అధికారప్రతినిధి డీఎస్ కేశవరెడ్డి, సింగల్‌విండో డెరైక్టర్ కుళ్లాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అభ్యర్థులతో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటింటి ప్రచారం


గెలిపిస్తే డివిజన్ల అభివృద్ధి
♦ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
♦ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం
 ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 35,49, 50 డివిజన్లలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటి ప్రచారం నిర్వహించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
 ఖమ్మం :  కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపిస్తే.. డివిజన్‌లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని 35,49,50 డివిజన్లలో పోటీ చేస్తున్న గుండపూడి జయమ్మ, గుండ్ల రవికుమార్, పీట్ల పార్వతమ్మను గెలిపించాలని కోరుతూ శుక్రవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 35వ డివిజన్‌లోని రాపర్తినగర్ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. రాజీవ్‌నగర్, బుర్హాన్‌పురం చెరువు కట్ట, వాటర్ ట్యాంక్ ఏరియా, రామాలయం వీధుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. దినసరి కూలీలు, చాట్ బండార్ వ్యాపారులు, కార్మికులు, గృహిణులను ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు.
49వ డివి జన్ పరిధిలోని దానవాయిగూడెం, కాలనీల్లో గుండ్ల రవికుమార్ తరఫున, 50డివిజన్ పరిధిలోని ఎన్‌టీఆర్ కాలనీ, రామన్నపేట కాలనీ, రామన్నపేట ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వ హించారు.  ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డివిజన్ ఇన్‌చార్జ్‌లు, పార్టీ వైరా నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొర్రా రాజశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాయకులు గుండపనేని నాగేశ్వరరావు, ఉపేంద్ర, అజ్మీరా లింగరాజు, సూర్యం, సాయి, పాండు, కన్నేటి వెంకన్న, టీ.ఈశ్వరాచారి, ఎం.కృష్ణారెడ్డి, జీ.అరవింద్,కన్నేటి వెంకన్న, నాయకులు ఎస్‌కే సోందు, మద్దినేని శ్రీనివాసరావు, బల్లెం వీర స్వామి, పల్లపు వెంకన్న, మంగల సుమన్ పాల్గొన్నారు.

వెన్నుపోట్లు పొడవడమే క్యారెక్టరా..?


వెన్నుపోట్లు పొడవడమే క్యారెక్టరా..?
చంద్రబాబును ప్రశ్నించిన ఎమ్మెల్యే పీఆర్కే

మాచర్ల : క్యారెక్టర్ కలిగి ఉండడమంటే సొంత మామకు వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిలో అధికారంలోకి రావడమేనా అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను క్యారెక్టర్ కలిగిన వ్యక్తినని సీఎం చంద్రబాబు చెప్పుకోవడంపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌పార్టీలో ఉన్న చంద్రబాబు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి మామ ఎన్టీఆర్ వద్ద చేరి,చివరకు ఆయనకే వెన్నుపోటు పొడిచారన్నారు. తన వెంట వచ్చిన హరికృష్ణ, దగ్గుపాటి వెంకటేశ్వరరావులను ఆరు నెలల్లో వదిలించుకొని వారికి సైతం తన వెన్నుపోటు ఎలా ఉంటుందో చూపించారన్నారు. వైస్రాయి హోటల్‌లో క్యాంప్ నిర్వహించి ఎమ్మెల్యేలను బంధించి అధికారం చేపట్టిన వ్యక్తి, ఇప్పుడు  ప్రజలకు ఏమీ తెలియదన్నట్లు తనకు తాను సచ్చీలుడుగా చెప్పుకోవడం విడ్డూరమన్నారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడం, రాష్ట్రంలో అవినీతి అక్రమ చర్యలకు తెరతీయడం, తాజాగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే క్యారెక్టర్ కలిగి ఉండడమా అంటూ ప్రశ్నించారు.

మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయా వర్గాలను మోసగించి, కులమతాలను చీల్చి  నీచ రాజకీయాలు నడుపుతున్న చంద్రబాబుకు క్యారెక్టర్ గురించి చెప్పుకునే అర్హత లేదన్నారు. క్యారెక్టర్ అంటే వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఫ్యాన్ గుర్తుపై గెలిపించిన చరిత్ర జగన్‌దేనన్నారు. నీకు  క్యారెక్టర్ ఉంటే వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి సైకిల్ గుర్తుపై పోటీ చేయించి సత్తా చాటాలని, అప్పుడు క్యారెక్టర్ గురించి మాట్లాడాలని ఎమ్మెల్యే పీఆర్కే సూచించారు.

నీలా రాజకీయాలు చేస్తే జగన్ ఎన్నోసార్లు సీఎం అయి ఉండేవారు


నీలా రాజకీయాలు చేస్తే జగన్ ఎన్నోసార్లు సీఎం అయి ఉండేవారు
♦ చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపాటు
♦ పక్క పార్టీ ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకోవడమేనా మీ క్యారెక్టర్?

 సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు మాదిరిగా.. జగన్‌మోహన్‌రెడ్డి కూడా వైశ్రాయి తరహాలో రాజకీయాలు చేసి ఎమ్మెల్యేలకు సూట్‌కేసులిచ్చుంటే తన తండ్రి చనిపోయినప్పటినుంచి ఇప్పటికే ఎన్నోసార్లు సీఎం అయిఉండేవారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.  ప్రజల ఓట్లతో అధికారంలోకి రావాలనుకున్నారేతప్ప తప్పుడుదారిలో అధికారం చేపట్టాలని ఆయనెప్పుడూ అనుకోలేదన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.చంద్రబాబు, ఆయన మం త్రులు, నేతలు చెప్పేది శ్రీరంగనీతులు.. చేసేది నీతిమాలిన రాజకీయాలని దుయ్యబట్టారు.

‘నాకుండేదే క్యారెక్టర్’ అన్న సీఎం మాటలు  ఎవరికైనా నవ్వు వస్తుందన్నారు. ‘రాజకీయాల్లో విలువలకోసం పాటుపడుతున్నానంటారు.. పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలపై కేసులుపెట్టి, సూట్‌కేస్‌లిచ్చి మీ పార్టీలో చేర్చుకోవడమేనా విలువలు కాపాడడమంటే?’ అని ప్రశ్నించారు. 35ఏళ్ల రాజకీయజీవితంలో తానే తప్పూ చేయలేదని సీఎం అనడంపై ఆమె మండిపడ్డారు. ‘ఆయన రాజకీయ జీవితమే తప్పుడుమార్గంలో మొదలైందని అందరికీ తెలుసు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి మొదలుపెట్టిన రాజకీయం.. ఈరోజు ఆయన, ఆయన కుమారుడు కలసి ఈ రాష్ట్రాన్ని దోచుకునేంతవరకు కొనసాగిస్తున్నారని  ప్రజలందరికీ తెలుసు. క్యారెక్టర్ అంటాడు. రాజకీయాల్ని వ్యాపారంగా మార్చేసి, అప్పుడు ఎన్టీఆర్ దగ్గరున్న ఎమ్మెల్యేల్ని, ఈరోజు జగన్ వద్దనున్న ఎమ్మెల్యేల్ని కొన్న నీతిమాలిన క్యారెక్టర్ ఆయనది’ అని దుయ్యబట్టారు.  ప్రత్యేకహోదాకానీ, రైల్వేజోన్‌కానీ సాధించలేని అసమర్థ క్యారెక్టర్.. మాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళల్ని మోసగించిన మోసకారి, దగాకోరు క్యారెక్టర్ ఆయనదని తూర్పారపట్టారు. ‘మా వాళ్లు బ్రీఫ్‌డ్ మీ’ అంటూ ప్రపంచంలో తెలుగువారందరి పరువును తీసిన క్యారెక్టర్ బాబుదన్నారు.

 లోకేశ్ తప్పుడు ఆలోచనల్ని తుంచేయాలి
 రాజకీయాలకు పట్టిన తుప్పు చంద్రబాబు అయితే, ఆయన అడుగుజాడల్లోనే వాళ్లఅబ్బాయి రాజకీయాలు ప్రారంభించారని రోజా దుయ్యబట్టారు. ‘ఇసుకమాఫియా నుంచి కల్తీమద్యం మాఫియాదాకా.. సీఎస్‌లు సంతకం పెట్టకున్నా ప్రాజెక్టు పనుల్లో వేలకోట్లు దోచుకుంటున్న విషయం.. ఆయన అనుచరులే కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో మహిళల్ని వ్యభిచారంలో దించుతున్న విషయం ప్రజలందరికీ తెలుసు. అయినా తాను తప్పుచేసినట్టు నిరూపిస్తే.. రాజకీయాలనుంచి తప్పుకుంటానంటున్నారు. ఇంత చిన్నవయస్సులో చేసిన తప్పులు దొరకకుండా తప్పుచేయడం నేర్చుకున్నాడంటే.. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌కు లోకేశ్‌వల్ల పెనుముప్పు పొంచిఉంది. కాబట్టి మొగ్గలోనే ఆయన తప్పుడు ఆలోచనల్ని తుంచివేయాలని కోరుతున్నా’ అన్నారు.

 రాజీనామాకు మీరు సిద్ధమేనా?
 సొంత నియోజవర్గంలో ఎమ్మెల్యేగా గెలవలేని పయ్యావుల కేశవ్ తమ పార్టీ అధినేతను శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పిస్తామని మాట్లాడడం హాస్యాస్పదమని రోజా అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్ధపడితే.. వైఎస్సార్‌సీపీ తరఫున మిగిలిన ఎమ్మెల్యేలమంతా రాజీనామాకు సిద్ధమన్నారు. తన ఎమ్మెల్యేల్ని తిరిగి ప్రజా క్షేత్రంలో గెలిపించుకురాగల సత్తా జగన్‌కుందని, ఆ దమ్మూధైర్యం టీడీపీకి, చంద్రబాబుకుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పక్కపార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడుతున్నారంటే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనేనన్నారు. తెలంగాణ టీడీపీ కేసీఆర్ పార్టీలో విలీనమయ్యాక.. ఏపీలోనూ ఎక్కడ తమ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లిపోతారన్న భయంతోనే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.  తండ్రిపై ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టి.. క్షణాల్లో జైల్లోపెట్టిన చంద్రబాబుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే ఆఖిలప్రియ నమస్కారం చేసిందంటే రాజకీయాల్లో ఏమి విలువలున్నట్టని ప్రశ్నించారు.

నెంబర్ వన్ ర్యాంక్ చంద్రబాబుదే: రోజా

Written By news on Friday, February 26, 2016 | 2/26/2016


నెంబర్ వన్ ర్యాంక్ చంద్రబాబుదే: రోజా
హైదరాబాద్ : 'నాకుండేదే క్యారెక్టర్. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పూ చేయలేదు. రాజకీయాల్లో విలువల కోసమే పాటుపడుతున్నా' అన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా తప్పుబట్టారు. క్యారెక్టర్ లేనివారి జాబితాలో నెంబర్ వన్ స్థానం చంద్రబాబుకే దక్కుతుందని ఆమె ఎద్దేవా చేశారు. లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రోజా మీడియా సమావేశంలో మాట్లాడారు.

చంద్రబాబు చెప్పేవి శ్రీరంగ నీతులు... చేసేవి నీతిమాలిన పనులని ఈ సందర్భంగా రోజా  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన 35 ఏళ్ల రాజకీయ జీవితమే తప్పుడు మార్గంలో మొదలైందని, పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి, ఈ రోజు చంద్రబాబు, ఆయన కుమారుడు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే చాలా ఉన్నాయన్నారు. రాజకీయాలను వ్యాపారంగా మార్చేసి ఎన్టీఆర్, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను కొన్న నీతిమాలిన క్యారెక్టర్ చంద్రబాబుదన్నారు.

'మావాళ్లు బ్రీఫ్ డ్ మీ అంటూ  ఎమ్మెల్యేలను కొని  ప్రపంచంలో తెలుగువాడి పరువును బజారును పడేసిన క్యారెక్టర్ చంద్రబాబుది. రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని మాయమాటలు చెప్పిన చరిత్ర బాబుది. 131 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీనే వైఎస్ జగన్ ను ఏమీ చేయలేకపోయింది. 33 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ ఏం చేస్తుంది?. పవన్ కళ్యాణ్, మోదీ కాళ్లు పట్టుకుని చంద్రబాబు గెలిచారు.

వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు నైతిక విలువల గురించి తెలుసుకోవాలి. ఎన్నికష్టాలు ఎదురైనా ప్రజల తరఫు పోరాడుతున్న నాయకుడు వైఎస్ జగన్. సోనియాగాంధీ, చంద్రబాబు కుమ్మక్కై 16 నెలలు జగన్ ను జైల్లో పెట్టారు. అయినా ఆయన ఎక్కడా భయపడలేదు. రాజకీయాల్లో విలువలు కాపాడాలనే వైఎస్ జగన్ పని చేస్తున్నారు. తప్పుడు దారిలో అధికారంలోకి రావాలని ఆయన ప్రయత్నించలేదు. నిజంగా చంద్రబాబుకు క్యారెక్టర్ ఉంటే ప్రజల కోసం పనిచేయాలి. తెలంగాణలో టీడీపీ...టీఆర్ ఎస్ లో విలీనమైంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. పక్క పార్టీలో ఉన్న నేతలను తీసుకుని పోయినంత మాత్రాన టీడీపీ బలపడదు' అన్నారు.

మేం రెడీ...మీరు రెడీనా?

మరోవైపు పయ్యావుల కేశవ్ సవాల్ ను తాము స్వీకరిస్తున్నామని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన 62మంది రాజీనామా చేస్తారని, మీరు రాజీనామా చేయండి, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామంటూ ఆమె ప్రతి సవాల్ విసిరారు. అసెంబ్లీ రద్దుకు డేట్ ఫిక్స్ చేయాలని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పయ్యావుల... వైఎస్ జగన్ ను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు వెళదామని, ఎవరి ఫేస్ వ్యాల్యు ఏంటో తేలుతుందని రోజా వ్యాఖ్యలు చేశారు.

టీడీపీలో చేరకపోతే అంతు చూస్తాం


టీడీపీలో చేరకపోతే అంతు చూస్తాం
వైఎస్‌ఆర్ సీపీ నాయకులకు మంత్రి సోదరుడి బెదిరింపు

అనంతపురం : పార్టీ ఫిరాయించాలని, లేకుంటే అంతు చూస్తామంటూ రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలను టీడీపీ నాయకులు బెదిరించారు. తమ మాట వినకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందంటూ హెచ్చరించారు. ఇందులో భాగంగా పోలీసులను రంగంలోకి దింపి ఒత్తిళ్లు పెంచారు. రాప్తాడు మండలం యర్రగుంటలో చెరువు స్థలాన్ని టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన కొందరు సాగు చేసుకుంటున్నారు. వారం క్రితం వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు నరసింహారెడ్డి భూమి నుంచి మట్టిని తోలేందుకు టీడీపీ నేత నారాయణస్వామి సిద్ధమయ్యాడు. అతని చర్యలను నరసింహారెడ్డి అడ్డుకున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం నారాయణస్వామి మంత్రి పరిటాల సునీతను ఆశ్రయించాడు. సమస్య పరిష్కరించండంటూ ధర్మవరపు మురళీ తదితరులను మంత్రి ఆదేశించారు. రంగంలోకి దిగిన మంత్రి సోదరుడు మురళి బుధవారం ఉదయం నరసింహారెడ్డిని, సర్పంచ్ కుమారుడు సాకే వెంకటేష్‌ను చర్చల పేరుతో పిలిపించుకుని, తమ పార్టీలో చేరాలని కోరినట్లు తెలిసింది.

ఆయన ఒత్తిళ్లకు తలొగ్గకపోవడంతో ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్‌ను రంగంలోకి దించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సీఐ తన సిబ్బందితో యర్రగుంటకు చేరుకుని చెరువులో సాగు చేసుకుంటున్న వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారులను మాత్రమే కలిసి వెంటనే  ఖాళీ చేయాలని ఆదేశించారు. ఆ సమయంలో ఇంటి వద్ద నరసింహారెడ్డి, పుల్లారెడ్డి, కేశవరెడ్డి, సాకే వెంకటేష్ లేకపోవడంతో వారిని సాయంత్రం ఐదు గంటలకు పోలీస్ స్టేషన్‌కు రప్పించుకున్నారు.  చెరువు మట్టిని తరలించే సమయంలో అడ్డుకుంటే అరెస్ట్ చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.  ఇదే విషయంపై తహశీల్దార్ అందే హరికుమార్ మాట్లాడుతూ... వారం క్రితం గ్రామాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో చెరువు స్థలంలో గ్రామస్తులు సాగు చేసుకుంటున్న విషయం వెలుగు చూసిందన్నారు. ఆ స్థలాలను ఖాళీ చేయాలని వారికి నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకోనున్నట్లు చెప్పారు.

రోజంతా బిజీబిజీగా వైఎస్ జగన్

అభిమానం వెల్లువ
⇒ రోజంతా బిజీబిజీగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
⇒ వివాహాలు, పరామర్శలు, నూతన జంటలకు ఆశీర్వాదం
 కృష్ణమ్మ కుటుంబ సభ్యులకు పరామర్శ
⇒ ఎర్రగుంట్ల, బద్వేలు, పోరుమామిళ్లలో ఘన స్వాగతం
⇒ అడుగడుగునా కాన్వాయ్‌ని ఆపి.. కరచాలనం చేసిన అభిమానులు
⇒ ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటామంటూ నేతలు, కార్యకర్తలకు భరోసా
 పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
 ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో మాటా మంతి

 
ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. పరిష్కారం చూపుతూ.. కార్యకర్తల పట్ల అభిమానాన్ని చాటుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముందుకు సాగారు. పండుటాకులపై ప్రేమ కురిపిస్తూ.. అడుగడుగునా అభిమానులు కాన్వాయ్‌ని ఆపుతున్నా ఏమాత్రం విసుగు చెందకుండా అందరినీ ఆప్యాయంగా పలుకరించారు.  
 
కడప : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నాటి జిల్లా పర్యటనలో జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగిన పర్యటనలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. కడప, ఎర్రగుంట్ల, మైదుకూరు, పోరుమామిళ్ల, బద్వేలు, ఆలంఖాన్‌పల్లె ఇలా అన్నిచోట్ల వేలాది మంది జనానికి అభివాదం చేస్తూ.. అభిమానులతో కరచాలనం చేస్తూ.. వృద్ధులు, మహిళలను ఆప్యాయంగా పలుకరిస్తూ ఆయన ముందుకు సాగారు. వేధింపులు ఎదుర్కొంటున్న కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి నేనున్నాంటూ ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని, కలిసికట్టుగా ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వంపై పోరాడుదామని పిలుపునిచ్చారు.

ఆశీర్వాదాలు.. పరామర్శలు
ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి చెందిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ దాసరి సూర్యనారాయణరెడ్డిపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్న నేపధ్యంలో గురువారం ఉదయాన్నే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎర్రగుంట్లలో ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం పోట్లదుర్తికి వెళ్లి ఇటీవలే వివాహమైన రాజేంద్రనాథ్‌రెడ్డి కుమారుడు మహేంద్రనాథ్‌రెడ్డి, కీర్తిలతలను ఆశీర్వదించారు. ఆ తర్వాత చాపాడు మండలంలోని నాగులపల్లెకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి వెళ్లారు. ఇటీవలే వివాహమైన మండల ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి కుమారుడు విద్యాసాగర్‌రెడ్డి, మౌనికలను ఆశీర్వదించారు. అట్లూరు వైఎస్సార్ సీపీ నాయకుడు గోవిళ్ల చిన్న సూరారెడ్డి కుమారుడు ఆదిత్యనాథ్‌రెడ్డి వివాహం శుక్రవారం జరగనున్న నేపథ్యంలో బద్వేలులోని వారి ఇంటికి వెళ్లారు. ఆదిత్యను ఆశీర్వదించారు. అనంతరం పోరుమామిళ్లలోని ఎంపీపీ చిత్తా విజయ్‌ప్రతాప్‌రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత మహిళా ఆర్థిక సహకార సంస్థ మాజీ చైర్ పర్సన్ క ృష్ణమ్మ, ఆమె కుమారుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నాగార్జునరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. (ఇటీవలే క ృష్ణమ్మ భర్త పోతిరెడ్డి భాస్కర్‌రెడ్డి మృతి చెందారు) అనంతరం ఆలంఖాన్‌పల్లెలో చెన్నూరు వైఎస్సార్‌సీపీ నేత రాజేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇటీవల వారు గ ృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం వైఎస్సార్ సీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, కార్యకర్తలు, నాయకులు వైఎస్ జగన్‌ను కలిసి చర్చించారు. ఆ తర్వాత అక్కడికి సమీపంలోని కాంట్రాక్టర్ సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లారు. కడప నగరంలోని 3వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మిదేవి, వీరారెడ్డిల కుమారుడు బ్రహ్మనందరెడ్డి, శివకుమారిలను (ఇటీవలే వివాహం అయ్యింది) ఆశీర్వదించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చల్లా రాజశేఖర్ తల్లి రెడ్డెమ్మ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మాసీమ బాబు ఇంటికి వెళ్లి ఇటీవలే వివాహమైన కుమార్తె ప్రియాంక, అల్లుడు శ్రీకాంత్‌రెడ్డిలను ఆశీర్వదించారు. అనంతరం హజరత్ మౌలానా సయ్యద్‌షా యూసుఫ్ బొగ్దాది సాహెబ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పెద్దదర్గాకు వెళ్లి ఉరుసు ఉత్సవంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని పీఠాధిపతి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ముస్లిం మైనార్టీలు తమ సమస్యలను జగన్‌కు విన్నవించారు. అక్కడి నుంచి నేరుగా వైఎస్ జగన్ కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త, దివంగత సీఎం వైఎస్ తోడల్లుడు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యారు.
 
 అడుగడుగునా కాన్వాయ్‌ను ఆపి కరచాలనం
 పులివెందుల నుంచి కడప వరకు బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా వస్తున్న సందర్భంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎక్కడికక్కడ ప్రతిపక్ష నేత కాన్వాయ్‌ను ఆపి కరచాలనం చేశారు. వ ృద్దులు, యువకులు, మహిళలతోపాటు చాలాచోట్ల చిన్నారులు కూడా వైఎస్ జగన్‌ను పలుకరించారు. అన్ని గ్రామాల్లో స్థానికులు రోడ్డుపైకి వచ్చి జగన్‌తో కరచాలనం చేసేందుకు కాన్వాయ్‌ను ఆపుతూ వచ్చారు. దీంతో పర్యటన ఆలస్యంగా సాగింది.
 
వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నేతలు
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు వచ్చి కలిశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వెంట ఉండగా, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌బాషా, రఘురామిరెడ్డి, శ్రీనివాసులు, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, అనంతపురం జిల్లా కదరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, రాజుల భాస్కర్‌రెడ్డి, పార్టీ నాయకులు సుధీర్‌రెడ్డి, అంబటి కృష్ణారెడ్డి, వేల్పుల రాము, బద్వేలు నియోజకవర్గానికి చెందిన పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు వైఎస్ జగన్‌ను కలిసి పలు విషయాలపై చర్చించారు. అనంతరం ఆయన తన పర్యటన ముగించుకుని రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

మరో రెండేళ్లు పోరాటం చేద్దాం


మరో రెండేళ్లు పోరాటం చేద్దాం
కార్పొరేటర్లతో వైఎస్ జగన్
 
కడప కార్పొరేషన్:  ‘‘మరో రెండేళ్లు ఈ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండండి.. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత చూసి అధికారులు, పోలీసుల్లో కూడా మార్పు వస్తుంది, అప్పుడు మన మాటే వింటారు’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆలంఖాన్‌పల్లె సమీపంలోని బుద్ద టౌన్‌షిప్‌లో కడప నగరపాలక సంస్థ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్నేళ్లుగా మా కుటుంబం వెన్నంటి ఉన్న మీరు ఒకట్రెండు సంవత్సరాలు ఓపిక పడితే కష్టాలన్నీ తీరిపోతాయన్నారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, మరో ఏడాది ఓపిక పడితే పరిస్థితి పూర్తిగా తారుమారవుతుందని తెలిపారు. మీరంతా జిల్లాలో తనకు అండగా ఉంటే మిగతా జిల్లాల్లో పార్టీని బలోపేతానికి కృషి చేస్తానన్నారు. మన ప్రభుత్వం వచ్చినప్పుడు పేరుపేరునా గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరికీ మేలు చేస్తామని చెప్పినట్లు తెలిసింది. సొంత జిల్లాలోనే తలనొప్పులు తెస్తే ఇబ్బందిగా ఉంటుందని చెప్పగా, ఇందుకు కార్పొరేటర్లంతా ముక్తకంఠంతో స్పందిస్తూ ప్రాణం పోయేంత వరకూ పార్టీని వీడబోమని ప్రతిన చేసినట్లు తెలుస్తోంది.

కొందరు కార్పొరేటర్లు వైఎస్ జగన్‌తో మాట్లాడుతూ మీరు జిల్లాకు వచ్చినప్పుడు కడపలో రైలు దిగి వెళితే నాయకులు, కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. దీనికి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రతి నెలకో, రెండు నెలలకో కార్పొరేటర్లు, నాయకులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకోవాలని, మీవల్ల పరిష్కారం కాని వాటిని తన దృష్టికి తీసుకురావాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, నగర మేయర్ కె.సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషాలను సూచించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సానపురెడ్డి శివకోటిరెడ్డి, రామలక్ష్మణ్‌రెడ్డి, పాకా సురే్‌ష్, చైతన్య, ఎస్‌ఏ షంషీర్, బోలా పద్మావతి, కె.బాబు, ఎన్.రషీదా తబస్సుమ్, ఎస్‌బి మహ్మద్  అన్సర్ అలీ, కోఆప్షన్ సభ్యులు నాగమల్లారెడ్డి, టీపీ వెంకటసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆధైర్య పడొద్దు


ఆధైర్య పడొద్దు
కౌన్సిలర్ దాసరితో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 
ఎర్రగుంట్ల : దేనికి భయపడొద్దు, మీకు నేనున్నాను అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కౌన్సిలర్ దాసరి సూర్యనారాయణరెడ్డికి భరోసా ఇచ్చారు. గురువారం వైఎస్సార్ సీపీ నాయకుడు డాక్టరు సుధీర్‌రెడ్డి ఆధర్యంలో ఎంపీ వైఎస్ ఆవినాష్‌రెడ్డితో పాటు ఆయన ఎర్రగుంట్లలోని కౌన్సిలర్ దాసరి సూర్యనారాయణరెడ్డి ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ దాసరి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు తనపై అక్రమ కేసులు పెట్టారని వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు.

ఇందుకు జగన్ స్పందిస్తూ ఎలాంటి భయాందోళ నలు పడకండి అని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు పద్మనాభయ్య, నాగన్న, ఎరికల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు సత్యనారాయణరెడ్డి, ముస్తాఫా, ప్రతాప్‌లు కలసి మాట్లాడారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గంగా వెంకటశివారెడ్డి, గంగాకృష్ణారెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యులు అబ్దుల్‌గఫార్, నాగిరెడ్డి, వై.కోడూరు శ్రీరాములరెడ్డిలు పాల్గొన్నారు.

చంద్రబాబుకు అంత డబ్బు ఎక్కడిది?

Written By news on Thursday, February 25, 2016 | 2/25/2016


'చంద్రబాబుకు అంత డబ్బు ఎక్కడిది?'
నెల్లూరు: తాను ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని కావలి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్మూధైర్యం ఉంటే ఆ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.

ఇక, ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చంద్రబాబునాయుడి తీరుపై స్పందిస్తూ ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబుకు అసలు అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు చంద్రబాబు దగ్గర జోకర్లుగా మిగిలిపోవడం ఖాయమన్నారు.

చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే..


'చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ ఉంటే.. '
కడప : ఎమ్మెల్యేలను డబ్బుతో కొనడం గొప్పకాదని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటే ఎన్నికల్లో ఎవరిని నిలబెట్టినా ప్రజలు ఓట్లు వేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ పునాదులు కదపాలంటే అది ప్రజల చేతుల్లో ఉంటుంది కానీ పెదబాబు, చినబాబు చేతిలో కాదని వైఎస్ జగన్ అన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా  కేవలం ఐదుగురిని మాత్రమే చంద్రబాబు నాయుడు తీసుకు వెళ్లగలిగారన్నారు. ఈ ఫిరాయింపులకు ఎందుకు దిగుతున్నారనే జ్ఞానం చంద్రబాబుకు ఉండాలని, ఎందుకు చేస్తున్నారో, దేనికోసం చేస్తున్నారో బుద్ధి ఉండాలన్నారు. 'నిజంగా చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ ఉంటే పార్టీ మారినవారితో రాజీనామా చేయించండి. ఎన్నికలకు పోదాం. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో దాన్ని రెఫరెండంగా తీసుకుందాం. దానికి చంద్రబాబు రెడీయా. వేరే పార్టీ నుంచి గెలిచినవారిని ప్రలోభాలతో తనవైపునకు తిప్పుకొన్న తీరు చూస్తుంటే చంద్రబాబు మనిషేనా అనిపిస్తుంది. అలాంటి మనిషి రాక్షసుడిగా పుట్టాల్సింది.

గ్రామాల్లో తిరిగే ధైర్యం ఇప్పుడు చంద్రబాబుకు లేదు. రుణమాఫీలపై రైతులు నిలదీస్తున్నారు. వడ్డీలు కూడా మాఫీ కావడం లేదని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం కూడా రాలేదని మండిపడుతున్నారు. డ్వాక్రా మహిళలు కూడా చంద్రబాబును మోసగాడు అంటున్నారు. రుణాలు మాఫీ కాలేదు సరికదా, రెండు రూపాయిలు వడ్డీ చెల్లించాల్సి వస్తోందని ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయమే చంద్రబాబు మరిచిపోయారు. నిరుద్యోగులకు భృతి కూడా ఇవ్వలేదు. సగంలో నిలిచిపోయిన ఇళ్లకు చెల్లింపులు కూడా చేయలేదు. కరెంటు బిల్లుల షాక్ లు కొడుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు తారాస్థాయికి చేరాయి.

చంద్రబాబును జనం తిట్టుకుంటున్నారు. మున్సిపాల్టీల్లో పన్నులు డబుల్ చేశారు. చంద్రబాబు ప్రజల గొంతుల్ని నొక్కే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆయనకు ఇన్ని డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి. ఒక్కో ఎమ్మెల్యేకు కోట్లాది రూపాయలతో ప్రలోభపెడుతున్నారు. నన్ను తప్ప మిగతా ఎమ్మెల్యేలకు రోజూ ఫోన్లు కొడుతున్నారు. ఇన్ని డబ్బులు ఆఫర్ చేసినా...ప్రలోభాలకు లొంగని ఎమ్మెల్యేలకు హ్యాట్సాఫ్ చెప్తున్నా. ప్రజల తరఫున పోరాటం చేయడానికి మా ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. అన్నివర్గాల వారికి మా ఎమ్మెల్యేలు అండగా ఉంటున్నారు. మళ్లీ పదవిలోకి రావాలంటే చిట్కా.. ఎమ్మెల్యేలను లాక్కోవడం కాదు. ప్రజల గుండెల్లో నిలబడ్డమే.. మళ్లీ అధికారంలోకి రావడానికి చిట్కా. ఎమ్మెల్యేల కొనుగోలుతో పని కాదని చంద్రబాబు గుర్తించాలి. ఇంత ఒత్తిడి చేసినా ఐదుగురు ఎమ్మెల్యేలను మాత్రమే తీసుకెళ్లారు. వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తీసుకోవడమేంటి? వారిని అనర్హతకు గురి చేయరట? రాజీనామాలు తీసుకోరంట?. చంద్రబాబు వేసే ఎత్తుగడల మాదిరిగా టీవీ ఛానళ్లు వార్తలు ఇస్తున్నాయి. టీవీ ఛానళ్లు పేర్లు వేయడం, దీనికి మా ఎమ్మెల్యేలు ఖండనలు ఇవ్వడం. ఇలా ఎన్నిరోజులు. ఏం తీరు ఇది.

ఇంతమందిని లాక్కునే శక్తి చంద్రబాబుకు ఉంటే ఐదుగురుతో ఎందుకు ఆగారు? ఆయనపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఎవ్వరికీ లేవు. మునిగిపోయే పడవ ఎక్కడానికి ఎవ్వరూ సిద్ధంగా లేదు. టీవీ ఛానళ్లలో వచ్చే తప్పుడు వార్తల వల్ల, ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యేల నిజంగా వెళితే, ఏమైనా రాసినా అర్థం ఉంటుంది. వెళ్లనివాళ్లను కూడా టార్గెట్ చేసి వార్తలు రాయడం సరికాదు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మీడియా కూడా సంయమనంతో వ్యవహరించాలి.' అని సూచించారు.

ఏడాదైతే వాళ్లే మా పార్టీలోకి వస్తారు: వైఎస్ జగన్


ఏడాదైతే వాళ్లే మా పార్టీలోకి వస్తారు: వైఎస్ జగన్
హైదరాబాద్: ఎమ్మెల్యేలను కొనడం వల్ల ప్రభుత్వాలు నిలబడవని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తేనే ప్రభుత్వాలు నిలబడతాయని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో గురువారం ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ 'నలుగురైదుగురు ఎమ్మెల్యేలను తీసుకోవడం వల్ల ఏమీ కాదు. మొట్టమొదట పార్టీలో అమ్మ, నేను మాత్రమే ఉన్నాము. ఆ తర్వాత 18 మంది ఎమ్మెల్యేలు వస్తే రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాము. అనంతరం మా బలం 67 కు చేరుకుంది. అధికార పార్టీ పట్టిసీమ, జెన్ కో, రాజధాని భూముల్లోని అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కోనుగోలు చేస్తోంది.
 
ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 నుంచి 30 కోట్లు ఆఫర్ చేస్తున్నారు.  ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక చంద్రబాబు ప్రతిపక్షం గొంతు నొక్కే పనిలో పడ్డారు. టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల నియెజక వర్గాల్లో అంతకంటే మెరుగైన నాయకులు వస్తారు. ఆ నాడు ఎన్టీఆర్ గెలిపించిన ఎమ్మెల్యేలను తీసుకుని దొడ్డి దారిన చంద్రబాబు సీఎం అయ్యారు.  ఆయనకు సిగ్గుంటే పార్టీలోకి తీసుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. అప్పుడు ఎన్నికలకు వెళ్దాం..ప్రజలు ఎవరి వైపు నిలబడతారో చూద్దాం. చంద్రబాబు ఈ సవాల్ ను ఛాలెంజ్ గా తీసుకోవాలి. ప్రజలకు మాకు తోడున్నామంటూ భరోసా ఇస్తున్నారు. ఇంకో ఏడాదైతే టీడీపీ ఎమ్మెల్యేలే మా పార్టీలోకి వస్తారు. అప్పడు నైతికంగా వాళ్లతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తా' మని తెలిపారు. 

ఆ శక్తి వైఎస్ జగన్‌కి ఉంది : రోజా


ఆ శక్తి వైఎస్ జగన్‌కి ఉంది : రోజా
అన్నవరం: రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తానంటూ ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ పిచ్చి భ్రమల్లో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. దీనిని బట్టి లోకేశ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అర్థమవుతోందన్నారు. ప్రజస్వామ్యంలో ప్రతిపక్షం చాలా అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. గురువారం ఉదయం రోజా దంపతులు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయస్వామిని దర్శించుకుని వ్రతం ఆచరించారు.
అనంతరం రోజా విలేకర్లతో మాట్లాడుతూ...  లోకేశ్ తెలంగాణలో బీరాలు పలికి తొడగొట్టాడని... అక్కడ టీడీపీ ఖాళీ అయిపోయిందన్నారు. ఇక్కడ కూడా అలాంటి కబుర్లే చెబుతున్నాడని, త్వరలో ఏపీలోనూ టీడీపీ ఖాళీ అయిపోయే పరిస్థితి వస్తుందని రోజా జోస్యం చెప్పారు. నలుగురైదుగురు పార్టీని వీడినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడే ప్రసక్తే లేదన్నారు. వెళ్లిన వారు కూడా వ్యక్తిగత స్వార్థం కోసమేగానీ, రాష్ట్రాభివృద్ధి కోసం వెళ్లలేదన్నారు.
అన్ని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రజా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు.  అలాంటి నాయకుడిని వదలి వెళ్లిన వారు ఆలోచన చేసుకోవాలని సదురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి సూచించారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారి స్థానంలో కొత్తవారిని తయారు చేసుకుంటామని, ఆ శక్తి జగన్‌కు ఉందన్నారు.

చంద్రబాబు రాజకీయాలకు పట్టిన పీడ అని ఆమె ఎద్దేవా చేశారు.  స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని గతంలో ఎన్టీఆర్ తీర్మానం చేసిన విషయాన్ని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలు పక్కన పట్టి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబుపై రోజా నిప్పులు చెరిగారు.

జగన్ వెంటే నా పయనం


'జగన్ వెంటే నా పయనం'
కడప : ఎవరెన్ని ప్రచారాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని ఆ పార్టీ నాయకుడు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం కడప జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ ను రఘురామిరెడ్డి ప్రొద్దుటూరులో కలిశారు. అనంతరం రఘురామిరెడ్డి మాట్లాడుతూ...  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెంటే నా పయనం అని తెలిపారు. పార్టీలు మారడం అనైతికమని రఘురామిరెడ్డి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరుతున్నట్లు వార్తా ఛానళ్లు ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించారు.
టీవీ 9 అంటే గౌరవం ఉందని... కానీ వాళ్లు కూడా అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. పార్టీ మారే అవకాశం లేని మాలాంటి వాళ్ల మీద ఇలాంటి ప్రచారమా... ? అని ప్రశ్నించారు. ఓ పార్టీ ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలను వేరే పార్టీ వాళ్లు పిలవడమే తప్పని రఘురామిరెడ్డి ఈ సందర్భంగా అభిప్రాపడ్డారు. ఓ వేళ ఎమ్మెల్యేలు మరోపార్టీలో చేరితే.. నియోజకవర్గాల్లో ఎలా తిరుగుతారన్ని ప్రశ్నించారు.  పార్టీ మారిన వాళ్లు... నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యనికి విరుద్ధమన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణలో ఓ న్యాయం. ఏపీలో మరో న్యాయమా అని నిలదీశారు.
తెలంగాణలో పార్టీ మారితే... ఎలా వ్యతిరేకిస్తారు... ఇక్కడ ఎలా సమర్థిస్తారు అని అడిగారు. చంద్రబాబుకు నైతిక విలువలు ఉన్నాయా అని రఘురామిరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. విలువలు లేని చంద్రబాబు... ఎథిక్స్ పెట్టడం హాస్యాస్పదంగా ఉందని రఘురామిరెడ్డి ఎద్దేవా చేశారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు... టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రఘురామిరెడ్డి పై విధంగా స్పందించారు.

వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన ప్రారంభం


వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన ప్రారంభంవీడియోకి క్లిక్ చేయండి
కడప : వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన గురువారం ప్రారంభమైంది. ఉదయం 7.30 గంటలకు వైఎస్ జగన్ పులివెందుల నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో కమలాపురం వద్ద ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ కొద్దిసేపు ఆగి.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎర్రగుంట్ల మునిసిపాలిటీకి చెందిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ దాసరి సూర్యానారాయణరెడ్డిని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు.
మునిసిపల్ అధికారులు ప్రతిపక్ష పార్టీకి చెందిన సూర్యానారాయణరెడ్డిపై కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తుండడంతో పార్టీ తరఫున భరోసా ఇచ్చారు. అనంతరం జగన్ ప్రొద్దటూరుకు బయల్దేరి వెళ్లారు. సదరు ప్రాంతాల్లోని పలు కుటుంబాలను వైఎస్ జగన్ ఈ రోజు పరామర్శించనున్నారు. అలాగే ఈ రోజు రాత్రి జరగబోయే చిన్నమ్మ కుమార్తె వివాహానికి వైఎస్ జగన్ హాజరుకానున్నారు.

జగన్‌తోనే ఉంటా


'జగన్‌తోనే ఉంటా'
ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ 
 
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితోనే ఉంటానని, పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు.

మంగళవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తాను వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచానని, ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చెప్పారు. కొన్ని చానళ్లలో అసత్య ప్రచారం జరుగుతోందని, తాను పార్టీ మారడం లేదని వెల్లడించారు. జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని ఉద్ఘాటించారు. 

మీ గెలుపే.. బహుమతి


మీ గెలుపే.. బహుమతి
♦ నిరంతరం అందుబాటులో ఉంటా..
♦ పార్టీ గుర్తును ప్రజలకు తెలపాలి..
♦ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం : ‘కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు అలుపెరుగకుండా కష్టపడండి.. మీరు పోటీ చేసిన డివిజన్‌లో గెలిచి.. వైఎస్సార్ సీపీ సత్తా చాటితే అదే నాకు మీరిచ్చే బహుమతి’ అని ఖమ్మం ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని  వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలో పార్టీ తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులతో బుధవారం రాత్రి ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల కమల్‌రాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రచారంలో ప్రతి ఒక్కరూ పార్టీ గుర్తును ఓటర్లకు తెలియజేయాలన్నారు. స్క్రూట్నీ పూర్తయిన తర్వాత ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రతి ఒక్కరి తరఫున ప్రచారం చేస్తానని.. ఇతర అభ్యర్థులు, పార్టీలు, నాయకులు, అధికారుల నుంచి ఏఒక్క అభ్యర్థికి, కార్యకర్తకు ఏచిన్న సమస్య తలెత్తినా.. ఇబ్బంది కలిగినా.. వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు.

వెనుకడుగు వేయకుండా సమస్యను పరిష్కరిస్తానన్నారు. బెదిరింపులకు పాల్పడే వారికి భయపడవద్దని, ఎదుటి వ్యక్తి ఎంత గొప్పవారైనా నేనున్నానని దైర్యం చెప్పారు. మీ విజయం కోసం మారుమూల ప్రాంతానికైనా వస్తానని.. ఎన్ని కిలోమీటర్లయినా నడుస్తానని.. ఎంత కష్టపడటానికైనా తాను సిద్ధమని చెప్పారు. అధికార పార్టీ నాయకుల్లా సాధ్యపడని హామీలు గుప్పించి మోసగించే ప్రయత్నం చేస్తే రాజకీయంగా ఎదగలేరని ఆయన సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షర్మిలాసంపత్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సూతగాని జైపాల్, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి సాధు రమేష్‌రెడ్డి, వైరా నియోజకవర్గ కోఆర్డినేటర్ బొర్రా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

చినబాబు.. కోటా!



అధికారపార్టీ నేతల అరాచకం
60సీ కింద బాలాజీ రిజర్వాయర్పనుల విభజన
 స్లో ప్రోగ్రెస్ కింద  పాత కాంట్రాక్టర్‌పై వేటు
అధికారుల తీరుపై  సర్వత్రా విమర్శలు


జిల్లాలోని నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువ పనులను వాటాలు వేసి పంచుకుంటున్న అధికారపార్టీ నాయకులు మరో అక్రమానికి తెరతీశారు. గాలేరు-నగరి కాలువ పరిధిలోని బాలాజీ రిజర్వాయర్ పనులను చినబాబు అనుచరులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంలో ఉన్న కాంట్రాక్టర్‌పై పనుల ఆలస్యం అనే నెపం నెట్టారు. అసలు విషయమేమంటే పనులు చేపట్టేందుకు పలు శాఖల నుంచి క్లియరెన్సులే రాలేదు. పనులూ ప్రారంభమే కాలేదు. అయినా పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని  పేర్కొనడం కొసమెరుపు.

తిరుపతి తుడా: గాలేరు-నగిరి కాలువ పరిధిలోని బాలాజీ రిజర్వాయర్ పనులను అధికారపార్టీ సానుభూతి పరులకు  అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. బాలాజీ రిజర్వాయర్ పనులను 60-సీ కింద విభజించి  చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అనుయాయులైన మరో ఇద్దరికి కట్టబెట్టేందుకు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. మూడో కంటికి తెలియకుండా సంబంధిత అధికారులు ఈ పనులను చక్కబెట్టేశారు. పాత కాంట్రాక్టర్‌కు చెక్ పెడుతూ ఈ పనులు టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయి. 2007లో అగ్రిమెంట్ పొందిన హైదరాబాద్‌కు చెందిన ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ జీఎన్‌ఎస్‌స్ 11వ ప్యాకేజీ కింద బాలాజీ రిజర్వాయర్ పనులను టెండర్ ద్వారా చేజిక్కించుకుంది.
2011 కల్లా బాలాజీ రిజర్వాయర్ పనులు పూర్తిచేయాల్సి ఉంది. అయితే నిర్మాణం చేపట్టాలంటే డీజీపీఎస్ సర్వే చేసి ఫారెస్ట్ అనుమతులు పొందాల్సి ఉంది. ఇప్పటికీ ఫారెస్టు అనుమతులు రాకపోవడం, నిధులు విడుదలలో పక్షపాతం వంటి అనేక కారణాలు వెంటాడటంతో బాలాజీ రిజర్వాయర్ పనులకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది.
ఫారెస్టు క్లియరన్స్ లేకపోవడం సంబంధిత అధికారులదే తప్పువుతుంది, కాంట్రాక్టర్‌ది ఎలాంటి తప్పులేకపోయినా స్లో ప్రోగ్రెసివ్ కింద పాత అగ్రిమెంట్‌ను నిలుపుదల చేస్తూ 60-సీ కి విభజించి మరో ఇద్దరికి (పీఎంఆర్, చెన్నకేశవ కన్‌స్టక్ష్రన్‌‌సకు) పనులను అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. దీనికితోడు రిజర్వాయర్ అంచనా వ్యయం రూ.125.55 కోట్లు కాగా.. తాజాగా మరో రూ.90 కోట్లను పెంచి కొత్త కాంట్రాక్టర్లకు ఇచ్చారనీ, ఇందులో చినబాబుకు భారీగా వాటా దక్కనున్నట్లు సమాచారం.

టెండర్‌కు వెళ్లకుండా.. 60సీ తెరపైకి
స్లో పోగ్రెస్ కింద పాత కాంట్రాక్టర్‌ను  నిలుపుదల చేస్తూ అదే అగ్రిమెంట్‌తో 60-సీ కింద పనులను మరో ఇద్దరికి అప్పగించేశారు. జీఎన్‌ఎస్‌ఎస్‌లో భాగమైన బాలాజీ రిజర్వాయర్ 11వ ప్యాకేజీ కిందకి వస్తుంది. 2007లో హైదరాబాద్‌కు చెందిన ప్రోగ్రెసీవ్ కంస్ట్రక్షన్స్ టెండర్ ద్వారా రూ.125.55 కోట్లతో పనులను దక్కించుకున్నారు.
స్లో ప్రోగ్రెస్ కింత పాత కాంట్రాక్టర్‌ను నిలుపుతూ అదే అగ్రిమెంట్ కింద మరో ఇద్దరికి పనులను అప్పగించారు. ప్రభుత్వం- కాంట్రాక్టర్‌ల మధ్య తలెత్తడానికి కారణమైన పనులు, అనవసర క్లైమ్‌లు వచ్చిన పనుల్ని విడదీయడానికి, స్లో ప్రోగెస్ (పనుల్లో జాప్యం) వంటి కారణాలు ఎదురైతే పనుల్ని విడదీసి మరొకరికి ఇవ్వడం కోసం 60-సీ నిబంధన తెరపై తీసుకొస్తారు.
ఈ నిబంధన బాలాజీ రిజర్వాయర్‌కు వర్తించకపోయినా చినబాబు అండతో60సీ తెరపైకి తీసుకొచ్చి పచ్చనేతలకు కట్టబెట్టారు. స్లో ప్రోగ్రెస్ ఉంటే టెండర్‌ను రద్దుచేసి మళ్లీ టెండర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. 60-సీని అడ్డుపెట్టుకుని టెండర్‌కు వెళ్లకుండా అధికార పార్టీ నేతలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బరితెగించింది. పాత టెండర్ పేరుతో ప్రస్తుతం పనులు అప్పగించినా, వాటి అంచాలను పెంచి కోట్ల రూపాయలు కొట్టేసేందుకు పెద్దకుట్ర జరుగుతోంది.
మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో జీఎన్‌ఎస్‌ఎస్‌కు నిధులు కేటాయించనుండటంతో చినబాబు తన అనుయాయులకు లబ్ధిచేకూర్చి తద్వారా సొమ్ముచేసుకునేందుకు ఈ కుంభకోణానికి తెరలేపారు. తిరుపతి డివిజన్ గాలేరు-నగరి చీఫ్ ఇంజనీరు ఈ అంశంపై సాక్షి వివరణ కోరగా.. సెలవులో ఉన్న కారణంగా తనకు పూర్తి సమాచారం తెలియదని అనారోగ్యం దృష్టా సెలవు పెట్టానని. రెండు రోజుల్లో పూర్తి వివరాలు చెబుతానని తెలిపారు.

స్లో పోగ్రెసివ్ ఎలా అవుతుంది
బాలాజీ రిజర్వాయర్ పనులు చేయాలంటే ఇతర శాఖలకు సంబంధించి ముందస్తు అనుమతులు ఉండాలి. 2011 కల్లా ఈ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటికీ ఫారెస్టు అనుమతులు లేవు. అనుమతులు ఇవ్వకనే టెండర్ పిలిచి పనులను అప్పగించారు. ఆ తరువాతైనా అనుమతులు కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అసలు ప్రారంభమే కాని పనులకు స్లో పోగ్రెస్ అనే కారణంతో పాత కాంట్రాక్టర్‌కు చెక్ పెట్టి అగ్రిమెంట్‌ను రద్దు చేయడం గమనార్హం.

మీ ఫేస్ వ్యాల్యూ ఏంటో... వాళ్లే చెబుతారు: రోజా

Written By news on Wednesday, February 24, 2016 | 2/24/2016


మీ ఫేస్ వ్యాల్యూ ఏంటో... వాళ్లే చెబుతారు: రోజా
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. బుధవారం విశాఖపట్నంలో రోజా విలేకర్లలో మాట్లాడుతూ... నమ్మినవారిని నట్టేట ముంచడమే నారా వారి సిద్ధాంతం అని ఆరోపించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను దెబ్బకొట్టాలనే దృష్టి తప్ప చంద్రబాబుకు పాలనపై శ్రద్ధే లేదని విమర్శించారు. పార్టీ కోసం ప్రాణాలొదిలిన కుటుంబాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు.
అలాగే ఓట్లు వేసిన ప్రజలను కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. తండ్రి అధికారంలో ఉన్నారని వానపాములాంటి లోకేశ్ నేడు నాగుపాములా బుసకొడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. లోకేశ్ వైఖరి చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందని,   లోకేశ్ అవాకులు, చెవాకులతోనే తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏపీలో కూడా లోకేశ్ కి బాధ్యతలు అప్పగిస్తే .. మన పరిస్థితి ఏంటని టీడీపీ నేతలు భయపడుతున్నారన్నారు.
చంద్రబాబులాంటి దిక్కుమాలిన ఆలోచనలు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు లేవని రోజా అన్నారు. గతంలో ఎన్టీఆర్ లాంటి మహానుభావుడిని  ముఖ్యమంత్రి కుర్చీ నుంచి కిందకి దింపే వ్యవహారం... ఒక వేళ జగన్ చేస్తే మీరు ఒక్క రోజు కూడా అధికారంలో ఉండేవారు కాదని ఆమె అన్నారు. దమ్ముంటే ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలనైనా తీసుకెళ్లవచ్చని... అయితే సిగ్గు, అభిమానం అనేది ఉంటే.. పార్టీ మారినవారితో రాజీనామా చేయించి  మళ్లీ ఎన్నికల్లో  పోటీ చేయాలని రోజా సవాల్ విసిరారు. మీ ఫేస్ వ్యాల్యూ ఏంటో...  మీరు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలే చెబుతారంటూ రోజా ధ్వజమెత్తారు.

కేంద్ర హోంమంత్రితో వైఎస్ జగన్ భేటీ


కేంద్ర హోంమంత్రితో వైఎస్ జగన్ భేటీ
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా ప్రక్రియను వేగవంతం చేయాలని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేంద్ర హెంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కోరినట్టు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పార్టీ ఎంపీలతో పాటు ఆయన బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు రాజ్ నాథ్ ను కలిశారు. భేటీ ముగిసిన తర్వాత వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడుతూ... నిన్నటి అంశాలనే హోంమంత్రికి వివరించినట్టు తెలిపారు.

మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలయ్యేలా చూడాలని రాష్ట్రపతిని వైఎస్ జగన్ కోరారు. వివిధ అంశాలపై నాలుగు పేజీల వినతిపత్రం సమర్పించారు. వైఎస్ జగన్ వెంట లోక్‌ సభా పక్షనేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పివి మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు.

అటు నుంచి 40 మంది రారని గ్యారంటీ ఉందా?


అటు నుంచి 40 మంది రారని గ్యారంటీ ఉందా?
విజయవాడ :
హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నో నీతులు చెప్పారని.. ఇప్పుడు ఆయన ఏపీలో చేస్తున్నది ఏంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి విమర్శించారు. 10 మందిని తీసుకెళ్తా అని చెప్పిన చంద్రబాబు కేవలం నలుగురిని మాత్రమే చేర్చుకోగలిగారని, దీంతో ఆయన ఏంటన్నది అందరికీ తెలిసిపోయిందని అన్నారు. తమ పార్టీ వాళ్లు నలుగురు ఆ పార్టీలోకి వెళితే టీడీపీ నుంచి 40 మంది తమ పార్టీలోకి రారని గ్యారంటీ ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఓ మాట, ఇక్కడ ఓ మాట మాట్లాడుతున్నారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మాట్లాడినట్లే ఇక్కడ కూడా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాలు చేశారు. తమకు మెజార్టీ ఉన్నా అక్రమంగా జిల్లా పరిషత్ లను కైవసం చేసుకున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చి బాబు సీఎం అయ్యారని, ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. అక్కడ కేసీఆర్ చేశారు. ఇక్కడ నేను చేస్తాను అంటే నీ నైతికత ఏంటి చంద్రబాబూ అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. టీడీపీ నుంచి వెళ్లి పోయిన తర్వాత రాజీనామా చేసి ఓసారి, టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు రెండుసార్లు రాజీనామా చేసి ఎన్నికలల్లో పోటీచేసి గెలిచారన్నారు. టీడీపీలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. దమ్ముంటే ఎన్నికల్లో మళ్లీ గెలిచి చూపించాలని డిమాండ్ చేశారు. నైతికత లేని నేత ఎవరంటే ఒక్క చంద్రబాబు తప్ప ఎవరూ లేరని, ప్రజలు ఇదే విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రెండేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశావు బాబూ.. రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ లో ఉండి పాలించావు తప్ప రాష్ట్రాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు.

తనపై ఓటుకు కోట్లు కేసులు వేశారని వాపోయిన చంద్రబాబు.. ఇప్పుడు కేసీఆర్ తో ఏమైనా సెటిల్ మెంట్ చేసుకున్నారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో పదేళ్లు ఉండే అర్హత కోల్పోతున్నామా అని అడిగారు. నిజంగానే చంద్రబాబు అభివృద్ధి చేస్తే ఈ మూడేళ్లే కాదు.. మరో 5 ఏళ్లు రాష్ట్రాన్ని మీ చేతుల్లోనే పెడతామని చెప్పారు. కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రజలు రెండేళ్లు మిమ్మల్ని భరించారని, ఇంకా ఆయన పరిపాలన కొనసాగితే ఇంకెన్ని దుష్పరిణామాలు తలెత్తుతాయోనన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారని చెప్పారు. ఎవరో పార్టీ నుంచి వెళ్లిపోయారని దాని గురించి ఆలోచించాల్సిన పని లేదన్నారు.

ఆయనవి సిగ్గుమాలిన పనులు.. పైశాచిక ఆనందం


ఆయనవి సిగ్గుమాలిన పనులు.. పైశాచిక ఆనందం
విజయవాడ :
పార్టీలు మారినప్పుడు పదవులకు రాజీనామా చేసి.. మళ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలవడం రాజకీయాల్లో నిబద్ధతకు చిహ్నమని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మూడుసార్లు తన పదవులకు రాజీనామా చేశారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి బయటకు రాగానే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, సిద్దిపేట నుంచి పోటీ చేసి గెలిచారని, అలాగే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి మళ్లీ గెలిచారని అన్నారు. దానం నాగేందర్‌ను వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నప్పుడు కూడా ఆయనతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించారని, మళ్లీ ఎన్నికలు పెడితే నాగేందర్ ఓడిపోయారని చెప్పారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికలకు ముందు, ఆ తర్వాత తెలంగాణలో జరిగిన పరిణామాల సందర్భంలో చంద్రబాబు మాట్లాడిన మాటలు, ఆయన చేసిన సిగ్గుమాలిన పనులు, ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకుని పొందిన పైశాచిక ఆనందం అన్నీ స్పష్టం అవుతున్నాయన్నారు. గతంలో కేసీఆర్‌ను తిట్టిన తిట్లన్నీ ఇప్పుడు ఆయన తనను తాను తిట్టుకున్నట్లు అయిందని చెప్పారు. వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు.. 18 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, తాను కూడా రాజీనామా చేసి సొంత పార్టీపై పోటీచేసి గెలిచిన చరిత్ర ఉందని కొడాలి నాని గుర్తుచేశారు. పార్టీలు మారినప్పుడు తామంతా కూడా శాసనసభ్యత్వాలను వదులుకున్నామని, తమపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌ను తామే కోరామని చెప్పారు.

క్యాంపులు పెట్టడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం చంద్రబాబుకు రాజకీయాల్లో ముందునుంచి అలవాటని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కాళ్లు, సోనియా కాళ్లు పట్టుకుని వదలరని నాని ఎద్దేవా చేశారు. దమ్ముంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని.. ప్రజలు వాళ్లకు అనుకూలంగా తీర్పు వస్తే తాము నోరు మూసుకుని కూర్చుంటామని, నీకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఏం చేస్తావో చెప్పాలని సవాలు చేశారు. తెలంగాణలో పార్టీని సర్వనాశనం చేసినందుకు ఎన్టీఆర్ ఆత్మ కూడా క్షోభిస్తూ ఉంటుందని అన్నారు. పదవీ కాంక్ష ఉన్న ఎమ్మెల్యేలు వేరే పార్టీ నుంచి వచ్చి తమ పార్టీలో చేరే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. ఎందుకంటే.. అలా రావాలంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తమ అధినేత చెబుతారని, అది వాళ్లకు ఇష్టం ఉండదని అన్నారు. జలీల్‌ఖాన్‌కు మంత్రి ఉమా బ్రోకరేజి చేశారని జిల్లాలో అందరూ చెబుతున్నారన్నారు. శోభా నాగిరెడ్డి పీఆర్పీ నుంచి వైఎస్ఆర్‌సీపీలోకి వచ్చినప్పుడు ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చారని, ఇప్పుడు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ ఆమె అడుగుజాడల్లో నడవాలంటే వాళ్లు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జలీల్ ఖాన్ రాజీనామా చేసినా, ఆయన అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడుగురు కార్పొరేటర్లు మాత్రం ఇప్పటికీ వైఎస్ జగన్ వెంటే ఉన్నామంటూ వచ్చారని చూపించారు.

హామీలు అమలయ్యేలా చూడండి


హామీలు అమలయ్యేలా చూడండి
♦ ప్రత్యేక హోదా ప్రక్రియను వేగవంతం చేయాలి
♦ రాష్ర్టపతికి ప్రతిపక్ష నేత జగన్ వినతిపత్రం

 సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశయ్యారు. వివిధ అంశాలపై వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలోని ముఖ్యాంశాలు...

► ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు, రాజ్యసభ సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కాలేదు. ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటనలను ఆంధ్రప్రదేశ్‌ఖ 2019 వరకు రెవెన్యూ లోటు ఎదుర్కోనుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2014-15కు సంబంధించిన లోటును పూర్తిగా భర్తీ చేయలేదు.
► కడపలో స్టీలు ప్లాంట్, పెట్రో కెమికల్ కాంప్లెక్సు, విశాఖలో రైల్వేజోన్ అంశాల్లో పురోగతి లేదు. రాష్ట్రంలో ప్రధానమైన పరిశ్రమలు, పెట్టుబడులు ఇప్పటివరకు రాలేదు. అందువల్ల ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని నీతి ఆయోగ్‌కు సూచించండి. ప్రత్యేక హోదా ప్రతిపాదనను 2014 మార్చి 2న కేబినెట్ ఆమోదించింది. ప్రత్యేక హోదాను అమలు చేయాలని ప్రణాళిక సంఘాన్ని ఆదేశించింది.
► వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాల్సి ఉండగా కేంద్రం ఇప్పటివరకు రూ.700 కోట్లు మాత్రమే విడుదల చేసింది. బీఆర్‌జీఎఫ్ పథకాన్ని రద్దు చేసింది. మరోవైపు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు, అభివృద్ధిని ఒకే ప్రాంతంలో కేంద్రీకరించే ైవె ఖరితో ఉంది. అందువల్ల రాజ్యసభలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమను అభివృద్ధి చేయాలని కోరుతున్నాం.
► పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తిచేయాలి.
► టీడీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెడుతోంది. తుని సంఘటనలో మాత్రమే కాకుండా చిత్తూరు మేయర్ హత్యోదంతంలోనూ ఇలాగే వ్యవహరించింది.
► తుని సంఘటనపై దర్యాప్తు జరగకుండానే ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్‌సీపీపై నెపం నెట్టడమే కాకుండా కడప, పులివెందుల వాళ్లు బాధ్యులంటూ పదేపదే ప్రకటనలు ఇస్తున్నారు.
► అధికార పార్టీ నేతలు కాల్‌మనీ-సెక్స్ రాకెట్, అక్రమ ఇసుక తవ్వకాలు, ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడుతున్నా చర్యలు లేవు. శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై కూలీలను కాల్చి చంపినా సమగ్ర దర్యాప్తు జరగలేదు. గోదావరి పుష్కరాల్లో తొలిరోజే 29 మంది భక్తులు చనిపోతే ఆ సంఘటనపై దర్యాప్తు జరగలేదు.
► ప్రభుత్వ అవినీతిపై, మేం చేసిన ఫిర్యాదులపై సిట్టింగ్ జడ్జితో గానీ, లేదా సీబీఐతోనైనా దర్యాప్తు జరిపించండి.

టీడీపీ టికెట్‌పై గెలవగలరా?


టీడీపీ టికెట్‌పై గెలవగలరా?
♦ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వైఎస్సార్‌సీపీ సవాల్
♦ చంద్రబాబుది రాజకీయ వ్యభిచారం

 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ నుంచి అధికారపక్షంలోకి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీ టికెట్‌పై పోటీ చేసి గెలవాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సవాలు విసిరారు. వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని మండిపడ్డారు.  జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పార్టీ మారిన ఈ నలుగురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నుంచి అభ్యర్థిని ఎవరు నిలబెట్టాలనేది కూడా వారే నిర్ణయించుకోవచ్చని ఆ ‘ఛాయిస్’ను కూడా తాము వారికే ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు అధికారపక్షంలోకి వెళ్లినంత మాత్రాన ప్రజల్లో మార్పు లేదని ప్రజలంతా వైఎస్సార్‌సీపీ పక్షానే ఉన్నారని, ఎన్నికలు జరిగితే జగన్‌కు ఎపుడెపుడు ఓటేయాలా అని ఎదురు చూస్తున్నారన్నారు.

 ఏం చూసి వెళ్లారు?: నలుగురు ఎమ్మెల్యేలు ఏం చూసి చంద్రబాబు పార్టీలోకి వెళ్లారు? చంద్రబాబు పాలన ప్రజాహితంగా సాగుతోందని వెళ్లారా? ఎన్నికలపుడు ఇచ్చిన రైతుల, డ్వాక్రా మహిళల రుణ మాఫీని అమలు చేశారని వెళ్లారా? నిరుద్యోగ సమస్య, కాపుల సమస్య పరిష్కరిస్తున్నారని వెళ్లారా? అని సూటిగా ప్రశ్నించారు. కేవలం దొంగ కేసులు, అవినీతి సూట్‌కేసుల కోసమేననేది స్పష్టమవుతోందన్నారు. శ్రీనివాసులు మాట్లాడుతూ తాను పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేల చేత చంద్రబాబు రాజీనామా చేయించి నైతిక విలువలకు కట్టుబడి ఉండాలన్నారు.   పిన్నెల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కినపుడు చేసిన తొలి ఐదు సంతకాలు ఎందుకు అమలు చేయలేక పోతున్నారో చంద్రబాబు అవలోకించుకోవాలన్నారు.

పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న సీఎం


పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న సీఎం
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శ
నరసరావుపేట వెస్ట్ : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాని సీఎం చంద్రబాబునాయుడు తన ప్రభుత్వంపై పెల్లుబుకుతున్న ప్రజావ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మంగళవారం సాయంత్రం పత్రికలకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మామ నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచి ఆనాడే నైతిక విలువలను చంద్రబాబు నాయుడు కాలరాశాడని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవటం దేనికో చంద్రబాబు ప్రజలకు చెప్పాల్సి ఉందన్నారు.

తెలంగాణాలో అడ్డగోలుగా ఎమ్మెల్యేలను అక్కడి అధికార పార్టీ కొనుగోలు చేస్తోందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, తాను ఏపీలో అదే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో చేస్తే తప్పు.. తానుచేస్తే ఒప్పని చెప్పటం నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనమన్నారు. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి మునిగిపోయే తన పడవను కాపాడుకోవాలని సీఎం తాపత్రయపడుతున్నాడని తెలిపారు. తన పంచన చేరిన ఎమ్మెల్యేలే తమ నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పనికూడా జరగలేదని చంద్రబాబు ముందే ఏకరువు పెడుతుంటే ఈ రాష్ట అభివృద్ధి ఏవిధంగా ఉందో 175 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వ్యక్తి రాష్ట్రప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వెంటనే తనతో కలిసి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లి నైతిక విలువలకు కట్టుబడిన ఆదర్శ నాయకుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అని గుర్తుచేశారు. ఇదేవిధంగా చంద్రబాబునాయుడు తన పార్టీలోకి వచ్చిన వారితో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లే సత్తా ఉందా అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఆయన స్వయంగా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాల కోసం పాటుపడే నాయకులు, కార్యకర్తలకు పార్టీలో కొదవేలేదని ఆయన స్పష్టం చేశారు

అప్పుడు పశువులు.. ఇప్పుడు కాదా?


అప్పుడు పశువులు.. ఇప్పుడు కాదా?
పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు అండ్ కో వింత వ్యాఖ్యలు
 
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై నిన్న, మొన్నటివరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో పాటు ఆ పార్టీ నేతలు ఎన్నో సుద్దులు చెప్పారు. తెలంగాణలో ఇతర పార్టీల నేతలను టీఆర్‌ఎస్ పార్టీ సంతలో పశువులను కొన్నట్లు కొంటోందని, ఆ పార్టీకి మగతనం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. వారి ఇళ్ల ముందు చావు డప్పులు మోగించడం, చీపుర్లు, చెప్పుల ప్రదర్శన వంటి నిరసన కార్యక్రమాలను సైతం తెలుగుదే శం కార్యకర్తలు నిర్వహించారు. కానీ ఇప్పుడు.. ‘తాము చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి..’ అన్నట్టుగా ఉంది టీడీపీ వ్యవహారం. పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు మచ్చుకు కొన్ని..
 
సంతలో పశువులు మాదిరిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అదే బలమని భ్రమపడుతున్నారు. చేతనైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు రావాలి. ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది. మేం సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమో కాదో తేల్చుకోండి.
-రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ప్రకాష్‌గౌడ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. (ప్రకాష్‌గౌడ్ ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరారు)
 
సనత్‌నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తలసాని శ్రీనివాసయాదవ్ ఏ పార్టీ తరఫున గెలిచి ఏ పార్టీలో ఉన్నారో సమాధానం చెప్పాలి. మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్లూ.. ఇది న్యాయమా? టీడీపీలో గెలిచి రాజీనామా చేయకుండా హీరో మాదిరిగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారంటే, అది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అలాంటి వ్యక్తులను చిత్తు చిత్తుగా ఓడించాలి. స్వార్ధంతో కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినా పార్టీ కార్యకర్తలు చెక్కు చెదరలేదు. ఒకరు పోతే వందమంది నేతలను తయారు చేసుకునే శక్తి టీడీపీకి ఉంది.
-గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు
 
సొంతంగా నాయకులను తయారు చేసుకోలేక టీడీపీ నేతలను ఇతర పార్టీలు అరువు తెచ్చుకుంటున్నాయి. తెలంగాణలో టీడీపీని దెబ్బతీసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. సామాన్య కార్యకర్తలను ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేస్తే వారు పార్టీని వదలడం బాధాకరం.
 - మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ విస్తృత సమావేశంలో చంద్రబాబు
 
టీ  టీడీపీ నుంచి ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలది వెన్నెముకలేని బతుకు. ఇబ్బంది కలిగించిన వారిని ఎదిరించి నిలబడాలి, తలబడాలి. కానీ ఆ నాయకులు సీఎం కేసీఆర్ కాళ్లముందు మోకరిల్లారు. ఫిరాయింపులతో పదవులు, సొమ్ములు రావొచ్చేమో గానీ గౌరవం రాదు.
 -ఎనుముల రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ

Popular Posts

Topics :