హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 18న విశాఖపట్నం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. విశాఖపట్నం జిల్లా పాల్మన్ పేటకు వెళ్లి మత్స్యకారులను పరామర్శించనున్నారు. ఇటీవల దాడులకు గురైన మత్స్యకారులతో వైఎస్ జగన్ మాట్లాడి వారికి భరోసా కల్పించనున్నారు.
పాల్మన్ పేటలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, మత్స్యకారులపై తెలుగుదేశం పార్టీ నేతలు ఇటీవల దాడి చేసిన సంగతి తెలిసిందే. టీడీపీలో చేరడం లేదన్న కారణంతో తమపై దాడి చేశారని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజ నిర్థారణ కమిటీ ఇదివరకే పాల్మన్ పేట గ్రామాన్ని సందర్శించి బాధితుల్ని పరామర్శించింది.