14 August 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

పీవీ సింధుకు రెండెకరాల భూమి : విజయ్ చందర్

Written By news on Saturday, August 20, 2016 | 8/20/2016


హైదరాబాద్: ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధుకు బహుమతుల వర్షం కురుస్తోంది. తాజాగా ఆమెకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ చందర్ రెండెకరాల భూమిని కేటాయిస్తున్నట్లు శనివారం ప్రకటించారు.

కరుణామయుడు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ భూమిని ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్ ఫాంహౌస్ కు సమీపంలోని కరకపట్లలో ఈ భూమి ఉందన్నారు. పీవీ సింధు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా డాక్యుమెంట్స్ అందజేస్తామని విజయ్ చందర్ తెలిపారు.

కేంద్రంపై పోరాడాల్సింది పోయి.. బిచ్చమేస్తే తీసుకుంటావా?

కేంద్రంపై పోరాడాల్సింది పోయి.. బిచ్చమేస్తే తీసుకుంటావా? : అంబటి
 పునర్విభజన చట్టం కల్పించిన హక్కుల సాధనకు పోరాడాల్సిందిపోయి.. కేంద్రం భిక్షం వేస్తోంటే ఆంధ్రప్రదేశ్ బిచ్చగాళ్ల సంఘం అధ్యక్షుడిలా సీఎం చంద్రబాబు తీసుకోవడం ఏమిటని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. కేంద్రమిచ్చిన నిధుల్ని సక్రమంగా వినియోగించట్లేదంటూ వినియోగ ధ్రువీకరణ పత్రాల(యూసీలు)పై నీతిఆయోగ్ అనుమానం వ్యక్తపరుస్తూ.. తనపై అవినీతిపరుడిగా ముద్రవేసినా చంద్రబాబు నోరెందుకు పెగలట్లేదని ప్రశ్నిం చారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకోసం.. రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడం రాష్ట్రప్రజల గుండెల్ని తొలచివేస్తోందన్నారు.
విభజన చట్టంలోని హక్కులకోసం సీఎం చంద్రబాబు పోరాడితే వైఎస్సార్‌సీపీ మద్దతిస్తుందన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం రూ.1,976 కోట్ల సాయం ప్రకటించిందని.. ఇదిచూసి ఆనందపడాలో, బాధపడాలో అర్థమవని పరిస్థితి నెలకొందన్నారు.బాబులా స్వప్రయోజనాలకోసం రాష్ట్రప్రజల ప్రయోజనాల్ని తాకట్టుపెట్టే సంస్కృతి వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికుంటే.. ఆయన జైలుకెళ్లి ఉండేవారే కాదన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం 2014-15లో రూ.1,500 కోట్లు, 2015-16లో రూ.550 కోట్లు, ప్రస్తుతం రూ.450 కోట్లు.. వెరసి రూ.2,500 కోట్లే ఇచ్చిందన్నారు.  రెవెన్యూలోటు భర్తీకింద రూ.3,979 కోట్లే ఇచ్చిందన్నారు.
 రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఇచ్చిన హామీమేరకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులివ్వాలంటూ ఆదినుంచీ వైఎస్సార్‌సీపీ పోరాడుతోందని అంబటి గుర్తుచేశారు.

బాబు దాష్టికానికి దేవుడి మొట్టికాయలు తప్పదు

Written By news on Thursday, August 18, 2016 | 8/18/2016

'బాబు దాష్టికానికి దేవుడి మొట్టికాయలు తప్పదు'
విజయవాడ: ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్న మహాత్ముడి విగ్రహాన్ని పగులగొట్టి బుడమేరు కాల్వలో పడేయటం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దాష్టికానికి నిదర్శనం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బాబు పాలనలో గాంధీజీ, వైఎస్ఆర్ విగ్రహాలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం కృష్ణపుష్కరాల్లో భాగంగా పున్నమి ఘాట్ లో స్నానమాచరించిన ఆయన అనంతరం ఇబ్రహీం పట్నం వెళ్లారు. అక్కడ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు దుర్మార్గాలకు ఆ దేవుడే మొట్టికాయలు వేయాలని అన్నారు. చంద్రబాబు ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతుందని, ఆయనకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Popular Posts

Topics :