బాబు అలా చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు అలా చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు

బాబు అలా చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు

Written By news on Sunday, January 29, 2017 | 1/29/2017


‘బాబు అలా చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు’
విజయవాడ:  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పుట్టు పూర్వోత్తరాలు తెలుసు కాబట్టే.. ఆయన సొంత జిల్లా చిత్తూరులో వైఎస్ఆర్సీపీ 8 సీట్లను గెలుచుకుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలో మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. విశాఖలో జరిగింది భాగస్వామ్య సదస్సు కాదని.. అది గెట్ టు గెదర్ లా ఉందన్నారు. రాబోయే రోజుల్లో విశాఖను నేనే నిర్మించానని చంద్రబాబు చెప్పుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని బొత్స అన్నారు. రూ.10.50 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెబుతున్నారని, రూ.20 లక్షల కోట్లు వస్తున్నట్లు చెప్పుకుంటే బాగుండేదని ఎద్దేవాచేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని, భాగస్వామ్య సదస్సులో ఎంవోయూ చేసుకున్న కంపెనీల నెట్ వర్క్, బ్యాక్ గ్రౌండ్ క్రెడిబిలిటీని బయటపెట్టాని బొత్స డిమాండ్ చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంత దూరమైన వెళ్తామని, ఏం జరిగినా సరే హోదా సాధించే వరకు పోరాడతామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. హత్య, ఫ్యాక్షన్ రాజకీయాలను పోషించేదెవరో అందరికీ తెలుసునని, రాజకీయ నేత హత్యలో ఎవరున్నారో బెజవాడ ప్రజలందరికీ తెలుసునని, పింగళి వంశానికి చెందిన పాత్రికేయుడి హత్య, సీఎస్ యాక్సిడెండ్.. పింగళి నరసింహారావు ఎన్ కౌంటర్ గురించి బాబు కేబినెట్ లో పనిచేసిన హరిరామజోగయ్య పుస్తకంలో రాశారాని ఈ సందర్భంగా బొత్స గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో అన్ని రంగాలు కుంటుపడ్డాయని తెలిపారు.
Share this article :

0 comments: