
జాతీయ మహిళా సాధికారత సదస్సు అని ఆహ్వానం పంపి విమానాశ్రయంలో తనను ఓ టెర్రరిస్టులా అరెస్టు చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. శనివారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. విమానశ్రయంలో ఆపి బాంబులు, తుపాకులు, కత్తులు ఉన్న వారిలా అదుపులోకి తీసుకోవడం దారుణమని అన్నారు. మహిళలపై చంద్రబాబు ప్రభుత్వ చిన్నచూపును వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. టీడీపీ ప్రభుత్వం తనను చంపెయ్యదని గ్యారెంటీ ఏంటి? అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
0 comments:
Post a Comment