పోలవరానికి రూ 3,000 కోట్లా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పోలవరానికి రూ 3,000 కోట్లా!

పోలవరానికి రూ 3,000 కోట్లా!

Written By news on Tuesday, March 28, 2017 | 3/28/2017


పోలవరం ప్రాజెక్టుకు గత మూడేళ్లలో కేటాయించింది రూ. 3,000 కోట్లే... వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికే  దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడే రూ 5,500 కోట్లు ఈ ప్రాజెక్టుపై ఖర్చు పెట్టారు. కానీ జాతీయ ప్రాజెక్టుగా దీనిని ప్రకటించిన తరువాత మూడేళ్లలో మూడు వేల కోట్లు  మాత్రమే ఇచ్చారు.

 ఇక అలాంటి దానిపై ఇంకా ప్రెజెంటేషన్‌ ఏమిటి? ఇపుడు తాజాగా పోలవరం నుంచి బొల్లాపల్లి, అక్కడి నుంచి సోమశిలకు పెన్నా అనుసంధానం పేరుతో రూ . 1 లక్ష కోట్ల వ్యయంతో ప్రాజెక్టు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుకే ఏడాదికి రూ .వెయ్యి కోట్లు మించి ఇవ్వని మహానుభావుడు (చంద్రబాబు) మళ్లీ రూ. 1 లక్ష కోట్లతో అనుసంధానం అని ప్రజల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.   రాష్ట్రంలో ప్రతిదీ కుంభకోణమే కొనసాగుతోంది.
Share this article :

0 comments: