విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సోమవారం ఉదయం సమావేశమైంది. వైఎస్ జగన్ అధ్యక్షతన విజయవాడ ఆర్అండ్బీ గెస్ట్హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో.. 46 ప్రధాన సమస్యలను శాసనసభలో లేవనెత్తాలని వైఎస్ఆర్ సీపీ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాలను పొడిగించేలా బీఏసీలో వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టనుంది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది.
అనంతరం గంగుల ప్రభాకర్ రెడ్డిని వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు. ఫిరాయింపుల కారణంగా ఇద్దరికే ఎమ్మెల్సీ అవకాశం లభించిందని తెలిపిన జగన్.. అభ్యర్థుల ఎంపిక కారణాలను వివరించారు.
0 comments:
Post a Comment