
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ అంశంపై ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విలేకరులతో ముచ్చటించారు. రాజకీయాలు పక్కనపెట్టి ఈ విషయాన్ని ఆలోచించాలని ఆయన అన్నారు. ‘ఒక జడ్జి ముందుకు ఒక కేసు వస్తుంది. వీళ్లు తప్పని వాళ్లు... వాళ్లు తప్పని వీళ్లు...ఇరుపక్షాలు వాదనలు వినిపించుకుంటాయి. అన్ని విన్న తర్వాత జడ్జి ఒక నిర్ణయం తీసుకుంటారు.
అలాగే రోజా విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఆమెకు శిక్ష కూడా పూర్తయింది. శిక్ష పూర్తయ్యాక కూడా మళ్లీ గతంలో ఏదో జరిగిందని పాత విషయాన్ని తిరగదోడడం కరెక్టేనా? ఒకే అంశానికి సంబంధించి ఎన్నిసార్లు చర్యలు తీసుకుంటారు?. ఒక ఆడకూతురు పట్ల ఇలా వ్యవహరించడం ధర్మమేనా?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
0 comments:
Post a Comment