హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్లోని రాజ్భవన్లో కలుసుకున్నారు. ప్రత్తికొండ వైఎస్సార్ కాంగ్రెస్ నేత చెరుకులపాడు నారాయణరెడ్డిని దారుణంగా హతమార్చిన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పాల్పడుతున్న హత్యా రాజకీయాలపై గవర్నర్కు వైఎస్ జగన్ ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్తో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు గవర్నర్ను కలిశారు.
గవర్నర్తో భేటీ అనంతరం వైఎస్ జగన్ కర్నూలు జిల్లాకు వెళ్లనున్నారు. నారాయణ రెడ్డి అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు.
గవర్నర్తో భేటీ అనంతరం వైఎస్ జగన్ కర్నూలు జిల్లాకు వెళ్లనున్నారు. నారాయణ రెడ్డి అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు.
0 comments:
Post a Comment