పాదయాత్రతో మీ చెంతకే వస్తున్నా: వైఎస్‌ జగన్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాదయాత్రతో మీ చెంతకే వస్తున్నా: వైఎస్‌ జగన్‌

పాదయాత్రతో మీ చెంతకే వస్తున్నా: వైఎస్‌ జగన్‌

Written By news on Sunday, July 9, 2017 | 7/09/2017


పాదయాత్రతో మీ చెంతకే వస్తున్నా: వైఎస్‌ జగన్‌
గుంటూరు: చంద్రబాబు దగాకోరు ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి త్వరలో పాదయాత్ర చేస్తానని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ ప్లీనరీ వేదికగా ప్రకటించారు. అక్టోబర్‌ 27 నుంచి ఆరు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానని వెల్లడించారు.
వైఎస్‌ జగన్‌ పాదయాత్ర గురించి ఇంకా ఏం చెప్పారంటే.. 'ప్రతి ఊరుకి పోండి.. ప్రతి గ్రామానికి వెళ్లండి.. త్వరలోనే అన్న వస్తున్నాడని చెప్పండి. అందరికీ భరోసా ఇస్తూ నేను కూడా వస్తా.. అక్టోబర్‌ 27 నుంచి దాదాపు ఆరు నెలల పాటు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తా. ప్రతి జిల్లాకు, ప్రతి ప్రాంతానికి వస్తా.. మీతోనే ఉంటూ పాదయాత్ర చేస్తా. ఇడుపులపాయ నుంచి తిరుమలకు వెళ్తా.. కాలి నడకన కొండెక్కి తిరుమలేశుడిని దర్శించుకుంటా. అక్కడి నుంచి ఇచ్ఛాపురం దాకా మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తా. ఊరు వాడా అందరికీ చెప్పండి. అన్న వస్తున్నాడు. మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి. వైఎస్‌ మాదిరిగానే అధికారం తెచ్చుకుంటాం. ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. మీ అందరి ఆశీస్సులు కావాలి. నష్టపోయాం అని తెలుసు. కేసులు పెడుతున్నారని తెలుసు. మంచి కాలం వస్తుంది. ప్రతి కార్యకర్తకు తోడుగా నిలబడతా. మీ అందరి ఆశీస్తులు కోరుతున్నా.'
Share this article :

0 comments: