02 July 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Emperor of Corruption Download

Written By news on Saturday, July 8, 2017 | 7/08/2017

చంద్రబాబు అవినీతిపై ‘ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌’




గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు గడిచిన మూడేళ్లలో సాగించిన అవినీతిపై ముద్రించిన ‘ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌’  పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఈ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సీఎం చంద్రబాబు చేసిన అవినీతిపై ఆధారాలతో సహా ఈ పుస్తకాన్ని ముద్రించడం జరిగిందన్నారు.
ఆయన సాక్ష్యాత్తూ రూ.3 లక్షల 75వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. అందులో లక్షకోట్ల కుంభకోణంలో ఒక్క రాజధాని ప్రాంతం భూముల మీద అయితే, మరొకటీ విశాఖలో భూముల మీద జరిగిన కుంభకోణం అన్నారు.  ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టులకు సంబంధించి అన్ని ఆధారాలతో ఈ పుస్తకాన్ని రూపొందించామన్నారు. ఈ పుస్తకాన్ని ప్రతి గ్రామంలోకి తీసుకు వెళ్లాలని వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సూచించారు.

వాస్తవానికి చంద్రబాబు ‘అవినీతి చక్రవర్తి’ పేరుతో వైఎస్‌ఆర్‌ సీపీ ఏడాది కిందటే ఒక పుస్తకాన్ని ప్రచురించింది. అయితే ఈ ఏడాది కాలంలో చోటు చేసుకున్న మిగిలిన అన్ని కుంభకోణాలను జతచేసి, గత కుంభకోణాల జమా లెక్కలను అప్‌డేట్‌ చేసి ఈ పుస్తకాన్ని పునర్ముద్రించింది.  మొత్తం 56 కుంభకోణాలకు సంబంధించి అవినీతి చోటు చేసుకున్నది అది తేల్చినట్లు తెలుస్తోంది.
‘ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌’ పుస్తకం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



వైఎస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ అప్‌డేట్స్‌


హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, తెలుగు ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్లీనరీ ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరిగే ఈ ప్లీనరీకి సంబంధించిన కార్యక్రమాల వివరాలు ఎప్పటికప్పుడు లైవ్‌ అప్‌డేట్స్‌ మీకోసం..

తొలిరోజు ప్లీనరీ..
సాయంత్రం 4.58 గంటలు:  దగాపడ్డ డ్వాక్రా మహిళల తీర్మానాన్ని బలపరిచిన వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గిడ్డీ ఈశ్వరీ
సాయంత్రం 4.58 గంటలు:  దగాపడ్డ డ్వాక్రా మహిళల తీర్మానాన్ని ప్లీనరీలో ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే రోజా

సాయంత్రం 4.49 గంటలు:  అనంతపురం జిల్లా సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్‌ సీపీ నేత శంకర్‌నారాయణ
సాయంత్రం 4.43 గంటలు:  చేనేత కార్మికుల సమస్యలపై తీర్మానాన్ని బలపరిచిన వైఎస్‌ఆర్‌ సీపీ నేత మోహన్‌రావు
సాయంత్రం 4.33 గంటలు:  చేనేత కార్మికుల ఇక్కట్లపై తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ బుట్టా రేణుక.. చేనేత కార్మికులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని, దళారులు లేని మార్కెట్‌ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి..

సాయంత్రం 4.28 గంటలు:  ప్లీనరీలో మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి
సాయంత్రం 4.20 గంటలు:  ప్లీనరీలో మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ నేత రెహమాన్‌
సాయంత్రం 4.13 గంటలు:  ప్లీనరీలో మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌ సీపీ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు నదీమ్‌ అహ్మద్‌

సాయంత్రం 4.02 గంటలు:  ప్లీనరీలో ప్రసంగించిన వైఎస్‌ఆర్‌ సీపీ నేత జోగి రమేశ్‌
మధ్యాహ్నం 3.54 గంటలు: ప్రజాసంక్షేమంపై తీర్మానాన్ని బలపరిచిన వైఎస్‌ఆర్‌సీపీ నేత జంగా కృష్ణమూర్తి
మధ్యాహ్నం 3.43 గంటలు: ప్రజాసంక్షేమంపై తీర్మానాన్ని బలపరిచిన వైఎస్‌ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే బాలరాజు

మధ్యాహ్నం 3.33 గంటలు: ప్రజాసంక్షేమంపై తీర్మానం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్‌ సీపీ నేత మేరుగ నాగార్జున

మధ్యాహ్నం 3.25 గంటలు: ఏపీలో ఆటవిక పరిపాలనపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌
మధ్యాహ్నం 2.56 గంటలు: చంద్రబాబు ఆటవిక పాలన గురించి వివరిస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మధ్యాహ్నం 2:46 గంటలు: ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగిస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని
మధ్యాహ్నం 2:25 గంటలు: రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి

మధ్యాహ్నం 2:10 గంటలు: ‘చంద్రబాబు అవినీతి చక్రవర్తి’ పుస్తకంపై వివరణ ప్రారంభించిన అంబటి రాంబాబు
మధ్యాహ్నం 2:07 గంటలు: చంద్రబాబు అవినీతి చక్రవర్తి (ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌)​ పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. మూడేళ్లలో చంద్రబాబు నాయుడు చేసిన రూ.3,75,000కోట్ల అవినీతిని ఈ పుస్తకంలో ఆధారాలతో సహా వెల్లడించినట్లు తెలిపిన వైఎస్‌ జగన్‌.
మధ్యాహ్నం 1:55 గంటలు: పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదికను ప్రవేశ పెట్టిన ధర్మాన ప్రసాదరావు
మధ్యాహ్నం 1:45 గంటలు: ప్లీనరీలో ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 29 సీ ప్రకారం మూడేళ్ల పార్టీ జమా ఖర్చుల నివేదికను ప్రవేశపెట్టిన  పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారు.
 
మధ్యాహ్నం 1:30గంటలు: వ్యవసాయ సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి
మధ్యాహ్నం 1:20గంటలు: విజయనగరం జిల్లా తీర్మానం ప్రవేశ పెట్టిన జిల్లా అధ్యక్షుడు బీ చంద్రశేఖర్‌

మధ్యాహ్నం 1:15 గంటలు: పశ్చిమ గోదావరి జిల్లా తీర్మానం ప్రవేశ పెట్టిన జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని

మధ్యాహ్నం 1:05 గంటలు: తూర్పుగోదావరి జిల్లా తీర్మానం ప్రవేశపెట్టిన జిల్లా అధ్యక్షుడు కన్నబాబు

మధ్యాహ్నం 1గంటలు:
 విశాఖపట్నం తీర్మానం ప్రవేశపెట్టిన జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌

మధ్యాహ్నం 12:55 గంటలు: శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టిన జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి
మధ్యాహ్నం 12:53 గంటలు : పూర్తయిన ప్లీనరీ ప్రసంగం. ప్లీనరీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
మధ్యాహ్నం: 12:45 గంటలు: ప్లీనరీ ప్రారంభ ఉపన్యాసాన్ని ప్రారంభించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
మధ్యాహ్నం 12: 40 గంటల: ప్లీనరీలో నేతలు, పార్టీ కార్యకర్తలతో ప్రమాణం చేయించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి
మధ్యాహ్నం 12: 37 గంటలు: దివంగతులైన పార్టీ నేతలు, కార్యకర్తలకు నివాళులు

మధ్యాహ్నం 12:30 గంటలు: పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు ప్రకటన విడుదల చేసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. నేడు నామినేషన్ల స్వీకరణ. సాయంత్రం తుది జాబితా ప్రకటన. రేపు సాయంత్రం జాతీయ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడి
మధ్యాహ్నం 12:19 గంటలు: ప్లీనరీలో సర్వమత ప్రార్థనలు

మధ్యాహ్నం 12: 17 గంటలు: వేదికవద్ద వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వైఎస్‌ జగన్‌, పార్టీ నాయకులు
మధ్యాహ్నం 12:15 గంటలు: వేదిక పైకి చేరుకుని పార్టీ నాయకులకు, ప్రతినిధులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఇతర శ్రేణులకు అభివాదం చేసిన వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి

మధ్యాహ్నం 12:05 గంటలు: జాతీయ ప్లీనరీ ప్రాంగణంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  జెండా ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

ఉదయం 11:58 గంటలు: ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. ప్రాంగణమంతటా పార్టీ శ్రేణుల ఉత్సాహం, కోలాహలం

ఆకర్షిస్తున్న ఫొటో గ్యాలరీ: ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మ‌హానేత డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖర్‌ రెడ్డి ఫొటో గ్యాల‌రీ బాగా ఆకర్షిస్తోంది. అలాగే, వేదికముందు ఏర్పాటుచేసిన వంద వైఎస్‌ఆర్‌ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కళాకారుల పాటలతో హోరెత్తుతున్న ప్రాంగణం: భారీగా తరలివచ్చిన పార్టీశ్రేణులు, అభిమానులతో వైయస్ఆర్ ప్లీనరీ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కళాకారులు పాటలతో హోరెత్తిస్తున్నారు. వైయస్ఆర్ జయంతి సందర్భంగా మహానేతను స్మరించుకుంటూ ప్లీనరీ ఉత్సాహంగా కనిపిస్తోంది. కాసేపట్లో వైఎస్‌ జగన్ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకోనున్నారు.

పార్టీ ప్రతినిధుల నమోదు ప్రారంభం: వైయస్సార్సీపీ జాతీయ ప్లీనరీ సమావేశానికి ప్రతినిధుల రాక మరింత ఊపందుకుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది.

ఉదయం 10:30 గంటలు: గన్నవరం చేరుకున్న వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి. ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌, జోగి రమేష్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, దుట్టా రామచంద్రరావు, బుడ్డి చంద్రశేఖర్‌, స్థానిక నేతలు. కాసేపట్లో రోడ్డు మార్గంలో గుంటూరుకు చేరుకోనున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌.
ఉదయం 9:30 గంటలు: కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయల్దేరిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
ఉదయం 9:00 గంటలు: ఇడుపుల పాయ నుంచి కడప ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన వైఎస్‌ జగన్‌. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళతారు.
ఉదయం 8.30 గంటలు: ఇడుపుల పాయ వైఎస్‌ఆర్‌ ఘాట్‌ ప్రాంగణంలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి కుటుంబ సభ్యుల పుష్పాంజలి. పూలమాలను వేసి అంజలి ఘటించిన వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.

ఉదయం 8.00 గంటలు: ఇడుపుల పాయ వైఎస్‌ఆర్‌ ఘాట్‌కు చేరుకున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఘన నివాళులు.

మహానేతకు కుటుంబసభ్యుల ఘన నివాళి


ఇడుపులపాయ: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 68వ జయంతి వేడుకలు శనివారం రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహానేత జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ ఆర్ ఘాట్ వద్ద  కుటుంబ సభ్యులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.  వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, కుమార్తె వైఎస్ షర్మిల, అల్లుడు బ్రదర్ అనీల్, ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం వైఎస్‌ఆర్‌ ఘాట్‌ ప్రాంగణంలోని మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.  ఈ కార్యక్రమానికి మహానేత కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు వైఎస్ఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు మహానేత 68వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్లీనరీ తొలిరోజు కార్యక్రమాలు



ప్లీనరీ తొలిరోజు కార్యక్రమాలు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, తెలుగు ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశం మరికొద్ది సేపట్లో ఘనంగా ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే పార్టీనేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాలను నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు.  అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు గత మూడేళ్ల పాలనలో ప్రజలను దారుణంగా మోసం చేసిన నేపథ్యంలో ... రానున్న కాలంలో ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేసి నిరంతరం ప్రజలతో మమేకం కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు నివ్వబోతోంది.

ఇందుకు సంభందించిన మొదటి రోజు ఎజెండా
► ఉదయం 8గంటల నుంచి ఉదయం 10.30 వరకూ పార్టీ ప్రతినిధుల రిజిస్ట్రేషన్‌ జరుగుతుంది.
► ఉదయం 10.30 గంటల నుంచి 11.00 గం. వరకూ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుల సమావేశం జరగనుంది.
► అనంతరం 11.00 నుంచి 11.15 గం.వరకూ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అనంతరం ప్రార్థన ఉంటుంది
► తర్వాత 11.15నుంచి 11.30 వరకూ పార్టీ నేతలను వేదికపైకి ఆహ్వనించనున్నారు.
► దాని తర్వాత 11.30 నుంచి 11.45 వందేమాతరం గీతాలాపనతో పాటుగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి.
► 11.45 గం.లకు వేదికపై నున్న మహానేత వైఎస్‌ఆర్‌ విగ్రహానికి జగన్‌ పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు.
► 11.50 గంటలకు కు సర్వమత ప్రార్థనలు జరుగుతాయి.
► 12 గంటలనుంచి 12.10 వరకూ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన, పార్టీ ప్రతినిధుల ప్రమాణం జరగనుంది,
► 12.10 నుంచి12.25 వరకూ దివంగతులైన వైఎస్సార్సీపీ నేతలకు, నాయకులకు పార్టీ శ్రేణులు నివాళులు అర్పించనున్నాయి.
► 12.25 నుంచి 12.55 గం.ల వరకూ వైస్‌జగన్‌ ప్లీనరీ ప్రారంభోపన్యాసం చేయనున్నారు.
► మధ్యాహ్నం 12.55 గంటల నుంచి 1.10 గం. వరకూ పార్టీ జమా ఖర్చుల ఆడిట్‌ స్టేట్‌మెంట్‌ ప్రతిపాదన, ఆమోదం
► మధ్యాహ్నం 1.10 గం. నుంచి 1.20 గం. వరకూ పార్టీనియమావళి సవరణలు

మధ్యాహ్నం 1.20 గం నుంచి 1.30 గం. వరకూ పార్టీ విరాళాలు కోరుతూ పార్టీశ్రేణులకు విజ్ఞప్తి
► 1.30  గం​నుంచి 2.00 గం. వరకూ జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా తీర్మానాలు చేస్తారు.
► 2.00 గం నుంచి 2.30 గం. వరకూ పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదికకు ఆమోదం తెలుపుతారు.

ప్రతిపాదనలు-ఆమోదాలు
► మధ్యాహ్నం 2.30 గం నుంచి 2.55 గం. వరకూ కష్టాల్లో వ్యవసాయం-నష్టాలే శరణ్యం అంశంపై ప్రతిపాదన, చర్చ, ఆమోదం.
► మధ్యాహ్నం 2.55 గం నుంచి 3.20 గం. వరకూ రాజకీయ తీర్మానంపై ప్రతిపాదన, చర్చ, ఆమోదం.
► 3.20 గం నుంచి 3.45 గం వరకూ ఆంద్రప్రదేశ్‌లో ఆటవిక పాలనపై ప్రతిపాదన, చర్చ, ఆమోదం.
► 3.45 గం నుంచి 4.10 గం వరకూ ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌ పుస్తక ఆవిష్కరణ, పలు అంశాలపై వివరణ జరుగుతుంది.
► సాయంత్రం 4.10 గం నుంచి 4.35 గం. వరకూ వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు, పార్టీఫిరాయిపులపూ ప్రతిపాదన, చర్చ, ఆమోదం
► సాయంత్రం 4.35 గం నుంచి 5.00 గం. వరకూ చంద్రబాబు హయాంలో దగాపడ్డ ద్వాక్రా మహిళ, ప్రతిపాదన, చర్చ, ఆమోదం
► 5.00 గం నుంచి 5.25 గం వరకూ అమలు కాని ఎన్నికల హామీలు, కాపు రిజర్వేషన్లపై ప్రతిపాదన, చర్చ, ఆమోదం
► 5.25 గం నుంచి 5.50 గం వరకూ సమాజంలో సోషల్‌ మీడియా పాత్ర, నెటిజన్లపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలపూ ప్రతిపాదన, చర్చ, ఆమోదం
► చివరగా 5.50 గం నుంచి 5.55 గం వరకూ అధ్యక్ష ఎన్నికల తుది జాబితా ప్రకటిస్తారు.

పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ కీలక భేటీ

Written By news on Wednesday, July 5, 2017 | 7/05/2017




హైదరాబాద్‌: వైఎస్సార్‌ సీపీ అన్ని జిల్లాల అధ్యక్షులు, పరిశీలకులు, పార్టీ నేతలతో అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను ఈ సందర్భంగా పార్టీ నాయకులకు జగన్‌ పరిచయం చేశారు.

విజయవంతమైన రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పేరుగాంచారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీని, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్‌ను విజయపథాన నడిపించడంతో ఆయన కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

కాగా, జులై 8, 9 తేదీల్లో వైఎస్సార్‌ సీపీ ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పన్నెండు ఎకరాల స్థలంలో ప్లీనరీ నిర్వహించనున్నారు. దాదాపు 30వేల మంది ప్రతినిధులు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్లీనరీ నిర్వహణ కోసం మొత్తం 18 కమిటీలు ఏర్పాటు చేశారు.

‘ఆంధ్రజ్యోతి’ రాతలపై మండిపడ్డ ఎమ్మెల్యేలు


‘ఆంధ్రజ్యోతి’ రాతలపై మండిపడ్డ ఎమ్మెల్యేలు
తిరుమల: ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక రాతలపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అవాస్తవాలు రాసి గిరిజనులు, దళితుల మనోభావాలను కించపరచొద్దని హితవు పలికారు.
విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... గిరిజనులు మనోభావాలు దెబ్బతీసేలా ‘ఆంధ్రజ్యోతి’లో తప్పుడు వార్తలు రాశారని తెలిపారు. మీ రాతలు వెనక్కు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. నిన్న హైదరాబాద్‌కు వచ్చిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వైఎస్‌ జగన్‌ తమను పరిచయం చేసి, ఫొటోలు తీయించారని.. కానీ ఆంధ్రజ్యోతి విలువలు దిగజార్చేలా వార్త రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళితుల మనోభావాలను దెబ్బతీసేలా ‘ఆంధ్రజ్యోతి’ లో వచ్చిన కథనాలను చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ ఖండించారు. ‘ఆంధ్రజ్యోతి’ 

Popular Posts

Topics :