20 August 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్ వెంటే

Written By news on Saturday, August 26, 2017 | 8/26/2017




► గడప గడపకు నవరత్నాలు చేరాలి
► మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి


కోవెలకుంట్ల: పార్టీ మారుతున్నారని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్‌ జగన్‌ వెంటేనని వైఎస్సార్‌సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. స్థానిక కృష్ణతేజ ఫంక‌్షన్‌ హాలులో శుక్రవారం నియోజకవర్గంలోని ఆయా గ్రామాల బూత్‌ కమిటీలతో నవరత్నాల సభ నిర్వహించారు.

సభకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు నాయుడుకు 2019లో గుణపాఠం తప్పదన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన తొమ్మిది పథకాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత బూత్‌కమిటీలదేన్నారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసాతో ప్రతి రైతు కుటుంబానికి న్యాయం జరుగుతుందని, ఏడాదికి రూ.12500 చొప్పున నాలుగేళ్లపాటు రూ.50వేలు రైతుల చేతికందుతుందన్నారు.

డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, పొదుపు సంఘాలకు రూ.15వేల కోట్లతో ప్రతి మహిళ లక్షాధికారి అయ్యే విధంగా వైఎస్‌ఆర్‌ ఆసరా పథకంతో లబ్ధిచేకూరతుందన్నారు. రూ. వెయ్యి పింఛన్‌ను రూ.2వేలకు పెంచడంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఎంతో ఆసరాగా ఉంటుందని, పేద కుటుంబాల్లోని పిల్లల చదువుకు ఏడాదికి రూ.10వేల నుంచి రూ.20వేలు నేరుగా తల్లులకే ఇచ్చే విధంగా అమ్మ ఒడి పథకంతో పిల్లల భవిష్యత్‌ ఉజ్వలమవుతుందన్నారు. పేద కుటుంబాలకు సొంతింటి కల నెలవేరుతుందని, ఆరోగ్య శ్రీ పథకానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్జ ప్రాజెక్టుల పూర్తి, మూడు దశల్లో మద్యపాన నిషేధం కార్యక్రమాలతో రాష్ట్రంలో తిరిగి రాజన్నరాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

వైఎస్‌ జగన్‌ కాకినాడ పర్యటన ఖరారు


వైఎస్‌ జగన్‌ కాకినాడ పర్యటన ఖరారు
కాకినాడ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. వైఎస్‌ జగన్‌ ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పర్యటించనున్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నఅనంతరం ఆయన  స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో వైఎస్‌ జగన్‌ కాకినాడ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఆయన 26న (శనివారం) కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అయితే అస్వస్థత కారణంగా  వైఎస్‌ జగన్‌ పర్యటనను ఆదివారానికి పోస్ట్‌ పోన్‌ చేశారు.

కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో రెండు చోట్ల బహిరంగసభలు, రోడ్డు షో నిర్వహించనున్నారని పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు వెల్లడించారు. శనివారం సాయంత్రం కాకినాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ ఆదివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బయల్దేరి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి కారులో కాకినాడ వస్తారని, ఉదయం 10.30 గంటలకు అన్నమ్మ ఘాటి వద్ద జరిగే బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. తర్వాత చంద్రిక థియేటర్, జగన్నాథపురం వంతెన మీదుగా సినిమా రోడ్డులో రోడ్డు షోలో పాల్గొంటారన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు డెయిరీ ఫారం సెంటర్‌ చేరుకున్న తర్వాత అక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తారని చెప్పారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణమవుతారని తెలిపారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, కాకినాడ పౌరులు జగన్‌ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

జోరువానలో వైఎస్‌ జగన్‌ భారీ రోడ్‌షో

Written By news on Sunday, August 20, 2017 | 8/20/2017


'బాబు మోసాలకు వ్యతిరేకంగా ఓటువేద్దాం'
  • జోరువానలో వైఎస్‌ జగన్‌ భారీ రోడ్‌షో
నంద్యాల: మూడున్నరేళ్ల చంద్రబాబునాయుడు అవినీతి, మోసపూరితమైన పాలనకు వ్యతిరేకంగా నంద్యాల ఉప ఎన్నికలో ఓటు వేద్దామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. 'నంద్యాలలో ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎవరో ఒక వ్యక్తిని ఎమ్మెల్యే చేసుకోవడానికో ఈ ఉప ఎన్నిక జరగడం లేదు. మూడున్నరేళ్ల చంద్రబాబు పరిపాలనపై ఇవాళ ఉప ఎన్నిక జరుగుతోంది. చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలకు వ్యతిరేకంగా ఇవాళ మనం ఓటువేద్దాం. చంద్రబాబు పరిపాలనలోని అవినీతికి వ్యతిరేకంగా ఇవాళ ఓటు వేద్దాం' అని ఆయన పేర్కొన్నారు. నంద్యాలలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్‌ జగన్‌ ఆదివారం సాయంత్రం పట్టణంలోని వైఎస్‌ఆర్‌ నగర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ప్రసంగించారు. జోరు వర్షంలోనూ కొనసాగిన ఈ రోడ్‌షోకు పెద్ద ఎత్తున జనం తరలిరావడం గమనార్హం. వైఎస్‌ జగన్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..
  • ఈ మూడున్నరేళ్ల పాలనలో చంద్రబాబు చెప్పుకోవడానికి చేసిందేమీ లేదు.
  • ఉప ఎన్నికలు వచ్చేదాక చంద్రబాబుగానీ, ఆయన మంత్రులుగానీ ఒక్కరోజైనా మీకు నంద్యాల రోడ్ల మీద కనిపించారా? ఎప్పుడూ రాలేదు.
  • ఎన్నికలకు ముందు ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలమిస్తాను, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని చంద్రబాబు చెప్పారు.
  • ఈ మూడున్నరేళ్ల పాలనలో మీకు కనీసం ఒక్క ఇళ్లైనా కట్టించారా? కట్టించలేదు
  • ఎన్నికల్లో ప్రతి పేదవాడికి సాగుభూమి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి.. ఒక్క ఎకరం భూమి అయినా ఇవ్వలేదు.
  • రేషన్‌ దుకాణాల్లో ఇంతకుముందు బియ్యం, కిరసనాయిల్‌, కందిపప్పు, పామాయిల్‌, గోధుమపిండి ఇలా పలురకాల వస్తువులు ఇచ్చేవారు. కానీ, చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్క బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు.
  • ఆ దివంగత నేత, ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిగారి పరిపాలనలో నంద్యాలలో 21800 పెన్షన్‌ కార్డులు ఉండేవి. చంద్రబాబు సీఎం అయ్యాక పెన్షన్‌ కార్డులు చాలావరకు తగ్గుతూ వచ్చాయి. నంద్యాల ఉప ఎన్నిక రావడంతో మళ్లీ పెన్షన్‌ కార్డులను పెంచారు. ఎన్నికలు అయ్యాక అవి ఉంటాయో లేదో తెలియదు
  • ఎన్నికల సమయంలో మద్యాన్ని తగ్గిస్తాం, బెల్టు షాపులు లేకుండా చేస్తామని చంద్రబాబు చెప్పారు.
  • ఈ మూడున్నరేళ్ల పాలనలో కనీసం ఒక్క బెల్టు షాపైనా చంద్రబాబు తగ్గించారా? లేదు.
  • పైగా మద్యం అమ్మకాలు నెలనెలా సంవత్సరం సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మద్యం హౌస్‌ డెలివరీ ఇచ్చే పరిస్థితి వచ్చింది.
  • 'జాబు రావాలంటే బాబు రావాలి' అని ఎన్నికల్లో చంద్రబాబు జోరుగా ప్రచారం చేశారు. జాబు రాకపోతే ఇంటింటికి రూ. రెండువేల నిరుద్యోగభృతి ఇస్తానన్నారు. కానీ జాబు రాలేదు. భృతి ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఈ 38 నెలల కాలంలో ప్రతి ఇంటికి రూ. 76వేల చొప్పున చంద్రబాబు బకాయి పడ్డారు.  
  • డ్వాక్రా మహిళలకు రూ.14వేల కోట్ల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశారు. కనీసం ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు
  • రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని, రూ. 87,612 కోట్ల రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారు.  బ్యాంకుల్లోని మీ బంగారం ఇంటికొచ్చిందా? రాలేదు. రైతులకు రుణమాఫీ జరగలేదు. ఎన్నికల్లో గెలువడం కోసం ఎవ్వరినీ వదిలిపెట్టకుండా వాగ్దానాలు ఇచ్చి అందరినీ బాబు మోసం చేశారు.
  • ప్రతి పేదవాడు కూడా పేదరికం నుంచి బయటపడాలంటే కుటుంబం నుంచి ఒక్కరన్న ఇంజినీరింగ్‌, డాక్టర్‌, కలెక్టర్‌ కావాలని.. ఆ చదువుల కోసం ఎంతైనా  ఖర్చు పెట్టడానికి తోడుగా నిలబడ్డారు.
  • ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులు రూ. లక్ష వరకు పెరిగిపోయాయి. ఫీజులు పెరిగినా కేవలం ముష్టివేసినట్టు చంద్రబాబు రూ. 30 నుంచి 35వేలు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు. దీంతో పేదవాళ్లు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి మోసపూరిత, అన్యాయమైన పాలన కావాలా? వద్దు.
  • వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 108 నంబర్ కు ఫోన్‌ కొడితే చాలు వెంటనే అంబులెన్స్ వచ్చేది. ఆరోగ్య శ్రీ కింద పేదవారికి మెరుగైన చికిత్స అందేది.
  •  వైఎస్ హయాంలో ఎంత ఖర్చయినా పిల్లలకు వైద్యం అందేది.
  • కానీ ప్రస్తుతం  అలాంటి పరిస్థితులు లేవు.
  •  కిడ్నీ పేషంట్ లు డయాలసిస్ కోసం ఆసుపత్రికి వెళితే ఏడాది తర్వాత రమ్మంటున్నారు.
  • చంద్రబాబు నైజమే మోసం చేయడం
  •  ఎన్నికల ముందు పదవిలోకి రావడం కోసం ఇష్టానుసారంగా హామీలు గుప్పించారు.
  • మూడేళ్ల కిందట చంద్రబాబు కర్నూలు వచ్చినప్పుడు కర్నూలుకు కొత్త ఎయిర్ పోర్టు, కర్నూలు స్మార్ట్‌ సిటీ, ట్రిపుల్‌ ఐటీ, ఉర్ధూ యూనివర్సిటీ, స్విమ్స్‌ తరహా సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, కర్నూలులో ఫుడ్‌ పార్క్ అంటూ ఊదరగొట్టారు.
  • వీటిలో కనీసం ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చ లేదు.
  • ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక ఉంది కాబట్టి చంద్రబాబు మళ్లీ అరిగిపోయిన టేప్‌ రికార్డర్‌ ఆన్‌ చేశారు.
  • ఇష్టానుసారంగా మోసపూరిత వాగ్దానాలు గుప్పించే రాజకీయ నాయకులను ప్రశ్నించినప్పుడే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది.
  • చెప్పిన వన్నీ వినుకుంటూ పోతే రేపటి రోజున ప్రతి ఇంటికి మారుతీ కారు, కేజీ బంగారం ఇస్తామంటారు.
  • మోసం చేసే ఇటువంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పాలి.
'కర్నూలు జిల్లా ప్రజల సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో మూడేళ్ల కిందట ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అందరినీ మోసం చేశారు. ఇలాంటి చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సమయం ఆసన్నమైంది. నంద్యాల ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయాలి. ధర్మం, న్యాయం వైపు నిలిచి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలి' అని జగన్‌ పిలుపునిచ్చారు.

Popular Posts

Topics :