10 September 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్‌ఆర్‌ కుటుంబంలోకి జగన్‌ ఆహ్వానం

Written By news on Monday, September 11, 2017 | 9/11/2017


సాక్షి, హైదరాబాద్‌ : 'వైఎస్‌ఆర్‌ కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానించడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే మీ చెంతకు వస్తోంది. వైఎస్‌ఆర్‌ కుటుంబంలో భాగస్వామ్యులు కావాలని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను' అని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 

కాగా సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘వైఎస్సార్‌ కుటుంబం కార్యక్రమం’ ప్రారంభమైన విషయం తెలిసిందే. పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్టోబర్‌ 2 వరకు ప్రతీ బూత్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరు రోజుకు రెండు కుటుంబాలను కలసి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించనున్నారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.

అలాగే వైఎస్సార్‌ కుటుంబంలో చేరాలనుకునే వారు 9121091210 నంబరుకు మిస్డ్‌ కాల్‌ ఇస్తే సరిపోతుంది. ఇలా మిస్డ్‌కాల్‌ ఇస్తే వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడి కార్యాలయంతో నేరుగా సంప్రదింపులు జరిపే అవకాశం ఉంటుంది. చంద్రబాబు పాలనలో ఎదురవుతున్న ఇబ్బందులు, తాము ఎదుర్కొంటున్న కష్టాలను ప్రజలు తెలియజేయవచ్చు. సెప్టెంబర్‌ 11వ తేదీ నుంచి అక్టోబర్‌ 2వ తేదీవరకు 20 రోజులపాటు వైఎస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం కొనసాగనుంది.

వైఎస్‌ఆర్‌ కుటుంబానికి అద్భుత స్పందన


సాక్షి, హైదరాబాద్‌ : మనిషి...మనిషితో అనుబంధం వైఎస్‌ఆర్‌ కుటుంబమైతే... రాష్ట్ర ప్రజలకు, సొంత మామకే వెన్నుపోటు చంద్రబాబు కుటుంబమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. పార్టీ ఎమ్మెల్యేలు కళావతి, ఆదిమూలపు సురేశ్‌, నారాయణస్వామి సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘వైఎస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమానికి అద్భుత స‍్పందన వస్తోంది. ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో 4 లక్షల మంది సభ్యులుగా చేరారు. వైఎస్‌ఆర్‌ కుటుంబంలో డిజిటల్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా కూడా చేరొచ్చు. www.ysrkutumbam.com కు లాగాన్‌ అయి సభ్యులుగా చేరవచ్చు. వైఎస్‌ఆర్‌ స్వర్ణయుగాన్ని మళ్లీ తీసుకువచ్చి ...చంద్రబాబు పాలనను ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు.
కాగా వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సభ్యత్వ నమోదుకు రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ‘వైఎస్సార్‌ కుటుంబం కార్యక్రమం’ ప్రారంభమైన  విషయం తెలిసిందే. పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్టోబర్‌ 2 వరకు ప్రతీ బూత్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరు రోజుకు రెండు కుటుంబాలను కలసి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించనున్నారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.

అలాగే పార్టీ సభ్యత్వం తీసుకోవాలనుకునే వారు 9121091210 నంబరుకు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలి. ఇలా మిస్డ్‌కాల్‌ ఇస్తే వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడి కార్యాలయంతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. చంద్రబాబు పాలనలో ఎదురవుతున్న ఇబ్బందులు, కష్టాలను ప్రజలు తెలియజేయవచ్చు. పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలను తమ పార్టీలో సభ్యులుగా చేర్చుకునే లక్ష్యంతో వైఎస్సార్‌ కుటుంబం కార్యక్రమానికి రూపకల్పన చేసింది. సెప్టెంబర్‌ 11 తేదీ నుంచి అక్టోబర్‌ 2వ తేదీవరకు 20 రోజులపాటు వైఎస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం కొనసాగనుంది.

Popular Posts

Topics :