24 September 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

తిరుమల ఏడు కొండలుని రెండు కొండలు చెద్దాం అనుకున్నారా ? ఇందులొ నిజం ఎంటి.. ??

Written By news on Saturday, September 30, 2017 | 9/30/2017


"వై.యస్.ఆర్" తిరుమల ఏడు కొండలు ని రెండు కొండలు చెద్దాం అనుకున్నారా ? ఇందులొ నిజం ఎంటి.. ??
2005 లొ తిరుమల అనే గ్రామం లొ పంచాయతి ఎన్నికలు జరగాలి అని ఒక అనామకుడు హైకొర్టు ని ఆశ్రయించాడు.
తిరుమల లొ రాజకీయము తగదు అనే ఉద్దేశం తొ 2005 న పంచాయితి రాజ్ మరియు దేవాదాయ శాఖ మంత్రి అయిన జే.సి దివాకర్ రెడ్డి గారి ఆద్వర్యం లొ ప్రభుత్వం 2005 సెప్టెంబర్ 26న ఒక జి.ఒ విడుదల చెసింది (జి.ఒ నెంబర్ 338) ఆ జీవొ లొ తిరుమలలొ 27.5 చదరపు కిలొ మిటర్లలొ ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి , కార్యాలయాలు , ఫంక్షన్ హాళ్ళు, యాత్రికుల ప్రయొజనాలకొసం ఏర్పర్చిన గ్రుహాలు , మరియు చుట్టుపక్కన ఉన్న ఇళ్ళు అన్ని కలిపి ఒక టౌన్ షిప్ , ఒక పవిత్ర స్థలం ఇక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు , మీటింగులు జరగటానికి వీలు లేదు అని చెబుతు జి.ఒ ని విడుదల చేశారు.. (ఆ రొజు హిందు పెపర్ లొ వచ్చిన జొ.ఒ ముఖ్య ఉద్దేశం న్యూస్ కింద ఇచ్చాను చూడొచ్చు)

దీనికి ఆదారం గతం లొ 1975 డిసెంబర్ 2 న విడుదల చెసిన జి.ఒ 1605, మరియు 4 నవంబర్ 1965 విడుదల చెసిన జి.ఒ నెంబర్ 1784 ని ( కింద ఇచ్చిన 1980 హైకొర్టు జడ్జ్మెంట్ కాపి లొ ఆ జీ.ఒ నెంబర్లు చూడొచ్చు) ఇంకా 1986 లొ రామారావు దేవాలయాల చట్టం లొ అర్చకుల వారసత్వపు హక్కును రద్దు చెయాలి అనే ఆలొచన తొ జస్టిస్ చల్లా కొండయ్య నెత్రుత్వం లొ ఒక కమిటీ వేశారు ఆ కమిటి కూడా స్వామివారి ఆలయం చుట్టు ఉన్న 10.1/3 చదరపు మైళ్ళ విస్తీర్ణ ప్రాంతం దేవస్తానానికి మంజూరు అయింది అని చెప్పారు.. ( ఇక్కడ కూడా ఆ కమీషన్ ఏడుకొండలు అని చెప్పలేదు ) ఇంకా తిరుమల పవిత్రతని కాపాడటానికి కమీషన్  తిరుమలలొ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకి తావు ఇవ్వకూడదు అని కూడా చెప్పారు కాని రామారావు వాటిని పట్టించుకొకుండా , కేవలం అర్చకుల వారసత్వపు హక్కు మాత్రమే రద్దు చేశారు. కాని దీనినే వై.యస్ తిరుమల పవిత్రతను కాపాడటానికి అమలు చేశారు  వై.యస్ వీటిని ఆదారంగా తీసుకుని ఉదహరిస్తు అందులొ ఉనట్టే చెప్పారు మిగత స్థలం అంత అడివి కాబట్టి అది కెంద్ర చెతులొ ఉంటది కాబట్టి ( ఈ జి.ఒ ని విడుదల చెసినప్పుడు 1975 జి.ఒ లొ లాగానే ఉదహరించారు ) ఈ జి.ఒ విడుదల చెసింది అప్పటి పంచాయతి రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరి ఐ.ఏ.యస్ యం.సామ్యుల్ అనే వ్యక్తి.



ఈ జి.ఒ ని పట్టుకుని ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టి, వై.యస్ తిరుమల ఏడు కొండలని రెండు కొండలు గా చేశారు అని ప్రచారం అందుకున్నారు - ( వాస్థవం గా చూస్తే ఆ జి.ఒ ముఖ్య ఉద్దేశం జనసంచారం మటికి ఉన్న తిరుమల ప్రాంతం లొ ఎలాంటి రాజకీయ కర్యాకలాపాలు ఉండటానికి లేదు అని చెప్పటం) 1925 నుండి విలేజ్ రికార్డ్స్ లొ ఉన్న ఏరియా ఇంతే - ఇందులొ వై.యస్ మార్చింది లేదు.

ప్రతిపక్షాలు మాటలు నమ్మి కొంత మంది సాదువులు 2006 జులై 15 న నిరసన వ్యక్తం చేశారు ఇలా చెస్తు వారు తిరుమల ని కిలొ మీట్లర్ల లా కాకుండా ఏడు కొండలు అని మార్చి జి.ఒ ఇవ్వాలి అని అడిగారు, అలాగే 27 జులై 2006 న టి.టి.డి అదారిటి ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తు తిరుమల 27.5 చదరపు కిలొ మిటర్లు కాదు అడవి తొ సహా అంత కలిపి 332 చదరపు కిలొ మీటర్ల ప్రాంతం అని కొత్త జి.ఒ ఇవ్వాలి అని అడిగారు.
అదే రొజు ప్రభుత్వ కెబినెట్ అప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం కింద లేని అటవి ప్రాంతాన్ని వీరికి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుని కెంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి అది రాగానే ప్రభుత్వం 2007 జూన్ 2 న ఏడు కొండలు అంటే శేషాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, ౠషబాద్రి తిరుమలకి సంభందిచిన పవిత్ర ప్రదేశం అని జి.ఒ నెంబర్ 746 ని విడుదల చేశారు , దీని తొ పాటు రాష్ట్రం లొ ఉన్న దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారం నిషిద్దం అని 747 జి.ఒ ని విడుదల చేశారు.

వై.యస్ అదే 2006 ఆగస్టు న తిరుపతి లొ "యస్.వి వేదిక్ విశ్వ విద్యాలయం" ప్రారంబిస్తు తప్పుడు ప్రచారాలు ఆపాలి అని, ఎట్టి పరిస్తుతులలొను తిరుమల, ఏడు కొండలు అంగులం కూడా కదిలించాలి అనే ఉద్దేశం లేదు అని, ఆ పాపం కి వడికట్టాము అనే ప్రచారం మానుకొవాలి అని హితవు పలికారు.

ఇక్కడ మనం ఆలొచించాల్సింది
1) హిందు మెజారిటి దేశం లొ రొజు లక్షలలొ భక్తులు వచ్చే ప్రదేశం ని రెండు కొండలు చెస్తాం అనే ఆలొచన రాజకీయం లొ ఉండే వారు చేస్తారా ??
2) తిరుమల ఆద్వర్యం లొ లేని అటవి ప్రాతం ని 1975, 1965 జొ.లొ లేదు కాబట్టి 2005 జి.ఒ లొ కూడ పెట్టలేదు ఇందులొ వై.యస్ తప్పు ఎంటి ?
3) నిజంగా 7 కొండలు తిరుమల వే అని ప్రకటించే హక్కు తనకి ఉంతే కెంద్ర అటవిశాక నుండి అనుమతి వచ్చే దాక సంవత్సరం పాటు ఎందుకు వై.యస్ ఎదురు చూశారు.
ఇలా రాజకీయాల నుండి తిరుమల దివ్యక్షేత్రం పవిత్రతని కాపాడుదాం అని ఆలొచించిన వై.యస్ మీద కేవలం రాజకీయ లబ్ధి కొసం దేవుడిని కూడా అడ్డం పెట్టుకుని రాజకీయ చేశారు తెలుగుదేశం వారు , దీనికి బాబు గారిని మొసే పత్రికలు వంత పాడాయి - హిందు ధర్మం మీద అత్యంత విశ్వాసం ఉన్నవాళ్ళ మనొభావాలు గాయపడ్డాయి - లేదు ప్రతిపక్షాలు వాటి అనుభంద మీడియా గాయ పడేలా చేశారు... ఇప్పటికైనా విజ్ఞులు నిజాలు గ్రహిస్తారు అని ఆసిస్తున్నాం...

https://prajaballet.blogspot.in/2017/06/blog-post.html?m=1

వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎంపీ

Written By news on Friday, September 29, 2017 | 9/29/2017

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన చిమటా సాంబు
సాక్షి, హైదరాబాద్‌: ప్రకాశం జిల్లాలోని చీరాల, చిత్తూరు జిల్లాలోని పలమనేరుకు చెందిన పలువురు నేతలు గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. చీరాల అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఎడం బాలాజీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ చిమటా సాంబుతోపాటు గడ్డం శ్రీనివాసరావు(పీడీసీసీ బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌), కర్ణ శ్రీనివాసరావు(వేటపాలెం మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు), వేటగిరి సంజీవరావు(ప్రకాశం జిల్లా యానాది సంఘం అధ్యక్షుడు), బొచ్చుల మోహన్‌రావు(పుల్లాయపాలెం మాజీ సర్పంచ్‌) వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరంతా వైఎస్‌ జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని పార్టీలో చేరాలన్న తమ అభీష్టాన్ని వ్యక్తం చేయగా.. ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అమృతపాణి, చీరాల పార్టీ అధ్యక్షుడు బొనిగల జైసన్‌బాబు, రూరల్‌ అధ్యక్షుడు పిన్నిబోయిన రామకృష్ణ ఈ సందర్భంగా హాజరయ్యారు.

పలమనేరు నేత చేరిక..
మరోవైపు పలమనేరుకు చెందిన నేత ఆకుల గజేంద్ర గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనకు జగన్‌మోహన్‌రెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. గజేంద్ర ఒకప్పుడు మంత్రి ఎన్‌.అమర్‌నాథరెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉండేవారు. ఈ సందర్భంగా గజేంద్ర మాట్లాడుతూ.. ఊపిరున్నంత వరకూ వైఎస్సార్‌సీపీలోనే ఉంటానని, వచ్చే ఎన్నికల్లో ఎవరికి అసెంబ్లీ టికెట్‌ ఇచ్చినా గెలుపుకోసం గట్టిగా కృషి చేస్తానని తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఆయనకు జగన్‌ సూచించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉప నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు కళత్తూరు నారాయణస్వామి, పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తలు రాకేష్‌రెడ్డి, సి.వి.కుమార్‌ హాజరయ్యారు. 

వైఎస్సార్‌సీపీలోకి మరో ఇద్దరు నేతలు

Written By news on Tuesday, September 26, 2017 | 9/26/2017


వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన ఆకాసం శ్రీరామచంద్రమూర్తి. చిత్రంలో ఎమ్మెల్సీ పిల్లి సుబాష్‌చంద్రబోస్, పార్టీ నేతలు బాలకృష్ణ, కన్నబాబు, బాబ్జి, సునీల్‌.
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు నాయకులు వైఎస్సార్‌సీపీలోకి వచ్చారు. తూర్పుగోదావరి  జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్‌ ఆకాసం శ్రీరామచంద్రమూర్తి సోమవారం లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. రామచంద్రమూర్తికి పార్టీ కండువా వేసి జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ  పిల్లి సుబాష్‌చంద్రబోస్, ముమ్మడివరం సమన్వయకర్త పితాని బాలకృష్ణ, కాకినాడ పార్లమెంటరీ కోఆర్డినేటర్‌ చలమలశెట్టి సునీల్ తదితరులు ఉన్నారు. కాగా, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా, అనంత ఉదయ్‌ భాస్కర్‌, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, పార్టీ నేత గుర్రం గౌతమ్‌ తదిరులు వైఎస్‌ జగన్‌ను కలిశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి చెందిన పీవీఎల్‌ నరసింహరాజు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా వేసి వైఎస్‌ జగన్ ఆహ్వానించారు. ఎమ్మెల్సీ ఆళ్ల నాని, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు పాతపాటి సర్రాజు, కారుమూరి నాగేశ్వరరావు, బలరామరాజు తదితరులు ఆయన వెంట ఉన్నారు

వై వి సుబ్బారెడ్డికి 4జిల్లాల బాధ్యతలు


వైఎస్ఆర్‌సీపీ సీజీసీ సభ్యులుగా పాత‌పాటి స‌ర్రాజు

 హైదరాబాద్ : ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన పాత‌పాటి స‌ర్రాజుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాల‌క మండ‌లి (సి.జి.సి.) స‌భ్యులుగా నియ‌మించారు. పెనుమ‌త్స వెంక‌ట ల‌క్ష్మీ న‌ర‌సింహ‌రాజుని ఉండి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియమితులయ్యారు. పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు వీరి నియామకం జరిగింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాల‌యం ఓ పత్రికా ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది.

వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా సజ్జల రామకృష్ణారెడ్డి

అనంతపురం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనంతపురం జిల్లాతో పాటు కర్నూలు, వైఎస్‌ఆర్‌ కడప, ప్రకాశం జిల్లాల పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ, సమన్వయకర్తగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Popular Posts

Topics :