05 November 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

అప్పుడే రాజకీయాల్లో విశ్వసనీయత వస్తుంది: వైఎస్‌ జగన్‌

Written By news on Wednesday, November 8, 2017 | 11/08/2017


 వీఎన్‌పల్లి: ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత కనుమరుగైపోయిందని, రాజకీయాల్లో ఒక మాట అంటూ ఇస్తే.. ఆ మాటకు కట్టుబడి ఉండే పరిస్థితి కనిపించడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నాలుగేళ్ల చంద్రబాబు పాలన నిదర్శనంగా నిలిచిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని ఆయన గుర్తుచేశారు. ప్రజలకు ఫలానాది చేశానని చెప్పుకోలేని పరిస్థితుల్లో టీడీపీ సర్కారు ఉందని ఆయన విమర్శించారు. ‘ప్రజాసంకల్పయాత్ర’ చేపడుతున్న వైఎస్‌ జగన్‌కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. బుధవారం మూడోరోజు పాదయాత్ర సందర్భంగా వీఎన్‌పల్లిలో ప్రజలను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. రాజకీయ వ్యవస్థ మారాలంటే ప్రజల్లోంచి చైతన్యం రావాలని, ఎన్నికల్లో ప్రజలకు ఒక మాట ఇస్తే.. దానిని అమలుచేయలేకపోయినప్పుడు ఆ నాయకుడు రాజీనామా చేసి పక్కకు తప్పుకొనే పరిస్థితి రావాలని, అప్పుడే రాజకీయాల్లో విశ్వసనీయత వస్తుందని వైఎస్‌ జగన్‌ ఉద్ఘాటించారు.
భవిష్యత్తులో మంచి కలుగుతుందనే భరోసా ఇచ్చేందుకు..
‘రాబోవుకాలంలో మంచి రోజులు వస్తున్నాయి.. భవిష్యత్తులో మంచి జరగబోతుందన్న ఆశ కల్పించేందుకు.. ప్రతి రైతుకు, రాష్ట్రంలోని ప్రతి వర్గానికీ తోడుగా ఉండేందుకు నేను ఈ పాదయాత్ర చేస్తున్నా’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. తన పాదయాత్రలో భాగంగా ప్రతి సామాజిక వర్గాన్ని కలుస్తామని,  వారు చెప్పినవన్నీ విని.. ప్రజలందరి సలహాలు తీసుకుంటామని తెలిపారు. నవరత్నాలు పథకాలతో ప్రతి ఇంట్లో చిరునవ్వులు విరబూయాలని కోరుకుంటున్నామని, నవరత్నాల విషయంలో ప్రజలు ఇంకా ఏమైనా సలహాలు ఇస్తే తీసుకుంటామని, దారిపొడవునా ప్రజలు చెప్పే ప్రతి సలహాను స్వీకరిస్తామని చెప్పారు. చంద్రబాబు మాదిరి ఇంతింత బుక్కులు మ్యానిఫెస్టోగా పెట్టి మోసం చేయబోమని, ప్రజల చేత దిద్దబడిన మ్యానిఫెస్టో మాత్రమే రెండు, మూడు పేజీల్లో ఉంటుందని చెప్పారు. తమ ప్రణాళికలో చెప్పిన ప్రతి పనిని చేస్తామని, చెప్పినవే కాదు.. చెప్పనవి కూడా చేసి చూపించి.. 2024 ఎన్నికలు వచ్చినప్పుడు.. ఇవి చేశామని చెప్పి.. మళ్లీ ఆశీర్వదించమని ప్రజలను కోరుతామని అన్నారు. తన పాదయాత్ర కార్యక్రమానికి ప్రజలందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలని, దేవుడి దయ కావాలని ఆయన కోరారు.
 


వైఎస్‌ జగన్‌ ఇంకా తన ప్రసంగంలో ఏమన్నారంటే..
  • నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు
  • రైతుల రుణాలన్నింటీని బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు
  • నాలుగేళ్లు అయినా మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయా? కాలేదు
  • బాబు పుణ్యాన రైతులే కాదు డ్వాక్రా మహిళలు కూడా మోసపోయారు
  • బాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు, డ్వాక్రా మహిళలకు ఇచ్చే సున్నా వడ్డీకే రుణాలు పూర్తిగా పక్కనబెట్టారు
  • చంద్రబాబు సీఎం అయ్యాక పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మల రుణాలు మాఫీ అయ్యాయా? కాలేదు
  • జాబు రావాలంటే.. బాబు రావాలని, ఒకవేళ జాబు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారు

రెండే రెండు పేజీలు.. చెప్పినవన్నీ చేస్తాం

Written By news on Tuesday, November 7, 2017 | 11/07/2017


వేంపల్లి :  దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన రెండోరోజు వేంపల్లిలోని శ్రీనివాస కల్యాణ మండలంలో రచ్చబండ నిర్వహించారు. భారీగా తరలి వచ్చిన వృద్ధులు, మహిళలు, యువకులు... ఈ ముఖాముఖిలో పాల్గొని తమ సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ... ‘ ఎన్నో హామీలిచ్చి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ మేనిఫెస్టో చూద్దామన్నా కనిపించడం లేదు.

అర్హులైన పేదలందరికీ ఇళ్లు
అయితే వైఎస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టో మాత్రం అలా ఉండదు. రెండే రెండు పేజీలుంటుంది. అందులో చెప్పినవన్నీ చేస్తాం. ఇచ్చిన హామీలు అమలు చేసి మళ్లీ గర్వంగా ప్రజల వద్దకు వస్తాం. ఇప్పటికే నవరత్నాలు ప్రకటించాం. మీ సలహాలు స్వీకరించి మరింత మెరుగ్గా చేస్తాం. అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచితంగా విద్యుత్‌, అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం.

వృద్ధులకు రూ.2వేలు పెన్షన్‌
అలాగే అవ్వా, తాతలకు ప్రస్తుతం రూ.1000 ఉన్న పెన్షన్‌..మేం అధికారంలోకి రాగానే రూ.2.వేలు చేస్తాం. ఒకవేళ చంద్రబాబు నాయుడు రూ.2వేల పెన్షన్‌ ఇస్తే... నేను రూ.3వేలు చేస్తా. అలాగే ఎవరూ లేని ఒంటరి వృద్ధుల సంక్షేమం కోసం ప్రతి మండలంలో ఓ వృద్దాశ్రమయం ఏర్పాటు చేస్తా. వృద్ధులను అన్ని రకాలుగా ఆదుకుంటా.
లక్షా 42వేల ఉద్యోగులు భర్తీ
అలాగే ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తా. యువతకు ఉద్యోగాలు రావాలంటే ఏపీకి ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడదాం. ప్రస్తుతం రాష్ట్రంలో కౌరవ పాలన నడుస్తోంది. జాబు రావాలంటే బాబు రావాలని చంద్రబాబు మోసం చేశారు.
విద్యార్థుల ఖర్చులకు రూ.20వేలు
 విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడమే కాకుండా కాలేజీ విద్యార్థులకు ఖర్చుల కోసం రూ.20వేలు ఇస్తాం. అధికారంలోకి రాగానే ఆరు నెలల్లోగా కడప స్టీల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి, మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేసి యువతకు 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. .’ అని హామీ ఇచ్చారు.

తొలిరోజు ముగిసిన ప్రజా సంకల్ప యాత్ర

సాక్షి, ఇడుపులపాయ :  ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తొలిరోజు ముగిసింది.  ఆయన మొదటి రోజు ఇడుపులపాయ నుంచి వేంపల్లి వరకూ 8.9 కిలోమీటర్లు మేర పాదయాత్ర పూర్తి చేశారు. కాగా సోమవారం ఉదయం  తొమ్మిది గంటల నలభైయేడు నిమిషాలకు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ నుంచి తొలి అడుగు వేసిన వైఎస్‌ జగన్‌.. మారుతీనగర్‌, వీరన్నగట్టుపల్లె, కుమురంపల్లె మీదుగా వేంపల్లి రోడ్డు వరకూ పాదయాత్ర చేశారు. వీరన్నగట్టుపల్లెలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఇక రెండోరోజు ప్రజా సంకల్ప యాత్ర వేంపల్లి రోడ్డు నుంచి ప్రారంభం కానుంది.
మరోవైపు దారి పొడవునా వైఎస్‌ జగన్‌కు జనం ఘనస్వాగతం పలికారు.  కోట్లాది జన హృదయాలను కలుస్తూ సాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర.. నిర్ధిష్ట లక్ష్యాలతో కొనసాగనుంది. మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి, నిజంతో నిమిత్తం లేకుండా అసత్య ప్రచారంతో, దబాయింపు రాజకీయాలతో వర్థిల్లుతున్న వారికి ఈ యాత్ర ముచ్చెమటలు పట్టిస్తూ జరుగుతుంది. ఇక ప్రజాసంకల్ప యాత్రకు తరలివచ్చిన అభిమానులతో ఇడుపులపాయ జనసముద్రమైంది.  తెలుగు రాష్ట్రాల నుంచే కాకా..పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వైఎస్ జగన్ అభిమానులు తరలివచ్చారు. జగన్‌తో కలిసి వేలాది అభిమానులు ఆయన అడుగులో అడుగేశారు. వైఎస్ జగన్ వెంట..పలువురు వైఎస్ఆర్‌ సీపీ  నేతలు  కూడా కలిసి నడుస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగే పాదయాత్ర 180 రోజులు  125 నియోజకవర్గాల్లో 3వేల కిలో మీటర్లు సాగనుంది.  

YS Jagan speech

Written By news on Monday, November 6, 2017 | 11/06/2017

ఉద్యోగులకు వైఎస్‌ జగన్‌ వరాల జల్లు

సాక్షి, ఇడుపులపాయ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీలోని ఉద్యోగ వర్గాలపై హామీల జల్లు కురిపించారు. తాము అధికారంలోకి రాగానే ప్రతి ఉద్యోగికి స్థలం ఇచ్చి.. ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేశారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పారు. ఉద్యోగులకు కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ను అమలుచేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం ఇడుపులపాయలో 'ప్రజాసంకల్ప యాత్ర'ను ప్రారంభించిన సందర్భంగా ఆయన  బహిరంగ సభలో ప్రసంగించారు.
బాబు రావాలంటే జాబు రావాలని గత ఎన్నికల్లో ప్రచారంతో ఊదరగొట్టారని, కానీ ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాల్సిందేనని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. 50 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నిందని, ఈ మేరకు జరిగిన ప్రొసీడింగ్స్‌ను 'సాక్షి' దినపత్రిక బయటపెట్టడంతో అబ్బే అలాంటిదేం లేదని ప్రభుత్వ పెద్దలు బుకాయిస్తున్నారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ఈ ప్రొసీండిగ్స్‌ బయటకు వచ్చేసరికి.. వీటిని వెల్లడించారనే సాకుతో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారని, ఇలా ఉద్యోగులను సస్పెండ్‌ చేయడం న్యాయమేనా? అని ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.

నేటి పాదయాత్ర ఇలా..

ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించి మారుతినగర్‌ మీదుగా మధ్యాహ్నం 1 గంటకు భోజన విరామ ప్రాంతానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి వీరన్నగట్టుపల్లె కూడలిలో పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తారు. అక్కడి నుంచి కుమ్మరాంపల్లె మీదుగా వేంపల్లె శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకుంటారు.  జగన్‌కు రాత్రి విడిది కోసం టెంట్‌లు ఏర్పాటు చేశారు. ఆయన టెంట్‌లోనే నిద్రపోతారు. ప్రతి రోజు ఉదయం తన కోసం వచ్చిన వారితో పాటు, పార్టీ కార్యకర్తలు, నాయకులను కలుసుకుంటారు. రోజూ ఉదయం 7 కిలో మీటర్లు, సాయంత్రం 7 కిలో మీటర్ల చొప్పున పాదయాత్ర చేసేలా కార్యక్రమం ఖరారు చేశారు. మంగళవారం మధ్యాహ్నానికి పాదయాత్ర కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలంలోకి ప్రవేశిస్తుంది. రాత్రి ఈ మండలంలోనే ఆయన బస చేస్తారు.

ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం


సాక్షి, పులివెందుల: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన 'ప్రజాసంకల్ప యాత్ర'కు సిద్ధమయ్యారు. పులివెందులలో తన నివాసంలో తల్లి విజయమ్మ నుంచి ఆశీస్సులు తీసుకొని.. సోదరి షర్మిల, ఇతర కుటుంబసభ్యులకు వెళ్లొస్తానని చెప్పి.. అశేషమైన అభిమానులు, కార్యకర్తల మద్దతు నడుమ వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయకు బయలుదేరారు. ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద మహానేతకు కుటుంబసభ్యులతో కలసి వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు.
జనంతో కిక్కిరిసిపోయిన ఇడుపులపాయ..!
వైఎస్‌ జగన్‌ 'ప్రజాసంకల్ప యాత్ర'కు వేదికైన ఇడుపులపాయలో అశేషమైన జనవాహినితో కిక్కిరిసిపోయింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పెద్దసంఖ్యలో ఇడుపులపాయకు చేరుకున్నారు. పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు, ప్రజలు ఇక్కడకు చేరుకోవడంతో ఇడుపులపాయ కోలహలంగా మారింది. మరికాసేపట్లో ఇక్కడ ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రసంగించి.. అనంతరం వైఎస్‌ జగన్‌ 'ప్రజాసంకల్ప యాత్ర' ప్రారంభించనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 180 రోజులు 3 వేల కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. ఈ యాత్ర ద్వారా 125 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల బాధలు ప్రత్యక్షంగా చూసి.. సుమారు 2 కోట్ల మందిని స్వయంగా కలుసుకుంటారు.

నేటి పాదయాత్ర ఇలా..
ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించి మారుతినగర్‌ మీదుగా మధ్యాహ్నం 1 గంటకు భోజన విరామ ప్రాంతానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి వీరన్నగట్టుపల్లె కూడలిలో పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తారు. అక్కడి నుంచి కుమ్మరాంపల్లె మీదుగా వేంపల్లె శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకుంటారు.  జగన్‌కు రాత్రి విడిది కోసం టెంట్‌లు ఏర్పాటు చేశారు. ఆయన టెంట్‌లోనే నిద్రపోతారు. ప్రతి రోజు ఉదయం తన కోసం వచ్చిన వారితో పాటు, పార్టీ కార్యకర్తలు, నాయకులను కలుసుకుంటారు. రోజూ ఉదయం 7 కిలో మీటర్లు, సాయంత్రం 7 కిలో మీటర్ల చొప్పున పాదయాత్ర చేసేలా కార్యక్రమం ఖరారు చేశారు. మంగళవారం మధ్యాహ్నానికి పాదయాత్ర కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలంలోకి ప్రవేశిస్తుంది. రాత్రి ఈ మండలంలోనే ఆయన బస చేస్తారు.

మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నా : వైఎస్‌ జగన్‌

Written By news on Sunday, November 5, 2017 | 11/05/2017


పులివెందుల: ప్రజా సంకల్పయాత్రపై వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం సాయంత్రం ట్వీట్‌ చేశారు. ప్రజాసంకల్పయాత్రకు మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. తొలి రోజు షెడ్యుల్‌కు సంబంధించి వివరాలను వెల్లడించారు.

సోమవారం ఉదయం 8:30 గంటలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించనున్నారు. ఉదయం 9.42 గంటలకు ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం కానుంది. 10.30 గంటలకు ప్రజలను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు. తొలి రోజు మొత్తం 8.9 కిలోమీటర్లు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. రాత్రి 7.30 గంటలకు వేంపల్లి సమీపంలో తొలిరోజు ప్రజా సంకల్పయాత్ర ముగియనుంది.

ప్రజా సంకల్పయాత్ర తొలి రోజు పూర్తి షెడ్యుల్‌ :

జగన్‌ స్పీక్స్‌' : వీడియో సిరీస్ ప్రారంభం


 పులివెందుల:  ప్రజాసంకల్పయాత్ర చేయబోతున్న వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సోషల్‌ మీడియాలోనూ నెటిజన్లతో మమేకమయ్యేందుకు కొత్తగా 'జగన్‌ స్పీక్స్‌' పేరుతో వీడియో సిరీస్‌ ప్రారంభించారు. పాదయాత్రలోని అనుభవాలను ఈ కార్యక్రమం ద్వారా నెటిజన్లతో పంచుకోనున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తన అధికారిక ఫేస్‌ బుక్‌ పేజీలో పోస్ట్‌ చేసిన 'జగన్‌ స్పీక్స్‌' తొలి వీడియోకు విశేషమైన స్పందన వచ్చింది. పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు.
ఈ వీడియోలో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..
తెలుగు ప్రజలకు నమస్కారం. ఇది వరకు ప్రకటించిన విధంగా  ప్రజా సంకల్పయాత్ర సోమవారం నుంచి ప్రారంభిస్తున్నాను. వైఎస్‌ఆర్‌ కుటుంబం ద్వారా మీరు నా కుటుంబంలో భాగమయ్యారు. నన్ను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్నందుకు మనస్పూర్తిగా మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. 6 నుంచి 7 నెలలపాటూ దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా సాగే ఈ పాదయాత్రతో మీకు మరింత దగ్గరగా అయ్యే ప్రయత్నం చేస్తాను. మీరు చెప్పే ప్రతి అంశాన్ని వింటాను. మీ కష్టాలను నష్టాలను పరిష్కరించే ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేస్తాను. నవరత్నాలను గతంలోనే మీతో పంచుకున్నాను. ఆ నవరత్నాల్లోనూ కూడా మెరుగు పరచడానికి మీరేదైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు కూడా తెలుసుకుంటూ అడుగులు ముందుకు వేస్తాను. చివరకు ఈ పాదయాత్రలో నా ప్రయత్నం ఏమిటంటే .. మనం  ఎన్నికల సమయాని విడుదల చేసే మేనిఫెస్టో ఆఫీసుల్లో కూర్చొని దిద్దిన మేనిఫెస్టోలా కాకుండా ప్రజలు దిద్దిన మేనిఫెస్టోలా బయటకు రావాలి. ఆ దిశగా మీ సలహాలు, మీరు చెప్పే అంశాలతో, మీరు చేసే మార్పులతోనే ఆ మేనిఫెస్టో విడుదల చేయాలన్న తాపత్రయంతోనే నా ఈ పాదయాత్ర సాగుతుంది. దాదాపు 6 నుంచి 7 నెలలపాటూ సాగే ఈ పాదయాత్రలో డిజిటల్‌ మీడియా ద్వారా మీ అందరితో ఇంకా దగ్గరకావడానికి ప్రయత్నం చేస్తాను. మీమ్మల్ని అందర్ని కూడా ఈ పాదయాత్రలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను. జగన్‌ స్పీక్స్‌ వీడియో సిరీస్‌ ద్వారా మీ అందరికి అందుబాటులో ఉంటా..

పులివెందులకు వైఎస్‌ జగన్‌

YS Jagan Mohan reddy at Pulivendula, offers prayers - Sakshi
కడప ఎయిర్‌పోర్టులో అభిమానులకు అభివాదం చేస్తూ పులివెందులకు బయలుదేరిన వైఎస్‌ జగన్‌.
కడప దర్గాలో ప్రార్థనలు.. రాత్రికి ఇడుపులపాయకు
రేపటి నుంచే ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, పులివెందుల : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం సాయంత్రం పులివెందులకు చేరుకున్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు హైదరాబాద్‌ నుంచి విమానంలో కడపకు చేరుకున్న వైఎస్ జగన్.. కడప నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్లారు. స్థానిక సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక పార్థనల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. అనంతరం గండి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి సాయంత్రం తిరిగి కడప వెళ్లనున్న ఆయన.. అక్కడి ప్రఖ్యాత పెద్ద దర్గాలోనూ ప్రార్థనలు చేస్తారు. రాత్రి 8:30 గంటలకు ఇడుపులపాయకు బయలుదేరి వెళతారు. రేపటి(సోమవారం) నుంచి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టనున్న జగన్‌కు స్వాగతం పలుకుతూ పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు.
రేపటి నుంచే ప్రజా సంకల్ప యాత్ర : ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలగుండా 3వేల కిలోమీటర్ల మేర సాగనున్న వైఎస్‌ జగన్‌ ‘ప్రజా సంకల్ప యాత్ర’ సోమవారం ఉదయం నుంచి ప్రారంభకానుంది. ఇడుపులపాయలోని మహానేత వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం జగన్‌ పాదయాత్రను ప్రారంభిస్తారు. తొలిగా వైఎస్సార్‌ జిల్లాలో ఏడు రోజులపాటు 100 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు మీదుగా యాత్ర కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. తర్వాత అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల మీదుగా ఇచ్ఛాపురం వరకు కొనసాగుతుంది.
కడపలో వైఎస్ జగన్‌‍కు ఘనస్వాగతం  

Popular Posts

Topics :