16 October 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఏపీఐఐసీకి ఎలా బదలాయిస్తారు..?

Written By news on Thursday, October 20, 2016 | 10/20/2016


'ఏపీఐఐసీకి ఎలా బదలాయిస్తారు..?'
శ్రీకాకుళం : సీఎం చంద్రబాబు సర్కార్ ఘగర్ ఫ్యాక్టరీ భూములను లాక్కొని శ్రీకాకుళం ప్రజలను మరోసారి మోసం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఆరోపించారు. 
 
శ్రీకాకుళంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఆముదాలవలస కో ఆపరేటివ్ ఘగర్ ఫ్యాక్టరీ భూములను ఏపీఐఐసీకి కేటాయించడం సరికాదన్నారు. ఘగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు...భూములను ఏపీఐఐసీకి ఎలా బదలాయిస్తారని..? తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. 

సత్యవతి చేసిన తప్పేంటి?: వైఎస్ జగన్

Written By news on Wednesday, October 19, 2016 | 10/19/2016


సత్యవతి చేసిన తప్పేంటి?: వైఎస్ జగన్
తణుకు: ప్రజాభిప్రాయం సేకరించకుండా గ్రామాల మధ్య ఫ్యాకర్టీ నిర్మించడం దుర్మార్గమని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ పెట్టవద్దంటూ నిరసన తెలిపిన గ్రామస్తులపై అక్రమ కేసులు బనాయించి అమాయకుల్ని వేధించటం సరికాదని ఆయన అన్నారు. ఆక్వా బాధితులను చూస్తుంటే  కడుపు తరుక్కుపోతోందన్నారు.  ఆక్వాఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా ఉద్యమించి, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సబ్ జైల్లో ఉన్న సత్యవతిని వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్యవతి చేసిన తప్పంటేని, కాలుష్యాన్ని అరికట్టాలని కోరిన వారిపై హత్యాయత్నం కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తే ఏడుగురిపై హత్యాయత్నం కేసులు పెట్టారని, గ్రామాల్లో భయాందోళనలు సృష్టించి గ్రామస్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. గ్రామస్తులు వద్దని చెప్పినా గ్రామం మధ్యలో ఫ్యాక్టరీ పెట్టడం మొదటి తప్పని, అమాయాకులపై హత్యాయత్నం కేసులు పెట్టడం ఇంకో తప్పని, గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టడం నాలుగో తప్పని అన్నారు.

ఇంతమంది ఉసురు పోసుకుని ఫ్యాక్టరీ పెట్టడం అవసరమా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం వస్తుందని జనం చెబుతున్నా పట్టించుకోరా అని సూటిగా అడిగారు. ఇప్పటికే డెల్టా పేపర్ మిల్లుతో ప్రజలు ఇబ్బందులు పాలువుతున్నారని, ఇప్పుడు మళ్లీ ఆక్వా ఫ్యాక్టరీ పెడితే అదే పరిస్థితి వస్తుందని స్థానికులు బాధపడుతున్నారన్నారు. ప్రజల బాధ ప్రభుత్వానికి పట్టదా అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం తనకు కావాల్సిన వారికి మేలు చేసేందుకు ఎంతకైనా తెగిస్తోందన్నారు. పది కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరప్రాంతంలో ఫ్యాక్టరీ పెట్టుకోండని జనం చెబుతున్నా పట్టించుకోవటం లేదన్నారు.

చంద్రబాబు ఓ వైపు ఈ ఫ్యాకర్టీతో కాలుష్యం ఉండదంటున్నారని, మరోవైపు పైప్ లైన్ నిర్మిస్తామని చెబుతున్నారని, పైప్ లైన్ వేయటానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఒకవేళ పైప్ లైన్ లీకేజీ అయితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే సముద్ర తీరప్రాంతానికి ఫ్యాక్టరీని తరలించి ప్రజలకు మేలు చేయాలని అన్నారు. సముద్ర తీరప్రాంతంలో మెగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీకి  350 ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోందని, ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించి అక్కడే ఫ్యాక్టరీ పెడితే తాము కూడా సహకరిస్తామన్నారు. దీనివల్ల అందరికీ మంచి జరుగుతుందని, ప్రజల ఉసురుతో ప్రాజెక్టులు నిర్మించలనుకోవటం సరికాదన్నారు.

కాగా ఆక్వాఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిలో సత్యవతి ఒకరు. ఆమె ప్రస్తుతం తణుకు సబ్‌జైల్లో ఉన్నారు. ఉద్యమాల పేరుతో జనాన్ని రెచ్చగొట్టిందనే ఆరోపణతో సత్యవతిపై కేసు బనాయించి.. జైలుకు పంపారు. ఆమె కుమారుడితోపాటు మరో ఆరుగురు నర్సాపురం సబ్‌జైల్లో ఉన్నారు. 36 రోజులుగా సత్యవతి జైలు జీవితం గడుపుతున్నారు. పోలీసులు సత్యవతిపై సెక్షన్‌ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసారు.

మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులతో ముఖాముఖి


నేడు తుందుర్రుకు వైఎస్ జగన్
 మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులతో ముఖాముఖి
 తణుకు సబ్‌జైలులో ఉద్యమకారిణి సత్యవతికి పరామర్శ


సాక్షి ప్రతినిధి, ఏలూరు:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలను కలుసుకుని వారితో ముఖాముఖీ మాట్లాడతారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు తెలిపిన ప్రకారం జగన్ పర్యటన వివరాలిలా ఉన్నాయి.. వైఎస్ జగన్ బుధవారం ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడినుంచి నేరుగా తణుకు పట్టణానికి వెళతారు. 36 రోజులుగా అక్కడి సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న తుందుర్రు గ్రామస్తురాలు, ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమకారిణి ఆరేటి సత్యవతిని పరామర్శిస్తారు. అక్కడినుంచి అత్తిలి, పాలకోడేరు, భీమవరం మీదుగా తుందుర్రు గ్రామానికి చేరుకుంటారు. ఫుడ్‌పార్క్ నిర్మాణాన్ని 

టీడీపీ కంచుకోట కూలిపోయింది

Written By news on Monday, October 17, 2016 | 10/17/2016


టీడీపీ కంచుకోట కూలిపోయింది
టీడీపీకి గుడ్‌బై చెప్పిన మర్రిపూడి వాసులు
 పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీలో చేరిక
 కండువాలు కప్పి ఆహ్వానించిన
 పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు


రంగంపేట/పెద్దాపురం :  టీడీపీ కంచుకోట కూలిపోయింది. ఆవిర్భావం నుంచీ తెలుగుదేశానికే మద్దతుగా నిలిచిన రంగంపేట మండలం మర్రిపూడిలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ గ్రామానికి చెందిన టీడీపీ కీలక నాయకుడు రిమ్మలపూడి వెంకటేశ్వరరావు(అబ్బు)తో పాటు 500 మందికి పైగా కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యాన చేరిన వారికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ నల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కంచుకోట కూలడం మర్రిపూడి నుంచే ఆరంభమైందని అన్నారు.

ఎమ్మెల్యే పదవులు శాశ్వతం కాదని, మళ్లీ ఎన్నికల్లో ఉంటామో, లేదో తెలియని పదవులు ఎప్పుడూ తమవెంటే ఉంటాయనుకుని అహంభావంతో పాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని చెప్పారు. భవిష్యత్తులో టీడీపీకి గడ్డుకాలం తప్పదన్నారు. నమ్మి వచ్చిన కార్యకర్తలకు సమన్యాయం చేయగలిగిన నేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. అటువంటి నాయకుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న టీడీపీకి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని కన్నబాబు అన్నారు. కార్యకర్తకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామని, మర్రిపూడి అబ్బును మండలం నుంచే కాకుండా జిల్లా స్థాయి నాయకుడిగా చూస్తారని చెప్పారు.

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ భవిష్యత్తులో వైఎస్సార్‌ స్వర్ణయుగం రానున్నదన్నారు. ప్రభుత్వ పాలనను, చంద్రబాబు అవినీతిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, పార్టీలో కష్టపడి పని చేస్తున్న వ్యక్తులను లెక్క చేయకుండా.. మద్యం దుకాణాల్లో మామూళ్లే నయమంటూ పాలన సాగిస్తున్న ఎమ్మెల్యేకు ప్రజలు భవిష్యత్తులో బుద్ధి చెప్పడం తథ్యమన్నారు. ‘రాము ట్యాక్స్‌’ పేరిట సాగుతున్న మామూళ్ల దందా ఎవరికి తెలియని బాగోతమని ప్రశ్నించారు.

రెండున్నరేళ్ల పాలనలో చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా చుక్క నీరు తెప్పించలేని ఎమ్మెల్యే ఎంత అసమర్థుడో ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. దీనిపై ప్రశ్నించిన నాయకులకు చంద్రబాబుతో మాట్లాడానని చెప్పుకుంటున్న ఆయన.. దమ్ముంటే ఇద్దరి సంభాషణనూ మీడియా ముందు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. అవినీతి ఎమ్మెల్యే పాలనకు విసుగు చెందే మర్రిపూడి గ్రామమంతా ఏకమై వైఎస్సార్‌ సీపీలో చేరారని, పార్టీపై, తనపై వారికున్న అభిమానానికి కృతజ్ఞుడినని అన్నారు. నమ్మి వచ్చిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, చిర్ల వీర్రాఘవరెడ్డిలు మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతి పాలన చూడలేకే కంచుకోటలాంటి గ్రామంలో టీడీపీ క్యాడర్‌ వైఎస్సార్‌సీపీలో చేరుతోందన్నారు.

అనంతరం రిమ్మలపూడి వెంకటేశ్వరరావు (అబ్బు), మాజీ సర్పంచ్‌లు రిమ్మలపూడి కృష్ణమూర్తి, మోర్త వెంకన్న, పిల్లి తాతారావు, కోరా సూర్యనారాయణమూర్తి, మాజీ ఎంపీటీసీ సభ్యులు పెంకే శ్రీనివాసరావు, పుట్టా యువరాజు, మందపల్లి జ్యోతి ఏసయ్య, మేడిద రాజు, మాజీ ఉప సర్పంచ్‌ మోదుకూరి బంగార్రాజు, టీడీపీ మాజీ అధ్యక్షుడు పుట్టా గోపాలుడు, విద్యాకమిటీ చైర్మన్‌ వేగి రాంబాబు, వార్డు సభ్యులు, కాకతీయ యూత్, కాపునాడు యూత్, అల్లూరి సీతారామరాజు యూత్, బలిజ యూత్, అంబేద్కర్‌ యూత్, జగజ్జీవనరామ్‌ యూత్, ఎంఆర్‌పీఎస్, రైతు–కూలీ సంఘ సభ్యులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు సుమారు 500 మందికి పైగా వైఎస్సార్‌ సీపీలో చేరారు.

 వారికి కురసాల కన్నబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జంగా సుబ్బారెడ్డి, వేము చిరంజీవి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొల్లాటి ఇజ్రాయేల్, మహిళా విభాగం కార్యదర్శి ఎరకారెడ్డి సత్య, రాష్ట్ర యూత్‌ కార్యదర్శి ఎన్‌డీఆర్, రైతు విభాగం సహాయ కార్యదర్శి సత్తి సుబ్బారెడ్డి, లంక చంద్రన్న, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సత్తి వీర్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు అడబాల వెంకటేశ్వర్లు, పాలాటి నాగేశ్వరరావు, పేపకాయల రాంబాబు, కనుమూరి వెంకటపతి, కనుమూరి సాయిరాజు, నక్కా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Popular Posts

Topics :