22 January 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

YV SUBBA REDDY SON marraige

Written By ysrcongress on Saturday, January 28, 2012 | 1/28/2012



హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తోడల్లుడు వై.వి.సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి సోదరుడు ప్రకాష్‌రెడ్డి కుమార్తె అపూర్వల వివాహ వేడుక శనివారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 5.14 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు పెద్ద సంఖ్యలో రాజకీయ, సినీరంగ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 

ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు, లోక్‌సభ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావూరి సాంబశివరావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాయపాటి సాంబశివరావు, రాష్ట్ర మంత్రులు ఎన్.రఘువీరారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, కె.జానారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, రాంరెడ్డి వెంకటరెడ్డి, ముఖేష్, శత్రుచర్ల విజయరామరాజు, కె.పార్థసారథి, వట్టి వసంతకుమార్, డీజీపీ వి.దినేష్‌రెడ్డి, లక్ష్మీపార్వతి, సినీ నటులు కృష్ణ, విజయనిర్మల, నరేష్, దర్శకుడు దాసరి నారాయణరావుతోపాటు పలువురు వివాహ విందుకు హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
 
 

తాను ప్రభుత్వ ఉద్యోగిని కాదని, అందువల్ల అవినీతి నిరోధక చట్టం కూడా వర్తించదన్నారు

తన కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లలో సీబీఐ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని...తాను అమాయకుడినని... సీబీఐ ఆరోపించినట్లుగా ఏ నేరం చేయలేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సీబీఐ చేసినవన్నీ ఊహాజనిత ఆరోపణలేనని తెలిపారు. జగన్‌ అక్రమార్జన కేసులో ఈనెల 2న అరెస్టయిన తనకు బెయిలు మంజూరు చేయాలంటూ విజయసాయిరెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో బెయిలు పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్‌ కంపెనీలకు వృత్తి రీత్యా ఛార్టెడ్‌ అకౌంటెంట్‌, ఆర్థిక సలహాదారుగా మాత్రమే ఉన్నానని చెప్పారు. ఇంతకు మినహా జగన్‌ గ్రూపు కంపెనీల్లో ఎలాంటి పాత్రా లేదని స్పష్టం చేశారు. అందువల్ల అక్రమంగా ఆర్జించిన సొమ్మును పెట్టుబడులుగా మార్చడానికి సంబంధించిన కుట్ర వెనుక ప్రధాన పాత్రధారి అన్న ఆరోపణ అవాస్తవమని తెలిపారు. కుట్రకు సంబంధించి తనకు మాత్రమే తెలుసన్న ఆరోపణ కూడా సరికాదన్నారు. తనకు 30 సార్లు నోటీసులు ఇచ్చి పిలిపించి పలువురు సీబీఐ అధికారులు విచారించారని చెప్పారు. తనకు తెలిసిన సమాచారం అంతా సీబీఐ అధికారులకు వెల్లడించానని, దర్యాప్తునకు సహకరించినట్లు చెప్పారు. తనపై మోపిన ఐపీసీ కింద 420, 409, 477(ఎ) సెక్షన్లు వర్తించవన్నారు. ఈ సెక్షన్లు వర్తించే నేరాలేవీ తాను చేయలేదని చెప్పారు. తాను ప్రభుత్వ ఉద్యోగిని కాదని, అందువల్ల అవినీతి నిరోధక చట్టం కూడా వర్తించదన్నారు. తనపై ప్రాథమికంగా ఎలాంటి కేసునూ సీబీఐ నిరూపించలేకపోయిందని తెలిపారు. 300 గంటల పాటు విచారించారని, అందువల్ల తాను దర్యాప్తులో జోక్యం చేసుకునే అవకాశమే లేదని చెప్పారు. గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చానని, సాక్షులను ప్రలోభ పెట్టడం, బెదిరించడం వంటివి చేయనని, సాక్ష్యాలను తారుమారు చేయబోనని హామీ ఇచ్చారు. విచారణకు, దర్యాప్తునకు అందుబాటులో ఉంటానని, బెయిలు మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు సీబీఐ కౌంటర్‌ నిమిత్తం విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.ప్రత్యేక కేటగిరీ కల్పించండి..సునీల్‌రెడ్డి: ఎమ్మార్‌ కేసులో అరెస్టయిన తనను ప్రత్యేక కేటగిరీ కింద పరిగణించేలా జిల్లా మేజిస్ట్రేట్‌కు సిఫారసు చేయాలంటూ సునీల్‌రెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బీఏ డిగ్రీ, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివిన తాను కాంపు లర్న్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో మార్కెటింగ్‌ మేనేజరుగా రూ.1.50లక్షల జీతం తీసుకున్నట్లు చెప్పారు. అనంతరం సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీలో డైరెక్టర్‌గా చేరానని, రూ.2 లక్షల వేతనం పొందుతున్నట్లు చెప్పారు. రూ.6 లక్షల ఆదాయపు పన్ను చెల్లిస్తున్నానని, వ్యాపారం నిర్వహిస్తున్న భార్య రూ.26 లక్షలు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఉన్నతప్రమాణాలతో జీవనం గడుపుతున్న తనను ప్రత్యేకకేటగిరీగా పరిగణించి వసతులు కల్పించేలా జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై సీబీఐ వివరణ కోరుతూ కోర్టు ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. రంగారావు ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారణ 30న: ఎమ్మార్‌ కేసులో నిందితుల జాబితాలో ఉన్న ఎమ్మార్‌ హిల్స్‌ టౌన్‌షిప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ తుమ్మల రంగారావు పెట్టుకున్న ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. శుక్రవారం సీబీఐ కౌంటరు దాఖలు చేయాల్సి ఉండగా అది చేయకపోవడంతో విచారణ వాయిదా పడింది.

27/01/2012 VAT deeksha images





మేలో మున్సిపల్ ఎన్నికలు.ఏప్రిల్‌లో పీఏసీఎస్, మేలో డీసీసీబీలకు

కొత్త, పాత మున్సిపాలిటీలు/కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి ప్రకటించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ ఎన్నికలు నిర్వహించాలని శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. మే చివర్లో పోలింగ్ నిర్వహించేలా కార్యక్రమం రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారని, అయితే జూన్ వరకు గడువు ఇవ్వాలని అధికారులు కోరారని వివరించారు. అయితే రెండుమూడు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తే.. ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి కుంటుపడుతుందన్న ఉద్దేశంతో ఒకేసారి నిర్వహించాలని నిర్ణయించామన్నారు. పురపాలక శాఖపై సీఎం సమీక్ష అనంతరం మంత్రి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

రాష్ట్రంలో మొత్తం 17 కార్పొరేషన్లు, 148 మున్సిపాలిటీలు ఉంటే.. వాటిలో నాలుగైదు మినహా అన్నింటికీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో వెంటనే బీసీ ఓటర్ల జాబితాలతోపాటు, వార్డుల విభజన చేపట్టాలని, అలాగే పంచాయతీల విలీనంతో విస్తీర్ణం పెరిగిన మున్సిపాలిటీల్లో పునర్వ్యవస్థీకరణ సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. భయంతో ఎన్నికలు వాయిదా వేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. కొత్త మున్సిపాలిటీలకు సిబ్బంది కేటాయింపు ఫైలు ఆర్థికశాఖ వద్ద ఉందని అధికారులు భేటీలో ప్రస్తావించగా.. మూడ్రోజుల్లో ఫైలు క్లియర్ చేయాలని సీఎం ఆదేశించారు.

నిధులపై ఆంక్షలు ఎత్తివేత: మున్సిపాలిటీల నిధులపై ఉన్న ఆంక్షలు తొలగించాలని ఆర్థికశాఖ అధికారులను సీఎం ఆదేశించారని మంత్రి మహీధర్‌రెడ్డి తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకి కాకుండా అవసరమైన మేరకు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. 

గోదావరి, కృష్ణా మూడో దశ ఒకేసారి: హైదరాబాద్ నగరానికి గోదావరి నీళ్లతోపాటు కృష్ణా మూడోదశ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు. హడ్కో నిధులతో కృష్ణా మూడో దశ చేపట్టాలని నిర్ణయించారు. 
 ఏప్రిల్‌లో పీఏసీఎస్, మేలో డీసీసీబీలకు:
అనుకూలురునే సభ్యులుగా చేర్చించాలని సీఎం సూచన

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎన్నికలను తప్పించుకోవడం అనివార్యమైన నేపథ్యంలో తొలుత సహకార సంఘాల ఎన్నికలకే వెళ్లాలని అధికార పార్టీ నిర్ణయించింది. స్థానిక, మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే సహకార ఎన్నికల వల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు కలిగే అవకాశమున్నందునే ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23లోగా ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీఎస్), మే 15లోపు జిల్లా సహకార సంఘాల (డీసీసీబీ) ఎన్నికలు నిర్వహించాలని సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎమ్మెస్)ల అధ్యక్షులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి ఎస్.శైలజానాథ్ సమావేశమయ్యారు. 

ఏప్రిల్‌లో పీఏసీఎస్, మేలో డీసీసీబీ ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను ముందుంచారు. అయితే మెజారిటీ డీసీసీబీ చైర్మన్లు ఈ ప్రతిపాదనపట్ల విముఖత వ్యక్తం చేశారు. మద్దతు ధర, ఎరువుల ధర పెంపు, కరెంటు కోతలతో రైతులు ప్రభుత్వంపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభావం అధికంగా ఉన్నందున ఎన్నికలను వాయిదా వేయడమే ఉత్తమమని సూచించారు. అయితే ఏప్రిల్, మే నెలలో ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చామని ఈ సందర్భంగా సీఎం, పీసీసీ చీఫ్‌లు స్పష్టంచేశారు. 

కొత్త ఓటర్లను చేర్పించండి: నోటిఫికేషన్‌కు 45 రోజుల ముందు సంఘంలో సభ్యులుగా చేరిన వారంతా ఎన్నికల్లో ఓటేసేందుకు అర్హులైనందున తక్షణమే సహకార సంఘ సభ్యత ప్రక్రియను ప్రారంభించి, కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండే వారినే సభ్యులుగా చేర్పించాలని సీఎం సూచించారు. అయితే కొత్తగా సభ్యత్వ నమోదుతో విమర్శలతోపాటు, స్థానికంగా సమస్యలు వస్తాయని డీసీసీబీల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో డీసీసీబీ ఛైర్మన్లు శనివారం సమావేశమై తరువాత సీఎంను కలిసి అభిప్రాయాన్ని తెలియ చేయాలని నిర్ణయించారు. అనంతరం ఆప్కాబ్ ఛైర్మన్ విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 22 డీసీసీబీ ఛైర్మన్లలో 20 మంది కాంగ్రెస్ వారేనని తెలిపారు. 


రామోజీరావుకు సుప్రీంకోర్టు సైతం షాక్

కింది కోర్టు, హైకోర్టు తీర్పులను సమర్థించిన సుప్రీం
ఎలాంటి కుట్రపూరిత ఉద్దేశాలు లేవని ఇప్పుడు చెబితే ఎలా అని ప్రశ్న?

న్యూఢిల్లీ/హైదరాబాద్, న్యూస్‌లైన్: విశాఖపట్నం సీతమ్మధారలోని ‘ఈనాడు’ లీజు స్థలం విషయంలో ఆ పత్రిక అధినేత రామోజీరావుకు సుప్రీంకోర్టు సైతం షాక్ ఇచ్చింది. ఈ స్థలానికి సంబంధించిన లీజును పొడిగించేలా యజమానిని ఆదేశించాలని కోరుతూ కింది కోర్టులో రామోజీ వేసిన పిటిషన్‌కు చేసిన సవరణలను అనుమతించటానికి నిరాకరిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రాథమిక దశలోనే కొట్టివేసింది. ఇప్పుడు తాము జోక్యం చేసుకుంటే.. కింది కోర్టు ప్రొసీడింగ్స్‌ను ప్రభావితం చేసినట్లవుతుందని న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.ఎం.లోథా, జస్టిస్ హెచ్.ఎల్.గోఖలేలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఏం చెప్పాలనుకున్నా.. కింది కోర్టులకు వెళ్లి చెప్పుకోవాలని తేల్చి చెప్పింది. కింది కోర్టుల్లో ఉన్న కేసుల్లో తదుపరి పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందేనని శుక్రవారం స్పష్టం చేసింది. 

ఇదీ కేసు నేపథ్యం...

విశాఖపట్నంలోని సీతమ్మధారలో మంతెన ఆదిత్య ఈశ్వరకుమార కృష్ణవర్మకు చెందిన 2.70 ఎకరాల భూమి (13,078 చదరపు గజాలు)ని 33 సంవత్సరాల లీజు ఒప్పందంతో ఉషోదయా పబ్లికేషన్స్ పేరు మీద 1974 మార్చి 30న రామోజీరావు తీసుకున్నారు. లీజు గడువు ముగిసిన వెంటనే భూమిని తిరిగి అప్పగించేటట్లు ఇరుపక్షాలు ఒప్పందం చేసుకున్నాయి. వర్మ నుంచి తీసుకున్న స్థలంలో రామోజీ ‘ఈనాడు’ కార్యాలయం ఏర్పాటు చేశారు. అయితే రామోజీరావు.. స్థల యజమాని వర్మకు తెలియకుండానే, ఆయనకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా తాను లీజుకు తీసుకున్న స్థలం నుంచి 517 చదరపు మీటర్ల స్థలాన్ని రోడ్డు వెడల్పు నిమిత్తం ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. 

స్వాధీనం చేసిన భూమికి ప్రతిఫలంగా సీతమ్మధారలోనే 872 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించాలని 1985 జనవరి 17న కోరారు. ఆ స్థలాన్ని వర్మ పేరు మీద కాకుండా ‘డెరైక్టర్, ఈనాడు’ పేరు మీద కేటాయించాలని అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్‌ను కోరారు. రామోజీ డిమాండ్‌ను నాటి విశాఖ ఎమ్మార్వో తోసిపుచ్చారు. రోడ్డు నిర్మాణం కోసం ఈనాడుకు చెందిన స్థలంలో కేవలం 289 చదరపు మీటర్లను మాత్రమే తీసుకోవటం జరిగిందని ఎమ్మార్వో స్పష్టం చేశారు. అయితే రామోజీ కోరిన వెంటనే, అప్పటి కలెక్టర్ ఎస్.వి.ప్రసాద్ మాత్రం ఆగమేఘాల మీద స్పందించారు. రామోజీ కోరిన భూమి అప్పటికే ఈనాడు కార్యాలయ స్వాధీనంలో ఉన్నందున దానిని డెరైక్టర్, ఈనాడుకు స్వాధీనం చేయాలని తహసీల్దార్‌ను ఆదేశిస్తూ ఎస్.వి.ప్రసాద్ 1985 ఏప్రిల్ 17న ఉత్తర్వులు జారీ చేశారు. 

రామోజీ పిటిషన్ ఇదీ...

రామోజీ తీసుకున్న స్థలం లీజు కాలపరిమితి 2007 మార్చి 31న ముగిసింది. కానీ స్థలాన్ని వర్మకు ఆయన అప్పగించలేదు. పైగా టైటిల్‌డీడ్‌ను వ్యతిరేకిస్తూ లీజు కాలపరిమితిని పొడిగించాలని కోరుతూ 9వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టులో 2007లోనే పిటిషన్ దాఖలు చేశారు. లీజుకు తీసుకున్న స్థలంలోకి భూ యజమాని వర్మ, ఆయన మనుషులు రాకుండా నిరోధించాలని కూడా కోరారు. తాము లీజుకు తీసుకున్న ఆస్తిపై థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా వర్మను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. 

ఇందులో లీజుకు తీసుకున్న స్థల విస్తీర్ణాన్ని మొదట 9,200 చదరపు మీటర్లుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన తనకు వ్యతిరేకంగా పలు పరిణామాలు చోటు చేసుకోవటం, కేసు నమోదు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించటం వంటి పరిణామాల నేపథ్యంలో పిటిషన్‌లో సవరణలు చేసేందుకు అనుమతించాలని కింది కోర్టును అభ్యర్థించారు. భూమి విస్తీర్ణం 9,200 చదరపు మీటర్లుగా పేర్కొన్న దానిని 11,034 మీటర్లుగా సవరించేందుకు అనుమతించాలని కోరారు. ఇందుకు కింది కోర్టు తిరస్కరించింది. తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన మేజిస్ట్రేట్‌పై ఆరోపణలు చేస్తూ.. కేసును మరో జడ్జికి బదిలీ చేయాలంటూ రామోజీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే సమయంలో కింది కోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్, కౌంటర్లలో సవరణలకు కింది కోర్టు అనుమతించకపోవటాన్ని సవాల్ చేస్తూ మరో రెండు పిటిషన్లను కూడా సమర్పించారు. ఈ పిటిషన్లను హైకోర్టు గతంలోనే కొట్టివేసింది. రామోజీ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ గోడా రఘురాం గతేడాది నవంబర్ 18న 74 పేజీల సంచలన తీర్పు ఇచ్చారు. 1974 నుంచి ఇప్పటి వరకు రామోజీరావు చేస్తూ వచ్చిన పలు అవకతవకలను, కోర్టులకు చెప్పిన అవాస్తవాలను ఎండగట్టారు. యజమాని నుంచి తీసుకున్న స్థలం విస్తీర్ణాన్ని తగ్గించి చూపటం.. వర్మ స్థలాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేసి, ప్రతిగా ప్రభుత్వం నుంచి ఉషోదయా సంస్థ పేరు మీద స్థలం పొందటం.. తనకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేసిన మేజిస్ట్రేట్‌పై ఆరోపణలు చేయటం.. తదితర అంశాలపై రామోజీ చర్యలను న్యాయమూర్తి తప్పుపట్టారు. స్థలాన్ని లీజుకు తీసుకునే సమయంలో దాని విస్తీర్ణం ఎంతో తనకు తెలియదంటూ రామోజీ చెప్పటంపై విస్మయం వ్యక్తం చేశారు. లీజుకు తీసుకున్న స్థలం 11,034.78 చదరపు మీటర్లన్న విషయం రామోజీకి మొదటి నుంచి స్పష్టంగా తెలుసునని పేర్కొన్నారు. 

వర్మకు పంపిన నోటీసుల్లో సైతం లీజు విస్తీర్ణం 9,200 చదరపు మీటర్లుగా రామోజీ పేర్కొన్నారని, వర్మ దీనిపై అభ్యంతరం కూడా తెలిపారని న్యాయమూర్తి గుర్తు చేశారు. వివిధ సందర్భాల్లో పలు ప్రభుత్వ సంస్థలు సర్వే చేసి, విస్తీర్ణం 9,200 చదరపు మీటర్లకు పైనేనని తేల్చిన విషయాన్ని కూడా న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో సైతం రామోజీ తాను లీజుకు తీసుకున్న స్థలం విస్తీర్ణం 11,000 చదరపు గజాలని చెప్పటాన్ని కూడా న్యాయమూర్తి గుర్తు చేశారు. దీనికి సంబంధించి రామోజీకి వ్యతిరేకంగా కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎటువంటి దోషం లేదని న్యాయమూర్తి తేల్చారు. మేజిస్ట్రేట్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఉత్తర్వులు జారీ చేశారని స్పష్టం చేశారు. 

‘సుప్రీం’లోనూ చుక్కెదురు...

హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ రామోజీరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రామోజీ తరఫున సీనియర్ న్యాయవాది లావు నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. పిటిషనర్‌పై కింది కోర్టులో ఉన్న కేసులను అద్దె నియంత్రణ చట్టం కిందకు మార్చాలని కోరారు. 

అలా చేస్తే పాత బకాయిలన్నింటినీ కలిపి ఇప్పటివరకూ మొత్తం అద్దెను చెల్లించటానికి తాము సిద్ధమని, పిటిషనర్‌కు ఎలాంటి కుట్ర పూరిత ఉద్దేశాలు లేవని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. కుట్రపూరిత ఉద్దేశాల విషయమై తాము ఆలోచించటం లేదని, అలాంటి ఉద్దేశాలు లేవని ఈ దశలో ఈ రోజున చెప్పటం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో కింది కోర్టు వ్యవహరించిన తీరును తాము తప్పుపట్టటం లేదని తేల్చి చెప్పింది. ‘ప్రస్తుతం ఈ కేసు విచారణ కీలక దశలో ఉంది. అందువల్ల మేం జోక్యం చేసుకోవాలనుకోవటం లేదు. మీరు అక్కడికే వెళ్లి మీ వాదనలు వినిపించుకోండి. క్రిమినల్ కేసు నమోదైందని, ఇప్పుడు అద్దె నియంత్రణ చట్టం కిందికి కేసును మార్చాలని కోరితే ఎలా? అలా చేస్తే అది కింది కోర్టులోని పిటిషనర్ ప్రయోజనాలకు భంగం కలిగించినట్లు అవుతుంది. నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని, అద్దె మొత్తం కడతామని ఇప్పుడు చెబితే ఎట్లా?’ అని ధర్మాసనం నిలదీసింది. రామోజీ తరఫు న్యాయవాది హైకోర్టు తీర్పు తప్పని చెప్పేందుకు ప్రయత్నించినా ధర్మాసనం పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమంటూ ప్రాథమిక దశలోనే రామోజీ పిటిషన్‌ను కొట్టివేసింది.

దుకాణాలు తగ్గిపోయి చివరకు వారి ఉద్యోగాలు పోయే ప్రమాదం

అధికారంలోకి వచ్చాక తొలిరోజే దానిపై సంతకం 
దేశంలో ఎక్కడా లేని పన్ను కేవలం మన రాష్ట్రంలోనే ఎందుకు?
వ్యాట్ వల్ల 3.50 లక్షల కుటుంబాలపై ప్రభావం
దుకాణాలు తగ్గిపోయి చివరకు వారి ఉద్యోగాలు పోయే ప్రమాదం
ఉద్యోగాలిస్తామని చెప్తూ.. ఉన్న ఉద్యోగాలు ఊడే పరిస్థితి తెస్తున్నారు
నిత్యావసరాల ధరలన్నీ పెంచడంతో సామాన్యుడిపై ఏడాదికి రూ.1,400 భారం
రూ.2 బియ్యాన్ని రూ.1కి చేసి ఏటా రూ.240 మాత్రమే తగ్గిస్తోందీ ప్రభుత్వం
ఆ రూ.1 బియ్యం ప్రచారానికి మాత్రం రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నారు
ఈ ప్రభుత్వ పెద్దలకు సోనియాను మెప్పించడం తప్ప ప్రజల కష్టాలు పట్టడం లేదు
వస్త్ర వ్యాపారుల సమ్మెపై స్పందించకపోతే ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాం

నరసరావుపేట నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి:దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే చిన్న చిన్న వస్త్ర వ్యాపారులను కూడా వదలకుండా విలువ ఆధారిత పన్ను(వ్యాట్) విధిస్తున్నారని, వారి జీవితాలతో ఆడుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పెద్దలపై మండిపడ్డారు. అమలు చేస్తే దేశం మొత్తం ఒకే విధానం అమలు చేయాలన్నారు. లేదంటే రాబోయే సువర్ణయుగంలో ముఖ్యమంత్రి స్థానంపై కూర్చున్న తొలి రోజునే వస్త్రాలపై ‘వ్యాట్’ రద్దు చేస్తూ సంతకం చేస్తానని వస్త్ర వ్యాపారులకు, ఆర్య వైశ్యులకు ఆయన హామీ ఇచ్చారు. పంచదార, కిరోసిన్ కోటా తగ్గించి, కరెంటు చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచి ఈ ప్రభుత్వం ప్రతి కుటుంబం మీద ఏటా రూ.1,400 అదనంగా భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

వస్త్రాలపై ప్రభుత్వం విధించిన 5 శాతం వ్యాట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా వ్యాపారులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలోని వైఎస్సార్ చౌక్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి పాలుపంచుకొని ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..

ఈ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్న దుకాణాలను కూడా వదలడం లేదు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా.. మన రాష్ట్రంలో బట్టల వ్యాపారులపై 5 శాతం వ్యాట్ విధిస్తున్నారని చెప్పడానికి నాకు సిగ్గుగా ఉందని ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలకు చెప్తున్నా. అన్ని రాష్ట్రాల్లో ఒకే మాదిరిగా ట్యాక్సులు(పన్నులు) ఉండాలి కాబట్టి, మేం వ్యాట్ తీసుకొస్తున్నామని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. దానికి పూర్తి విరుద్ధంగా ఇక్కడి ప్రభుత్వం చేస్తోంది. నిన్ననే అనుకుంటా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారు ఒక మాట అన్నారు. ‘అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది(వస్త్రాలపై వ్యాట్) పెట్టేస్తారు. మేం మూడు నెలల ముందు మాత్రమే తీసుకొచ్చాం’ అని ఆయన చెప్పారు. అయ్యా..! రామనారాయణరెడ్డి గారూ.. ఇది జనవరి. మూడు నెలల కిందట అంటే నవంబర్. మీరు టాక్స్‌లు తెచ్చింది జూలైలో. మీకు నవంబర్‌కు జూలైకి తేడా కూడా తెలియకుండా పోయిందా?

పత్తి వినియోగంపైనా ప్రభావం..: వస్త్రాలపై ఈ వ్యాట్ విధించడం వల్ల దాదాపుగా 1.50 లక్షల దుకాణాలను ఇది ప్రభావితం చేస్తుంది. దుకాణానికి కనీసం ఇద్దరు చొప్పున పని చేసేవారు ఉంటారు అనుకుంటే, దాదాపుగా 3 నుంచి 3.50 లక్షల కుటుంబాలు ఈ దుకాణాల మీద ఆధారపడుతున్నాయి. రూ.100కు ఐదు రూపాయలు చొప్పున ట్యాక్స్ వేయడం వలన వారి కొనుగోలు శక్తి తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. దీంతో దుకాణాలు కూడా తగ్గిపోయి, వేధింపులు ఎక్కువయ్యే పరిస్థితులు వస్తాయి. వేధింపులు ఎక్కువై లంచాలు పెరిగిపోయే పరిస్థితి వస్తుంది. లంచాలు ఎక్కువై దుకాణాలు మూసివేయాల్సిన పరిస్థితికి దారి తీస్తుంది. చివరకు ఉద్యోగాలు పోయే పరిస్థితులు వస్తాయి. ఒక వైపేమో.. రాజీవ్ యువ కిరణాలు.. కిరణ్ యువకిరణాలు అంటావు. ఉద్యోగాలు ఇస్తామని ఒకవైపు చెప్తూనే.. మరోవైపు మీరు చేస్తున్న పనుల వలన చిన్నచిన్న దుకాణాల్లో పనిచేస్తున్న వారి ఉద్యోగాలు పోయి రోడ్డున పడే పరిస్థితులు మీకు కనపడటం లేదా? ఇది ఇంతటితో ఆగిపోదు. ఈ భారం పత్తి రైతుల మీద పడే ప్రమాదం కూడా ఉంది. కారణం ఏమిటీ అంటే.. కొనుగోలు శక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో, అప్పుడు పత్తి వినియోగం కూడా తగ్గి పోతుంది. పత్తి వినియోగం లేకపోవడంతో ఇవాళ క్వింటాల్ పత్తికి పలుకుతున్న రూ.3,500 ఇంకా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది.

సోనియాను మెప్పించడమే చాలు వీళ్లకు...

ఇవాళ రైతులను ఆదుకునే నాథుడు లేడు. చదువుకుంటున్న పేద విద్యార్థిని ఆదుకునే నాథుడు లేడు. చివరకు చిన్న చిన్న దుకాణాలను నడుపుకొంటున్న ఆర్యవైశ్య సోదరులను సైతం బాదేంతగా ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. ఆ దివంగత నేత వైఎస్సార్‌ను చూసి ప్రజలు ఓటేసింది.. ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం కోసమా.. అని బాధనిపిస్తోంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి చూస్తే వైఎస్సార్ సువర్ణయుగం గుర్తుకు వస్తోంది. కారణం ఏమిటంటే.. ఆ ఐదు సంవత్సరాలూ.. ఇవాళ్టికీమర్చిపోలేని సువర్ణయుగం. ఇవాళ ఈ రాష్ట్ర పెద్దలకు ఏం కావాలీ అంటే? వీళ్లు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా ప్రజల్లోకి రారు వీళ్లు. వీళ్లకు అసలు ప్రజలతో పనే లేదు. వీళ్లకు కావాల్సిందల్లా ఒక్క సోనియా గాంధీని మెప్పించడం తప్ప మరోటి లేదు.

కూకటివేళ్లతో పెకిలిస్తాం... 

చేస్తే దేశం అంతటా ఒకే విధానం తీసుకొని రండి. లేకపోతే ఈ రాష్ట్రం నుంచి వ్యాట్‌ను వెంటనే తీసేయండి అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను చెప్తున్నా. ప్రభుత్వం మీద ఇంకా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా బహుశా ఈ ఎనిమిది రోజుల సమ్మె సరిపోతుందో.. సరిపోదో.. నాకైతే తెలియదు. అందరం ఏకం కావాలి. ఒక్కటై ఆ చిన్నచిన్న దుకాణాల వారిని ఆదుకునేందుకు ముందడుగు వేయాలి. ఎనిమిది రోజుల సమ్మె చేస్తామని చె ప్పి ముందే నోటీసులు ఇచ్చాం.. ఆరు నెలల నుంచీ వస్త్ర వ్యాపారులు పోరాటం చేస్తూ ఉన్నారు. అయినా కూడా కనీసం పట్టించుకునే నాథుడు లేని అధ్వాన పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో కనపడుతున్నాయి. ఈ ఉద్యమంలో భాగంగా ఆర్డీవో దగ్గరకు వెళ్లి ఇక్కడ మేం చేస్తున్న సమ్మెను ముఖ్యమంత్రిగారికి పంపించాలని వినతిపత్రం ఇస్తాం. ఇచ్చిన తరువాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కదులుతుందేమో.. అని చూస్తాం. కదలకపోతేమటుకు.. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించే రోజు త్వరలోనే వస్తుందని హెచ్చరిస్తున్నాను. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రమైన ఉద్యమాలు చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. చిన్నచిన్న వ్యాపారులకు సంఘీభావం తెలిపేందుకు ధర్నాకు వచ్చిన ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.

రూ.240 తగ్గించి.. 1,400 పెంచారు

‘‘ఒక వ్యక్తి బతకాలి అంటే ఆ వ్యక్తికి ఏడాదికి కనీసం నాలుగు చొక్కాలు, నాలుగు లుంగీలు, నాలుగు బనియన్లు, నాలుగు నిక్కర్లు కావాలి. వీటి కోసం సంవత్సరానికి ఆ వ్యక్తి ఖర్చు చేసేది రూ. వెయ్యి. ఆ కుటుంబంలో కనీసం నలుగురు ఉంటారు అనుకుంటే రూ.4,000 ఖర్చవుతుంది. ఆ రూ. 4 వేల మీద ఐదు శాతం వ్యాట్ అంటే సంవత్సరానికి ఆ కుటుంబం మీద రూ. 200 అదనపు భారం పడుతోంది. కిరోసిన్ చూద్దామా.. అంటే, మూడు లీటర్లు ఇస్తున్న కిరోసిన్‌ను ఒక లీటర్‌కు తగ్గించారు. మార్కెట్‌లో లీటర్ కిరోసిన్ రేటు రూ. 30. అదే కిరోసిన్‌ను రేషన్‌లో కొంటే రూ. 15. కిరోసిన్ కోటా తగ్గించడం వల్ల నెలకు సామాన్యుడిపై అదనంగా పడుతున్న భారం రూ.30. సంవత్సరానికి లెక్కేస్తే రూ.360. పంచదారేమో.. ఇంతకుముందు ఒక కేజీ ఇచ్చేవారు. 

ఇది ఇప్పటికే అర్ధ కేజీకి తగ్గించారు. ఇలా తగ్గించినందుకు ప్రజలపై పడే భారం రూ.10. అంటే సంవత్సరానికి రూ. 120. నిత్యావసరాల మీద 4 నుంచి 5 శాతం వ్యాట్ పెంచినందు వలన నెలకు రూ.15 చొప్పున సంవత్సరానికి రూ. 180 భారం పడుతోంది. పెంచిన కరెంటు చార్జీలు చూస్తే నెలకు రూ. 20 చొప్పున సంవత్సరానికి రూ. 240 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. పెంచిన బస్ చార్జీలు చూద్దామా.. అంటే నెలకు రూ.20, సంవత్సరానికి రూ. 240. మొత్తం కలిపి చూస్తే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.1,400 భారం పెంచారు అనే సం గతి చెప్పటానికి మీకు సిగ్గుగా లేదా అని నేను అడుగుతున్నా. ఒక వైపేమో.. రూ.1400 పెంచారు. మరోవైపేమో.. కేజీ రెండు రూపాయల బియ్యం రూపాయి చేశామని చెప్పి నెలకు రూ. 20 చొప్పున ఏడాదికి రూ.240 తగ్గిం చారు. నికరంగా పెంచింది రూ.1,400.. తగ్గించిందేమో రూ.240. ఇంత తగ్గిం చామని చెప్పి పబ్లిసిటీ చేసుకోడానికి రూ.700 కోట్లు ఖర్చుపెడుతున్నారు’’.

రంగారావును ఎందుకు అరెస్టు చేయలేదు?

ఎమ్మార్ వ్యవహారంలో కీలక నిందితుల్లో ఒకరైన స్టైలిష్ హోమ్స్ డైరెక్టర్ తుమ్మల రంగారావును సీబీఐ అధికారులు ఇంత వరకూ అరెస్ట్ చేయకపోవటాన్ని సుశీల్‌కుమార్ ప్రశ్నించారు. సీబీఐ ఉద్దేశపూర్వకంగానే రంగారావును అరెస్ట్ చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సీబీఐ, రంగారావుల మధ్య కుట్ర సాగుతోందని చెప్పారు. నిందితుడిగా ఉన్న వ్యక్తిని వదిలి వేసి.. సునీల్‌రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ‘ఈ మొత్తం కేసులో సీబీఐకి ఎలా కావాలంటే అలా.. ఏం కావాలంటే అది.. రంగారావు చెప్పారు. అందుకే సీబీఐ ఆయన జోలికి వెళ్లటం లేదు. రంగారావును పిలుస్తారు.. తాము అనుకున్నది ఆయన చేత చెప్పించుకుని వెంటనే పంపేస్తున్నారు. కానీ మిగిలిన వారిని మాత్రం విచారణ పేరుతో పిలిపించి.. అక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. 

రంగారావు విషయంలో సీబీఐ ఎందుకింత ప్రేమ కనపరుస్తోందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో సీబీఐ స్వతంత్రంగా సాధించింది ఏమీ లేదు. రంగారావు చెప్పిన దానిని బట్టే సునీల్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి సహ నిందితుడు చెప్పిన దానిని బట్టి.. ఇతరులను అరెస్ట్ చేయటం సరికాదు. ఈ విషయం నేను చెప్పటం లేదు. ఇప్పటికే పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కానీ సీబీఐ అధికారులు ఇందుకు విరుద్ధంగా రంగారావు ఏదో చెప్పారంటూ సునీల్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. తమకు రంగారావు ఇన్ని విధాలుగా సహకరిస్తున్నారు కాబట్టే.. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకునేలా ఆయనను ప్రేరేపించారు. 

ఈ కేసులో నిందితుడుగా ఉన్న కోనేరు ప్రసాద్‌ను కస్టడీకి అప్పగించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో సీబీఐ ఏం రాసిందో ఒక్కసారి చూడండి. కోనేరు ప్రసాద్, తుమ్మల రంగారావు కలిసి కుట్రపన్నారని సీబీఐయే చెప్పింది. అలాంటప్పుడు కోనేరును అరెస్ట్ చేసి.. రంగారావును ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? ఈ కేసులో కోనేరు ప్రసాద్, రంగారావులే ప్రధాన కుట్రదారులు, నిందితులు. కానీ సీబీఐ అధికారులు రంగారావు పేరును ప్రతి చోటా తప్పిస్తూ వస్తున్నారు. ఎమ్మార్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ రంగారావు ప్రస్తావన ఉంది. ఆ తీర్పు ఆధారంగా రూపొందించిన ఎఫ్‌ఐఆర్‌లోనూ ఆయన పేరు ఉంది. అయినా కూడా సీబీఐ ఆయన జోలికి వెళ్లదు. ఎందుకంటే రంగారావును అరెస్ట్ చేస్తే.. తమకు అనుకూలంగా చెప్పేవారు ఎవ్వరూ ఉండరు కాబట్టి. రంగారావును సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రతి దశలోనూ అనుకూలంగా వాడుకుంటున్నారు. ఇదేనా దర్యాప్తు చేయాల్సిన పద్ధతి?’’ అని ప్రశ్నించారు. 

చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?

‘‘నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్నామని మాటల్లో చెబితే సరిపోదు.. అది చేతల్లో కనిపించాలి. కానీ సీబీఐ దర్యాప్తు తీరును చూస్తుంటే వారివి కేవలం మాటలేనని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది’’ అని సుశీల్‌కుమార్ వివరించారు. ‘‘ఎమ్మార్ రాష్ట్రంలో అడుగుపెట్టింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో. ఎమ్మార్‌కు భూములు కేటాయించింది ఆయనే. ఆయన హయాంలోనే కీలక జీవోలన్నీ జారీ అయ్యాయి. అసలు కుట్రకు తెరలేచింది బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే. అయినప్పటికీ సీబీఐ అధికారులు ఆయన జోలికి వెళ్లరు. ఆయనను కనీసం పిలిపించి ప్రశ్నించటం కూడా చేయరు. బాబును ఎందుకు పిలిపించరో.. ఎందుకు ప్రశ్నిం చరో.. సీబీఐకి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఎమ్మార్ కేసులో బాబు హయాం నుంచీ దర్యాప్తు జరిపేలా సీబీఐని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు చంద్రబాబు, సీబీఐ తదితరులకు నోటీసులు కూడా జారీ చేసింది’’ అని ఆయన గుర్తుచేశారు.

ఆంధ్రజ్యోతి, ఈనాడుకు సీబీఐ ఉద్దేశపూర్వక లీకులు ఇస్తోంది

సీబీఐ దర్యాప్తు తీరుపై ప్రశ్నలు సంధించిన ప్రత్యేక కోర్టు 
అసలు సునీల్ అరెస్టును మీరు ఎలా సమర్థించుకుంటారు? 
సునీల్‌రెడ్డిని ఐదు రోజుల కస్టడీ కోరిన సీబీఐ అధికారులు 
రెండున్నర రోజుల కస్టడీకి అనుమతించిన న్యాయమూర్తి
న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని స్పష్టీకరణ 
సీబీఐది అధికార దుర్వినియోగం: సుశీల్‌కుమార్ వాదన
రంగారావును ఇప్పటి వరకూ ఎందుకు అరెస్టు చేయలేదు? 
ఆంధ్రజ్యోతి, ఈనాడుకు సీబీఐ ఉద్దేశపూర్వక లీకులు ఇస్తోంది.. ఆ పత్రికల 
ప్రతినిధులను సీబీఐ వెంట పెట్టుకుని తిరుగుతోంది... లీకులపై కోర్టు దృష్టి సారించాలి
ఎమ్మార్ రాష్ట్రంలోకి వచ్చింది చంద్రబాబు హయాంలోనే.. ఎమ్మార్‌కు భూములు 
కేటాయించిందీ, కీలక జీవోలిచ్చిందీ బాబే.. ఆయనను సీబీఐ ఎందుకు ప్రశ్నించదు?

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘ఎమ్మార్ వ్యవహారంలో సునీల్‌రెడ్డి పాత్రపై ఒక్క ఆధారమైనా ఉందా? ఎఫ్‌ఐఆర్ దాఖలు సమయంలో ఒక్క చిన్న ఆధారమైనా సంపాదించారా? ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పాత్రపై ఒక్క లైను కూడా లేదు. అసలు సునీల్‌రెడ్డి అరెస్టును మీరు ఎలా సమర్థించుకుంటారు? ఇన్ని రోజులుగా సునీల్‌రెడ్డికి వ్యతిరేకంగా మీరు సంపాదించిన ఆధారాలేమిటి?’’ అని సీబీఐ అధికారులను ప్రత్యేక న్యాయస్థానం ప్రశ్నించింది. సునీల్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది చూపిన సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలిస్తే.. ఈ మొత్తం కేసు వారికే అనుకూలంగా ఉందని సీబీఐని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. సునీల్‌రెడ్డిని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ గట్టిగా పట్టుపట్టినప్పుడు.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ ప్రశ్నలు సంధించింది. ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని సీబీఐ అధికారులు.. చివరకు రెండున్నర రోజుల కస్టడీకి అంగీకరించారు. 

దీంతో సునీల్‌రెడ్డిని శనివారం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి బి.నాగమారుతీశర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపరచాలని సీబీఐ అధికారులను ఆదేశించారు. సునీల్‌రెడ్డిని ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు మాత్రమే న్యాయవాదుల సమక్షంలోనే ప్రశ్నించాలని, అనంతరం రిమాండ్‌కు తరలించాలని స్పష్టం చేశారు. సునీల్‌రెడ్డిని 15 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనల విన్న అనంతరం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు సునీల్‌రెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ వాదించగా.. సీబీఐ తరఫున బిళ్లా రవీంద్రనాథ్ వాదనలు వినిపించారు. సుశీల్‌కుమార్ దాదాపు రెండు గంటల పాటు తన వాదనలు వినిపించారు. సీబీఐ దర్యాప్తు జరుగుతున్న తీరును.. అందులోని లోపాలను.. పక్షపాత ధోరణిని.. అధికారులు కొన్ని పత్రికలకు చేస్తున్న ఉద్దేశపూర్వక లీకులను.. సీబీఐ అనుసరిస్తున్న చట్ట వ్యతిరేక విధానాలను ఆయన ఎత్తిచూపారు. ఒక వర్గం మీడియా ప్రచురిస్తున్న అసత్య కథనాలను కూడా కోర్టు ముందుంచారు. 

రంగారావును ఎందుకు అరెస్టు చేయలేదు?

ఎమ్మార్ వ్యవహారంలో కీలక నిందితుల్లో ఒకరైన స్టైలిష్ హోమ్స్ డైరెక్టర్ తుమ్మల రంగారావును సీబీఐ అధికారులు ఇంత వరకూ అరెస్ట్ చేయకపోవటాన్ని సుశీల్‌కుమార్ ప్రశ్నించారు. సీబీఐ ఉద్దేశపూర్వకంగానే రంగారావును అరెస్ట్ చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సీబీఐ, రంగారావుల మధ్య కుట్ర సాగుతోందని చెప్పారు. నిందితుడిగా ఉన్న వ్యక్తిని వదిలి వేసి.. సునీల్‌రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ‘ఈ మొత్తం కేసులో సీబీఐకి ఎలా కావాలంటే అలా.. ఏం కావాలంటే అది.. రంగారావు చెప్పారు. అందుకే సీబీఐ ఆయన జోలికి వెళ్లటం లేదు. రంగారావును పిలుస్తారు.. తాము అనుకున్నది ఆయన చేత చెప్పించుకుని వెంటనే పంపేస్తున్నారు. కానీ మిగిలిన వారిని మాత్రం విచారణ పేరుతో పిలిపించి.. అక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. 

రంగారావు విషయంలో సీబీఐ ఎందుకింత ప్రేమ కనపరుస్తోందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో సీబీఐ స్వతంత్రంగా సాధించింది ఏమీ లేదు. రంగారావు చెప్పిన దానిని బట్టే సునీల్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి సహ నిందితుడు చెప్పిన దానిని బట్టి.. ఇతరులను అరెస్ట్ చేయటం సరికాదు. ఈ విషయం నేను చెప్పటం లేదు. ఇప్పటికే పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కానీ సీబీఐ అధికారులు ఇందుకు విరుద్ధంగా రంగారావు ఏదో చెప్పారంటూ సునీల్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. తమకు రంగారావు ఇన్ని విధాలుగా సహకరిస్తున్నారు కాబట్టే.. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకునేలా ఆయనను ప్రేరేపించారు. 

ఈ కేసులో నిందితుడుగా ఉన్న కోనేరు ప్రసాద్‌ను కస్టడీకి అప్పగించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో సీబీఐ ఏం రాసిందో ఒక్కసారి చూడండి. కోనేరు ప్రసాద్, తుమ్మల రంగారావు కలిసి కుట్రపన్నారని సీబీఐయే చెప్పింది. అలాంటప్పుడు కోనేరును అరెస్ట్ చేసి.. రంగారావును ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? ఈ కేసులో కోనేరు ప్రసాద్, రంగారావులే ప్రధాన కుట్రదారులు, నిందితులు. కానీ సీబీఐ అధికారులు రంగారావు పేరును ప్రతి చోటా తప్పిస్తూ వస్తున్నారు. ఎమ్మార్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ రంగారావు ప్రస్తావన ఉంది. ఆ తీర్పు ఆధారంగా రూపొందించిన ఎఫ్‌ఐఆర్‌లోనూ ఆయన పేరు ఉంది. అయినా కూడా సీబీఐ ఆయన జోలికి వెళ్లదు. ఎందుకంటే రంగారావును అరెస్ట్ చేస్తే.. తమకు అనుకూలంగా చెప్పేవారు ఎవ్వరూ ఉండరు కాబట్టి. రంగారావును సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రతి దశలోనూ అనుకూలంగా వాడుకుంటున్నారు. ఇదేనా దర్యాప్తు చేయాల్సిన పద్ధతి?’’ అని ప్రశ్నించారు. 

చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?

‘‘నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తున్నామని మాటల్లో చెబితే సరిపోదు.. అది చేతల్లో కనిపించాలి. కానీ సీబీఐ దర్యాప్తు తీరును చూస్తుంటే వారివి కేవలం మాటలేనని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది’’ అని సుశీల్‌కుమార్ వివరించారు. ‘‘ఎమ్మార్ రాష్ట్రంలో అడుగుపెట్టింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో. ఎమ్మార్‌కు భూములు కేటాయించింది ఆయనే. ఆయన హయాంలోనే కీలక జీవోలన్నీ జారీ అయ్యాయి. అసలు కుట్రకు తెరలేచింది బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే. అయినప్పటికీ సీబీఐ అధికారులు ఆయన జోలికి వెళ్లరు. ఆయనను కనీసం పిలిపించి ప్రశ్నించటం కూడా చేయరు. బాబును ఎందుకు పిలిపించరో.. ఎందుకు ప్రశ్నిం చరో.. సీబీఐకి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఎమ్మార్ కేసులో బాబు హయాం నుంచీ దర్యాప్తు జరిపేలా సీబీఐని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు చంద్రబాబు, సీబీఐ తదితరులకు నోటీసులు కూడా జారీ చేసింది’’ అని ఆయన గుర్తుచేశారు. 

సీబీఐ దర్యాప్తు తీరు చూడండి...

‘‘ఈ కేసులో సీబీఐ తన దర్యాప్తును ఏ విధంగా చేస్తోందో ఒక్కసారి చూడండి. సునీల్‌రెడ్డి అరెస్టు జరిగిన తీరును చూస్తే సీబీఐ దర్యాప్తు ఎంత సక్రమంగా సాగుతోందో అర్థమవుతోంది. సునీల్‌రెడ్డిని ఈ నెల 24న ఉదయం 6గంటలకు ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్ కేసులో ఒక్కసారి కూడా సునీల్‌రెడ్డిని విచారించలేదు. కనీసం నోటీసులు జారీ చేయలేదు. అదుపులోకి తీసుకుని.. అక్కడి నుంచి ఆయన బ్యాంకు లాకర్లు ఉన్న బ్యాంకుకు తీసుకెళ్లి, నిబంధనలకు విరుద్ధంగా వాటిని తెరిచారు. బ్యాంకు లాకర్లలో సీబీఐ వారికి ఏమీ దొరకలేదు. అక్కడి నుంచి దిల్‌కుష అతిథి గృహానికి తీసుకువచ్చి.. అక్కడకు స్టైలిష్ రంగారావును పిలిపించి.. సునీల్‌రెడ్డి అతనేనా.. కాదా.. అని తేల్చుకున్నారు. మళ్లీ ఇంటికి తీసుకెళ్లి అక్కడ సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకోలేదు. ఇలా చేయటం కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం. సోదాలు పూర్తయిన తరువాత సాయంత్రం 6.30కి అరెస్టు చేశారు. కానీ సునీల్‌రెడ్డే స్వయంగా తమ వద్దకు వచ్చి అరెస్టు చేయాలని కోరినట్లు సీబీఐ అధికారులు చెప్తున్నారు. ఇది నమ్మదగ్గ విధంగా ఉందా? సునీల్‌రెడ్డి అరెస్టు సమయంలో ఆయన నివసించే ప్రాంతంలో ఉండే ఇద్దరు వ్యక్తులను సాక్షులుగా చూపాలి. కానీ సీబీఐ అధికారులు తమ జేబులో ఉండే ఇద్దరు బ్యాంకు అధికారులను సాక్షులుగా చూపారు. ఇది చట్టవిరుద్ధం.

సీబీఐది అధికార దుర్వినియోగం... 

అసలు ఏం చేశారని సునీల్‌రెడ్డిని అరెస్టు చేశారు..? గంటల కొద్దీ సోదాలు చేసి ఏం కనుగొన్నారు..? ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించి ఏం రాబట్టారు..? ఈ మొత్తం వ్యవహారంలో సీబీఐది అధికార దుర్వినియోగం. దానిని ఈ కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు. సీబీఐ ఏం కావాలంటే అది.. ఎలా కావాలంటే అలా దర్యాప్తు చేస్తోంది. ఇందుకు రాజ్యాంగం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. తమ విచారణలో సునీల్‌రెడ్డి ఏం చెప్పలేదని సీబీఐ చెబుతోంది. 

ఏదైనా తెలిసుంటే కదా.. చెప్పేందుకు. తెలియని విషయాలను గురించి ఎవరు మాత్రం ఏం చెప్తారు..? అందరూ రంగారావులాగా సీబీఐకి కావాల్సిన విధంగా చెప్పగలరా..? కోనేరు ప్రసాద్ కస్టడీ కోరే సమయంలో సీబీఐ తాను దాఖలు చేసిన పిటిషన్‌లో.. విల్లాల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం డబ్బును దుబాయ్‌లోని తన కుమారుడి ఖాతాకు బదిలీ చేసిందని స్వయంగా చెప్పింది. మరి అలాంటప్పుడు సునీల్‌రెడ్డికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది..? సీబీఐ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంది. దానిని కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సునీల్‌రెడ్డి పాత్ర గురించి హైకోర్టు తీర్పులో లేదు. ఎఫ్‌ఐఆర్‌లో కూడా లేదు. కేవలం 25న దాఖలు చేసిన పిటిషన్‌లో మాత్రమే సునీల్ ప్రస్తావన ఉంది. ఇప్పటి వరకు ఎమ్మార్ కేసులో ఒక్క ప్రభుత్వ ఉద్యోగిని కూడా అరెస్టు చేయలేదు. కీలక నిందితుడిగా ఉన్న రంగారావు జోలికి వెళ్లకపోవటం వెనుక ఉద్దేశాలు ఏమిటి?’’ అని సుశీల్ ప్రశ్నించారు.

ఆధారాలున్నాయి: సీబీఐ న్యాయవాది 

సీబీఐ తరఫు న్యాయవాది రవీంద్రనాథ్ వాదనలను వినిపిస్తూ.. సునీల్‌రెడ్డి అరెస్టును సమర్థించుకున్నారు. విల్లాల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును కోనేరు ప్రసాద్.. సునీల్‌కు అందచేశారన్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని, మరింత సమాచారం రాబట్టేందుకే సునీల్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నామని కోర్టుకు చెప్పారు. వసూలు చేసిన మొత్తాలు అంతిమంగా ఎక్కడకు చేరాయనే విషయాన్ని సునీల్ ద్వారా తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఆ డబ్బు ఎక్కడ దాచారు? ఎవరికిచ్చారు? తదితర కీలక సమాచారాన్ని సునీల్ వెల్లడించాల్సి ఉందన్నారు. అందువల్ల 15 రోజులు కాకున్నా కనీసం ఐదు రోజుల పాటైనా ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. దీనికి సునీల్ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తరువాత కోర్టు రెండున్నర రోజులకు సునీల్‌రెడ్డిని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ మీడియాకు సీబీఐ లీకులు... 

‘‘సీబీఐ మొదటి నుంచీ ఓ వర్గం మీడియాను ప్రోత్సహిస్తూ వస్తోంది. వారికే ఉద్దేశపూర్వకంగా లీకులిస్తోంది. ఏ రీతిలో కథనం ప్రచురిస్తే.. లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులకు నష్టం కలుగుతుందో.. అదే రీతిలో కథనాలు రాయిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీడియాను సీబీఐ తన వెంట తిప్పుతోంది. ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను. సునీల్‌రెడ్డి వ్యవహారంలోనూ ఇదే జరిగింది. ఉదయం 6 గంటలకు సీబీఐ అధికారులు సునీల్‌రెడ్డి ఇంటికి వెళితే.. సీబీఐతో పాటు ఆంధ్రజ్యోతి అక్కడ ఉంది. సునీల్ ఇంటికి సీబీఐ వెళుతోందని ఆంధ్రజ్యోతికెలా తెలిసింది? సీబీఐ అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చారు కాబట్టే.. ఆ పత్రిక అక్కడకు రాగలిగింది. 

చిన్న లీకు ఆధారంగా ఆ రెండు పత్రికలు అర్థం లేని కథనాలను తయారు చేస్తున్నాయి. రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందో కూడా రాస్తున్నాయి. అసలు రిమాండ్ రిపోర్ట్ మీడియా ప్రతినిధులకు ఎలా అందుబాటులోకి వస్తోంది? పత్రికల్లో వచ్చిన కథనాలను ఓసారి చూడండి. అందులో ఉపయోగించిన భాషను పరిశీలించండి (కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాల తాలూకు కటింగులను న్యాయమూర్తికి ఇచ్చారు). ఇదంతా కూడా పెద్ద కుట్ర. అసలు 161 స్టేట్‌మెంట్లు ఈ పత్రికలకు ఎలా తెలుస్తున్నాయి? దీనిపై కోర్టు దృష్టి సారించాలి’ అని వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. సీబీఐ కొన్ని సమయాల్లో సీరియస్‌గా వ్యవహరించటం లేదని వ్యాఖ్యానించారు. 

కటిక నేలపై పడుకోబెట్టారు...

అరెస్టు చేసిన రోజున సునీల్‌రెడ్డితో సీబీఐ వ్యవహరించిన తీరుపై సుశీల్‌కుమార్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. సీబీఐ మానవత్వం లేకుండా వ్యవహరించిందని తెలిపారు. ‘‘సీబీఐ అధికారులు ఇక్కడే ఉన్నారు. వారిని ఒక్క ప్రశ్న అడగండి. ఐవో (దర్యాప్తు అధికారి)గా కాకుండా ఓ మనిషి హోదాలో చెప్పమనండి.. సునీల్‌రెడ్డి విషయంలో ఎలా వ్యవహరించారో. అరెస్టు చేసిన రాత్రి సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ స్టేషన్)లో ఉంచారు. కటిక నేలపై పడుకోబెట్టారు. కింద పరుచుకోవటానికి, కప్పుకోవటానికి దుప్పటి కూడా ఏర్పాటు చేయలేదు. పక్కనే ఉన్న మ్యాట్‌ను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. మూత్ర విసర్జనకు సైతం సరైన సదుపాయాలు లేవు. సీబీఐ కావాలనే ఇదంతా చేస్తోంది’’ అని సుశీల్ వివరించారు. సుశీల్‌కుమార్ వాదిస్తున్న సమయంలో సీబీఐ న్యాయవాది రవీంద్రనాథ్ జోక్యం చేసుకుంటూ.. సునీల్‌రెడ్డి ప్రమేయంపై ప్రతి విషయాన్ని ఆధారాలతో నిరూపిస్తామని, ఇది తమ చాలెంజ్ అని పెద్ద గొంతుతో వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదా కోసం సునీల్‌రెడ్డి పిటిషన్

ఎమ్మార్ కేసులో అరెస్టయి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న తనకు ప్రత్యేక హోదా కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని సునీల్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేశారు. తన విద్యార్హతలు, హోదాను పరిగణనలోకి తీసుకుంటూ తన అభ్యర్థనను మన్నించాలని ఆయన కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు ఈ నెల 30న విచారించనున్నది.

Popular Posts

Topics :