13 September 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

రైతు ఆత్మహత్యలు సర్కారీ హత్యలే

Written By news on Saturday, September 19, 2015 | 9/19/2015

‘‘అన్నదాతల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం దేశంలోనే ముందుంది. రైతాంగం ఆశలపై ఈ ప్రభుత్వం నీళ్లు చల్లింది. రుణాలు అందక, గిట్టుబాటు ధరల్లేక రైతన్నలు పిట్టల్లా రాలిపోతున్నా.. ఈ సర్కారుకు చీమ కుట్టినట్లయినా లేదు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. 15 నెలల కేసీఆర్ పాలనలో ఇప్పటి వరకు 1,100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. కేవలం 120 కుటుంబాలకే ఎక్స్‌గ్రేషియా అందించడం దారుణమన్నారు.

రైతు ఆత్మహత్యలు ఆపాలని, కరువు మండలాలు ప్రకటించాలని, రైతు రుణాలన్నీ ఏకమొత్తంగా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో పొంగులేటి పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బతుకులు బంగారుమయమవుతాయని కలలుగన్న రైతన్నల ఆశలు అడియాసలయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు.

‘‘ఎన్నికలకు ముందు, తర్వాత రైతు ఆత్మహత్యలను సర్కారీ హత్యలుగానే పరిగణిస్తామని ప్రకటించిన కేసీఆర్.. ఇప్పడు 1,100 రైతుల మరణానికి బాధ్యత వహిస్తారా..? రాష్ట్రంలో జరుగుతున్న ఆ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. ఎన్నికల మేనిఫెస్టోలో లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని బీరాలు పలికారు. రుణమాఫీ దేవుడెరుగు.. కొత్తగా ఒక్క రైతుకు కూడా రుణం ఇవ్వడ ం లేదు. రైతు పక్షపాతిగా వ్యవహరించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.1.50 లక్షల పరిహారాన్ని ప్రవేశపెడితే.. ఈ ప్రభుత్వం దాన్ని కూడా సకాలంలో అందించకపోవడం దారుణం’’ అని పొంగులేటి అన్నారు. పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.
 
రూ.5 వేల కరువు పింఛన్ ఇవ్వాలి
రైతుల వెన్నంటి నిలిచేది వైఎస్సార్‌సీపీ ఒక్కటేనని పొంగులేటి చెప్పారు. త్వరలోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలతో ‘రైతు దీక్ష’ చేపడతామని ప్రకటించారు. కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని అభ్యర్థించినా రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదని చెప్పారు. రైతులకు నెలకు రూ.5 వేల చొప్పున కరువు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ధర్నాలో పార్టీ ప్రధాన కార్యదర్శులు శివకుమార్, గాదె నిరంజన్‌రెడ్డి, సయ్యద్ మతీన్, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.సురేశ్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆడెం విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శులు ధనలక్ష్మి, ప్రభుకుమార్, అమృతాసాగర్, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు ముజ్తాబా అహ్మద్, సంయుక్త కార్యదర్శులు కుసుమ కుమార్‌రెడ్డి, వరలక్ష్మి, సేవాదళ్ అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, రాష్ట్ర డాక్టర్ సెల్ అధ్యక్షుడు ప్రపుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీకి వినతిపత్రం అందజేశారు.
 
జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు
రైతు సమస్యలపై వైఎస్సార్‌సీపీ అన్ని జిల్లాల్లో భారీగా ఆందోళనలు చేపట్టింది. ర్యాలీలు, ధర్నాల్లో పార్టీ నేతలు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మెదక్‌లో సంగారెడ్డి కలెక్టరేట్ ముందు పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్రా భిక్షపతి, రాష్ట్ర కార్యదర్శి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, వరంగల్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాడెం శాంతి కుమార్, నిజామాబాద్ జిల్లాలో పార్టీ సేవాదళ్ రాష్ట ప్రధాన కార్యదర్శి నీలం రమేశ్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంగయ్య, కరీంనగర్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ర్ట కార్యదర్శులు బోయిన్‌పల్లి శ్రీనివాస్‌రావు, అక్కెనపెల్లి కుమార్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, ఆదిలాబాద్ లో పార్టీ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గంగన్న, ఖమ్మంలో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మట్టా దయానంద్, నల్లగొండలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్నేని వెంకట రత్నంబాబు తదితరులు పాల్గొన్నారు.

నిధుల అనుసంధానమే చేశారు..!


నదుల అనుసంధానం పూర్తయితే శ్రీశైలం నీళ్లు కిందకు ఎందుకు?
గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం పూర్తి చేశామంటున్న ప్రభుత్వం రాయలసీమకు మళ్లించాల్సిన కృష్ణా నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కిందకు ఎందుకు వదిలిపెడుతోందని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారంనాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పట్టిసీమ ప్రాజెక్టుతో నదుల అనుసంధానం చేయడం ద్వారా కృష్ణా నదీ జలాలను శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంత సాగు, తాగునీటి అవసరాలను తీర్చుతామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులు ఉంటే తప్ప రాయలసీమకు నీటిని మళ్లించడం సాధ్యంకాదనీ, ప్రస్తుతం 839అడుగుల స్థాయిలోనే నీటిని కిందికి వదిలిపెడుతోందన్నారు. పది రోజుల పాటు కిందకు నీటి ని వదలకుండా ఉంటే 854 అడుగుల స్థాయి చేరుకునే అవకాశముందన్నారు.854 అడుగుల నీటిమట్టం ఉంచడం కోసం శ్రీశైలం వద్ద తాము ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని శ్రీకాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  
 
నిధుల అనుసంధానమే చేశారు..!
జరగని గోదావరి, కృష్ణా నదుల అనుసంధానాన్ని జరిగినట్టు ప్రభుత్వం ప్రచారం చేస్తోందని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు.చంద్రబాబు పట్టిసీమ పేరుతో నిధుల అనుసంధానం మాత్రమే చేశారని విమర్శించారు. గోదావరి జలాలు కృష్ణాలో కలపడానికి ఉపయోగపడే పోలవరం కుడి కాల్వను 175కి.మీ. పనులను గతంలోనే పూర్తిచేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆ ఘనత దక్కుతుందా? లేదంటే కేవలం 30కి.మీ. కాలువను తవ్వించిన చంద్రబాబుకు దక్కుతుందా? అని ప్రశ్నించారు.

హంద్రీనీవా ప్రాజెక్టు టెండర్ల విషయంలో సీఎం పేరు చెప్పి సీఈ స్థాయి అధికారులు మిగతా కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనకుండా బెదిరించారని విమర్శించారు. ఇద్దరు మాత్రమేటెండర్లు దాఖలు చేసిన రూ.460కోట్ల విలువ చేసే ఈ పనులలో  రూ.200కోట్ల అవినీతి జరిగిందన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

18న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆందోళన

Written By news on Thursday, September 17, 2015 | 9/17/2015


18న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆందోళన
రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద కార్యక్రమానికి పొంగులేటి: శివకుమార్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపేందుకు ఈ నెల 18 తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని రైతులు తీవ్ర సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని  ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ప్రభుత్వం వైపు నుంచి రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కనిపించడం లేదని చెప్పారు.

బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వాన్ని తట్టి లేపాలని వైఎస్సార్ సీపీ సంకల్పించిందన్నారు. అందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం జిల్లా ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ నెల 18న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారన్నారు.  ఆరు డిమాండ్లతో కూడిన  వినతి పత్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లకు రైతులతో కలిసి అందజేస్తారని చెప్పారు.

కాగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉదయం పది గంటలకు వెయ్యి మంది రైతులతో జరగనున్న కార్యక్రమంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొంటారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు తప్పకుండా  పాల్గొనాలని శివకుమార్ కోరారు.
 
డిమాండ్లు ఇవే: 1. తక్షణమే కరువు మండలాలను ప్రకటించాలి. 2. కరువు సహాయక చర్యలు చేపట్టాలి. రైతు రూణమాఫీ ఏకమొత్తంగా చేయాలి. 3. ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం తక్షణమే అందించాలి. 4. కరువులో రైతులకు కరువు పింఛన్లు రూ.5000 వంతున ఇవ్వాలి. 5. పశువులకు పశుగ్రాసాన్ని, పాడి పశువులకు దానాను ఉచితంగా అందించాలి. 6. జిల్లాలో గల పెండింగ్ ప్రాజెక్ట్‌లు వెంటనే పూర్తి చేసి కరువు నివారణ చర్యలు చేపట్టాలి.

బలవంతం చెల్లదు


బలవంతం చెల్లదు
రైతులకు ఇష్టం లేకుండా భూమి సేకరించే హక్కు ప్రభుత్వానికి లేదు: జగన్
సాక్షి, విజయవాడ బ్యూరో: పోర్టు పేరు చెప్పి 30 వేల ఎకరాలను బలవంతంగా రైతుల నుంచి తీసుకోవాలనుకోవడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇష్టం లేకుండా ఒక్క ఎకరం కూడా వారి నుంచి తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. భూములు ఇవ్వనన్న వారిని పూర్తిగా వదిలేయాలని అన్నారు.

ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని,  మూడేళ్లు ఓపిక పడితే వచ్చేది మన ప్రభుత్వమేనని బందరు పోర్టు బాధిత భూసేకరణ రైతులకు భరోసా ఇచ్చారు. కోర్టుల్లో కేసులు వేసి భూమిని ఆపుకుంటే.. ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమేనని, అప్పుడు ఒక్క ఎకరా కూడా అన్యాయంగా పోయే పరిస్థితి ఎవరికీ రానీయకుండా అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

పోర్టు కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన బందరు మండలంలోని పెదకరగ్రహారం, తుమ్మలచెరువు, పొట్లపాలెం గ్రామాల్లో బుధవారం పర్యటించిన ఆయన రైతులు, మహిళలతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. తొలుత పెదకరగ్రహారంలో రైతుల గోడు విన్నారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడారు.
 
కేంద్ర ప్రభుత్వమే వెనక్కిపోయింది...
‘పెదకరగ్రహారం గ్రామంలో తీసుకునే భూములకు ఎంత పరిహారం ఇస్తామన్నది చెప్పలేదు. అయినా పోర్టు వస్తే ఎంతో కొంత మంచి జరుగుతుందని చెప్పి గ్రామసభలో తీర్మానం చేసి ఆమోదం తెలిపారు. కానీ ప్రభుత్వం అంతటితో ఆగకుండా సంవత్సరానికి రెండు, మూడు పంటలు పండే భూములు, రొయ్యల చెరువుల భూములు తదితర 30 వేల ఎకరాలను తీసుకుంటానంటోంది. ఇది నిజంగా అన్యాయం.

ఇళ్లు, ఊళ్లు, భూములు, మండలం మొత్తం ఖాళీ చేసి వెళ్లిపొమ్మంటున్నారని అక్కాచెల్లెమ్మలు వాపోతున్నారు. మా కడుపు కొడతారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం భయపడొద్దు. ఎవరూ మనకిష్టం లేకుండా మన భూములు తీసుకోలేరు. ఆగస్టు 31న ఆర్టినెన్స్‌కు చివరి రోజు, దానికన్నా ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఈ  భూముల మీద అధికారం మాదే అని వారనుకోవచ్చు. కానీ అది జరగదు. కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా వచ్చిన నిరసనలు తట్టుకోలేక ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకుంది.

ఆర్డినెన్సే లేనప్పుడు చంద్రబాబుకు భూములు లాక్కునే అధికారం ఎక్కడిది? ఆయన చట్టానికంటే ఎక్కువా? అని అడుగుతున్నా. పోర్టు మాత్రమే కట్టండి. పోర్టు పేరు చెప్పి మా జీవితాలతో చెలగాటాలాడొద్దంటున్నారు. పోర్టు వరకూ మూడు వేలో, నాలుగు వేల ఎకరాలో తీసుకోండి. దానికి రైతులు వేరేచోట భూములు కొనుక్కునేందుకు ఎకరానికి రూ.30 లక్షలు ఇవ్వాలని అడుగుతున్నారు. అసైన్డ్ భూములు, ఎంజాయ్‌మెంట్ భూములకూ పరిహారం ఇవ్వాలని అడుగుతున్నారు. పోర్టుకు అంగీకారం తెలుపుతున్నాం కాబట్టి ఇష్టం వచ్చినట్లు తీసుకుంటామంటే ఒప్పుకోమని చెబుతున్నారు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
 
చట్టంలో మార్పులు తీసుకువస్తాం...
‘అసైన్డ్ భూములంటే వాళ్లత్తగారి సొత్తు అన్నట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవచ్చన్నట్లుగా తయారైంది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఎలా ఉండాలంటే,  ఎవరైనా పరిశ్రమలు పెట్టాలంటే వచ్చి అడగాలి. పరిశ్రమ పెడతానంటున్నాడు, మీ భూములు ఇస్తారా అని అడగాలి. ఎవరైనా భూములు ఇవ్వమూ అంటే దానికి ఫుల్‌స్టాప్ పెట్టాలి. కానీ ముఖ్యమంత్రి కన్ను ఊరి మీద పడితే భయమేసేలా ఈ ప్రభుత్వం తయారైంది. అసైన్డ్ భూమి లాక్కోవడం చట్టం ప్రకారం హక్కు అనుకుంటున్నారు. అది సాధ్యం కాదు. ఈ చట్టంలో మార్పులు తీసుకొస్తాం. ఒకసారి వారికిచ్చిన భూములను(అసైన్డ్) మళ్లీ ఎలా తీసుకుంటారు’ అని ప్రశ్నించారు.
 
అన్ని రకాలుగా తోడుగా ఉంటాం...
పొట్లపాలెంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ‘మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటా. ఆగస్టు 31న ఆర్డినెన్స్ వీగిపోతుందని తెలిసి, చంద్రబాబు భూములు తీసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చాడు. ఆర్డినెన్స్‌ను కేంద్రమే వెనక్కు తీసుకుంటే ఈ పెద్ద మనిషి లేని చట్టాన్ని చూపించి రైతులను భయపెడుతున్నాడు. భూములు లాక్కునే అధికారం ఈ పెద్ద మనిషికి ఎక్కడుంది అని అడుగుతున్నా.

‘లా’ అనేదే లేనప్పుడు దేన్ని చూపించి చంద్రబాబు భూములు లాక్కుంటాడు? ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అన్ని రకాలుగా తోడుగా ఉంటా. కేవలం మూడేళ్లు ఆగండి.. చూస్తాచూస్తా ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది. మరో మూడు సంవత్సరాలు భూములు పోకుండా ఆపుకొంటే చాలు. ఆ తర్వాత ఒక్క ఎకరా కూడా మీ నుంచి పోకుండా చూసుకునే బాధ్యత నాది. ఆ తర్వాత చంద్రబాబు ఉండడు.

మన ప్రభుత్వం వస్తుంది. ఈ మూడు సంవత్సరాలు ఒక్క ఎకరా పోకుండా అన్ని రకాలుగా మద్దతిస్తాం. అవసరమైతే ధర్నాలు, బంద్‌లు చేద్దాం. జిల్లాలోని వైఎస్సార్‌సీపీ నాయకులంతా అండగా ఉంటారు. మీరు ఎక్కడైనా ధర్నాలు చేయండి, అవసరమైతే దానికి నేను కూడా వస్తా’ అని రైతులకు భరోసా ఇచ్చారు.
 
గట్టిగా పోరాడతాం...
‘ఎన్నికలకు ముందు రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేసేస్తానన్నాడు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలు పూర్తిగా తీసేస్తానన్నాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి బాబు వస్తేనే జాబు వస్తుందని గోడలపై రాయించాడు. కానీ ఏ ఒక్కటీ చేయలేదు. అంతా మోసం. అలాగే బందరు పోర్టు భూసేకరణ కోసం అర్ధరాత్రి నోటిఫికేషన్ ఇచ్చాడు. దీనిపై గట్టిగా పోరాడదాం. మీరూ వద్దు. మీ నోటిఫికేషన్ వద్దని ఒత్తిడి తెద్దాం. నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేద్దాం’ అని  జగన్ అన్నారు.

జగన్‌కు తమ ఆవేదన చెప్పుకొనేందుకు ఈ మూడు గ్రామాలప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని భూసేకరణ వల్ల ప్రజలు అనుభవిస్తున్న ఇబ్బందుల్ని వివరించారు. వైఎస్ జగన్ వెంట ఎమ్మెల్యేలు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప్పులేటి కల్పన, రక్షణనిధి, నాయకులు కేపీ సారథి, జోగి రమేష్, ఉప్పాల రాము, వేదవ్యాస్, తలశిల రఘురాం, మోపిదేవి వెంకటరమణ, వంగవీటి రాధా, గౌతంరెడ్డి, ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులున్నారు.
 
ముఖ్యమంత్రి అయ్యాడు.. కరువు వచ్చింది...
తుమ్మలచెరువు గ్రామంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ‘మన ఖర్మ ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, కృష్ణా డెల్టాకు కరువొచ్చింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యి తనతోపాటు కరువునూ తీసుకొచ్చాడు. అంతటితో సంతోషపడలేదు. చివరికి రైతుల భూములను లాక్కునేందుకు ముందడుగు వేస్తున్నాడు. ఇవన్నీ ప్రభుత్వం కోసం కాదు. ప్రైవేటు వారికి, పారిశ్రామికవేత్తలకి, సింగపూర్ వాళ్లకి ఇచ్చేందుకు లాక్కోవాలని చూస్తున్నాడు.

మనకిష్టం లేకపోతే బలవంతంగా భూములు ఎవరూ లాక్కోలేరు. అన్ని విధాలుగా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొస్తాం. చంద్రబాబు భూములు బలవంతంగా తీసుకునేందుకు భయపడేలా ఒత్తిడి తీసుకొస్తాం. కోర్టులకు వెళదాం. కేసులు వేద్దాం. మన ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్కరికీ ఇటువంటి పరిస్థితి రాకుండా చూస్తానని చెబుతున్నా. ప్రభుత్వం ఏరకంగా ఉండాలనేది వీళ్లకి ట్యూషన్ చెప్పాలి. ఏదైనా భూమి కావల్సివస్తే ముందు రైతులను అడగాలి. వారు ఇస్తే భూములు తీసుకోవాలి. వారు కోరిన రేటు పారిశ్రామికవేత్తల నుంచి ఇప్పించాలి. అయినా రైతులు ఒప్పుకోకపోతే ఆ భూమిని వదిలేయాలి’ అని అన్నారు.
 
రైతుల ఆవేదన ఇదీ..
సాక్షి, విజయవాడ బ్యూరో: ‘భూముల కోసం మా ఊళ్లలోకొస్తే ఎవరినీ తిరిగి వెళ్లనీయం. ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వం. ప్రాణమైనా ఇస్తాంగానీ భూమిని మాత్రం వదులుకోం. చంద్రబాబు వస్తే పోర్టు వస్తుందనుకుని ఓట్లేశాం. తీరా వచ్చాక మాకు జీవి తమే లేకుండా చేస్తున్నడు’ అని బందరు పోర్టు భూసేకరణ బాధితులు జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బందరు తీరగ్రామాల్లో ఆయన పర్యటించారు. పెదకరగ్రహారం, తుమ్మలచెరువు, పొట్లపాలెం గ్రామాల వారు జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకునేందుకు తరలివచ్చారు. వారి కెంత భూ మి ఉంది? ఏ పంటలు సాగవుతాయి? ఎంత ఆదాయం వస్తుంది?.. వంటి విషయాలను జగన్ అడిగి తెలుసుకున్నారు.
 
ఊరునే లేకుండా చేస్తారా?
పోర్టు కోసం భూములివ్వడానికి గ్రామసభ పెట్టి ఆమోదించాం. కానీ ఊరంతా ఇచ్చేయాలంటున్నారు. అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి భూసేకరణ నోటిఫికేషన్ పేపర్లను ఇచ్చారు. వాటిని చూశాక చాలామంది మంచాన పడ్డారు. పోర్టుకు మేం వ్యతిరేకం కాదు. కానీ ఆ పేరుతో మా ఊరునే లేకుండా చేస్తారా?
- కళ్యాణి, పెదకరగ్రహారం సర్పంచ్
 
ఎలా బతకాలి? ఎక్కడికెళ్లాలి?
నాకున్న ఎకరం భూమిని ఇచ్చేయమంటున్నారు. ఇద్దరం అన్నదమ్ములం. భూమి పోతే ఇద్దరం రోడ్డున పడతాం. ఈ వయసులో మేం ఎక్కడికెళ్లాలి? ఎలా బతకాలి? ఎకరం పొలానికి 35, 40 బస్తాల ధాన్యం పండిస్తాం. అది లేకుండా చేస్తామంటున్నారు.
-టి.రాముడు,పెదకరగ్రహారం రైతు
 
ఎందుకు ఓట్లు వేశామా అనిపిస్తోంది
మా భూముల్ని దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తున్నారు. చంద్రబాబుకు ఎందుకు ఓట్లేశామా అని నెత్తీ నోరూ కొట్టుకుంటున్నాం. మీ నాయనగారు దయాబిక్ష వల్ల నా కొడుక్కి రూ.5.5 లక్షలతో ఆపరేషన్ చేయించాం. ఇప్పుడు ఏమీ ఇవ్వకపోయినా ఉన్నది లాక్కుంటున్నారు. మీరు ముఖ్యమంత్రి ఎప్పుడవుతారని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం.
- సత్యసాయిబాబు, చిన్నాపురం

రైతులకు భరోసా కల్పిస్తాం: పొంగులేటి

Written By news on Wednesday, September 16, 2015 | 9/16/2015


రైతులకు భరోసా కల్పిస్తాం: పొంగులేటి
18న కలెక్టర్లకు వినతి పత్రాలు
 సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర సమస్యల్తో కొట్టుమిట్టాడుతున్న రైతులకు అండగా నిలిచి వారికి తాము భరోసాను కల్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపరకు అడ్డుకట్ట వేసేందుకు, ఆ దిశగా తక్షణం చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తొలి విడతగా ఈ నెల 18న 9 జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తామని మంగళవారం ఆయన ‘సాక్షి’కి చెప్పారు. రైతుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, వాటిని ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావించాల్సి ఉంటుందని ప్రతిపక్షంలో ఉండగా కేసీఆర్ చాలా సందర్భాల్లో పేర్కొన్నారు.

 కానీ ఇప్పుడు ఆయన హయాంలో దేశంలోనే అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో జరుగుతున్నాయి. బంగారు తెలంగాణ వస్తుందని ఆశించిన రైతులు అన్నిరకాలుగా నష్టపోయి ఆత్మహత్యల బారినపడడం అత్యంత విచారకరం. తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడి, సరిగా కరెంటు రాక, అప్పోసప్పో చేసి వేసిన పంటలు పండక, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు ఆత్మహత్య బాటపట్టే దుస్థితి ఏర్పడింది. రైతులకు ప్రకటించిన రూ.లక్ష రుణ మాఫీని ఒక్క విడతలో కాకుండా 4 విడతలుగా చేయాలని నిర్ణయించడంతో పాత అప్పులు తీరక, కొత్త రుణాలందక రైతులు తీవ్ర సంక్షోభంలో పడ్డారు’’ అని విమర్శించారు. రైతుల స్థితిగతులను, వారి సమస్యలను దగ్గర నుంచి పరిశీలించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తాను సీఎం కాగానే అనేక రైతు సంక్షేమ చర్యలు తీసుకున్నారని పొంగులేటి గుర్తు చేశారు.

 ‘‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను సమర్థంగా అమలుచేసి, గతంలో ఆత్మహత్యల బారిన పడిన రైతుల కుటుంబాలకు రూ.లక్షన్నర పరిహారం అందించేలా జీవో 421ను తెచ్చిన ఘనత వైఎస్‌కే దక్కింది’’ అన్నారు. ప్రస్తుతం 421 జీవోను సవరించి, రూ.5 లక్షలు పరిహారమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకవసరమైన ప్రణాళికలను వెంటనే రూపొందించి అమలు చేయాలన్నారు.

గన్నవరంలో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం

విజయవాడ: మచిలీపట్నం పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం గన్నవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.  కాగా బందరులో భూసేకరణ బాధిత రైతులతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ముందుగా ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన మచిలీపట్నం మండలంలోని కరగ్రహారానికి చేరుకుంటారు.

ఫరీద్‌బాబా దర్గా సెంటర్ వద్ద రైతులతో, గ్రామస్తులతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. అక్కడి నుంచి తుమ్మలచెరువు చేరుకొని వినాయకుడి గుడి సెంటర్‌లో రైతులతో భేటీ అవుతారు. అనంతరం పొట్లపాలెం చేరుకొని పంచాయతీ కార్యాలయం సెంటర్‌లో రైతులతో సమావేశం కానున్నారు. అక్కడి నుంచి తిరుగు పయనమై గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాదుకు వెళతారు.

యువభేరి మోగింది


యువభేరి మోగింది
కలసి నడుద్దాం... హోదా సాధిద్దాం...
♦ విద్యార్థి యువభేరి సదస్సులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
♦ పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమేమిటి? ... గతంలో 11 రాష్ట్రాలకు ఇచ్చిన హోదా మనకెందుకు ఇవ్వరు?
♦ ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు?

♦ కేంద్రంలో టీడీపీ మంత్రులను ఉపసంహరించుకుంటే కేంద్రం దిగి వస్తుంది
♦ ఓటుకు కోట్లు కేసు మాఫీకోసం హోదా హక్కును పణంగా పెట్టారు
♦ హోదాకోసం వైఎస్సార్‌సీపీ నిరంతర పోరాటం
♦ 26 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష
♦ మీరూ కలసిరండి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీద్దాం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: 
ప్రత్యేకహోదా మన హక్కు... దాని సాధనకోసం కలసి ఉద్యమిద్దాం... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి హోదా సాధిద్దాం.. అని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరకపోతే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేమిటని ప్రశ్నించారు. ఐదేళ్లుకాదు పదేళ్లు ప్రత్యేకహోదా తెస్తామని, ఇస్తామని ఎన్నికలముందు చెప్పిన టీడీపీ, బీజేపీ ఇప్పుడా ఊసెత్తడంలేదని విమర్శించారు.

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేసులను మాఫీ చేసుకునేందుకు ప్రత్యేకహోదా హక్కును కేంద్రానికి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేకహోదా సాధించుకుందామన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థులు మంగళవారం స్థానిక పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ‘రాష్ట్రానికి ప్రత్యేకహోదా- ఉద్యోగ అవకాశాలు- రాష్ట్రాభివృద్ధ అనే అంశంపై  విద్యార్థి యువభేరి సదస్సు నిర్వహించారు.

విద్యార్థులు, ప్రొఫెసర్లు, మేధావులు, విద్యావేత్తలు పెద్దసంఖ్యలో హాజరైన ఈ సదస్సుకు వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగాలు చేసిన వారికి మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
 
ప్రత్యేకహోదా ఎందుకిచ్చారంటే...
అన్ని పార్టీలూ కలసి ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టాయి. అప్పుడు వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీలుగా ఉన్న నన్ను, మేకపాటి రాజమోహన్‌రెడ్డిని సస్పెండ్ చేసి లోక్‌సభనుంచి గెంటేశారు. లోక్‌సభ తలుపులు మూసివేసి, టీవీ చానళ్ల ప్రసారాలు ఆపివేసి, అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారు. విభజనవల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో 95 శాతం హైదరాబాద్‌లోనే ఉంది.

బీటెక్, బీసీఏ, ఎంసీఏ చేసిన విద్యార్థులందరూ ఉద్యోగాలకోసం చూసేది హైదరాబాద్ నగరంవైపే. ఉమ్మడి రాష్ట్రంలోని 70 శాతం పరిశ్రమలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. 70 శాతం ఉద్యోగాలు కూడా అక్కడే ఉన్నాయి. విభజనవల్ల హైదరాబాద్‌లాంటి గొప్ప నగరాన్ని ఏపీ కోల్పోతుంది. అందుకే ఆ నష్టాన్ని వీలైనంత భర్తీ చేసేందుకు రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించారు.

ఐదేళ్లు సరిపోదు, పదేళ్లు కావాలని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, టీడీపీ డిమాండ్ చేశాయి. తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని, తెస్తామని బీజేపీ, టీడీపీ నేతలు ఎన్నికల ముందు ఊరూరా ఉపన్యాసాలిచ్చారు. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో ఆ రెండు పార్టీలే అధికారంలో ఉన్నాయి. కానీ ప్రత్యేకహోదా గురించి మాత్రం నోరెత్తడంలేదు.
 
కేసులకు భయపడి హోదా తాకట్టు
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదాకోసం కేంద్రాన్ని నిలదీయాల్సి ఉంది. కానీ ఆయన ఎందుకు నోరుమెదపడంలేదు? ఓ 15 రోజులో, నెలరోజులో గడువిచ్చి, ఆలోపు ప్రత్యేకహోదా ఇవ్వకపోతే కేంద్రంలో ఉన్న తమ మంత్రులను ఉపసంహరించుకుంటామని కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? నాతోపాటు రాష్ట్ర ప్రజలందరికీ ఉన్న సందేహమిది. అయినా చంద్రబాబు నోరు మెదపరు.

ఎందుకంటే... పట్టిసీమనుంచి పోలవరం వరకూ కమీషన్లు తీసుకుని, జీవో-22తో కొందరు కాంట్రాక్టర్లకు మేలుచేసి, కొందరికే మద్యం డిస్టిలరీ లెసైన్సులిచ్చి, ఇసుకనుంచి మట్టిదాకా పర్సెంటేజీలు తీసుకుని, బొగ్గు దగ్గరనుంచి పలు స్కాములు చేసి... ఏపీలో అక్రమంగా సంపాదించిన డబ్బుతో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు ఐదునుంచి రూ.20 కోట్ల లంచమిస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోవడం మనమందరం చూశాం.

ఆ కేసునుంచి బయటపడేందుకు చంద్రబాబు బీజేపీ మీద ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు. ప్రత్యేకహోదాకోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఓట్లుకు కోట్లు కేసులో తనను జైలుకు పంపుతారేమోనని చంద్రబాబు భయం. అందుకే తన స్వార్థం కోసం, కేసులనుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ఐదుకోట్ల ప్రజలను, ప్రత్యేకహోదాను కేంద్రం కాళ్ల దగ్గర తాకట్టుపెడుతున్నారు. గతంలో ఇదే చంద్రబాబు సోనియాగాంధీతో కలసి నా మీద కేసులు పెట్టారు. కానీ నేను భయపడలేదు. చంద్రబాబు నాయుడులా రెండుకళ్ల సిద్ధాంతం చెప్పలేదు. పోరాటం చేశా. రాష్ట్రాన్ని విభజించవద్దని గట్టిగా నిలదీశా.
 
ప్రత్యేకహోదా గురించి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సభ్యులు అపహాస్యం చేస్తూ, వక్రభాష్యం చెబుతూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రత్యేకహోదాకన్నా ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చెబుతున్నారు. తన వాదన సమర్థించుకునేందుకు.. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ అక్కాచెల్లెమ్మలను కించపరిచేలా మాట్లాడారు. ఆడపిల్లలకు తోడుంటానని చెప్పాల్సిన సీఎం మాట్లాడిన తీరిది. తనను తాను కాపాడుకోవడం కోసం ప్రత్యేకహోదాను తాకట్టు పెడుతున్న బాబును మీరంతా ప్రశ్నించండి.

అయ్యా చంద్రబాబూ... ప్రత్యేక ప్యాకేజీ పేరుతో మీరు చెప్తున్నవన్నీ, విభజన చట్టంలో హక్కుగా ఇచ్చిన హామీలు కాదా? అని నిలదీయండి. పోలవరం, మెట్రోరైలు, ఐఐఎం, ఐఐటీలన్నీ విభజన చట్టంలో హక్కుగా ఇస్తే... వాటిని కొత్తగా ప్యాక్ చేసి తానేదో సాధించానని మభ్యపెట్టాలని చూస్తున్న బాబును గట్టిగా ప్రశ్నించండి.

సాకులు చెబుతున్న ప్రభుత్వాలు...

ప్రత్యేకహోదాకు తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర ఒప్పుకోవడంలేదంటారు. అయ్యా... రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఈ రాష్ట్రాలు లేవా? ఈ రాష్ట్రాలు ఒప్పుకోవని అప్పుడు మీకు తెలీదా? ప్రత్యేకహోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడంలేదని అబద్ధాలు చెబుతున్నారు. కేంద్రం వసూలు చేసిన పన్నుల మొత్తాన్ని రాష్ట్రాలకు ఎలా పంచాలి, నాన్‌ప్లాన్ గ్రాంట్లు, లోన్లు ఎలా పంచాలన్నదే ఆర్థిక సంఘం పని.

ప్రత్యేకహోదాతో దానికి ఎలాంటి సంబంధం లేదు. హోదా ఇవ్వాలా లేదా అన్న నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధానమంత్రి. ఎందుకంటే కేంద్ర మంత్రిమండలి, నీతి ఆయోగ్, ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి... అన్నింటికీ సారథ్యం వహించేది ప్రధానమంత్రి. ఆదొక ఎగ్జిక్యూటివ్ నిర్ణయం మాత్రమే. కేబినెట్ ఇవ్వాలనుకుంటే ప్రత్యేకహోదా ఇచ్చేయవచ్చు. గతంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చారు.

వాటన్నింటికీ కేబినెట్‌లో నిర్ణయం తీసుకుని అమలు చేశారే తప్ప ఎక్కడా ఒక యాక్ట్ ద్వారా వచ్చింది కానేకాదు. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఉత్తరాఖండ్‌ను విభజించి, ప్రత్యేక హోదా ఇచ్చాక జాతీయ అభివృద్ధి సంఘానికి అనుమతి కోసం పంపారు. అవన్నీ తెలిసినా చంద్రబాబు కావాలని ప్రజలను మభ్యపెడుతున్నారు.
 
ప్రత్యేక హోదా వస్తే లక్షల్లో ఉద్యోగాలు...
ప్రత్యేకహోదావస్తే ప్రధానంగా రెండు లాభాలున్నాయి. రాష్ట్రానికి కేంద్రంనుంచి వచ్చే నిధులు 90 శాతం నిధులు గ్రాంటుగా, 10 శాతం రుణాలుగా వస్తాయి. అంటే గ్రాంటును తిరిగి చెల్లించాల్సిన అవసరంలేదు. ప్రత్యేకహోదా లేని రాష్ట్రాలకు 70 శాతం నిధులు రుణాలుగా, 30 శాతం మాత్రమే గ్రాంట్లుగా వస్తాయి. అంటే రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతుంది. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే భారీగా పారిశ్రామిక రాయితీలు వస్తాయి.

100 శాతం ఎక్సైజ్ పన్ను, ఆదాయపు పన్ను  మినహాయింపు ఉంటుంది. అలాంటి సదుపాయాలున్నప్పుడు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తారు, పరిశ్రమలు స్థాపిస్తారు, లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ వెళ్లి చూస్తే ప్రత్యేకహోదావల్ల జరిగిన మేలేమిటో తెలుస్తుంది. ఉత్తరాఖండ్‌లో రెండువేల పరిశ్రమలు వచ్చాయి. రూ.30 వేలకోట్ల పెట్టుబడులతో 130 శాతం అధికంగా పరిశ్రమలు రావడంవల్ల ఉపాధి అవకాశాలు 490 శాతం పెరిగాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పదివేల పరిశ్రమలు వచ్చాయి.

ఇవన్నీ చంద్రబాబుకు తెలిసినా ప్రత్యేకహోదా కోసం పట్టుపట్టకుండా పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఎన్నికలకు ముందు రాష్ర్టంలో ఏ టీవీ పెట్టినా.. జాబు రావాలంటే బాబు రావాలంటూ వినిపించేది. జాబు ఇవ్వకపోతే నెలకు రూ.రెండువేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. రాష్ట్రంలో 1.75 కోట్ల ఇళ్లున్నాయి. ఏ ఒక్కరికైనా జాబు వచ్చిందా? నిరుద్యోగ భృతి వచ్చిందా? ఆయన ఉద్యోగాలివ్వరు. ప్రత్యేకహోదా వల్ల పరిశ్రమలు వస్తాయని తెలిసినా పట్టించుకోడు. రాష్ట్రాభివృద్ధితో, బిడ్డల భవిష్యత్తుతో ఆడుకుంటున్న చంద్రబాబు మనిషేనా?
 
హోదావస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్...
972 కిలోమీటర్ల సముద్ర తీరమున్న రాష్ట్రం మనది. ప్రత్యేకహోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. ఉద్యోగంకోసం మనం వెదుకులాడే పరిస్థితి నుంచి మనకు కావాల్సిన కంపెనీలో ఉద్యోగం చేసే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రానికి, విద్యార్థులకు కలిగే లాభమేమిటో ప్రతి విద్యార్థికీ తెలియాలి. తెలిసినవారు మరో నలుగురికి చెప్పాలి. మనహక్కుకోసం మనం కలసి పోరాడదాం.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు మంగళగిరిలో దీక్ష చేశాం. ఢిల్లీలో దీక్ష చేశాం. బంద్‌కు పిలుపునిచ్చాం. 26నుంచి గుంటూరులో నిరవధిక దీక్ష చేస్తున్నా. వీటన్నింటితోపాటు మీ సహకారం కావాలి. అందరం కలసి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వంనుంచి తన మంత్రులను ఉపసంహరించుకుంటానని ఏ రోజైతే చంద్రబాబు చెప్తాడో ఆ రోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగివస్తుంది, ప్రత్యేకహోదా ఇస్తుంది. ఈ పోరాటంలో మనమంతా కలసికట్టుగా కృషిచేస్తే విజయం సాధిస్తాం. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధిస్తాం.
 
కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు షేక్ సలాంబాబు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వి.హరిప్రసాద్‌రెడ్డి, ఎస్వీయూ విశ్రాంత అధ్యాపక సంఘం అధ్యక్షుడు ఎం.సూర్యనారాయణరెడ్డి, తెలుగు అకాడమీ మాజీ అధ్యక్షుడు జె.ప్రతాప్‌రెడ్డి, ఎస్వీయూ అధ్యాపక సంఘం మాజీ అధ్యక్షుడు కె.రాజారెడ్డి, కార్యదర్శి ఎం.రెడ్డిభాస్కర్‌రెడ్డి, పీలేరు డిగ్రీ కళాశాల లెక్చరర్ చంద్రయ్య, రాష్ట్ర ఆడిటింగ్ రిటైర్డ్ అధికారి మునిరాజ మాట్లాడారు.

ఈ కార్యక్రమానికి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి,  పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌కే రోజా, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యేలు  దేశాయ్‌తిప్పారెడ్డి, నారాయణస్వామి, డాక్టర్ సునీల్, కొరముట్ల శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు.
 
విద్యార్థులదే నాయకత్వం
ప్రత్యేక హోదా సాధన కోసం విద్యార్థి లోకం కదం తొక్కింది. తిరుపతిలో యువభేరి సదస్సును విజయవంతంగా నిర్వహించింది. సదస్సుకు పలువురు రాజకీయనాయకులు హాజరైనా ఆద్యంతం విద్యార్థులకే ప్రాధాన్యం ఇచ్చారు. వేదికపై కూడా విద్యార్థి నాయకులే ఎక్కువగా కనిపించారు. రాజకీయ నాయకులకు దిశా నిర్దేశం కలిగించేలా విద్యార్థుల ప్రసంగాలు నడిచాయి. విద్యార్థి ప్రతినిధులు లేఖశ్రీ, బి.తేజేశ్‌రెడ్డి ప్రసంగాలు ఆలోచన రేకెత్తిం చాయి.

జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగానికి విశేష స్పందన లభించింది. విద్యార్థుల కేరింతలు, చప్పట్లు, జై జగన్ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. ప్రభుత్వం ఆంక్షలు విధించి ఎస్వీయూలో అనుమతి నిరాకరించినా సదస్సుకు వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చి ప్రత్యేకహోదా అవసరాన్ని ఎలుగెత్తి చాటారు. హోదాకోసం ఉద్యమిస్తామంటూ, హోదా సాధిస్తామంటూ నినదించారు. రాష్ట్రాభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు హోదా అత్యంత అవసరమని స్పష్టం చేశారు.
 
హోదాకోసం విద్యార్థులు ఉద్యమించాలి
మనమంతా యువకులం. ఈ తరానికి చెందినవాళ్లం. పార్లమెంటులో ఏదైనా హామీ ఇస్తే అది నెరవేరుతుందని విశ్వసిస్తాం. పార్లమెంటును చూసి నేర్చుకోవాలనుకుంటాం. కానీ రాష్ర్ట విభజన జరిగిన సమయంలో పార్లమెంటు జరిగిన తంతు చూసి... ఇదా ప్రజాస్వామ్యమని భారతీయులుగా సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది.

కానీ పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీకి దిక్కూ దివాణం లేకపోతే మనమంతా ఎక్కడికి వెళ్లాలి? ఎవర్ని విశ్వసించాలి? కేంద్ర మంత్రుల్లో కొందరు ప్రత్యేకహోదా ఇస్తామంటారు, కొందరు రాదంటారు. చంద్రబాబు అది సంజీవని కాదంటారు. స్పీకర్ ఇది జిందా తిలిస్మాత్ కాదంటారు. అసలు ప్రత్యేకహోదా ఇస్తారో ఇవ్వరో స్పష్టంగా చెప్పకుండా ప్రజల్ని గందరగోళ పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో చదువులు పూర్తిచేసి ఉద్యోగాలకోసం ఎదురుచూసే విద్యార్థులు ప్రత్యేకహోదా వల్ల వచ్చే ఉద్యోగావకాశాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

అందుకే యూనివర్సిటీల్లో ప్రత్యేక హోదాపై చర్చ జరగాలి. విద్యార్థులు అవగాహన పెంచుకుని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పెద్దలకు బుద్ధి వచ్చేలా, గడ్డిపెట్టేలా ఉద్యమించాలి. కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై విద్యార్థులకు అవగాహన కలగకూడదంటుంది. యూనివర్సిటీలో హోదాపై చర్చ జరగకూడదంటుంది. జగన్ వస్తున్నాడని తెలిసి వర్సిటీలో ఎలాంటి మీటింగులు జరగకూడదని హుకుం జారీ చేశారు సర్కారు పెద్దలు. అయ్యా చంద్రబాబూ...

తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరిగింది ఈ యూనివర్సిటీలో కాదా? ప్రధాని నరేంద్రమోదీతో మీరు సమావేశం పెట్టించింది ఈ వర్సిటీలో కాదా? యూనివర్సిటీలో రాజకీయ సమావేశాలు జరగకూడదని ఆరోజు గుర్తుకురాలేదా? ఈ సమావేశ వేదికపైన ఉన్నది యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మేధావులు. వచ్చింది విద్యార్థులు. ఇక రాజకీయం ఎక్కడుంది చంద్రబాబూ? మీ నిరంకుశ పోకడలను ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే గట్టిగా బుద్ధి చెప్తారు.

Popular Posts

Topics :