03 March 2013 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

షర్మిల పాదయాత్రకు రేపు విరామం

Written By news on Saturday, March 9, 2013 | 3/09/2013

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు ఆదివారం ఒక రోజు విరామం ప్రకటించారు. శివరాత్రి నేపథ్యంలో గుంటూరు జిల్లాలో అత్యంత ప్రాచుర్యం పొందిన కోటప్పకొండ తిరునాళ్లు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఆ ప్రాంత పరిసరాల్లో భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తారు. 

దీంతో ప్రజలు, పార్టీ కార్యకర్తల కోరిక మేరకు, జిల్లా పోలీసు యంత్రాంగం సూచనల మేరకు పాదయాత్రను ఒకరోజు నిలిపి వేస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, గుంటూరు జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ ప్రకటించారు. శనివారం రాత్రి పాదయాత్ర ముగిశాక చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గణపవరం గ్రామశివార్లలో షర్మిల బస చేస్తారు. ఆదివారం రోజంతా ఆమె అక్కడే ఉంటారని, సోమవారం 11వ తేదీ ఉదయం మళ్లీ అక్కడి నుంచే పాదయాత్రను ప్రారంభిస్తారని వారు వివరించారు.

Twitter Babu slip of tongue creates laughter

YSRCP Leader Mareppa Press Meet 9th March 2013

YS Sharmila's speech in Ganapavaram, Guntur

‘న్యాయం’ చేతులెత్తేస్తే దేవుడే తీర్పు చెబుతాడు


ఈ రోజు జగన్ విషయంలో జరుగుతున్న అన్యాయానికి ఈ సంస్కృత శ్లోకం సరిగ్గా సరిపోతుంది.
సస్యానిస్వయమత్తిచే ద్వసుమతీ మాతాసుతం హన్తిచేత్
వేలామంబు నిధిర్విలంఘుయతిచేత్, భూమిందహేత్పావకః
ఆకాశం జనమస్తకే పతతి చేత్, అన్నం విషయం చేద్భవేత్‌
అన్యాయం కురుతే యదాక్షితి పతిః కస్తం నిరోర్ధుంక్షమః॥
పంటనిచ్చే భూమే ధాన్యాన్ని తింటే, జన్మనిచ్చిన తల్లే బిడ్డను చంపితే, సముద్రం గట్టులను దాటితే, అగ్ని భూమిని కాల్చేస్తే, ఆకాశమే జనాల తలమీద పడితే, అన్నమే విషంగా మారితే, రాజ్యాధిపతులు, న్యాయాధికారులు న్యాయాన్ని వదిలేసి, అన్యాయ మార్గంలో ప్రవర్తిస్తే అడ్డుకోగలవారెవరు?

పై ప్రవర్తనలను అడ్డుకోగలవాడు దేవుడు ఒక్కడే! అన్యాయంగా ప్రవర్తించే రాజ్యాధికారులు, న్యాయాధికారులకు దేవుడే సరియైన శిక్ష వేస్తాడు.

ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని, సోనియా కేంద్ర నేర పరిశోధన శాఖ సహకారంతో జగన్‌ను జైలులో పెట్టించి, బెయిల్ కూడా రాకుండా చేస్తున్న విషయం దేశంలో తెలియనివారుండరు. దేవుడంతా చూస్తున్నాడు. జగన్‌కు అన్యాయం తలపెట్టి బాధించే వ్యక్తులను నామరూపాలు లేకుండా చేస్తాడు. ఈ రోజు జగన్ తల్లి, భార్యాపిల్లలు, బంధువులు, అభిమానులు అనుభవించే బాధను సోనియా, జేడీ కుటుంబాలు కూడా తప్పక అనుభవిస్తాయి.

- వి.రఘుపతి, విశ్రాంత సంస్కృత పండిట్, నెల్లూరు

తొమ్మిదేళ్లు ఏమీ చేయని బాబు ఇప్పుడొచ్చి ఏదో చేస్తానంటున్నారు!

తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు రైతులకు, వృద్ధులకు, అనారోగ్యాలతో బాధపడేవారికి ఏం న్యాయం చేశారని?! పదవిలో ఉండి ఏమీ చేయలేని చంద్రబాబు ఇప్పుడొచ్చి నేను అధికారంలోకి వస్తే, అన్నీ చేస్తాను అని చెబుతుంటే ప్రజలు నమ్ముతారా? అప్పట్లో వైఎస్సార్‌గారు ఉచిత కరెంటు అంటే, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకుంటారు అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తీగల్లో కరెంటు ఉండదనీ, బట్టలు ఆరేసుకోటానికి మాత్రమే కరెంటు తీగలు ఉపయోగపడతాయి అని విమర్శించిన అదే బాబుగారు ఇప్పుడు ఉచిత కరెంటు అంటున్నారు.

బట్టలు ఆరేసుకోటానికి వీలుగా ఇస్తారా? ప్రజలు గ్రహించాలి. మాటిచ్చి మడమ తిప్పని వీరుడు వైఎస్సార్‌గారు. అటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీని ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి తీసుకొచ్చారో నాయకులు కూడా గమనించాలి. ఆపద్బాంధవుడు చనిపోయాడన్న బెంగతో అనేకమంది మరణిస్తే వారి కుటుంబాలను ఓదార్చడం తప్పేం కాదు కదా. ఓ కుటుంబంలో ఎవరైనా చనిపోతే, తెలిసినవాళ్లు, బంధువులు వెళ్లి ఓదారుస్తారు కానీ, వీళ్లే వాళ్ల ఇళ్లకు వెళ్లి ఓదార్పు పొందరు కదా.

ఈ సంప్రదాయాలేవీ తెలియని సోనియా... బాధితుల్ని మీ దగ్గరకు రప్పించుకుని ఓదార్చండని చెప్పడం ఏ దేశపు రీతి, ఆనవాయితీ?! జగన్‌కు పెరుగుతున్న ప్రజాబలం చూసి ఓర్వలేక ఆయన మీద సీబీఐని ఉసిగొల్పి, తను ముందు నడుస్తూ సీబీఐని వెనక నడిపిస్తూ ఇష్టారాజ్యంగా జగన్‌ను, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు సోనియా. ఆమె ప్రభుత్వం జగనన్న పట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రజలందరూ శ్రద్ధగా గమనిస్తూ ఉన్నారు. వారంతా ‘జగనన్న త్వరగా బయటకు రావాలి’ అని దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. తొందర్లోనే మా ప్రార్థనలకు ప్రతిఫలం లభిస్తుందని, ఆ రోజు దగ్గర్లోనే ఉందని విశ్వసిస్తున్నాం.

- గుమ్మాపు శ్రీనివాసరావు, ఉసులుమర్రు, ప.గో.జిల్లా

ఇక మహిళా దినోత్సవం దేనికి గుర్తుగా జరుపుకోవాలి?

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై షర్మిల ధ్వజం
అతివల పట్ల నేరాల్లో రాష్ట్రానిదే ప్రథమ స్థానం
ఇక మహిళా దినోత్సవం దేనికి గుర్తుగా జరుపుకోవాలి?
తనను కలిసేందుకు వచ్చిన మహిళలను సీఎం కిరణ్ కనీసం పట్టించుకోలేదు
కనీసం మరుగుదొడ్లు కూడా కట్టించలేని ఈయనకు ఇంగిత జ్ఞానముందా?
చంద్రబాబు అధికారపక్షంతో కుమ్మక్కై అవిశ్వాసం పెట్టకుండా విధేయత చాటుకుంటున్నారు
మహిళా సాధికారత వైఎస్సార్ కల..ప్రతి పథకంలో మహిళకే హక్కు కల్పించారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 85, కిలోమీటర్లు: 1,177.5

 ‘‘ప్రపంచ మహిళా దినోత్సవం.. మహిళగా పుట్టినందుకు గర్వంగా జరుపుకొనే పండుగ. కానీ రాష్ట్ర మహిళలకు ఆ పండుగ జరుపుకొనే గర్వకారణం ఏముంది? రాష్ట్రంలో అతివలు మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోలేకపోతున్నారు. ఏ గ్రామానికెళ్లినా మరుగుదొడ్లు లేవని మహిళలు వేదనాభరితంగా చెప్తున్నారు. వారికి కనీసం మరుగుదొడ్లు కూడా కట్టించలేని ఈ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డికి ఇంగిత జ్ఞానం ఉందా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘‘మహిళల ఆర్థిక సాధికారత కోసం వైఎస్ ప్రవేశ పెట్టిన పావలా వడ్డీ రుణాలు ఇప్పుడు సరిగా అందడంలేదు. దేశంలో మహిళల పట్ల నేరాల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. లైంగిక దాడులు, హత్యాయత్నాలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. 

ఆడపడుచులకు కనీస భద్రత కల్పించలేని ఈ సర్కారు వారికేం మేలు చేయగలదు? కాంగ్రెస్ పాలనలో మహిళల గతి ఇలా ఉంటే ఇక మహిళా దినోత్సవం దేనికి గుర్తుగా జరుపుకోవాలి?’’ అని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికీ, అలాంటి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టని టీడీపీ వైఖరికీనిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు షర్మిలతో తమ వెతలు చెప్పుకున్నారు. అన్నింటినీ ఓపికగా ఆమె ఆలకించారు. మహిళల పట్ల ప్రభుత్వ పెద్దలకు కనీస గౌరవంగానీ, సానుభూతి గానీ లేవని విమర్శించారు. క్యాంపు ఆఫీసులో తనను కలిసేందుకు వచ్చిన మహిళలను కనీసం పట్టించుకోకుండా సీఎం కిరణ్ వెళ్లిపోయిన సంఘటనలు చూస్తుంటే మహిళల సమస్యల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అవగతమవుతోందన్నారు.

ఆడపడుచుల అన్న రాజన్న..: ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళలను అక్కా చెల్లెళ్లలా చూసుకున్నారు. మహిళలకు సాధికారత కల్పించడం ద్వారా వారంతా తలెత్తుకుని తిరిగేలా చేసేందుకు పరితపించారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలకు రూ.1 వడ్డీకి రుణాలిస్తే దాన్ని వైఎస్ పావలాకు తగ్గించారు. మహిళలందరికీ బ్యాంకు అకౌంట్లు తెరిపించి ఏపథకం చేపట్టినా అది ఇంటిలో మహిళల పేరిటే ఉండేలా చేశారు’’ అని షర్మిల గుర్తుచేశారు. కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాత్రం మహిళల పట్ల క్రూరంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు సీఎంగా ఉండగా రంగారెడ్డి జిల్లాలో ఓ యువతిపై యాసిడ్ దాడి జరిగితే ఆమెకు కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదు. దీనిపై హైకోర్టు అక్షింతలు వేసినా ఆమెకు సహాయం చేయకుండా తన క్రూరత్వాన్ని చాటుకున్నారు. అంతటి దుర్మార్గుడు ఇప్పుడు మహిళలకు ఇది చేస్తా, అది చేస్తా అంటూ యాత్రలు చేస్తున్నారు. 1999 ఎన్నికలకు ముందు మహిళలకు మంగళసూత్రాలు, విద్యార్థినులకు సైకిళ్లు ఇస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోలేదు. కరువు వస్తే ఆదుకోమన్నందుకు గుర్రాలతో తొక్కించిన దుర్మార్గుడు చంద్రబాబు’’ అని షర్మిల నిప్పులు చెరిగారు.

దాహమంటున్నా.. గుక్కెడు నీళ్లివ్వలేరా?: రాష్ట్రంలో పల్లెలన్నీ దాహార్తితో అల్లాడుతుంటే వారికి మంచినీరు కూడా కల్పించకుండా ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందంటూ షర్మిల మండిపడ్డారు. తాగడానికి నీరు లేకుండా ప్రజలెలా బతుకుతారనే ఆందోళన కూడా ప్రభుత్వానికి కలగకపోవడం దురదృష్టకరమన్నారు. లీటరు రూ.10 పెట్టి మంచినీరు కొనుక్కునే దుస్థితిలోకి పేదలను ప్రభుత్వం నెట్టివేసిందని ఆరోపించారు. ‘‘పేదలు రోజూ కూలికి వెళితే వారికొచ్చేది రోజుకు రూ.100. ఆదివారం కూడా పనిచేస్తే నెలకు రూ.3 వేలొస్తుంది. దాంతో నీరు కొంటారా? కరెంటు బిల్లులు చెల్లిస్తారా. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువులు కొంటారా? స్కూలు ఫీజులు కడతారా? ఈ మాత్రం అవగాహన అయినా ముఖ్యమంత్రికి లేకుండాపోయింది’’ అని షర్మిల దుయ్యబట్టారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ సరఫరా పరిస్థితి దారుణంగా మారింది. గ్రామాల్లో రోజుకు ఒక్క గంట కూడా విద్యుత్ సరఫరా లేదు. మరోవైపు బిల్లు చూస్తే రూ.500 వరకూ వస్తోంది. ఇంత కన్నా దారుణం మరేమైనా ఉందా?’’ అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. కరెంటు లేక విద్యార్థులు చదువుకునేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

అయినా బాబు అవిశ్వాసం పెట్టరు: ‘‘తమను పుట్టెడు కష్టాల్లోకినెట్టిన ఈ ప్రభుత్వం తమ కొద్దని రాష్ట్ర ప్రజలందరూ ముక్తకంఠంతో ఘోషిస్తుంటే.. దీనిపై నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు.. ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారు. అవిశ్వాసం పెట్టకుండా కాంగ్రెస్ పార్టీకి, సీఎం కిరణ్‌కు అపర విధేయుడిగా మారారు’’ అని షర్మిల విమర్శించారు. త్వరలోనే జగనన్న బయటకొస్తాడని, రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకొస్తాడని భరోసా ఇచ్చారు.

85వ రోజు శుక్రవారం గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం టి.చందవరం శివారులో ప్రారంభమైన షర్మిల పాదయాత్ర తూబాడు, నాందెడ్ల గ్రామాల మీదుగా సాగింది. నాదెండ్ల మండల కేంద్రం శివారులో ఏర్పాటు చేసిన బసకు షర్మిల రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం మొత్తం షర్మిల 12.5 కిలోమీటర్లు నడిచారు. యాత్రలో పాల్గొన్న నేతల్లో మర్రి రాజశేఖర్, ఆర్కే, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, స్థానిక నాయకులు వెంకట లక్ష్మీరాజ్యం, దేవళ్ల రేవతి, బండారు సాయిబాబు మాదిగ తదితరులు ఉన్నారు.

కాళ్లు లేవని ఉద్యోగమివ్వలేదు

పాదయాత్రలో సాగుతున్న షర్మిలను తూబాడు గ్రామంలో వాసిమళ్ల జ్యోతి అనే వికలాంగురాలు కలిసి తన గోడు చెప్పుకొంటూ కన్నీళ్లు పెట్టుకుంది. చక్రాల కుర్చీలో వచ్చిన ఆమెను ఆప్యాయంగా పలకరించిన షర్మిల.. ఆమె కష్టాలు విని చలించిపోయారు. ‘‘మూడేళ్ల క్రితం డిగ్రీ పూర్తిచేశానమ్మా.. గుంటూరులో యువకిరణాలకు దరఖాస్తు చేస్తే కాళ్లు లేవని ఉద్యోగమివ్వలేమన్నారు. బైక్ నడిపితేనే జాబ్ ఇస్తామని చెప్పారు. అమ్మలేదు, నాన్న మంచాన పడ్డాడు. పింఛన్ డబ్బులతోనే బతుకుతున్నాం. జీవనం చాలా కష్టంగా ఉంది’’ అని జ్యోతి కన్నీళ్లు పెట్టుకోవడంతో షర్మిల ఉద్వేగానికి లోనయ్యారు.

బాబూ..ప్రజలకైనా సమాధానమివ్వు!

ఈ ప్రభుత్వంపై ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని జనం అడుగుతున్నారు
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయకుండా అసెంబ్లీకి రానంటారా?
జనం కష్టాలు పట్టని టీడీపీ ఒక పార్టీయేనా
అవిశ్వాసం పెట్టరట.. బ్రదర్ అనిల్‌పై చర్చిస్తారట

 రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు విచిత్ర ధోరణి చూసి రాష్ట్ర ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయకుండా బడ్జెట్ సమావేశాలకు దూరంగా చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని అడుగుతున్న ప్రజలకైనా సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు బడ్జెట్ సమావేశాలకు రారట. ఆ పార్టీ అసెంబ్లీలో ప్రజాసమస్యలను ప్రస్తావించదట! కానీ బ్రదర్ అనిల్‌కుమార్ మీద చర్చలేపుతారట. 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటూ తొమ్మిదేళ్లు పాలన చేసిన నాయకుడు చేసే చేష్టలు ఇవేనా? టీడీపీ ఒక రాజకీయపార్టీయేనా?’’ అని దుయ్యబట్టారు. ‘‘రాష్ట్రంలో తాగడానికి గుక్కెడు నీళ్లులేక ప్రజలు అల్లాడుతున్నారు. రైతులు కిడ్నీలు అమ్ముకుంటున్నారు. కరెంటు కోతల కారణంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షల సందర్భంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటికీ కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీయరట...’’ అని ఎద్దేవా చేశారు.

ఎవరు చెబితే అవిశ్వాసం పెడతారు...?

ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తున్నా మిన్నకుండిపోయిన చంద్రబాబుకు తన పాదయాత్రలో ప్రజలు అడుగుతున్నా స్పందించడం లేదని అంబటి అన్నారు. ‘గుంటూరు జిల్లా మంగళగిరిలో బాబు పాదయాత్ర చేస్తున్నప్పుడు తోటి పాదచారుడు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని బాబును నిలదీశారు. ముదినేపల్లిలో రాత్రి 11 గంటలకు ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నప్పుడు కొందరు విద్యార్థులు అవిశ్వాసం పెట్టరేం? అని ప్రశ్నించినా ఆయన స్పందించరు. మరి ఎవరు చెబితే అవిశ్వాసం పెడతారు? పార్టీలు అడిగితే ఎలాగూ స్పందించడం లేదు, కనీసం ప్రజల ప్రశ్నలకైనా జవాబివ్వు’’ అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేదాకా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేట్లు లేరన్నారు. ఈ మధ్యకాలంలో అవిశ్వాసంపై టీడీపీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారన్నారు. ‘‘జగన్ బెయిల్ తెచ్చుకునేందుకే అవిశ్వాసం కోసం వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తుందని చంద్రబాబు అంటున్నారు. అంటే రాజకీయ దురుద్దేశాల వల్లే అక్రమ కేసులతో జగన్ ను నిర్బంధించినట్లు పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా?’’ అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే తక్షణం అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభకు రానంటున్న చంద్రబాబును ఇక పూర్తిగా అసెంబ్లీకి రాకుండా చేసేందుకు ప్రజలు సంసిద్ధమయ్యారని పేర్కొన్నారు. 

రహస్యం కాదు బహిరంగమే..

‘‘కాంగ్రెస్‌కు తాను రహస్య స్నేహితుడినని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు ఆయనను కాంగ్రెస్‌కు బహిరంగ మిత్రుడు అని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌కు నష్టం జరిగే ఎలాంటి ప్రయత్నం చంద్రబాబు చేయరు’’ అని అంబటి పేర్కొన్నారు. గతంలో అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్‌కు నష్టం జరిగినందుకే మరోసారి అలా జరగకూడదనే ఆలోచనతో బాబు ఉన్నట్లున్నారన్నారు. రాజ్యసభలో ఎఫ్‌డీఐ బిల్లు సందర్భంగా కాంగ్రెస్ పరువు కాపాడేందుకు చంద్రబాబు తన పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను గైర్హాజరు పరిచిన విషయాన్ని గుర్తుచేశారు. అవసరమైనప్పుడల్లా ఢిల్లీ వెళ్లి చీకట్లో చిదంబరాన్ని కలవడం, కర్ణాటకలో భరద్వాజతో సమావేశమవుతూ చీకటి ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారని మండిపడ్డారు.

ఇచ్చిన మాటకోసం పుట్టిందే వైఎస్సార్ సీపీ

పేదలను ఆదుకుంటాం
పార్టీ సీజీసీ సభ్యురాలు కొండా సురేఖ

హన్మకొండ: రాజన్న ప్రవేశపెట్టిన సంక్షే మ పథకాలను అమలు చేయడం, ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం ఆవిర్భవించిన పార్టీయే వైఎ స్సార్ సీపీ అని మాజీ మంత్రి, పార్టీ సీజీసీ సభ్యురాలు కొండా సురేఖ అన్నారు. వరంగల్‌లోని అన్నపూర్ణేశ్వరి గార్డెన్‌లో పార్టీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జిల్లా కన్వీనర్ చెరుకుపల్లి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ముఖ్య అతి థిగా కొండా సురేఖ హాజరై మాట్లాడారు. పార్టీ పటిష్టత కోసం సభ్యత్వ నమోదు, అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన తీరును నాయకులు, కార్యకర్తలకు వివరించారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సుస్థిర పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం కావాలని ఆమె సూచించారు. పార్టీ పటిష్టత కోసం ప్రతిఒక్కరూ తీవ్రంగా కృషి చేయాలన్నారు. సభ్యత్వ నమోదులో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అందరూ కష్టపడితే రాబోయే కాలం వైఎస్సార్ సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పటిష్టత కోసం మండలాలు, నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిశీలకులను నియమిస్తున్నట్లు ఆమె తెలిపారు. 

పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బొజ్జపెల్లి 

అనంతరం కొండా దంపతుల ఆహ్వానం మేరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొజ్జపెల్లి రాజయ్య వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు. ఆయనతోపాటు వివిధ పార్టీలకు చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు సురేఖ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ టీడీపీలో అణచివేత ధోరణి అధికంగా ఉందన్నారు. అది నచ్చకనే వైఎస్సార్ సీపీలో చేరినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ టి.రమేష్‌బాబు, కేకే.మహేందర్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రాము, మదన్‌లాల్, బండి పుల్లయ్య, భీంరెడ్డి సుధీర్‌రెడ్డి, నూనావత్ రాధ తదితరులతోపాటు వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు. 

వైఎస్సార్ సీపీలో చేరిన ఎమ్మెల్సీ బొడ్డు


తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ నేత, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు శుక్రవారమిక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రామారావుతో పాటు ఆయన కుమారుడు వెంకటరమణ, మండపేట నియోజకవర్గ నేత పాలచర్ల శ్రీనివాస్‌లతో పాటు జిల్లాకు చెందిన నాయకులు పెద్దసంఖ్యలో హైదరాబాద్ తరలివచ్చి పార్టీలో చేరారు. వారికి వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరి వెంట వైఎస్సార్ సీపీ నేతలు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, కె.చిట్టబ్బాయి, ఆదిరెడ్డి అప్పారావు తదితరులున్నారు. అనంతరం బొడ్డు భాస్కర రామారావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీచమైన రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. సీబీఐని ఉపయోగించుకొని కుట్రపూరిత ఆరోపణలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అన్యాయంగా జైలుపాలు చేశారన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు, ఈ సమయంలో ఆ కుటుంబానికి అండగా ఉండాలని భావించి వైఎస్సార్ సీపీలో చేరినట్లు తెలిపారు. ఇక నుంచి పార్టీ పటిష్టత కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.

వైఎస్సార్ మహిళా పక్షపాతి

ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారు
గ్యాస్ పెంపు నుంచి ఊరట కల్పించారు
ఆయన అడుగుజాడల్లోనే జగన్ నడుస్తారు.. ‘అమ్మ ఒడి’ లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తారు
చంద్రబాబు ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండూ దొందూ దొందే
మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు

సాక్షి, హైదరాబాద్: సమాజంలో మహిళలకు సమాన హక్కులు అమలుకావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై లైంగిక దాడులు, భ్రూణ హత్యలు నేటికీ జరుగుతున్నాయన్నారు. ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన మాత్రమే వెలుగులోకి వచ్చిందని, దేశంలో ప్రతి 21 నిమిషాలకు ఒక లైంగిక దాడి, 51 నిమిషాలకు ఒక వరకట్న చావు చోటుచేసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి చాలవన్నట్లు రాష్ట్రంలో మహిళల పట్ల పాలకులే అవమానకరంగా మాట్లాడటం బాధాకరమని వ్యాఖ్యానించారు. అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చిందని మహిళలు రాత్రి వేళల్లో తిరుగుతారా? అని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. పాలకులే ఇలా మాట్లాడితే మహిళలకు రక్షణ ఎక్కడి దని ప్రశ్నించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి విజయమ్మ పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత పలు రంగాల్లో రాణించిన మహిళలను ఘనంగా సన్మానించారు. అనంతరం హాజరైన వారిని ఉద్దేశించి విజయమ్మ ప్రసంగించారు.

మహిళల అభివృద్ధికి కృషి చేసింది వైఎస్సార్..

మహిళాభివృద్ధి కోసం దివంగత రాజశేఖరరెడ్డి ఎంతగానో కృషి చేశారని విజయమ్మ గుర్తు చేశారు. ‘‘గ్రామాల్లో మహిళల సాధికారత కోసం ఐక్యరాజ్యసమితి 2012లో నిర్ణయం తీసుకుంటే రాజశేఖరరెడ్డి మాత్రం ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సంబంధిత కార్యక్రమాలు అమలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్లను మహిళల పేరునే ఎక్కువగా ఇచ్చారు. భూమిలేని వారికి ఇచ్చే పట్టాలు కూడా ఆడవారికే ఇచ్చారు. భూమి సాగుకోసం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించారు. పావలా వడ్డీకే రుణాలు అందించి మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేశారు. టీడీపీ హయాంలో మహిళా సంఘాలకు ప్రభుత్వ రుణాలు రూ.14 వందల కోట్లే ఇచ్చారు. అయితే వైఎస్ అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలను 8 లక్షలకు పెంచి కోటి మంది సభ్యులను చేర్చారు. వారికి పావలా వడ్డీకే రూ.24 వేల కోట్లు అందించారు. అప్పట్లో రాష్ట్రానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ మహిళా సంఘాల అమలు తీరు చూసి రాజశేఖరరెడ్డిని అభినందించారట. అయితే ప్రస్తుతం సంఘాల పరిస్థితి తలకిందులైంది. పాలకులు వడ్డీలేని రుణాలని చెబుతున్నారేకానీ రుణాలు ఇచ్చిన దాఖలాలే లేవు’ అని వ్యాఖ్యానించారు.

అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించింది చంద్రబాబే..

చంద్రబాబు హయాంలో మహిళలు పలు అవమానాలు ఎదుర్కొన్నారని విజయమ్మ తెలిపారు. అంగన్‌వాడీలు వారి సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేపడితే మహిళలని కూడా చూడకుండా చంద్రబాబు పోలీసులను ఉపయోగించి గుర్రాల చేత తొక్కించారని గుర్తుచేశారు. అయితే రాజ శేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక వారి జీతభత్యాలు రెట్టింపుచేశారని వివరించారు. బాలికలు పదోతరగతి వరకు కచ్చితంగా చదవాలనే ఆలోచనతో కస్తూర్భా పాఠశాలను ఏర్పరిచి, దాదాపు 300 సంక్షేమ హాస్టళ్లు నిర్మించారని తెలిపారు. గ్యాస్ సిలిండర్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల చేత కంటనీరు పెట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖరరెడ్డి హయాంలో సిలిండర్ల ధరను కేంద్రం పెంచినా ఆ భారం తన అక్కా చెల్లెళ్లపై పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. 

‘అమ్మ ఒడి’లా జగన్ పాలన: రాజశేఖరరెడ్డి వారసుడిగా ఆయన హామీలన్నింటినీ జగన్‌బాబు నెరవేరుస్తారని విజయమ్మ హామీ ఇచ్చారు. జగన్‌బాబు పాలన అచ్చం అమ్మ ఒడిలా ఉంటుందన్నారు. ‘అమ్మ ఒడి’ పథకం కింద.. పిల్లలను బడికి పంపినందుకు తల్లి బ్యాంకు ఖాతాలో రూ.500 జమ చేస్తారని చెప్పారు. ఒక్కరుంటే రూ.500, ఇద్దరుంటే రూ. వెయ్యి జమచేస్తారని తెలిపారు. ఇవేకాకుండా మహిళలకు వడ్డీలేని రుణాలతో పాటు అన్నింటినీ అందిస్తారని, ప్రతి ఒక్కరూ జగన్‌బాబు నాయకత్వంలో ముందకెళ్లాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విజయమ్మతో పాటు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, పార్టీ నేతలు ఆర్‌కే రోజా, ధర్మాన పద్మప్రియ, విజయారెడ్డి పాల్గొని ప్రసంగించారు.

మహిళలకు విజయమ్మ సన్మానం

మహిళా దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలను విజయమ్మ సన్మానించారు. అంధురాలైనప్పటికీ రాష్ట్ర హైకోర్టులో ఏజీపీగా విశేష సేవలందిస్తున్న చంద్ర సుప్రియకిరణ్, కుటుంబ భారాన్ని తన భుజస్కంధాలపై మోస్తూ హైదరాబాద్‌లో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న జరిజల రేఖ, నిస్వార్థంతో రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ సేవకు మాత్రమే పరిమితమైన ప్రముఖ గైనకాలజిస్ట్ రాజ్యలక్ష్మి, రైతుకూలీగా పనిచేసి కాలక్రమంలో పది ఎకరాల ఆసామిగా ఎదిగిన మెదక్ జిల్లా న్యాల్‌కల్ మండలానికి చెందిన నడిమిదొడ్డి అంజమ్మ, యాసిడ్‌దాడికి గురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా ఉంటున్న హైదరాబాద్‌కు చెందిన అనూరాధలు ఈ సన్మానం అందుకున్నారు. ఈ సందర్భంగా సుప్రియ మాట్లాడుతూ.. ‘అంధురాలినైన నన్ను దేశంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్‌ను చేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిగారిదే. అంధురాలినైన నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. అంతేకాదు నాలాంటి అంధులకు ప్రభుత్వ విభాగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించారు. అంధుడైన నా భర్తకు సచివాలయంలో కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం నా భర్తను ఉద్యోగం నుంచి తొలగించింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తే అసెంబ్లీలో తమ హక్కుల కోసం పోరాడే అవకాశం ఉంటుందన్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టిషాక్


గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టిషాక్ తగిలింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ చైర్మన్, ప్రస్తుత బోర్డు సభ్యుడు జంపన ప్రతాప్ శుక్రవారం చంచల్‌గూడ జైలులోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకుని వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరే అంశాన్ని చర్చించారు. ప్రస్తుతం ప్రతాప్ కంటోన్మెంట్ 3వ వార్డు సభ్యుడిగా, ఆయన భార్య విద్యావతి 1వ వార్డు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. జంపనకు కంటోన్మెంట్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో బలమైన అనుచరవర్గం ఉండటంతో పాటు, కంటోన్మెంట్‌లో ఆయన ఆయా పార్టీలను గెలుపోటములను శాసించే స్థాయిలో బలమైన నాయకుడిగా ముద్రపడ్డారు. ప్రతాప్ త్వరలో ముఖ్య అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించారు.

జగన్‌ను కలిసిన డాక్టర్ మధుశేఖర్ 

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన డాక్టర్ మధుశేఖర్ శుక్రవారం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో ములాఖత్‌లో కలుసుకున్నారు. ‘చేయూత’ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఆయన.. తొలుత టీడీపీలో పని చేశారు. తర్వాత సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ తరఫున ఆర్మూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్(డాట్స్) కో కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల్లో అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 

‘వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండుసార్లు అవిశ్వాసం ఎందుకు పెట్టినట్టు?

కేసుల భయంతోనే అవిశ్వాసానికి చంద్రబాబు వెనకడుగు
వదలకుండా వెంటాడుతున్న ఐఎంజీ, ఎమ్మార్ వంటి కేసులు
అందుకే కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్.. 
ఆ మేరకే టీడీఎల్పీలో హైడ్రామా..కుంటిసాకులు
ఒకవేళ వేరే పార్టీ ఏదైనా అవిశ్వాసం పెడితే గైర్హాజరు!
ఎలాగైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటమే ఎజెండా
బాబు వైఖరిపై తెలుగుదేశం నేతల్లోనే చర్చలు
వైఎస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకనే సందేహం
అవిశ్వాసంలో ఒకవేళ వైఎస్సార్‌సీపీ సర్కారుకు మద్దతు పలికితే ఆ పార్టీని ఎండగట్టడానికి టీడీపీకి చాన్స్ దొరికేదనేఅభిప్రాయం

అవిశ్వాసం అనివార్యమైతే బాబు రెండు ప్రయోజనాలు ఆశిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఒకటి.. సర్కారు పడిపోకుండా చూడటం.. 

రెండోది.. ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన నిలిచి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తే వారిని అనర్హతకు గురిచేయడం

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేకుండా కాపాడతామన్న భరోసా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నుంచి లభించింది. తమకు తాముగా అవిశ్వాస తీర్మానం పెట్టబోమని తేల్చిచెప్పడమే కాకుండా ఒకవేళ వేరే పార్టీ ఏదైనా అవిశ్వాసం ప్రతిపాదించినా వ్యూహాత్మకంగా వ్యవహరించి సర్కారును కాపాడుతామన్న హామీ కాంగ్రెస్‌కు లభించింది. ఈ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదని మీకోసం యాత్రలో పదేపదే చెప్పిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచమయ్యారు. గురువారం జరిగిన తెలుగుదేశం శాసనసభా పక్షం (టీడీఎల్పీ) సమావేశంలో ప్రభుత్వంపై అవిశ్వాసం విషయమై హైడ్రామా నడిపించిన చంద్రబాబు అంతకుముందే కాంగ్రెస్‌కు స్పష్టమైన సంకేతాలు పంపించారని తెలుస్తోంది. తాజా పరిణామాలతో చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్‌కు సరెండర్ అయ్యారన్న అంశంపై టీడీపీలో తీవ్రస్థాయి చర్చ సాగుతోంది. అవిశ్వాసంపై టీడీఎల్పీ సమావేశంలో ఆయన చెప్పినవన్నీ కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నారన్న అపనింద రాకుండా ఉండేందుకు వెతుక్కున్న కుంటి సాకులు మాత్రమేనని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంగీకరిస్తున్నారు. టీడీఎల్పీ సమావేశానికి 48 మంది ఎమ్మెల్యేలు హాజరుకాగా 30 మందికిపైగా గైర్హాజరయ్యారు. వీరంతా సమావేశంలో ఏం జరిగిందన్న విషయాన్ని ఆరా తీయడంతో పాటు అధ్యక్షుడి వ్యవహార శైలిపై ఇతర నేతలతో చర్చల్లో మునిగిపోయారు. గత మూడేళ్లుగా అనేక విషయాల్లో కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్న చంద్రబాబు త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై తన కోటరీలోని సన్నిహితులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా టీడీఎల్పీలో హైడ్రామా నడిపించారని వారు నిర్ధారణకు వచ్చారు. 

ఈ నెల 13 నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానమే కీలకంగా మారుతుందని భావిస్తున్న సమయంలో చంద్రబాబు ఒక్కసారిగా వ్యూహం మార్చి వెనకడుగు వేయడం టీడీపీ ఎమ్మెల్యేలు కొందరికి మింగుడు పడటం లేదు. ఐఎంజీ, ఎమ్మార్ లాంటి కేసులు వెంటాడుతున్న కారణంగానే గత కొన్నేళ్లుగా చంద్రబాబు పూర్తిగా కాంగ్రెస్ కనుసన్నల్లో పనిచేస్తున్నారన్న అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత సమయంలో కాంగ్రెసేతర రాజకీయ పార్టీలన్నీ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వం మెడలు వంచాలని డిమాండ్ చేస్తున్నాయి. శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలన్నా, దానిపై ఓటింగ్ జరగాలన్నా కనీసం 30 మంది శాసనసభ్యుల బలం అవసరం. శాసనసభలో ఇప్పుడున్న పార్టీల్లో ఒక్క టీడీపీకి మాత్రమే ఆ బలముంది. అలాంటప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టి మిగతా పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని నిలదీయకుండా, అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వాన్ని అవకాశం చిక్కితే పడగొట్టకుండా చంద్రబాబు వెనకడుగు వేయడంలోని ఆంతర్యమేమిటో పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు. 

వేరే పార్టీ అవిశ్వాసం పెడితే మద్దతిస్తామని చెప్పడమంటే రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి కష్టాలు లేవని టీడీపీ భావిస్తున్నట్టా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ‘ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాసం పెట్టకపోవడానికి ప్రత్యేక కారణం అంటూ ఉండాలి. అలాంటివేమీ లేవు. ఇతర పార్టీలు లాభపడతాయని కాంగ్రెస్‌కు అండగా నిలుస్తామా? టీడీపీ చరిత్రలో ఇంతటి దరిద్రమైన పరిస్థితి ఇంతకు ముందెప్పుడూ లేదు. అవిశ్వాసం పెట్టడం వల్ల నిజంగానే వైఎస్సార్ కాంగ్రెస్ లాంటి పార్టీ ప్రయోజనం పొందుతుందని అనుకుంటే ఆ తర్వాత ఆ పార్టీని ఎండగట్టడానికి అవకాశం ఉంది కదా? అలా చేయనప్పుడు కచ్చితంగా కాంగ్రెస్‌కు సాగిలపడిపోవడంగానే భావిస్తారు..’ అని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే విశ్లేషించారు. ‘పార్టీకి 46 మంది ఎమ్మెల్యేలున్నప్పుడు కూడా స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టాం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టలేమని తెలిసీ చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టారు.

నిజానికి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఇప్పుడు తగిన వాతావరణం ఉంది. ఒకవైపు ఎంఐఎం తన మద్దతును ఉపసంహరించుకుంది. ప్రభుత్వం మైనారిటీలో పడింది. మరోవైపు టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం, వైఎస్సార్‌సీపీ వంటి పార్టీలన్నీ అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందివచ్చిన అవకాశాన్ని చంద్రబాబు ఉపయోగించుకోక పోవడమే కాకుండా కాంగ్రెస్‌కు అండగా నిలబడటమంటే కచ్చితంగా తెరవెనుక బలమైన కారణాలే ఉండొచ్చు..’ అని టీడీఎల్పీ సమావేశానికి హాజరుకాని సీనియర్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ‘బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం విఫలమైందని వెళ్లిన ప్రతిచోటా చెబుతున్నాం. చంద్రబాబు దానికోసం గట్టిగా పోరాటం చేసిండంటున్నం. అలాంటప్పుడు సర్కారును పడగొట్టడానికి ఏమాత్రం సంకోచించవద్దు. కానీ మా నాయకుడి ఆలోచనేంటో అర్థం కావడం లేదు..’ అని తెలంగాణ ఎమ్మెల్యే ఒకరు అన్నారు. 

వెంటాడుతున్న కేసులే కారణం: గడిచిన కొన్నేళ్లుగా కాంగ్రెస్‌కు ఎన్నో రకాలుగా చంద్రబాబు సహకరిస్తుండటం వెనుక బలమైన కారణాలున్నాయని ప్రైవేటు సంభాషణల్లో పార్టీ నేతలే చెబుతున్నారు. ముఖ్యంగా ఐఎంజీ, ఎమ్మార్ కేసుల విషయంలో చంద్రబాబులో ఇప్పటికీ ఆందోళన ఉందని, ఆ కారణంగానే వాటి నుంచి బయటపడటానికి ఆయన కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉంటున్నారన్న వాదన పార్టీలో బలంగా ఉంది. ఈ కారణంగానే ఆయన కాంగ్రెస్‌లోని ఢిల్లీ నేతలనూ నేరుగా సంప్రదిస్తున్నారని అంటున్నారు.

‘ ఆయన కాంగ్రెస్ అగ్రనేతలతో సంప్రదింపులు జరపకపోతే రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై ఓటింగ్ జరిగినప్పుడు మా పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు గైర్హాజరయ్యేవారే కాదు..’ అని ఒక నాయకుడు అన్నారు. ‘టీడీపీ ఎఫ్‌డీఐలకు వ్యతిరేకమని ప్రకటించి తీరా ఆ అంశంపై ఓటింగ్ జరిగితే వ్యతిరేకంగా ఓటు వేయకుండా సభ నుంచి బయటకు వచ్చి మాపార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతునిచ్చారంటే కచ్చితంగా చంద్రబాబు ఆదేశాల మేరకే అలా జరిగింది. లేదంటే వారెవ్వరూ గీత దాటే వారే కాదు. బాబు ఆదేశాల మేరకు నడుచుకున్నారు కాబట్టే వారిపై పార్టీ ఎలాంటి చర్య తీసుకోలేదన్న విషయం గుర్తుంచుకోవాలి..’ అని మాజీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. 

వైఎస్సార్ సీపీని ఎండగట్టడానికి అవకాశం చిక్కేది: ఒకవైపు కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ దాన్ని మరో పార్టీకి అంటగట్టడం రాజకీయంగా తప్పుడు వ్యూహమని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. అవిశ్వాసం పెడితే వైఎస్సార్ సీపీ దాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటుందని టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు చెప్పడాన్ని ఒక ఎమ్మెల్యే తప్పుబట్టారు. టీడీపీ అవిశ్వాసం పెట్టినప్పుడు ఒకవేళ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా నిలిచినపక్షంలో ఆ పార్టీని ఎండగట్టడానికి అవకాశం ఉండేదని, ఇంతకాలం మనం చేస్తున్న విమర్శలకు బలం చేకూరేదని ఆయన అన్నారు. 

కాంగ్రెస్‌ను కాపాడటమే లక్ష్యం: ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటమే చంద్రబాబు ఏకైక లక్ష్యంగా కనబడుతోందన్న అభిప్రాయాన్ని పలువురు సొంత పార్టీ నేతలతో పాటు కాంగ్రెసేతర పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ టీడీపీ అవిశ్వాసం పెట్టినా, లేదా వైఎస్సార్‌సీపీలాంటి మరో పార్టీ ప్రతిపాదించినా చంద్రబాబు వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఆ మేరకు చంద్రబాబు ఇప్పటికే ఒక వ్యూహం రచించారని తెలుస్తోంది. ‘మరోపార్టీ ఏదైనా అవిశ్వాస తీర్మానం నోటీసిస్తే అది చర్చకు వచ్చేలా సభలో టీడీపీ మద్దతు ప్రకటిస్తుంది. తద్వారా అవిశ్వాసానికి మద్దతునిచ్చినట్టుగా పైకి కనబడుతుంది. ఆ తర్వాత చర్చ పూర్తయి ఓటింగ్‌కు వచ్చేసరికి తనదైన శైలిలో ముందే రచించిన వ్యూహాన్ని అమలు చేస్తుంది..’ అని అంటున్నారు. 

ఓటింగ్ కనుక జరిగితే కాంగ్రెస్‌కు కావలసిన మెజారిటీ చూపించుకునే స్థాయిలో సభ నుంచి గైర్హాజరు కావడమే టీడీపీ వ్యూహంగా తెలుస్తోంది. ఏ రాజకీయ పార్టీ ప్రతిపాదించినా సరే అవిశ్వాసంపై మద్దతునిచ్చినట్టు పైకి కనిపించి లోపల మాత్రం సభ్యులను సభకు రాకుండా చేసి కాంగ్రెస్‌కు అండగా నిలుస్తారని చెబుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పటికే సంకేతాలు పంపారని కూడా విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఆ రకంగా చేయడం ద్వారా చంద్రబాబు రెండు ప్రయోజనాలను ఆశిస్తున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఒకటి కాంగ్రెస్ సర్కారు కూలిపోకుండా చూడటం కాగా.. రెండోది అవిశ్వాసంపై చర్చ జరిగి ఓటింగ్ సందర్భంలో ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన నిలిచి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తే వారిని అనర్హులను చేసే వ్యూహం..’ గా పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 

అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడేమిటి?: ఎన్టీఆర్ హయాం లోనూ ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వంపైనా కాంగ్రెస్ ఏనాడూ అవిశ్వాసం పెట్టలేదని, అలాంటప్పుడు కాంగ్రెస్‌పైన మనమెందుకు పెట్టాలని టీడీఎల్పీ భేటీలో బాబు చెప్పడం పట్ల నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

‘వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండుసార్లు అవిశ్వాసం ఎందుకు పెట్టినట్టు? అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చింది? పైగా అప్పుడు ఇంతటి స్థాయిలో కరెంటు కోతలు లేవు... రైతులకు ఇంతటి దుర్భరమైన పరిస్థితులు లేవు... ఇప్పుడు అన్ని రంగాల్లో పరిస్థితులు దయనీయంగా మారాయి. సామాన్యులను పట్టించుకునే పరిస్థితే లేదు. నిజానికి అవిశ్వాసం పెట్టడానికి ఇంతకన్నా ఇంకా ఏం కావాలి? అవిశ్వాసం పెట్టి ఒకవేళ ప్రభుత్వం పడిపోతే వచ్చే ఎన్నికల్లో ఎలాగూ గెలవలేమన్న కారణమైనా అయిఉండాలి... లేదా కేసుల భయమైనా కావొచ్చు... అందుకే మా నాయకుడు వెనకడుగు వేసినట్టు ఉన్నారు..’ అంటూ తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యే ఆఫ్ ది రికార్డుగా విశ్లేషించారు. ‘రాజకీయ పార్టీగా అందులోనూ ప్రధాన ప్రతిపక్షంగా పార్టీకి ఒక వ్యూహం ఉండాలి. అలా కాకుండా మరో పార్టీ బలపడుతుందనో, లేదా కేసులు మోపుతారనో భయపడి కాంగ్రెస్‌కు సరెండర్ కావడం వ్యక్తిగతంగా చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చవచ్చు కానీ మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీకి ఏమాత్రం ప్రయోజనకరం కాదు..’ అని మాజీ మంత్రి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే గెలుపు

రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఒంటరిగానే పోటీచేసి 200పైగా అసెంబ్లీ, 30పైగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండ లం వంగరలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీలోకి వచ్చినప్పటికీ వారిపై స్పీకర్ అన్హరత వేటు వేయడం లేదన్నారు. ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయం ఆయా పార్టీలకు ఉందన్నారు. పార్టీలకతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుచేతుల్లో ఉండడం బాధాకరమన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాల్సిన ప్రతిపక్ష టీడీపీ అధికార పార్టీతో కలిసిపోవడం దారుణమన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమవుతోందని చెప్పారు. ముందుస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, ఇందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధం గా ఉందన్నారు. కేంద్రంలో ఏ పార్టీకీ మెజారిటీ రాదని, అప్పుడు వైఎస్సార్‌సీపీ ఎంపీ లే కీలకం అవుతారన్నారు.బీజేపీతోసైతం తెలంగాణ వచ్చే అవకాశం లేదని చెప్పారు

షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...

మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర శనివారం చిలకలూరిపేట నియోజకవర్గంలో సాగనుందని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. బసచేసిన ప్రాంతం నుంచి శనివారం ఉదయం బయలు దేరి జేష్టవారిపాలెం మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం గణపవరంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి బసకు చేరుకుంటారు.

పర్యటించే ప్రాంతాలు:
చిలకలూరిపేట నియోజకవర్గం: జేష్టవారిపాలెం, గణపవరం

Avineethi, Bandhu Preeti, Mathapitchi, Kulapichi Una Party .....

Written By news on Friday, March 8, 2013 | 3/08/2013

'రాజకీయాల్లో లోకేష్‌ పిల్లకాకి'

రాజకీయాల్లో నారా లోకేష్‌ పిల్లకాకి లాంటివాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు అన్నారు. వస్తున్నా మీ కోసం అంటూ తల్లికాకికి పిల్లకాకి తోడైందని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ రెండుసార్లు ప్రజల చేత తిరస్కరించబడిందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని రుద్రరాజు అన్నారు.

కాంగ్రెస్‌ను కంటికి రెప్పలా కాపాడుతుంది చంద్రబాబేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. టీడీపీ అవిశ్వాసం తీర్మానం పెడితే టీఆర్ఎస్ మద్దతిస్తుందని హరీష్‌రావు తెలిపారు. 

Ambati rambabu fire on congress and tdp

YS Sharmila fire on congress and tdp

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మరోప్రస్థానం పాదయాత్ర 85వరోజు నాదెండ్లలో ముగిసింది. ఇప్పటివరకు ఆమె 1177.4 కిలోమీటర్లు నడిచారు.

మహానేత వైఎస్‌ఆర్‌ మహిళల్ని సొంత అక్కాచెల్లెళ్లలాగ చూసుకున్నారని గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా నాదెండ్ల ఎస్సీ కాలనీలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల అన్నారు. మహిళలంటే చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలకు గౌరవం లేదని షర్మిల ఆరోపించారు. మహిళా దినోత్సవం రోజున మహిళలు గర్వించే పరిస్థితి ప్రస్తుతం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు సరియైన మరుగుదొడ్లు లేవని, పావలావడ్డీ రెండు రూపాయలు అయిందని షర్మిల అన్నారు. 

మహిళలు తాళిబొట్లు తాకట్టుపెట్టుకుని రుణాలు తీర్చుకునే పరిస్థితి ప్రస్తుత పాలనలో తలెత్తిందని షర్మిల అన్నారు. జగనన్న విడుదల కోసం హైదరాబాద్‌కు నడిసివస్తామన్న ఎస్సీ కాలనీ మహిళలు అన్నారు. జగనన్నను త్వరగా బయటకు తీసుకురావాలని షర్మిలకు ఎస్సీ కాలనీ మహిళల విజ్ఞప్తి చేశారు. 


YS Vijayamma participate International Women's day celebrations

Special edition on Saadhikaaratalo Rajanna

Sharmila unveiled YSR statue in Tubaadu at Guntur

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని వైఎస్ షర్మిల అన్నారు. మహిళ గర్వంగా తలెత్తుకునే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదని ఆమె వ్యాఖ్యానించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె శుక్రవారం తుబాడ ఎస్సీ కాలనీలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ మహిళలకు మరుగుదొడ్లు కట్టిస్తామని... కాంగ్రెస్ పెద్దలే ఆ డబ్బులు దోచుకుంటున్నారని మండిపడ్డారు.

మహిళల విషయంలో చంద్రబాబు అదే వైఖరి అనుసరించేవారన్నారు. రంగారెడ్డి జిల్లాలో యాసిడ్ దాడికి గురైన యువతి విషయంలో అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబుకు కోర్టు అక్షింతలు కూడా వేసిందన్నారు. అయినా బాబు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. పాదయాత్రలో భాగంగా షర్మిల తుబాడులో మహానేత వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు

మహిళా దినోత్సవ వేడుకల్లో విజయమ్మ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ మహిళా సాధికారిత కోసం వైఎస్ఆర్ పరితపించారన్నారు. ప్రతి మహిళా లక్షాధికారి కావాలని వైఎస్ కలలు కన్నారని ఆమె గుర్తు చేశారు. 

మహిళల కోసం వైఎస్‌ఆర్ వడ్డీలేని రుణ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఆయన మరణం తర్వాత ఆ పథకాలన్ని అటకెక్కాయన్నారు. వైఎస్ వారసుడిగా ఆయన పథకాలను జగన్ అమలు చేస్తారని, జగన్ నాయకత్వంలో అందరం ముందుకు సాగుతామని విజయమ్మ పిలుపునిచ్చారు. 

గతంలో చంద్రబాబు, ప్రస్తుత కిరణ్ సర్కార్ దొందూ దొందేనని విజయమ్మ వ్యాఖ్యానించారు. అంగన్ వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదని ఆమె అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను విజయమ్మ సన్మానించారు

జగన్‌ను కలిసిన జంపన ప్రతాప్‌

 కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంచల్ గూడ జైల్లో కలిశారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ మర్యాదపూర్వకంగా జగన్ ను కలిసినట్లు జంపన ప్రతాప్ తెలిపారు

చందవరం నుంచి షర్మిల పాదయాత్ర

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అధికార-ప్రతిపక్షాల కుమ్మక్కు రాజకీయాలను నిరసిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం నేటికి 85వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం ఆమె చందవరం నుంచి యాత్రను ప్రారంభించారు. షర్మిల పాదయాత్ర తుబాడు నుంచి నాదెండ్ల మీదుగా సాగుతుంది.

ప్రజాభిమానాన్ని ఎవరూ నిర్బంధించలేదు

‘ధర్మో రక్షతి రక్షితః’ అన్నది భారతీయుల నమ్మకం! ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. జగన్ కోసం దాదాపు రెండు కోట్లమందికి పైగా ప్రజలు - ఆయన అరెస్టును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన - సంతకాల సేకరణను ధర్మ పరిరక్షణగా భావించి సంతకాలు చేశారు. ఈ సంతకాల ఉద్యమానికి రాష్ట్రపతి ఎంతగా స్పందించి రాజ్యాంగ పరిరక్షణ చేస్తారో చూడాలి. పాలకులు ధర్మబద్ధులై పరిపాలిస్తేనే అది ‘సుపరిపాలన’ అనిపించుకుంటుంది. రాముని రాజ్యం ధర్మపాలనలో సాగింది కనుకనే యుగాలు మారినా ‘రామరాజ్యాన్ని’ గొప్పగా కీర్తిస్తున్నారు ప్రజలు. 

కానీ ప్రస్తుత పాలకులు పూర్తి అధర్మంగా పాలిస్తున్నారు. సీబీఐ అంటే పాలకుల కొంగున ముడివడిన బంధమేనన్నది జగత్ విదితమే! నిజంగా జగన్ కేసు చూస్తుంటే గాంధీ నెహ్రూల వారసత్వంలో నడిచిన ‘ప్రజాస్వామ్యమేనా’ ఇది అనిపిస్తోంది. ప్రభుత్వంలో ఏ అధికారంలోనూ లేని జగన్‌పై ఒక అక్రమమైన కేసు బనాయించాయి అధికార పార్టీ, దానికి అనుబంధమైన ప్రతిపక్ష పార్టీ. ఇందులో ధర్మాధర్మాలు లేవు. న్యాయాన్యాయాలు లేవు. కేవలం కుట్రలు, కుతంత్రాలు, వంచన. 

ఇందుకోసమేనా భారతీయ నాగరిక సమాజం ప్రజాస్వామ్యాన్ని ఎంచుకుంది? ప్రజలంటే పాలకులకు, ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి అంత చులకనా? పోనీ కోర్టు ఆదేశాలతో పనిచేస్తున్నామని చెప్పుకునే సీబీఐ, కాంగ్రెస్, టీడీపీ పిటిషన్లకి అసలు ఆధారాలేమన్నా ఉంటే సమర్పించమని ఎవరైనా అడిగారా? అసలు ధర్మపీఠాలు కూడా తగిన రీతిలో స్పందించటం లేదెందుకు? అందుకే కావచ్చు, ప్రజలే ఈ ధర్మరక్షణ ఉద్యమానికి సంతకాలతో ఊపిరి పోస్తున్నారు. ఈ ఉద్యమం నిజానికి ఇంతటితో ఆగేది కాదు. జగన్ విడుదలై బయటకొచ్చేవరకు సాగుతుంది. అధర్మ పాలకుల కళ్లు తెరిపించేవరకూ సాగుతుంది. రాబర్ట్ వాద్రాపై (సోనియా అల్లుడు) ఆరోపణలొచ్చినప్పుడు సీబీఐ దర్యాప్తు లేదు. 

అఖిలేష్ యాదవ్ భార్యపై కేసొస్తే ఆమె ప్రైవేట్ వ్యక్తి అని సీబీఐ కేసు వేయలేదు. కానీ జగన్ విషయానికొస్తే మాత్రం ఆయన్ని అరెస్టు చేస్తుంది. బెయిల్ రానీకుండా చేస్తుంది. ఇదంతా చూస్తుంటే ఢిల్లీ పాలకుల ధర్మనీతి ఏమిటో, దానిని అంతర్లీనంగా అమలు చేసే సీబీఐ వక్రబుద్ధి ఏమిటో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతూనే ఉంది. ఇదే ‘ధర్మనీతి’ వైఎస్సార్ అనుసరించి ఉంటే, ఈపాటికి చంద్రబాబు తెచ్చుకున్న స్టేలన్నీ తొలగిపోయి జైల్లో ఉండేవాడు. కానీ రాజన్న అలా చేయలేదు. ‘రామరాజ్యం’ నీతినే అనుసరించాడు. అందుకే రాజన్నను యుగాలు, తరాలు మారినా ప్రజల నుండి వేరు చేయలేరు. ఆయన తనయుడిపై కురుస్తున్న ప్రజాభిమానాన్ని ఎవరూ నిర్బంధించలేరు.

- కె.పద్మావతి, ఏసీ ఇంజినీరింగ్ కాలేజ్, అంకుషాపూర్

కృతజ్ఞత తెలుపుకోవాలని ఆరాటపడుతున్నాం

కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో మా ఇంటి వారందరు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకుని వారికి మద్దతుగా నిలిచారు. ఆ తరువాత ఆయనకు జరిగిన అవమానం (చంద్రబాబు గారి కుట్ర, వెన్నుపోటు) మా మనసులను కలచివేయడంతో 2004లో వైయస్సార్‌గారికి మద్దతు దారులుగా నిలిచాం. తర్వాత వైయస్సార్ ప్రభుత్వ హయాంలో, మన రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఏదో ఒక విధంగా లబ్ధి పొందిన విధంగానే మా కుటుంబమూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందింది. నిజానికి మన రాష్ట్రంలోని ధనిక, మధ్య తరగతి, పేద, అట్టడుగు వర్గం వారందరూ వై.ఎస్.గారి వల్ల ప్రయోజనం పొందినవారే. దీనికి సర్వేలు, లెక్కలు వేయించనక్కరలేదు. 

స్వాతంత్య్రానంతరం మన దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత ఎత్తున ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు లేరు. అందుకే వైఎస్సార్ విగ్రహాలు వాడవాడలా నిర్మించుకుని నివాళులు అర్పించుకుంటున్నారు. ఆయన కుమారుడు జగన్‌కి మద్దతుగా నిలిచి కృతజ్ఞత తెలుపుకోవాలని ఎదురు చూస్తున్నారు. మరోవైపు, విశ్వసనీయత లేని ప్రతిపక్ష నాయకుడు కొంగ జపం చేస్తూ హామీలు గుప్పిస్తూ, ఏ చిన్న సందర్భం దొరికినా వైయస్సార్ కుటుంబంపైన బురద చల్లుతూ, గొప్పలు చెప్పుకుంటూ ఈసారి అధికారం ఇస్తే మొదటి సంతకం ఋణమాఫీ, రెండవ సంతకం బెల్టు షాపురద్దు అంటూ పాదయాత్ర చేయడాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. 

నిజానికి ప్రజల ఆలోచన వేరుగా ఉందన్న విషయం చంద్రబాబు గారికి తెలిసినట్లు లేదు పాపం. పాదయాత్ర సభల్లో ఆయన చేసే వీరంగాలు చూస్తే వైయస్సార్‌పై ఆయనకు ఎంతటి ఈర్ష్య, అసూయాద్వేషాలు ఉన్నాయో తెలుస్తోంది ఫైనల్‌గా ఆయన ఒకటి తెలుసుకోవాలి. త్వరలో ఆయన పెట్టబోయే మొదటి సంతకం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా పత్రం పైనే. 

- సాయిలక్ష్మి, బెంగళూరు

నేడు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొంటారని చెప్పారు. 

చంద్ర ‘వంక’లివీ..

కృష్ణా జిల్లా దాకరం గ్రామంలో భేటీ అయిన టీడీఎల్‌పీ
‘అవిశ్వాసం’ పెట్టకుండా తప్పించుకోవటంపై చర్చ 
తీర్మానం పెడితే వైఎస్సార్ కాంగ్రెస్‌కే మేలన్న బాబు 
ఎన్నికల్లో ప్రజలే అవిశ్వాసం పెడతారంటూ వ్యాఖ్య
‘పోరాటం’ ద్వారా కాలం గడపాలని నిర్ణయం

సాక్షి, విజయవాడ: అనుకున్నట్టే ‘అవిశ్వాసం’పై తెలుగుదేశం పార్టీ వెనకడుగు వేసింది. రాష్ట్రంలో 12 ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో ‘పోరాటం’ ద్వారా కాలం గడపాలనే నిశ్చయానికి వచ్చింది. అందులోనూ ఎన్నికల ఏడాది కావటంతో ప్రజలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌పై తమదే ‘అప్పర్ హ్యాండ్’ అయ్యేలా చూడాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. అసెంబ్లీలో సభ్యులను మోత్కుపల్లి నర్సింహులు డెరైక్ట్ చేయాలని, తాను యాత్ర నుంచి ఫోన్‌లో డెరైక్షన్ ఇస్తానని బాబు తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పెరగటానికి గల కారణాలను అన్వేషించాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు గురువారం తాను బసచేసిన కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం దాకరం గ్రామంలో టీడీఎల్‌పీ సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా ఎలా తప్పించుకుని బయటపడాలనే దానిపైనే మల్లగుల్లాలు పడ్డారు. ఈ సమావేశానికి 48 మంది ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మీడియాను అనుమతించకుండా గోప్యంగా నిర్వహించిన ఈ సమావేశంలో చర్చించిన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. 

మనమే ఎందుకు అవిశ్వాసం పెట్టాలి..?

గతంలో ఎన్టీఆర్ పైన, తనపైన కాంగ్రెస్ ఎప్పుడూ అవిశ్వాస తీర్మానం పెట్టలేదని, ఇప్పుడు తాము మాత్రమే ఎందుకు పెట్టాలని చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించారు. గతంలో అవిశ్వాస తీర్మానం పెడితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కార్లు, సూట్‌కేసులు ముట్టాయన్నారు. గత అవిశ్వాస తీర్మానంతో కేవలం ఇద్దరు సభ్యులున్న వైఎస్సార్ సీపీ బలం ఉపఎన్నికలకు దారితీయడంతో 18కి పెరిగిందని, మరోమారు అటువంటి తప్పు మనం చేయకూడదని పేర్కొన్నారు. ఇప్పుడు అవిశ్వాసం పెడితే కచ్చితంగా వైఎస్సార్ సీపీకే లాభమని, మధ్యంతర ఎన్నికలు వస్తే ఆ పార్టీకే అనుకూల పరిస్థితి ఉందని విశ్లేషించారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో అవిశ్వాసం పెట్టటం సరికాదన్నారు. ప్రజలే అవిశ్వాసం పెట్టి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇంటికి పంపుతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అవిశ్వాసం పెట్టకుండా అసెంబ్లీ సమావేశాలను దాటవేయటానికి ఎటువంటి వ్యూహాలను అవలంబించాలన్న దానిపై సభ్యులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఉదయంపూట తాను సెల్‌ఫోన్‌లో అందుబాటులో ఉంటానని, తన సూచనలకు అనుగుణంగా అడుగులు వేయాలని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే వైఎస్సార్ కాంగ్రెస్‌కే లాభమని, ప్రభుత్వం పడిపోతే ఎన్నికల్లో జగన్ జైల్లో ఉండే గెలిచారన్న క్రెడిట్ కొట్టేస్తారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అవిశ్వాసం వైఎస్సార్ కాంగ్రెస్ పెడితే అప్పటి పరిస్థితిని బట్టి చూద్దామన్నారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే అవిశ్వాసంపై నిర్ణయం తీసుకోవాలని మోత్కుపల్లి నర్సింహులు సూచించారు. అసెంబ్లీలో ఎవరెంతగా రెచ్చగొట్టినా తాము అవిశ్వాస తీర్మానం పెట్టకూడదని, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు పెడితే అప్పుడు పరిస్థితిని బట్టి వ్యవహరించాలని టీడీఎల్‌పీ సమావేశం నిర్ణయించింది. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లు, కరెంటు కోతలు, బాబ్లీ ప్రాజెక్టు వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా సభ్యులు ‘ఫైర్’ చూపించాలని సమావేశం సూచించింది. 

వైఎస్సార్ సీపీకి ఓట్ల పెరుగుదలపై ఆందోళన: టీడీఎల్‌పీ సమావేశంలో బాబు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ సభ్యులను కలవరపాటుకు గురిచేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో తనకు వచ్చిన సర్వే లెక్కల ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ ఓటింగ్ 37 శాతానికి పెరిగిందని, దానిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఏ వర్గాలు ఆ పార్టీకి చేరువవుతున్నాయనే అంశాన్ని పరిశీలించాలని ఎమ్మెల్యేలకు బాబు సూచించారు. ‘ఎస్సీ వర్గీకరణకు మనం అనుకూలమని ప్రకటి ంచిన తర్వాత మాలలు పార్టీకి దూరమయ్యారు.. వర్గీకరణపై మన స్టాండ్ ఎంతవరకు సమర్థనీయమనేది మీరు పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది’ అని నిర్దేశించారు. ద ళితవాడలో టీడీపీపై వ్యతిరే కత పెరగటానికి గల కారణాలను పరిశీలించాలన్నారు. 

12 అంశాలపై పోరాటం: బడ్జెట్ సమావేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న 12 సమస్యలపై టీడీపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు. టీడీఎల్‌పీ సమావేశం అనంతరం నర్సింహులు, పయ్యావుల తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘‘అసెంబ్లీలో మా వ్యూహం మాకు ఉంటుంది.. 

చర్చపై ముందుగానే బాబు ‘డైరెక్షన్’

రాష్ట్రం అంధకారంగా మారి రైతులు, సామాన్య ప్రజలు, విద్యార్థులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ఇతర రాజకీయ పక్షాలన్నీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టటానికి సిద్ధంగా లేని చంద్రబాబు గురువారం టీడీఎల్పీ సమావేశాన్ని చంద్రబాబు నాటకీయంగా ముగించారు. అవిశ్వాసానికి సంబంధించిన చర్చ సందర్భంగా టీడీఎల్పీ సమావేశంలో ఏం మాట్లాడాలన్న విషయాలను చంద్రబాబు ముందుగానే పలువురు సభ్యులకు సూచనలు ఇచ్చి ఆ విధంగా మాట్లాడాల్సిందిగా ఆదేశించారు. టీడీఎల్పీ సమావేశానికి ముందు చంద్రబాబు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడారు. సమావేశంలో ఏం చెప్పాలో ముందుగానే డెరైక్షన్ ఇచ్చారు. తర్వాత సమావేశంలో అధినేత మాటలను తన మాటలుగా రేవంత్ వినిపించారు. ప్రస్తుతం పార్టీకి సభలో 77 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉందని, వైఎస్సార్ కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్‌ఎస్, బీజేపీ, లోక్‌సత్తా, సీపీఏం, సీపీఐలు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చినా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉండదని సమావేశంలో రేవంత్‌రెడ్డి ద్వారా చెప్పుకొచ్చారు. చంద్రబాబు అనుకున్న విధంగా ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత మాట్లాడిన మండవ వెంకటేశ్వరరావు, మోత్కుపల్లి నర్సిం హులు ఆయన వాదనను బలపరిచారు. ఆమేరకు అవిశ్వాసం పెట్టరాదని టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి పడగొట్టటానికి మా అధినేతకు ఏమాత్రం ఇష్టం లేదు. అది నేరుగా చెప్పలేం కాబట్టే వ్యూహాత్మకంగా సమావేశంలో మాట్లాడుకున్నాం’ అని సమావేశం అనంతరం ఒక సీనియర్ ఎమ్మెల్యే వివరించారు.

చంద్ర ‘వంక’లివీ..

గతంలో ఎన్టీఆర్ పైన, నాపైన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అవిశ్వాస తీర్మానం పెట్టలేదు. ఇప్పుడు మనం మాత్రమే ఎందుకు పెట్టాలి? 
గతంలో అవిశ్వాస తీర్మానం పెడితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కార్లు, సూట్‌కేసులు ముట్టాయి. 
ఇప్పుడు అవిశ్వాసం పెడితే కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్‌కే లాభం. మధ్యంతర ఎన్నికలు వస్తే ఆ పార్టీకే అనుకూలం. 
ఎన్నికల్లో జగన్ జైల్లో ఉండే గెలిచారన్న క్రెడిట్ కొట్టేస్తారు. 
ప్రస్తుతం టీడీపీకి సభలో 77 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. విపక్షాలన్నీ అవిశ్వాసానికి మద్దతు ఇచ్చినా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉండదు. 
మరో ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో అవిశ్వాసం పెట్టటం సరికాదు. 
ప్రజలే అవిశ్వాసం పెట్టి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇంటికి పంపుతారు. 
అవిశ్వాసం వైఎస్సార్ కాంగ్రెస్ పెడితే అప్పటి పరిస్థితిని బట్టి చూద్దాం. 

షర్మిలను కలిసి కష్టాలు చెప్పుకున్న రైతులు, మహిళలు, విద్యార్థులు

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’గురువారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 84, కిలోమీటర్లు: 1,165
యాత్రలో షర్మిలను కలిసి కష్టాలు చెప్పుకున్న రైతులు, మహిళలు, విద్యార్థులు
కరెంటు కోతలపై ఆగ్రహం.. ప్రభుత్వంపై కన్నెర్ర
పెరిగిన ధరలతో బతకలేకపోతున్నామని ఆవేదన
అధైర్య పడొద్దని ధైర్యం చెప్పిన షర్మిల
జగనన్న వస్తే రాజన్న రాజ్యం తెస్తాడని భరోసా
ప్రభుత్వం ప్రజల్ని గాలికొదిలేసిందని ధ్వజం
ఆ ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై అవిశ్వాసం పెట్టడం లేదని విమర్శ

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ప్రజల బాధలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వానికి, పనికిరాని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకూ ఓటు ద్వారా తగిన గుణపాఠం నేర్పాలన్నారు. రాష్ట్ర ప్రజానీకాన్ని గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కారు వైఖరికి, దానికి తెరచాటు మద్దతు పలుకున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వైఖరికీ నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం గుంటూరు జిల్లా నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో కొనసాగింది. యాత్రలో భాగంగా నాదెండ్ల మండలం టి.చందవరంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం షర్మిల మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. 

అంతకుముందు యాత్రలో షర్మిలను కలిసిన రైతులు, మహిళలు, విద్యార్థులు తమ కష్టాలు చెప్పుకున్నారు. పెట్టుబడి ఖర్చులు, ఎరువుల ధరలు, పావలా వడ్డీ, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా పలు విషయాల్లో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. ఇన్ని కష్టాలతో సతమతమవుతుంటే.. తాజాగా కరెంటు కోతలతో గ్రామాల్లో చీకట్లు తప్ప వెలుగే లేకుండా పోయిందని మండిపడ్డారు. పెరిగిన ధరలతో బతకలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. అధైర్య పడొద్దని వారందరికీ ధైర్యం చెప్పిన షర్మిల.. జగనన్న వస్తే రాజన్న నాటి సువర్ణయుగం తిరిగి తెస్తాడని, అన్ని వర్గాల ప్రజల కష్టాలను తీరుస్తాడని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ప్రజల్ని పూర్తిగా గాలికొదిలేసిందని, తమ పదవులు కాపాడుకోవడానికే మంత్రులకు సమయమంతా సరిపోతుందని షర్మిల విమర్శించారు. ప్రజలు ఇన్ని కష్టాలతో సతమతమవుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబుకు చీమ కుట్టినట్లయినా లేదని, తన మీద కేసులపై దర్యాప్తు జరగకుండా ఉండేందుకు ఆయన ప్రభుత్వంతో కుమ్మక్కై అవిశ్వాసం పెట్టడం లేదని నిప్పులు చెరిగారు.

పదెకరాలు సాగు చేశా.. కప్పులు కడుగుతున్నా..

నాదెండ్ల మండలం సాతులూరులో షేక్ ఆదం షఫీ.. షర్మిలను కలిసి మాట్లాడుతూ.. ‘‘పదెకరాల పొలంలో పంటలేసి అకాల వర్షంతో నిండా మునిగిపోయా. మూడెకరాల్లో జొన్న, మూడెకరాల్లో పచ్చి శనగ, మరో నాలుగెకరాల్లో ఇతర పంటలేశా. మొన్న వచ్చిన వర్షాలకు పంటంతా నీటి పాలైంది. బంగారం కుదువపెట్టి రూ.60 వేలు తెచ్చి పెట్టుబడి పెడితే ఒక్క రూపాయి కూడా రాలా. ప్రభుత్వం సాయం చేస్తదనుకుంటే ఇంత వరకూ మమ్మల్ని పట్టించుకున్నవారు లేరు. ఇక గతిలేక టీ దుకాణం పెట్టుకుని కప్పులు కడుగుతున్నా’’ అని కంటతడి పెట్టాడు. షఫీని ఓదార్చిన షర్మిల.. వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు బాధలను తన బాధలుగా భావించి వారికి అండగా నిలిచారని, మళ్లీ జగనన్న వస్తే రైతుల కష్టాలను తీరుస్తారని ధైర్యం చెప్పారు.

అంతకుముందు ఫిరంగిపురం మండలం మునగపాడుకు చెందిన కొమిరిపూడి మొహిద్దీన్ షర్మిలను కలిసి మాట్లాడుతూ.. ఉన్న కొద్ది పొలంలో మినుము వేశానని, చివరకు కరెంటు లేకపోవడంతో నీరివ్వలేక పొలాన్ని పశువులకు వదిలి వేశానని వాపోయాడు. రైతుల కష్టాలు తీరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని షర్మిల భరోసా కల్పించగా..‘రాజన్న రాజ్యం మళ్లీ రావాలమ్మా’ అంటూ నినాదాలు చేశాడు.

84వ రోజు పాదయాత్ర గురువారం ఉదయం 10 గంటలకు నరసరావుపేటలో ప్రారంభమై జొన్నలగడ్డ, సాతులూరు, టి.చందవరం మీదుగా సాగింది. టి.చందవరం శివారులో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 7.30 గంటలకు షర్మిల చేరుకున్నారు. గురువారం మొత్తం 12.5 కిలోమీటర్లు నడిచారు. 

టీడీపీవి శవరాజకీయాలు :ఆమోద ఇండస్ట్రీస్ ఎండీ

వీరభద్రారెడ్డి 20 ఏళ్లుగా మా సంస్థలో తన సామర్థ్యంతో అంచెలంచెలుగా ఎదిగారు 
అత్యంత నమ్మకస్తుడైన ఉద్యోగిని కోల్పోవటం మాకు ఎంతో బాధ కలిగించింది 
టీడీపీ ఎమ్మెల్యేకు మాతో ఉన్న వ్యాపార వైరం వల్ల దీనిని రాజకీయం చేస్తున్నారు 
ఏదో రకంగా బురదజల్లి వైఎస్ కుటుంబాన్ని దెబ్బతీయటమే చంద్రబాబు లక్ష్యం 
స్వార్థ రాజకీయాల కోసం వీరభద్రారెడ్డి ఆత్మహత్యను వాడుకోవటం సిగ్గుచేటు 
వీరభద్రారెడ్డి ఆత్మహత్యకు - బ్రదర్ అనిల్‌కు సంబంధం అంటూ దుష్ర్పచారం 
ఆమోద ఇండస్ట్రీస్, బెనిటా, రక్షణ స్టీల్స్‌తో అనిల్‌కు సంబంధం ఉందని నిరూపించాలి 
నిరూపిస్తే కంపెనీలను వారికి రాసిస్తా.. లేనిపోని ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్తా 
టీడీపీ నేతల తీరుపై ఆమోద ఇండస్ట్రీస్ ఎండీ కొండలరావు ధ్వజం

సాక్షి, హైదరాబాద్: చెట్టంత కొడుకును పోగొట్టుకుని బాధపడుతున్న తల్లిదండ్రులను, భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఇల్లాలిని, తండ్రి లేడనే విషయాన్ని జీర్ణించుకోలేని చిన్నారులను పరామర్శించి ఆదుకోవాల్సిన ఆపన్న సమయంలో.. తెలుగుదేశం పార్టీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వీరభద్రారెడ్డి ఆత్మహత్యను వాడుకోవటాన్ని ఆమోద ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ కొండలరావు తప్పుపట్టారు. ఆయన ఈమేరకు గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తాను వ్యాపారం ప్రారంభించినప్పటి నుంచి 20 సంవత్సరాలుగా తమతో ప్రయాణించిన వీరభధ్రారెడ్డి వ్యాపారంతో పాటు అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు. ‘‘గుమస్తాగా చేరిన ఆయన.. తన సామర్థ్యంలో మేనేజర్ స్థాయికి ఎదిగారు. 20 సంవత్సరాల కిందట రూ. 1,500 జీతంలో మా వద్ద చేరి రూ. 50 వేలకు పైనే జీతం తీసుకునే స్థాయికి చేరారు. ఆయన కుటుంబంతో కూడా మాకు ఆత్మీయ అనుబంధం ఉంది’’ అని వివరించారు. తమకు అత్యంత నమ్మకస్తుడైన ఉద్యోగిని కోల్పోవటం మాకు బాధ కలిగించిందని కొండలరావు విచారం వ్యక్తం చేశారు. 

వీరభద్రారెడ్డి సెలవులో సొంత గ్రామమైన పోచంపల్లికి వెళ్లి ఆత్మహత్య చేసుకోవటం తమను కలిచివేసిందన్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న వీరభద్రారెడ్డి కుటుంబాన్ని ఆదుకోవటానికి, ఆయన పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వటానికి ఏం చేయాలని తాము ఆలోచిస్తున్న సమయంలో.. టీడీపీ నాయకులు, కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు పనికట్టుకుని వీరభద్రారెడ్డి ఆత్మహత్యను స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలని ప్రయత్నించటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి చెందిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)కు తమతో ఉన్న వ్యాపార వైరం వల్ల వీరభద్రారెడ్డి ఆత్మహత్యను రాజకీయం చేయటం ద్వారా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారని కొండలరావు ఆరోపించారు. ‘‘ఏదోరకంగా బురదజల్లో శవరాజకీయాలు చేసో వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని దెబ్బతీయటమే టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం. అందుకే వీరభద్రారెడ్డి ఆత్మహత్యను వాడుకుంటున్నారు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీ, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న దుష్ర్పచారం, శవరాజకీయాల వల్ల తమకు ఎంతో నమ్మకస్తుడైన ఉద్యోగి వీరభద్రారెడ్డి కుటుంబంతో ఉన్న ఆత్మీయ అనుబంధం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్న వీరభద్రారెడ్డి ఆఖరి కోరిక తీర్చటానికి కూడా తమకు అవకాశం లేకుండా చేయాలనే కుట్ర కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను వక్రీకరిస్తూ.. చనిపోయిన వ్యక్తి ఆత్మ ఘోషించే విధంగా, ఆయన ఆఖరి మాటల (సూసైడ్ నోట్)కూ వక్రభాష్యాలు చెప్తూ.. వీరభద్రారెడ్డి ఆత్మహత్యకు, బ్రదర్ అనిల్‌కుమార్‌కూ సంబంధం ఉందంటూ టీడీపీ, కొన్ని మీడియా సంస్థలు దుష్ర్పచారానికి దిగటాన్ని కొండలరావు ఖండించారు. లేనిపోని ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఆమోద ఇండస్ట్రీస్, బెనిటా, రక్షణ స్టీల్స్.. తన కంపెనీల్లో బ్రదర్ అనిల్‌కుమార్‌కు సంబంధం ఉందని నిరూపిస్తే, ఆ కంపెనీలను ఆరోపణలు చేస్తున్న వారి పేరిట రాసిస్తామని ఆయన సవాల్ చేశారు. 2003లో అమోద ఇండస్ట్రీస్ ఏర్పాటు చేశామని, 2007లో అనిల్‌కుమార్‌తో తనకు పరిచయమయిందని తెలిపారు.

నీతికి నిలబడతానన్నా వదలరా?

‘‘వీరభద్రారెడ్డికి స్వయానా చిన్నాన్న, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ముల్లంగి రామకృష్ణారెడ్డి.. ఈ ఆత్మహత్యకు రాజకీయ రంగు పులమొద్దని విజ్ఞప్తి చేశారు. శవరాజకీయాలు చేయవద్దని టీడీపీ నేతలకూ సూచించారు. కానీ టీడీపీ ప్రయోజనాల కోసం పార్టీ అధినేత ఆయనకు హుకుం జారీ చేశారు. నీతికి నిలబడతానని, శవరాజకీయాల జోలికి పోనని చెప్పినా రామకృష్ణారెడ్డిని వదలటం లేదు’’ అని కొండలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Popular Posts

Topics :