02 August 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఏపీ స్పీకర్, ముఖ్యమంత్రిలకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ

Written By news on Saturday, August 8, 2015 | 8/08/2015

ఏపీ స్పీకర్, ముఖ్యమంత్రిలకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ
జనరల్ పర్పసెస్ సమావేశానికి ప్రతిపక్షం నుంచి ముగ్గురేనా
శాసన సభా సంప్రదాయం ఎటు పోయింది
ప్రత్యేక హోదా కోసం మా ఢిల్లీ ధర్నా రోజునే సమావేశమా


హైదరాబాద్: 
ప్రజా సమస్యలను చర్చించకుండా సభను దారి తప్పించే కుటిల వ్యూహాలకు శాసన సభను వేదికగా మార్చొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావులకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కమిటీ ఆన్ జనరల్ పర్పసెస్ సమావేశాన్ని ఈనెల 11వ తేదీన నిర్వహిస్తామని చెప్పడం, అందులో ప్రతిపక్షం నుంచి కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం ఇవ్వడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్పీకర్తో కలిపి మొత్తం 25 మందిని దీనికి పిలుస్తుండగా.. తనతో కలిపి కేవలం ముగ్గురికే ప్రతిపక్షం నుంచి అవకాశం ఇవ్వడమేంటని నిలదీశారు. దామాషా పద్ధతిని పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాము ఢిల్లీలో ధర్నా చేస్తున్నరోజే ఈ సమావేశం నిర్వహించడం ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు.

అసలు కమిటీ ఆన్ జనరల్ పర్పసెస్ సమావేశం గత 12 ఏళ్లలో ఏనాడూ జరగలేదని ఆయన చెప్పారు. 1995-2004 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేవలం ఒక్కసారి మాత్రమే, అది కూడా తూతూమంత్రంగా సమావేశాన్ని నిర్వహించినట్లు చెబుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. కనీసం సమావేశానికి సంబంధించిన ఎజెండాను ఇవ్వడానికి కూడా శాసన సభ కార్యాలయం సిద్ధంగా లేదని ఆయన మండిపడ్డారు.

రానున్న వర్షాకాల సమావేశాల్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలు, అవినీతి, అన్యాయాలపై చర్చ జరగకుండా ఉండేందుకే ఒక పథకం ప్రకారం అత్యున్నతమైన శాసన సభను ఉపయోగించుకుంటున్నారన్న విషయం ఎవరికైనా అర్థం అవుతుందన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తాము ప్రస్తావించబోయే 19 ప్రధానాంశాలను కూడా ఆయన తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.





భూసేకరణ బూచి చూపితే భయపడం


భూసేకరణ బూచి చూపితే భయపడం
- అసలు చట్టమైతే కదా...సేకరణ
- ప్రజలకు న్యాయం చేసి ముందుకెళ్లండి: ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి:
 రాజధాని ప్రాంతంలో  ఈ నెల 20 నుంచి భూసేకరణ చేస్తామని రాష్ట్రమంత్రి  పి.నారాయణ ప్రకటించడం రైతులను భయపెట్టడం, మోసగించడమేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని పార్లమెంటు ఉభయసభల్లో గట్టెక్కించలేక మార్పులు, చేర్పులపై పునరాలోచనలో పడిన నేపథ్యంలో నారాయణ ఇలా ప్రకటించడాన్ని ఆయన ఆక్షేపించారు.

ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ బలవంతంగా భూసేకరణ చేయలేదని స్పష్టమైందని, ఒకవేళ అంతకు తెగిస్తే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద రైతులు, కూలీలకు అండగా నిలుస్తారని ఆర్కే పేర్కొన్నారు. రైతులందరి ఆమోదంతోనే ప్రజారాజధాని రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  కోరుకుంటోందని,అందుకు భిన్నంగా జరిగితే అలు పెరగని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
 
గతి తప్పిన హామీలు...
ఇప్పటి వరకు సంపూర్ణ రుణమాఫీ జరగలేదు. పొలాలు ఇచ్చిన రైతులకు కౌలు చెక్కులు పూర్తిగా ఇవ్వనేలేదని ఎమ్మెల్యే విమర్శించారు.  దేవాదాయ భూములను నేరుగా స్వాధీనం చేసుకునే అధికారం లేనప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుందని, అటవీ భూములను కేంద్రప్రభుత్వం ఇప్పటివరకు డీనోటిఫై చేయలేదన్నారు.
 
లంక భూములు, అసైన్డ్ భూముల రైతులకు పరిహారం అందజేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు కాలేదన్నారు. కౌలురైతుల లెక్కింపు,  వ్యవసాయ కూలీల వివరాలు నమోదు చేయకపోగా అర్హులను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలకు చెందిన వందలమంది కూలీలు, వ్యవసాయాధారిత చేతివృత్తుల వారి గురించి అసలు పట్టించుకొనకపోగా 9.2, 9.3 ఫారాలు ఇచ్చి న్యాయస్థానం మెట్లెక్కిన రైతులను మోసగించేందుకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తోందన్నారు.  భూములిచ్చిన రైతుల కోసం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం... భూమి ఎక్కడ.. ఎప్పుడిస్తారో ఇప్పటివరకు స్పష్టం చేయలేదన్నారు.
 
కొండవీటి వాగును ఏం చేస్తారు?
రాజధాని అమరావతి దుఃఖదాయని అయిన కొండవీటి వాగును మరల్చడం, వాగు ముం పు లేకుండా చేపట్టాల్సిన ప్రణాళికలను ఇప్పటికీ  ప్రభుత్వం సిద్ధం చేయలేదని ఎమ్మెల్యే ఆర్కే గుర్తుచేస్తూ... తమ సొంత లాభాల కో సం హడావు డిగా సీడ్ క్యాపిటల్ అని, మాస్టర్ ప్లాన్ అని కొత్తకొత్త పదాలతో ప్రజలను మోసగిస్తోందని దుయ్యబట్టారు. కృష్ణాతీరంలో అక్రమ కట్టడాలని ప్రకటించిన వాటిని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం సక్రమ కట్టడాలుగా మార్చుకుని, వాస్తు పిచ్చితో వందల కోట్ల ప్రజాధనాన్ని  దుర్వినియోగం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

నేతన్నలనూ మోసగించారు


నేతన్నలనూ మోసగించారు
చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ నేత మేరుగ ధ్వజం
ఎన్నికల ముందిచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా?
తక్షణమే చేనేత రుణాలు మాఫీ చేయాలని డిమాండ్

 
హైదరాబాద్: ప్రతి అంశానికీ మసిపూసి మాయ చేస్తూ నిత్యం ప్రజలందర్నీ మోసగించే సీఎం చంద్రబాబునాయుడు చేనేత కుటుంబాలనూ అదేతీరున మోసగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. అధికారంలోకి రాగానే నేతన్నలను ఆదుకుంటామని ఎన్నికలముందు వందలకొద్దీ హామీలిచ్చి, ఇప్పటివరకూ అందులో ఏ ఒక్కటీ అమలు చేయకపోగా.. ‘చేనేత’ దినోత్సవం రోజున ప్రజలంతా చేనేత వస్త్రాలు వాడాలని పిలువునివ్వడం వారిని మోసం చేయడం కాదా? అని పార్టీ అధికార ప్రతినిధి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చేనేతలను నిర్లక్షం చేసినందునే వందలమంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారమూ ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.312 కోట్ల చేనేతల రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించి, ఆ ఫైలుపై సంతకం కూడా చేశారు.

ఆయన మరణాంతరం సీఎంలైన వారెవరూ దాన్ని అమలు చేయనందున ఇప్పుడు చేనేతల అప్పు రూ.1000 కోట్లకు పెరిగిపోయింది. మొన్నటి ఎన్నికల ముందు కూడా చేనేత అప్పుల్ని అణాపైసలతోసహా మాఫీ చేస్తానని చంద్రబాబు మరోసారి వారిని మోసం చేశారు’’ అని ఆయన దుయ్యబట్టారు. ‘‘అధికారంలోకి రాగానే నేతన్నలకు గుర్తింపు కార్డులిస్తామన్నారు.. చేనేత భవనాలకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఇస్తామన్నారు.. జరీపై విధించిన వ్యాట్ రద్దు చేస్తామన్నారు.. కార్మికులకు బ్యాంకురుణాల మాఫీ.. పవర్‌లూమ్‌లపై ఉన్న రుణాలు రద్దు చేస్తామన్నారు.. ఒక్కొక్క నేత కుటుంబానికి లక్షన్నర సంస్థాగత రుణం ఇస్తామన్నారు.. ఇలా ఎన్నో హామీలిచ్చారు. వీటిలో ఏ ఒక్కటీ ఎందుకు అమలు చేయలేదు?’’ అని ప్రశ్నించారు. తక్షణమే చేనేత రుణాల్ని అణాపైసలతో మాఫీచేయాలని, పేద, చేనేతల ఆత్మహత్యలను ఆపాలని నాగార్జున డిమాండ్ చేశారు.

నిర్లక్ష్యమే నిజం!

Written By news on Friday, August 7, 2015 | 8/07/2015


నిర్లక్ష్యమే నిజం!
ఏఎన్‌యూ : ‘యూనివర్సిటీ కళాశాలలు, వసతి గృహాల్లో పరిస్థితులపై పలుమార్లు విద్యార్థినులు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇదే రిషితేశ్వరి మరణానికి కారణమైంది..’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  బృందం ఆరోపించింది. తప్పులు చేసిన కొందరిని రక్షించేందుకు యూనివర్సిటీ, ప్రభుత్వ అధికారులు వర్సిటీ వ్యవస్థను, సమాజాన్ని బదనాం చేస్తున్నారని మండిపడింది. రిషితేశ్వరి మృతి ఘటనలో వాస్తవాలు వెలికి తీసేందుకు ఆ పార్టీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్రస్థాయి నాయకులతో కూడిన బృందం గురువారం ఏఎన్‌యూలో పర్యటించింది.

పరిపాలనా భవన్‌లోని వీసీ కార్యాలయంలో ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.ఆర్.ఎస్.సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్‌తో వైఎస్సార్ సీపీ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆర్‌కే రోజా, కె.పార్థసారధి మాట్లాడుతూ వర్సిటీలో మహిళల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మృతురాలు రాసుకున్న డైరీ చదివితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. డైరీ మొత్తాన్ని యూనివర్సిటీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. యాంటీ ర్యాగింగ్ చట్టం ప్రకారం ప్రిన్సిపాల్‌ను ఎందుకు అరెస్టు చేయించలేదని మండిపడ్డారు.  ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. వర్సిటీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

 నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రిషితేశ్వరి ఘటనలో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ తప్పులు ఉన్నాయని ఆయన్నెందుకు ఏ1 ముద్దాయిగా చేర్చలేదని ప్రశ్నించారు. బాపట్ల, మాచర్ల ఎమ్మెల్యేలు కోనరఘపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థిని మృతికి కారకులైన వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిం చటం దురదృష్టకరమన్నారు. నిజనిర్ధారణ కమిటీ సభ్యుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ బాబురావు అరాచకాలను ప్రశ్నించినందుకే  దళిత అధ్యాపకుడు డేవిడ్‌రాజును విధుల నుంచి తొలగించారని మండిపడ్డారు.

 పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అధికారులు కులాలవారీగా వివక్ష కనబరచటం సరికాదన్నారు. ఏఎన్‌యూ నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్ ఆచార్య సి.రాంబాబును విచారణకు సంబంధించిన పలు అంశాలపై వైఎస్సార్ సీపీ బృందం ప్రశ్నించింది. విద్యార్థులకు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఫారాన్ని చూపాలని డిమాండ్ చేశారు.  ఆయన ఫీడ్‌బ్యాక్ ఫారాన్ని తెప్పించి వైఎస్సార్ సీపీ బృందానికి ఇచ్చారు. బృందం పట్టు వీడక పోవటంతో  రిషితేశ్వరి మృతికి పరోక్షంగా కారణమైన బాబురావుపై యాంటీ ర్యాగింగ్ చట్టం కింద చర్యలు తీసు కోవాలని పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేస్తూ అందరి సమక్షంలో లేఖ రాశారు.

అనంతరం రోజా,  వైఎస్సార్ సీపీ మహిళా ఎమ్మెల్యేలు యూనివర్సిటీలోని బాలికల వసతి గృహాలను సందర్శించి విద్యార్థినులతో చర్చించారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు షేక్ మహ్మద్ ముస్తఫా, ఉప్పలేటి కల్పన, జలీల్‌ఖాన్, మేకా ప్రతాప అప్పారావు,  గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, గిడ్డి ఈశ్వరి, గౌరు చరిత, కళావతి, పుష్పశ్రీవాణి, రక్షణ నిధి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నిజనిర్ధారణ కమిటీ సభ్యులు వంగవీటి రాధా, లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, గురజాల నియోకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు, వైఎస్సార్ సీపీ యువజన, మహిళా, విద్యార్థి, మైనార్టీ, ఎస్టీ  విభాగాల  జిల్లా అధ్యక్షులు కావటి మనోహర్ నాయుడు, యేళ్ల జయలక్ష్మి, పానుగంటి చైతన్య, సయ్యద్‌మాబు, మొగిలి మధు, వైఎస్సార్ సీపీ  జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవెళ్ల రేవతి, తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కత్తెర సురేష్ పాల్గొన్నారు.

 ప్రభుత్వ తీరుపై ధ్వజం.. సాక్షి, గుంటూరు :  అనంతరం రోజా విలేకరులతో మాట్లాడుతూ  ఎంఎల్‌ఏ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కనీసం వర్సిటీకి వచ్చి రిషితేశ్వరి వ్యవహారంపై ఆరా తీయలేదంటే టీడీపీ నేతలకు మహిళలపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందన్నారు.  హోం శాఖ నిద్ర పోతోందని ఆరోపించారు.  బాబు  పవర్  తన వద్ద పెట్టుకుని పదవి చిన్నరాజప్పకు ఇచ్చారనారు.

 కఠినంగా శిక్షించాలి..  ప్రిన్సిపాల్ బాబురావు లాంటి వ్యక్తుల వల్ల విద్యార్థినులు ప్రాణాలు కోల్పోవడంతోపాటు యూనివర్సిటీ విలువలు దిగజారుతున్నాయి. ప్రెషర్స్‌డే పార్టీని యూనివర్సిటీలో కాకుండా హాయ్‌ల్యాండ్‌లో ఏర్పాటు చేసి మందేసి, చిందు వేయించిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోకపోవడం వల్లనే రిషితేశ్వరి మృతి చెందింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపి దోషులను శిక్షించాలి.
                   -  కొలుసు పార్థసారధి, మాజీమంత్రి

 ప్రిన్సిపాల్‌పై చర్యలేవీ..  
 కళాశాల ప్రారంభమైన నెల రోజుల్లో ప్రెషర్స్ డే ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఐదు నెలల తర్వాత ఎక్కడో బయట ఏర్పాటు చేసి చిందులు వేస్తున్నా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణం.        
- ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు , ఎమ్మెల్సీ

 నివేదిక దారుణం..  రిషితేశ్వరి డైరీలోని పేజీలన్నీ మీడియాలో ప్రదర్శించినప్పటికీ వర్సిటీ నిజనిర్ధారణ  కమిటీ దాన్ని చూడకుండా నివేదిక ఇవ్వడం దారుణం.   
            -  వంగవీటి రాధా, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు

 అనుమానాలున్నాయి..  బాబురావు తప్పు చేశాడని నిర్ధారించినప్పటికీ  చర్యలు తీసుకోకపోవడం అనుమానాలు కలుగుతున్నాయి.
 -  గొట్టిపాటి రవికుమార్,  అద్దంకి ఎంఎల్‌ఏ

పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి


పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి
కేంద్ర వ్యవసాయ, ఆర్థిక మంత్రులకు వైఎస్సార్‌సీపీ ఎంపీల విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: పొగాకు రైతులకు న్యాయం చేయడానికి గిట్టుబాటు ధర కల్పించడంలో జోక్యం చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌లకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల సమక్షంలో ఏపీ, తెలంగాణలోని పొగాకు రైతుల సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం తొలుత కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు.

పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నివేదించారు. గిట్టుబాటు ధర కల్పించాలని, వాణిజ్య మంత్రి నిర్మలాసీతారామన్ సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరారు. మధ్య, తక్కువ గ్రేడు పొగాకు కొనుగోలు చేయడానికి పొగాకు బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. రైతుల వద్ద నిల్వ ఉన్న పొగాకు కొనుగోళ్లు చేయాలని కోరారు. పొగాకు రైతులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరప్రసాదరావు, ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, పొగాకు రైతులు అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. పొగాకు రైతుల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన నిధులతో నిల్వల కొనుగోలుకు చర్యలు చేపట్టాలని జైట్లీని కోరామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘాల ప్రతినిధులు దుగ్గినేని గోపినాథ్, మారెడ్డి సుబ్బారెడ్డి, బంగారుబాబు, వైవీ కృష్ణారావు, బి.ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు. కాగా, శుక్రవారం వాణిజ్యశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, పొగాకు రైతు ప్రతినిధులు భేటీ కానున్నారు.
 
ప్రత్యేక హోదా కోసం ఆందోళన..
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో 10న జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానించినట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఏపీ అభివృద్ధిని కోరుకునే అన్ని పార్టీలు ధర్నాకు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.

రిషితేశ్వరికి న్యాయం జరిగేదాకా పోరాడతాం..


రిషితేశ్వరికి న్యాయం జరిగేదాకా పోరాడతాం..
వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ స్పష్టీకరణ
నాగార్జున  వర్సిటీలో పర్యటన
ఇన్‌చార్జ్ వీసీ, రిజిస్ట్రార్‌లతో భేటీ
* ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
 సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మృతి చెందిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరికి న్యాయం జరిగే వరకూ పోరాడుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు స్పష్టం చేశారు.

రిషితేశ్వరి మృతిపై విచారణ జరిపేందుకు పార్టీ నిజనిర్ధారణ కమిటీ  గురువారం వర్సిటీలో పర్యటించింది. ఇన్‌చార్జ్ వీసీ సాంబశివరావు, రిజిస్ట్రార్ రాజశేఖర్, వర్సిటీ నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్ రాంబాబులతో  కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. రిషితేశ్వరి మృతి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపల్ బాబూరావుపై చర్యలు తీసుకోకుండా, అధ్యాపకుడు డేవిడ్‌రాజును తొలగించడమేమిటని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే  రోజా ఇన్‌చార్జ్ వీసీని ప్రశ్నించారు. ప్రిన్సిపల్ మద్యం తాగి చిందులేస్తే పట్టించుకోలేదని, అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే రిషితేశ్వరి మృతి చెంది ఉండేదా? అని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వీసీ, రిజిస్ట్రార్లను నిలదీశారు.
 
ప్రిన్సిపల్‌పై పోలీసులకు ఫిర్యాదు
అధికారులు సమాధానాలు దాటవేయడంతో ఆగ్రహించిన నాయకులు ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకునే వరకూ కదిలేది లేదని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ తప్పు ఉన్నట్లు తమ విచారణలో తేలిందని రాంబాబు చెప్పడంతో ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ నేతలు పట్టుబట్టారు. దీంతో ఇన్‌చార్జ్ వీసీ.. రిజిస్ట్రార్ రాజశేఖర్ చేత ప్రిన్సిపాల్ బాబూరావుపై పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇప్పించారు. అక్కడే ఉన్న పెదకాకాని సీఐ శేషారావుకు ఫిర్యాదు కాపీని అందించారు.
 
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు షేక్ మహ్మద్ ముస్తాఫా, ఉప్పులేటి కల్పన, జలీల్ ఖాన్, మేకా ప్రతాప అప్పారావు, గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గిడ్డి ఈశ్వరి , గౌరు చరిత, కళావతి, పుష్పశ్రీవాణి, రక్షణ నిధి, నిజనిర్థారణ కమిటీ సభ్యులు వంగవీటి రాధా, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, గురజాల, వినుకొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు జంగా కృష్ణమూర్తి, బొల్లా బ్రహ్మనాయుడు తదితరులు హాజరయ్యారు.
 
రిషితేశ్వరి మృతి చెందిన ఇందిరా ప్రియదర్శిని బాలికల హాస్టల్‌ను వైఎస్సార్‌సీపీ మహిళా ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, గిడ్డి ఈశ్వరి, గౌరు చరిత, ఉప్పులేటి కల్పన, కళావతి, పుష్పశ్రీవాణిలు సందర్శించారు. అక్కడి విద్యార్థినులు, వార్డెన్‌తో మాట్లాడారు. నిజనిర్ధారణలో తేలిన అంశాలను రాష్ట్ర గవర్నర్‌కు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదించనున్నట్లు మహిళా ఎమ్మెల్యేలు తెలిపారు.  
 
మీ అక్కకో, చెల్లికో ఇలా జరిగితే
ఊరుకుంటారా?: రిషితేశ్వరి లైంగిక వేధింపులు భరించలేక మానసిక క్షోభతో ఆత్మహత్యకు పాల్పడిందనే విషయం ఆమె డైరీని చూస్తే అర్థమవుతోందని  రోజా చెప్పారు. సీఎం చంద్రబాబు తన అక్కకో, చెల్లికో లేక కోడలికో ఇలా జరిగితే కేసు పెట్టకుండా సెటిల్‌మెంట్‌లు చేస్తారా? అని ప్రశ్నించారు. ఆమె నాగార్జున వర్సిటీలో మీడియాతో మాట్లాడారు. తహసీల్దార్ వనజాక్షిని కొడితే ఆమెను పిలిచి సెటిల్ చేశారని, ఇప్పుడు రిషితేశ్వరి కుటుంబానికి రూ.10 లక్షలు, 500 గజాల స్థలం ఇచ్చి సెటిల్ చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు దృష్టిలో ఒక ఆడపిల్ల ప్రాణం ఖరీదు ఇంతేనా అని మండిపడ్డారు.

వైఎస్ విగ్రహ గద్దె కూల్చివేతపై భగ్గు


వైఎస్ విగ్రహ గద్దె కూల్చివేతపై భగ్గు
300 మంది వైఎస్సార్ సీపీ నాయకుల ధర్నా
వైఎస్.రాజశేఖరరెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం
మహానేత విగ్రహ గద్దె కూల్చడం సరికాదు
విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి
జేసీని కలిసిన కొండా రాఘవరెడ్డి,  జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి

 
 కాజీపేట రూరల్ : కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న సర్కిల్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం సరికాదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. వైఎస్సార్ విగ్రహ గద్దెను కూల్చివేయడాన్ని నిరసిస్తూ గురువారం కలెక్టర్ బంగ్లా సెంటర్‌లో 300 మంది వైఎస్సార్ సీపీ నాయకలు ధర్నాకు చేశారు. తెలుగు ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహానేత విగ్రహ గద్దెను కూల్చివేయడం  బాధాకరమని, దీన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. జనహృదయ నేత విగ్రహ గద్దెను కూల్చివేయడం దుశ్చర్యకు నిదర్శనమన్నారు. విగ్రహం గద్దెను కూల్చిన స్థలంలోనే విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్య దేశంలో విగ్రహాలను కూల్చివేసే సంస్కృతి మంచిది కాదని, అనుమతి ఉన్న విగ్రహ గద్దెను కూల్చివేయడం క్షమించరానిదని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పేదల జీవితాల్లో వెలుగునింపిన అపరభగీరథుడి విగ్రహ గద్దెను కూల్చివేయడం బాధాకరమన్నారు.

జిల్లాలో వైఎస్సార్ విగ్రహాలకు ఎలాంటి హాని తలపెట్టినా.. రెచ్చగొట్టే దుశ్చర్యలకు పాల్పడి రాజకీయం చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. వైఎస్సార్ విగ్రహాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం విగ్ర హ గద్దె కూల్చిన స్థలంలో రాజశేఖరరెడ్డి ప్లెక్సీని ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు. అనంతరం కొండా రాఘవరెడ్డి, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జేపీ ప్రశాంత్ పాటిల్‌ను కలిసి గద్దెన కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని, గద్దెను తిరిగి ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాడెం శాంతికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికంటి శివ, గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ యాదవ్ జిల్లా నాయకులు అప్పం కిషన్, చల్లా అమరేందర్‌రెడ్డి, షంషీర్ బేగ్, మునిగాల కల్యాణ్ రాజ్, మంచె అశోక్, అచ్చిరెడ్డి, దుప్పటి ప్రకాష్, సుదర్శన్‌రెడ్డి, ఎర్రంరెడ్డి మహిపాల్‌రెడ్డి, ఎస్‌ఎ ఖాదర్, గౌని సాంబయ్య గౌడ్, నాగపురి దయాకర్, బద్రుద్దీన్‌ఖాన్, పిడిశెట్టి సంపత్, బొడ్డు శ్రావణ్, మాధవరెడ్డి, సంగాల ఈర్మియా, సాల్మన్‌రాజ్, ముజఫరుద్దీన్ ఖాన్, నెమలిపురి రఘు, కౌటిల్ రెడ్డి, వీరారెడ్డి, కైసర్, రాములు నాయక్, నరేందర్‌రెడ్డి, రాజేశ్‌రెడ్డి, రజినీకాంత్, రాజు, లోకు రమేష్, మొగిలి, జితేందర్‌రెడ్డి, సిరికొండ రామేశ్వరచారి పాల్గొన్నారు.

మీ కూతురే ఆత్మహత్య చేసుకుంటే ఇలా వదిలేస్తారా

Written By news on Thursday, August 6, 2015 | 8/06/2015


మీ కూతురే ఆత్మహత్య చేసుకుంటే ఇలా వదిలేస్తారా
నాగార్జున వర్సిటీ వీసీని నిలదీసిన వైఎస్ఆర్ సీపీ నేతలు
నిజనిర్ధారణ కమిటీ నిలదీతతో స్పందించిన వీసీ
ప్రిన్సిపాల్ బాబూరావుపై పోలీసులకు ఫిర్యాదు
వర్సిటీ కమిటీ చైర్మన్ మా చెవిలో కాలిఫ్లవర్ పెట్టారు
రిషితేశ్వరి ఆత్మహత్యను చిన్న విషయంగా కొట్టేశారు
రూం గురించిన గొడవతో ఆమె ఆత్మహత్య చేసుకుందట
తీవ్రంగా మండిపడ్డ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా


గుంటూరు: 
రిషితేశ్వరి ఆత్మహత్యను చిన్న విషయంగా కొట్టి పారేయడానికి యూనివర్సిటీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఆ కమిటీ చైర్మన్ తమ చెవుల్లో కాలిఫ్లవర్ పెట్టారని ఎద్దేవా చేశారు. రిషితేశ్వరి రూంలో సౌకర్యాలు బాగున్నాయని, ఎదురుగా ఉన్న సీనియర్ల రూంలో సౌకర్యాలు అంత సరిగా లేవని.. తాము ఈ రూంలోకి వస్తామని వాళ్లు గొడవ చేయడంతో.. మనస్తాపం చెంది రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారని రోజా మండిపడ్డారు. మీ కూతురే ఇలా ఆత్మహత్య చేసుకుంటే ఫిర్యాదు చేస్తారా, లేక ఇలాగే వదిలేస్తారా అని తాము ప్రశ్నించామన్నారు. ఇలాంటి క్యారెక్టర్ లేని ప్రిన్సిపాల్ గురించి ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటారా అని తాము నిలదీయడంతో.. అప్పుడు తెల్లకాగితం తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారని రోజా చెప్పారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..
  •  
  • మంత్రి గంటా శ్రీనివాసరావు నిర్లక్ష్యం వల్ల, ఇతర మంత్రుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు పోయాయి.
  • ర్యాగింగ్ భూతం టీడీపీ ప్రభుత్వంలో రెక్కలు విప్పుకొని పిల్లల ప్రాణాలు హరిస్తోంది.
  • ఇది కేవలం నాగార్జున వర్సిటీకి మాత్రమే పరిమితం కాదని మొన్నే చెప్పాం.
  • నిన్న వట్టిచెరుకూరులో సునీత అనే మరో విద్యార్థిని ర్యాగింగ్ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకుంది.
  • కాలేజిలోనే ఒక పెట్రోలింగ్ వాహనం అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
  • ఎవరైనా ర్యాగింగ్ గురించి ఓరల్ గా చెప్పినా కూడా చర్య తీసుకోవాలని కోరాం.
  • బాబూరావును ఎ1గా ప్రకటించి వెంటనే అరెస్టుచేయాలని డిమాండ్ చేస్తున్నాం.
  • వైఎస్ఆర్ సీపీ నిజనిర్ధారణ కమిటీ, విద్యార్థి, మహిళా విభాగాలు రిషితేశ్వరికి న్యాయం జరగాలని ఇక్కడకు వచ్చాయి.
  • ప్రభుత్వ ఒత్తిడి వల్లే ఇలా జరుగుతోందని తెలిసింది.
  • వీసీతో మాట్లాడితే అసలు విషయం తెలిసింది. ప్రభుత్వం కేసును నీరుగార్చాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసింది.
  • ఎన్ని ప్రాణాలు పోతున్నా. వీసీ మాత్రం ఆయనకు రాసిచ్చిన స్క్రిప్టే చదువుతున్నారు.
  • పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అడిగితే, పోలీసులే చూసుకుంటారన్నారు.
  • లెక్చరర్లను కూడా లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్ ను కాపాడేందుకు ప్రయత్నించారు.
  • ప్రిన్సిపాల్ బాబూరావు హాయ్ ల్యాండ్ కు వెళ్లిన విషయం తనకు తెలియదంటారు వీసీ.
  • అసలు ప్రిన్సిపాల్ యూనివర్సిటీ కాంపౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లినందుకు కేసు పెట్టాల్సి ఉన్నా పెట్టలేదు.
  • డేవిడ్ రాజు లాంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు గట్టిగా అడుగుతున్నారని ఆయన్ను ఇక్కడినుంచి తరిమేసిన విషయం నిజం కాదా అని అడుగుతున్నాము.
  • డేవిడ్ రాజును తరిమేయడానికి, పిల్లల్ని అరెస్టు చేయించడానికి హక్కులున్నాయి గానీ.. ప్రిన్సిపాల్ మీద ఫిర్యాదు చేసే హక్కు లేదా అని అడుగుతున్నాం.
  • రిషితేశ్వరి మరణానికి ప్రిన్సిపాలే ప్రత్యక్షంగా కారణం.

ప్రత్యేక హోదా సాధించే వరకూ ఉద్యమం ఆగదు

కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేవరకూ ఉద్యమం ఆగదని వైఎస్‌ఆర్ సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కమలాపురం, కడప ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా స్పష్టం చేశారు. స్థానిక వైఎస్ గెస్ట్ హౌస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు కలిసి తమ స్వార్థం కోసం ఉమ్మడి రాష్ట్రాన్ని ముక్కలు చేశాయన్నారు. రాజధాని లేకుండా విభజించిన ఏకైక రాష్ట్రం ఇదేనన్నారు. 60 ఏళ్లపాటు ఇరురాష్ట్ర ప్రజలు కలిసి నిర్మించుకొన్న హైదరాబాద్ రాజధానిని తెలంగాణకు ఇవ్వడం బాధాకరమన్నారు.

పార్లమెంటులో విభజన అంశాన్ని టేబుల్ ఎజెండాగా ప్రవేశపెట్టి, తలుపులు వేసి అత్యంత దుర్మార్గంగా విభజన చేసిన నీచ చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కట్టడి చేయడానికే వారు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబేనని నిందించారు. తెలంగాణ వారు కోరక మునుపే తమకు సమ్మతమేనని టీడీపీ పొలిట్‌బ్యూరోలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలు అయ్యాక రెండు కళ్ల సిద్ధాంతమంటూ ఇరు రాష్ట్రాల ప్రజలను మోసగించారని మండిపడ్డారు. ఆనాడు రాజ్యసభలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తే ఐదేళ్లు సరిపోదు, పదేళ్లు కావాలని పట్టుబట్టిన బీజేపీ ఈనాడు మాట తప్పడం దారుణమన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఒక్కటే ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధితో పోరాటం చేస్తోందని తెలిపారు. ఎన్డీయేలో టీడీపీ భాగస్వామ్యపక్షంగా కొనసాగుతున్నందున ఆ పార్టీ అధ్యక్షుడుగానీ, ఆ పార్టీ ఎంపీలుగానీ ప్రత్యేక హోదాపై మాట్లాడే పరిస్థితి లేదన్నారు. ప్రత్యేక హోదా రాకపోతే ప్రత్యేక ప్యాకేజీ తెస్తామని టీడీపీ చెప్పడం సరికాదన్నారు.

ఆ ప్రత్యేక ప్యాకేజీ చంద్రబాబు వ్యక్తిగత ప్యాకేజీనా, పార్టీ ప్యాకేజీనా చెప్పాలన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ హామీని కూడా కేంద్రం నెరవేర్చలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఏ ఒక్కచోటా ప్రత్యేక హోదాపై మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రజలందరూ పార్టీలకతీతంగా దీనిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 10వ తేది ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కడప మేయర్ కె. సురేష్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి జి. రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ఎస్సీ విభాగం జిల్లా కన్వీనర్ పులి సునీల్‌కుమార్ పాల్గొన్నారు.

ప్రతిపక్ష ధర్నా విఫలం చేసేందుకు టీడీపీ కుట్ర

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 12న ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాను విఫలం చేసేందుకు కేంద్రమంత్రులు సుజనాచౌదరి, వెంకయ్యనాయుడు కుట్రలు పన్నుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు.

కరువు ప్రాంతాలుగా అన్ని మండలాలు


కరువు ప్రాంతాలుగా అన్ని మండలాలు
* ప్రకటన కోరుతూ వైఎస్సార్‌సీపీ నేత పార్థసారథి డిమాండ్
* ఏడాది పొడవునా ‘ఉపాధి’ పథకాన్ని అమలు చేయాలి
* కరువుతో రైతులు అల్లాడుతుంటే బాబు విదేశీ పర్యటనలా..

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు విలయతాండవం చేస్తున్నందున అన్ని మండలాల్నీ కరువు ప్రాంతాలుగా ప్రకటించి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో వందరోజుల ఉపాధికి బదులుగా ఏడాది పొడవునా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని(ఎన్‌ఆర్‌ఈజీఎస్) అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అంతేగాక కేంద్రం లేదా రాష్ట్రప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో గ్రామాల్లో సహాయక పనులు చేపట్టాలని కోరారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువుతో అల్లాడుతున్న రైతులను విస్మరించి సీఎం చంద్రబాబు విదే శాల్లో విహార యాత్రలకు వెళ్లడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి అని, ఆయనకేమాత్రం వ్యవసాయంపై శ్రద్ధ లేదని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో ఖరీఫ్ వ్యవసాయ రుణాలకు సంబంధించి ఏటా మే 15 నాటికి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరగాల్సి ఉండగా జూన్ చివరినాటికిగానీ నిర్వహించలేదని, దీనినిబట్టి ఆయనకు రైతులపై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం సాగర్ నుంచి నీరు విడుదల కాకుండా కృష్ణా డెల్టా రైతులకు అన్యాయం చేస్తున్నా, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని యథేచ్ఛగా చేస్తూ రాయలసీమకు నష్టం కలిగిస్తున్నా చంద్రబాబు పట్టించుకోవట్లేదని విమర్శించారు.
 
బాబొస్తే కరువొస్తుందనేది నిజమైంది
బాబొస్తే జాబొస్తుందని ఎన్నికల్లో చెప్పారని, ఇపుడు ఎవరికీ జాబు రాకపోయినా.. బాబొస్తే కరువొస్తుందనేది నిజమైందని పార్థసారథి వ్యంగ్యంగా అన్నారు. చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో ఆరేళ్లు కరువొచ్చిందని, ఇపుడు ఆయన రావడంతోనే తిరిగి కరువు ప్రారంభమైందని చెప్పారు.

కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ


కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ
 నరసరావుపేటవెస్ట్ : ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం నరసరావుపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించింది. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మోసగిస్తున్న బీజేపీ, టీడీపీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ర్యాలీ అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఆర్డీవో యం.శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే గోపిరెడ్డి, ఇతర నాయకులు వినతిపత్రం సమర్పించారు. ప్రత్యేక హోదా కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో చేపట్టనున్న దీక్షకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.

ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కనీసం రాజధాని కూడా లేకుండా వెంటిలేటర్‌పై ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తే ఆక్సిజన్‌లా పనిచేస్తుందని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు కలసి సమైక్యాంధ్ర ఉద్యమం తరహాలో పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసి అన్యాయం చేసిందన్నారు. విద్యార్థులకు ఉద్యోగాలు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, రాజధాని కోసం నిధులు, రైతులకు ప్రయోజనాలు.. ఇవన్నీ ప్రత్యేక హోదాతోనే సాధ్యమని వివరించారు.

రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పార్లమెంటులో ఐదేళ్లపాటు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పిస్తామని ప్రకటిస్తే, సభలో ఉన్న ఇప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పదేళ్లు కావాలని, తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని వాగ్దానం చేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ ప్రత్యేక హోదాపై సానుకూల ప్రకటన చేయకుండా కేంద్రమంత్రులు, టీడీపీ ఎంపీలు తలో మాట మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.

కార్యక్రమంలో సీనియర్ నాయకులు కపలవాయి విజయకుమార్, షేక్.ఖాజావలి మాస్టారు, జెడ్పీటీసీ సభ్యుడు షేక్.నూరుల్‌అక్తాబ్, ఎంపీపీ కొమ్మాలపాటి ప్రభాకరరావు, రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్, జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యస్.సుజాతాపాల్, కార్యదర్శి బాపతు రామకృష్ణారెడ్డి, పట్టణ కన్వీనర్ యస్.ఏ.హనీఫ్, మండల కన్వీనర్ కొమ్మనబోయిన శంకరయాదవ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ సైదావలి, మున్సిపల్ ప్లోర్‌లీడర్ మాగులూరి రమణారెడ్డి, యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.గాబ్రియేలు, న్యాయవాదులు కె.రామ్మోహన్, కె.బాలాహనుమంతారెడి, శ్రీనివాసరెడ్డి, పట్టణ మైనార్టీ కన్వీనర్ షేక్.ఖాదర్‌బాషా, పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు సానికొమ్మ కోటిరెడ్డి, పట్టణ కార్యదర్శి యం.నరసింహారెడ్డి, రొంపిచర్ల మండల నాయకులు గెల్లి బ్రహ్మారెడ్డి, అన్నెం పున్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజలను గాలికొదిలి బాబు పర్యటనలు సిగ్గుచేటు

Written By news on Wednesday, August 5, 2015 | 8/05/2015


'ప్రజలను గాలికొదిలి బాబు పర్యటనలు సిగ్గుచేటు'
హైదరాబాద్: రైతులు సమస్యలతో సతమతమవుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్లడం సిగ్గుచేటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. ఏపీ ప్రజలను గాలికొదిలేశారని, చంద్రబాబు నిర్వాకం వల్ల కృష్ణా, గోదావరి డెల్టాలు ఎడారిలుగా మారిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తున్నా చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ అంతా బీడు భూమిగా మారిపోయిందని అన్నారు. ఏపీలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకంటించాలని, కార్మికులందరికి ఎన్ఆర్ఈజీఎస్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని కోరారు.  

మహిళల రక్షణ వదిలి విలాసాలా


'మహిళల రక్షణ వదిలి విలాసాలా'
చిత్తూరు: ఎన్నికలకు ముందు మహిళల రక్షణ కోసం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. అంగన్ వాడి ఉద్యోగులు వేతనాలు పెంచి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా.. వారి ఉద్యోగాలు కూడా తొలగిస్తున్నారని చెప్పారు.

బాలికల సంరక్షణ పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని, తన స్నేహితుని కుమార్తె జరీనా బేగం చావు బతుకుల మధ్య ఉన్నా పట్టించుకోవడం లేదని రోజా ఆరోపించారు. గోదావరిలో 27మందిని చంపి, రిషితేశ్వరి మరణానికి కారకులైనవారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే విదేశాలకు విలాసాలకోసం వెళ్లాడని ఆరోపించారు.

జనం పిట్టల్లా రాలుతున్నా పట్టించుకోరా?


జనం పిట్టల్లా రాలుతున్నా పట్టించుకోరా?కృష్ణా జిల్లా కొత్తమాజేరులో మాట్లాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
* వారం రోజుల్లో ఏపీ సర్కార్ స్పందించకపోతే కలెక్టరేట్ వద్ద బాధిత కుటుంబాలతో ధర్నా చేస్తా
కృష్ణాజిల్లా కొత్తమాజేరులో మృతుల కుటుంబాలకు, జ్వర పీడితులకు జగన్ పరామర్శ

 
 సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘జ్వరాలతో జనం పిట్టల్లా రాలుతుంటే ఈ  ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదు. రెండున్నర నెలల్లో ఏకంగా 18 మంది చనిపోతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గాని కన్నెత్తి చూడలేదు. చంద్రబాబుకు వారం టైమిస్తున్నా. ఈలోపు స్పందించకపోతే 18 మంది మృతుల కుటుంబాల తరపున నేను పోరాడతా. వారితో కలిసి బందరు కలెక్టరేట్ దగ్గర నేనే ధర్నా చేస్తాను’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.
 
 కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామంలో ఈ ఏడాది మే 11 నుంచి జూలై 21 వరకు 18 మంది జ్వరాల బారిన పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ప్రతిపక్ష నేత జగన్ మంగళవారం గ్రామానికి చేరుకుని మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు, అధికారులతో మాట్లాడారు. ఆ విషయాలు ప్రతిపక్షనేత మాటల్లోనే...
 
గ్రామంలో 70 రోజులుగా జ్వరాలతో బాధపడుతుంటే ఆసుపత్రిలో చేర్పించే దిక్కులేదు. ఊళ్లో మనుషులు పిట్టల్లా రాలిపోతుంటే కనీసం అధికారులు స్పందించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గ్రామంలో ధర్నా చేసి, తీవ్రతను కలెక్టర్, డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకుని వెళ్తే అప్పుడు కాస్తోకూస్తో కదలిక వచ్చింది. హెల్త్ క్యాంపులు పెట్టారు. 15రోజులు మెడికల్ క్యాంపులు పెట్టి మందులు ఇచ్చినా జ్వరాలు అదుపులోకి రాలేదు. విజయవాడ, మచిలీపట్నం వెళ్లి వేలాదిరూపాయలు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకున్నా చాలా మంది ప్రాణాలు దక్కలేదు. సరైన వైద్యం అందించలేని ప్రభుత్వం జ్వర పీడితులకు రూపాయి కూడా సహాయం చేయలేదు. ఇప్పుడు నేను వస్తున్నానని హడావుడిగా చెరువు బాగు చేయించి, మెడికల్ క్యాంపులో డాక్టర్‌ను పెట్టారు. అసలు చనిపోయిన వారు జ్వరాలతో చనిపోలేదనే ధోరణితో వారి మృతికి వేరే అనారోగ్య కారణాలు అని చూపించే దుర్మార్గపు ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?
 
  గ్రామంలో వాటర్ ట్యాంకు బాగు చేసేందుకు ఉండే ఇనుప నిచ్చెన విరిగిపోయింది. 15 రోజులకు ఒకసారి ట్యాంకు క్లీన్ చేయించాల్సి ఉండగా క్లీన్ చేసి ఐదేళ్లవుతోందని గ్రామస్తులే చెబుతున్నారు. దాన్ని ఇప్పుడు హడావుడిగా రిపేరు చేయించారు. ట్యాంకులో కోతుల కళేబరాలు కుళ్లిపోయి ఉన్నాయంటే ఈ ప్రభుత్వ యంత్రాంగం ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమవుతోంది. మంచినీటి చెరువును ఏడాదికొకసారి క్లీన్ చేసి, బ్లీచింగ్ చేయించాల్సి ఉండగా క్లీన్‌చేసి ఐదేళ్లకు పైనే అయింది. 18 మంది చనిపోయాక వచ్చి
 క్లీన్ చేశారు.
 
  మే నెలలో కేవలం నాలుగు రోజుల్లో ఐదుగురు జ్వరాలకు చనిపోయినప్పుడే ప్రభుత్వం మేల్కొని ఉంటే ఇంతమంది చనిపోకుండా కాపాడి ఉండవచ్చు. కంటితుడుపు చర్యగా మెడికల్ క్యాంపు పెట్టి వదిలేశారు. మందులు తింటున్నా ప్రజలు చనిపోతున్నారు. ఇంత తీవ్రమైన విషజ్వరాలు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నామనే కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేదు. పుష్కరాల్లో చాలా కష్టపడిపోయాను అనుకున్న చంద్రబాబు నాయుడు పుష్కరాల తరువాత సెలవు తీసుకుని విదేశాలకు వెళ్లిపోయారు. ఈ జిల్లాకే చెందిన ఆరోగ్య మంత్రి కూడా ఈ రోజు వరకూ గ్రామానికి రాలేదు.
 
  కొత్త మాజేరు గ్రామంలో జరిగే జ్వరాల చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఈ గ్రామానికి ఏదో సూదుల డాక్టర్‌ను కాకుండా స్పెషలిస్ట్‌లను పంపాలి. జ్వర పీడితులకు విజయవాడ, మచిలీపట్నంలలో ప్రత్యేకంగా ఉచిత వైద్యం చేయించాలి. గ్రామం అంతటా జ్వరాలు అదుపులోకి వచ్చేలా ప్రజల ఆరోగ్య పరిస్థితి నార్మల్‌గా ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలి. అయ్యా... చంద్రబాబు నాయుడూ... ఇప్పటికైనా కళ్లు తెరవండి. లేకుంటే వారం రోజులు చూస్తాం. మేమే బాధిత కుటుంబాలతో కలెక్టరేట్ దగ్గర ధర్నాకు దిగుతాం.
 
 దారిపొడవునా అపూర్వ స్వాగతం..
 కొత్తమాజేరులో జ్వర మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దారిపొడవునా జనం అపూర్వ స్వాగతం పలికారు.  జగన్ వెంట పార్టీ రాష్ట్ర నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మోపిదేవి వెంకటరమణ, తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, కొక్కిలిగడ్డ రక్షణనిధి, మేకా ప్రతాప్ అప్పారావు, జలీల్‌ఖాన్, అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు, వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి.గౌతంరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి రాధాకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల రాము తదితర నేతలు ఉన్నారు.
 
 కదిలిస్తే కన్నీరే...
 సాక్షి, విజయవాడ బ్యూరో: జ్వరంతో వణికిపోతున్న కొత్తమాజేరు గ్రామ పరిస్థితి తెలుసుకున్న వైఎస్ జగన్ గ్రామానికి కదలి వెళ్లారు. ఆదుకోవాల్సిన ఏపీ  సర్కారు అలక్ష్యం చేయడంతో వేలకు వేలు ఖర్చుపెట్టినా తమ వారి ప్రాణాలు నిలబెట్టుకోలేకపోయామంటూ కన్నీరు మున్నీరైన బాధిత కుటుంబాల దయనీయ స్థితి చూసి ఆయన చలించిపోయారు. రెండున్నర నెలల్లో 18మందిని కోల్పోయిన గ్రామస్తులను ఓదార్చారు. ఒక్కొక్కరూ ఎలా మృతిచెం దారో కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.
 
 వారికి న్యాయం జరిగేవరకూ పోరాడతానంటూ కొండంత భరోసా ఇచ్చారు. గ్రామంలో మామూలు పరిస్థితి నెలకొనేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. గ్రామంలో మంచినీటి ట్యాంకు, చెరువు వద్ద తహసీల్దార్ స్వర్ణమేరి, ఎంపీడీవో జానకీదేవి, డీఎల్‌పీవో సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రవికుమార్, ఎంపీటీసీ రూపా శిరీషలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో మృతుల కుటుంబాలతో ఆయన మాట్లాడి కొండంత ధైర్యం చెప్పారు. జ్వరాలతో తమ వాళ్లను కోల్పోయామంటూ మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపించాయి.

మాజేరుకు బాసట


మాజేరుకు బాసట
విషజ్వరాలు ప్రాణాలను హరిస్తుంటే బెంబేలెత్తి పోతున్న చల్లపల్లి మండలం కొత్తమాజేరు వాసులకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వారికి బాసటగా నిలిచారు. జ్వరమరణాలకు గురైనవారి కుటుం బాలను తక్షణం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల తరఫున పోరాటాలకు సిద్ధమని స్పష్టం చేశారు.

- చల్లపల్లి మండలంలో పర్యటించిన వైఎస్ జగన్
- విషజ్వర మృతుల కుటుంబాలకు పరామర్శ
- గోడు వెళ్లబోసుకున్న బాధితులు
- తక్షణం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జగన్
మచిలీపట్నం :
 చల్లపల్లి మండలం కొత్తమాజేరులో విషజ్వరాల బారిన పడి రెండున్నర నెలల వ్యవధిలో 18 మంది మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. కొత్త మాజేరులోని తాగునీటి చెరువు పక్కన ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మృతుల కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఒక్కొక్క పేరు చదువుతూ.. మృతులు ఎన్ని రోజుల పాటు జ్వరం బారినపడ్డారు.. ఎక్కడ వైద్యం చేయించుకున్నారు.. ఎంత ఖర్చు చేశారు.. ప్రభుత్వ సాయం అందిందా.. వైద్యశాఖ మంత్రి గ్రామానికి వచ్చారా, లేదా అనే వివరాలను బంధువుల నుంచి సేకరించారు. మృతులంతా విషజ్వరం బారిన పడే చనిపోయారని, ఎంత డబ్బు ఖర్చుచేసినా ప్రాణాలు దక్కలేదని ప్రతి ఒక్కరూ చెప్పారు.
 
ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుంది : జగన్
బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరించిన జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ‘ప్రభుత్వం స్పందించదు. వైద్యశిబిరంలో ఇచ్చిన మందులు పనిచేయవు. మృతుల కుటుంబాలకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి సాయం అందించలేదు.’ అని విమర్శించారు. ఈ సందర్భంగా బాధితులు ప్రభుత్వం వైద్యం శిబిరం ఏర్పాటుచేసిన తర్వాత కూడా మరణాలు సంభవించాయని వివరించారు. ఒకేరోజు గంటల వ్యవధిలోనే జంధ్యం జయలక్ష్మి, ఆమె భర్త శ్రీరాములు మరణించారని, దీంతో శ్రీరాములు తల్లి నాగేశ్వరమ్మ, కుమార్తె సీతమ్మ అనాథలుగా మిగిలారని గ్రామస్తులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. చేనేత పనిచేసే శ్రీరాములు తల్లి, కుమార్తెను పోషించేవారని, ఆయన మరణంతో ఆ ఇద్దరికీ దిక్కు లేకుండా పోయిందని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ‘వీళ్ల ఉసురు ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుంది.’ అన్నారు.
 
చెరువు పరిశీలన
కొత్తమాజేరు చేరుకున్న జగన్ 18 మంది మరణించడానికి గల కారణాలు, గ్రామంలో నెలకొన్న పరిస్థితులను తహశీల్దార్ స్వర్ణమేరి, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రవికుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఉన్న వాస్తవాలను తెలియజేయాలని, ఎవరికీ భయపడవద్దని చెప్పారు. చెరువులోని నీరు కలుషితం కావటం వల్లే విషజ్వరాలు ప్రబలాయని, ఈ విషయంపై ముందస్తుగానే హెచ్చరించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), కొక్కిలిగడ్డ రక్షణనిధి, మేకా వెంకటప్రతాప్ అప్పారావు, ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు రాధాకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని), పార్టీ నాయకులు సామినేని ఉదయభాను, సింహాద్రి రమేష్‌బాబు, దూలం నాగేశ్వరరావు, జోగి రమేష్, ఉప్పాల రాంప్రసాద్, ఉప్పాల రాము, కాజ రాజ్‌కుమార్, తలశిల రఘురామ్, తాతినేని పద్మావతి, ఆయా మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
రుణమాఫీ జరగలేదు
చల్లపల్లి మీదుగా ఘంటసాల మండలం లంకపల్లికి చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి ఘంటసాల మండల అధ్యక్షుడు వేమూరి వెంకట్రావు, సర్పంచి మాడెం నాగరాజు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కనుమూరి బుజ్జి అనే మహిళ మాట్లాడుతూ ‘బాబూ నీకు ఓటేశామనే కారణంతో బ్యాంకులో బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రూ.10వేల రుణాన్ని మాఫీ చేయలేదు.’ అని వివరించారు. రైతులకూ పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అధికారాన్ని దక్కించుకునేందుకు చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో అమలుకాని హామీలు ఇచ్చారని, రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని, రాబోయే రోజులు మనవేనని భరోసా ఇచ్చారు.

'అనంత'లో వైఎస్ఆర్ సీపీ నేతపై ఎస్ఐ దాడి

అనంతపురం(నల్లచెరువు): అనంతపురంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై వేధింపులు ఆగడంలేదు. రక్షణగా ఉండాల్సిన పోలీసులు అధికారపార్టీ అండ చూసుకుని చెలరేగిపోతున్నారు. తాజాగా..నల్లచెరువులో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ రవికుమార్ రెడ్డిపై ఎస్‌ఐ నరేంద్రభూపతి దాడి చేశారు. రవి మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన పొలం నుంచి ఇన్నోవా కారులో వస్తుండగా సీటు బెల్టు ఎందుకు పెట్టుకోలేదని నానా బూతులు తిట్టాడు.
ఇదేమిటి అని అడిగిన రవిపై ఎస్ ఐ చేయిచేసుకున్నాడు. కారును పాక్షికంగా ధ్వంసం చేశాడు. ఊరు వదిలి వెళ్లకపోతే నీ అంతు చూస్తానని ఎస్‌ఐ బెదిరించాడు. గాయాలైన రవి కదిరి ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. వైఎస్సార్‌సీపీ కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా బుధవారం ఉదయం రవిని పరామర్శించారు. సర్పంచ్ పై దాడిని ఆయన ఖండించారు.
 

మధ్యప్రదేశ్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

హైదరాబాద్: మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 160 కిలోమీటర్ల దూరంలోని ఖిర్కియా-హర్దా స్టేషన్ల మధ్య మాచక్ నదిపై బ్రిడ్జిని దాటుతూ రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు అర్ధరాత్రి పట్టాలు తప్పి, రెండు రైళ్ల ఇంజన్లతో పాటు ఏకంగా పదికి పైగా బోగీలు నదిలోకి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 30 మంది మరణించగా, చాలామంది గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

అరాచకం..!

Written By news on Tuesday, August 4, 2015 | 8/04/2015


అరాచకం..!
- వర్సిటీ వద్ద వైఎస్సార్ సీపీ బృందాన్ని అడ్డుకున్న  పోలీసులు
- లోపలకు అనుమతి లేదంటూ ప్రధాన ద్వారం వద్ద నిలిపివేత
- అధికారుల తీరుపై మండిపాటు...అక్కడే ధర్నాకు దిగిన నేతలు
- లోపాలను కప్పిపుచ్చుకొనేందుకే నిరాకరిస్తున్నారని ధ్వజం
- గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన బృందం సభ్యులు
ఏఎన్‌యూ: 
ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి ఘటనపై జరుగుతున్న ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యాన్ని, తప్పులను ప్రశ్నించటానికి వస్తే యూనివర్సిటీ గేటు బయటే అడ్డుకుంటారా అంటూ వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. ఈ ఘట నపై వైఎస్సార్ సీపీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు కె పార్ధసారథి, వంగవీటి రాధా, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మహ్మద్ ముస్తఫాలు ఇన్‌చార్జి వీసీని కలిసేందుకు సోమవారం యూనివర్సిటీకి వచ్చారు. లోపలకు వెళ్లటానికి అనుమతి లేదని, వర్సిటీ ఉన్నతాధికారులు చెబితేనే అనుమతిస్తామని పోలీసులు, వర్సిటీ ఇంజినీరింగ్ సిబ్బంది వైఎస్సార్ సీపీ బృందాన్ని ప్రధాన ద్వారం వద్ద నిలిపివేశారు.  

ఇన్‌చార్జి వీసీని కలిసేందుకు ఒక రోజు ముందుగానే అనుమతి తీసుకున్నామని వైఎస్సార్ సీపీ బృందం వీరికి తెలిపింది. విషయాన్ని రిజిస్ట్రార్‌కు తెలిపి వారు పంపమంటే పంపుతామని పోలీసులు స్పష్టం చేశారు. ఎంతకూ లోపలకు అనుమతించకపోవటంతో వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద నాయకులు బైఠాయించి ధర్నా చేశారు. యూనివర్సిటీ, ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడుతూ పోలీసులు, వర్సిటీ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే యూనివర్సిటీలో ఉన్న లోపాలను కప్పిపుచ్చుతున్నారని తేటతెల్లమవుతుందన్నారు.

ఒకప్పుడు యూనివర్సిటీలోకి పోలీసులు రావాలంటే అధికారుల అనుమతి అవసరమని నేడు యూనివర్సిటీలోకి సామాన్యులు వెళ్లటానికి పోలీసుల అనుమతి కావాల్సి రావటం దురదృష్టకరమన్నారు.వర్సిటీలో కుల, మతతత్వం వేళ్లూనుకుందని, భారీగా నిధుల దుర్వినియోగం, అవకతవకలు జరు గుతున్నాయని ఆరోపించారు. ఉన్నతాధికారులను కలిసే వరకు వెనక్కు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. దీంతో కాలినడకన వెళ్లి ఉన్నతాధికారులను కలిసేందుకు అనుమతి ఇచ్చారు. అనంతరం ఇన్‌చార్జి వీసీ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి రాజశేఖర్‌లను కలసిన బృందం యూనివర్సిటీలో పోలీసు బలగాలను మొహరించాలని, రాకపోకల్లో ఆంక్షలు విధించాలని, విద్యార్థులకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల కాపీలను చూపించాలని డిమాండ్ చేశారు.

దీనికి రిజిస్ట్రార్ స్పందిస్తూ ఆ ఆదేశాలను ప్రభుత్వం తరువాత లిఖిత పూర్వకంగా పంపుతామని చెప్పిందన్నారు. యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉందని హాస్టల్ వార్డెన్ బహిరంగంగా చెప్పారని, ప్రిన్సిపాల్ బాబురావు మాత్రం అలాంటిదేమీలేదంటున్నారని వైఎస్సార్ సీపీ బృందం పేర్కొంది.  వీటిపై యూనివర్సిటీ స్పందించకపోతే గవర్నర్, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తామని విలేకరులు అడిగిన ప్రశ్నకు పార్థసారధి బదులిచ్చారు. వర్సిటీకి వెళ్లిన వారిలో వైఎస్సార్‌సీపీ నేతలు పార్ధసారథి, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, వంగవీటి రాధా, ఎమ్మెల్యే ముస్తఫా, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పాను గంటి చైతన్య, యువజన విభాగం నగర అధ్యక్షులు ఎలికా శ్రీకాంత్, నాయకులు మే రువ నర్సిరెడ్డి, కోటా పిచ్చిరెడ్డి, గులాంరసూల్, షేక్ జానీ తదితరులు ఉన్నారు.

పీబీసీకి ఏటా అన్యాయమే


పీబీసీకి ఏటా అన్యాయమే
అనంతపురం కలెక్టర్‌కు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి లేఖ
పులివెందుల : 
పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) పరిధిలోని రైతులకు ప్రతి ఏడాదీ అన్యాయమే జరుగుతోందని, ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగు, తాగు నీటిని పూర్తి స్థాయిలో కోటా మేరకు సరఫరా చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌కు లేఖ రాశారు. (తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ ద్వారా వచ్చే నీటిని కోటా మేరకు అనంతపురం అధికారులు పీబీసీకి విడుదల చేస్తారు) ఈ సందర్భంగా ఆయన పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించిన పలు విషయాలను లేఖలో పొందుపరిచారు.

సీబీఆర్, పీబీసీకి నీరు విడుదలయ్యే ప్రాంతాలు తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలోని హైలెవెల్ కెనాల్‌కు చివరి భాగంలో ఉన్నాయని, పీబీసీ ద్వారా 55,579 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందన్నారు. అయితే ఐదేళ్లుగా సాగు నీరు అరకొరగా సరఫరా చేస్తున్నారన్నారు. దీనివల్ల రైతులు సంప్రదాయ పంటలను పండించడం మాని, పండ్ల తోటలను సాగు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో వర్షాభావ పరిస్థితుల వల్ల బోర్లలో నీరు అడుగంటి చీనీ చెట్లు ఎండిపోయాయన్నారు.

దీంతో తాగునీటికి కూడా కొరత ఏర్పడిందన్నారు. నియోజకవర్గంలోని సాగు, తాగునీటికి 2015-16 సంవత్సరానికి 3.23టీఎంసీలు కేటాయించినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కేటాయించిన నీరు మిడ్ పెన్నార్ నుంచి సీబీఆర్‌కు రావాల్సి ఉందన్నారు. మిడ్ పెన్నార్ నుంచి సీబీఆర్‌కు 98 కిలోమీటర్లు నీరు పారే సమయంలో ఆవిరి, ఇంకిపోవడం వల్ల దాదాపు 45 శాతం నీటిని నష్టపోతున్నామని వివరించారు.
 
పీబీసీకి కేటాయించిన నీటిని ఇతర ప్రాంతాల ప్రజలు ఆక్రమంగా వాడటం వల్ల నియోజకవర్గంలోని రైతాంగం తీవ్రంగా నష్టపోతోందన్నారు. ప్రవాహ నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని విడతల వారీగా కాకుండా నీటిని ఒకేసారి వదలాలని తాను గతంలోనే కోరానన్నారు. సీబీఆర్‌కు సంబంధించి ప్రతి ఏడాది తాగునీటి అవసరాలకు 1.73 టీఎంసీల స్థిర జలాలు కేటాయించాలన్నారు. భూగర్భ జలాలు అడుగంటిన దృష్ట్యా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు.

మిడ్ పెన్నార్ వద్ద 1.82 టీఎంసీల నీటిని విడుదల చేస్తే సీబీఆర్‌కు వచ్చేసరికి ఒక టీఎంసీ మాత్రమే చేరుతోందన్నారు. తుంపెర్ డీప్‌కట్ వద్ద సీబీఆర్ ప్రవేశం దగ్గర నీటి ప్రవాహ విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొందన్నారు. వాటర్ రీడింగ్ స్కేలు క్రాస్‌గా ఉండటం వల్ల 20 శాతం నీటిని నష్టపోతున్నామన్నారు. అందువల్ల మిడ్ పెన్నార్ నుంచి 4.97 టీఎంసీల నీటిని సీబీఆర్, పీబీసీలకు విడుదల చేయాలని కోరారు.

రిషితేశ్వరి కేసులో దోషుల్ని రక్షించేందుకు కొందరి ఆరాటం


న్యాయం జరిగే వరకు పోరు
రిషితేశ్వరి కేసులో దోషుల్ని రక్షించేందుకు కొందరి ఆరాటం
వైఎస్సార్ సీపీ నేతల మండిపాటు
పార్టీ నిజనిర్ధారణ కమిటీని ఏఎన్‌యూ గేటు వద్దే నిలిపివేత
నిరసనగా ధర్నా చేసిన నేతలు
సిటింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ జరపాలని డిమాండ్

ఏఎన్‌యూ: ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో అసలు దోషులను రక్షించేందుకు యూనివర్సిటీ, ప్రభుత్వ అధికారులు ఆరాటపడుతున్నారని, అందుకే ఆంక్షలు విధిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు.

ఈ కేసులో న్యాయం జరిగేవరకు పోరాడతామని స్పష్టంచేశారు. రిషితేశ్వరి మృతిపై వైఎస్సార్ సీపీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు కె.పార్థసారథి, వంగవీటి రాధాకృష్ణ, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా అధికారులను కలిసేందుకు సోమవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)కి వచ్చారు. వీరిని ప్రధాన ద్వారం వద్ద పోలీసులు, వర్సిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పార్టీ నేతలు అక్కడే ధర్నా చేసి, యూనివర్సిటీ, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం పోలీసుల అనుమతితో లోపలికి వెళ్లిన నేతలు ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.ఆర్.ఎస్.సాంబశివరావును, రిజిస్ట్రార్‌ను కలసి పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు సెలవుల్లో ఉండగా కమిటీలు విచారణ జరపడం ఏమిటని ప్రశ్నించారు. ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావును రక్షించేందుకు ప్రభుత్వ డెరైక్షన్‌లో వర్సిటీ అధికారులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. వర్సిటీ నిజనిర్ధారణ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని కోరారు.

ప్రభుత్వ అనుమతి తీసుకుని నివేదిక ఇస్తామని విసీ తెలిపారు. రిషితేశ్వరి మృతిపై సిటింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని, దీనికి వెంటనే వర్సిటీ పాలకమండలి ఆమోదం తెలపాలని నేతలు డిమాండ్ చేశారు. ఈనెల 6వ తేదీన తమపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మరోసారి యూనివర్సిటీలో పర్యటిస్తారని, అదేరోజు బాలసుబ్రహ్మణ్యం కమిటీ ముందు వాదనలు, అనుమానాలు తెలియజేస్తారని ఇన్‌చార్జి వీసీకి తెలిపారు.

వైఎస్సార్ సీపీ నేతపై దాడి

Written By news on Monday, August 3, 2015 | 8/03/2015

తుని: అధికార టీడీపీ నాయకల ఆగడాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. అధికారం అండ చూసుకుని తెలుగు తమ్ముళ్లు ప్రత్యర్థులపై దాడులకు తెబడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా తుని మండలం చేవూరులో వైఎస్సార్ సీపీ నాయకుడు నాగేశ్వరరావుపై టీడీపీ నేతలు కత్తులతో దాడి చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి వెళుతున్న నాగేశ్వరరావుపై దుండగులు వెనుకాల నుంచి కత్తులతో దాడి చేశారు.

తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావును కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

‘ప్రైవేట్ ప్రజల’ రాజధాని


‘ప్రైవేట్ ప్రజల’ రాజధాని ఇది
సాక్షి, హైదరాబాద్: అందరూ ఊహించినట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నది ప్రజారాజధాని కాదు..ప్రైవేట్ రాజధాని అని తేలింది. కేపిటల్‌సిటీ మాస్టర్ ప్రణాళికే ఇది స్పష్టం చేసింది. భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)లో రైతుల నుంచి తీసుకున్న 35వేల ఎకరాలతోపాటు ప్రభుత్వానికి చెందిన అటవీ, దేవాదాయ శాఖల చెందిన మరో 19వేల ఎకరాల్లో సింహభాగం ప్రైవేట్ సంస్థలకు, రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి కట్టపెడుతోంది. మొత్తం 54వేల ఎకరాల్లో రహదారులు, గ్రామాల సెటిల్‌మెంట్స్, ప్రభుత్వ ఇనిస్టిట్యూషన్స్, మౌలిక సదుపాయాలు, సీడ్ కేపిటల్, వాటర్ బాడీలకు అవసరమయ్యే భూములను తప్ప మిగతా 21,870 ఎకరాలను సింగపూర్‌కు చెందిన కంపెనీలకు, ప్రైవేట్‌సంస్థలకు ఏకంగా 99ఏళ్ల పాటు లీజుకు కేటాయించనుంది.
 
ఆ భూముల్లో ఆ కంపెనీలు రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేయనున్నాయి. భూసమీకరణలో భాగంగా వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకోవడం, ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకేనని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలోనే అసెంబ్లీ సమావేశాల్లో వ్యక్తం చేసిన అనుమానాలు నిజమయ్యాయి.
 
 ప్రైవేటు సంస్థలకు...  రియల్ ఎస్టేట్‌కే ప్రాధాన్యం...
 
 భూసమీకరణలో మొత్తం 54,272 ఎకరాలను (రైతుల నుంచి సేకరించిన భూమితోపాటు దేవాదాయ తదితర ప్రభుత్వ భూములు కలిపి) ప్రభుత్వం తీసుకోనుందని, అందులో ఏ రంగానికి ఎన్ని ఎకరాలు కేటాయించాలో కేపిటల్‌సిటీ మాస్టర్‌ప్లాన్‌లో స్పష్టం చేశారు. ఈ మొత్తం భూమిలో పార్కులు, గ్రీనరీ, రోడ్డు, వాటర్‌బాడీల డెవలప్‌మెంట్‌కు సగం భూమి, మిగతా 27వేల ఎకరాల పైచిలుకులో ప్రస్తుతం గ్రామాలను కొనసాగించేలా 2,705 ఎకరాలు, సీడ్‌కేపిటల్‌కు 2,667 ఎకరాలు తీసివేస్తే, మిగతా 21,870 ఎకరాలను రియల్‌ఎస్టేట్, వాణిజ్య అవసరాలు, పరిశ్రమలు, హోటల్స్, మిశ్రమ వినియోగం, గోల్ఫ్‌కోర్స్, క్రీడా, రిక్రియేషన్ రంగాలతోపాటు నివాస ప్రాంతాల అభివృద్ధి పేరుతో ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం కట్టబెట్టనుంది. (వాణిజ్యరంగాలకు 3,550 ఎకరాలను, పరిశ్రమలకు 3,065, హోటల్స్‌కు 770, మిశ్రమ వినియోగానికి 682, గోల్ఫ్‌కోర్స్‌లకు 417, క్రీడారంగాలకి 430 ఎకరాలను కేటాయించింది. రిటైల్ రంగం పేరుతో 67 ఎకరాలను, రిజర్వ్ పేరిట 242 ఎకరాలను, వైట్‌సైట్ పేరుతో కేటాయించిన 35 ఎకరాలనూ వాణిజ్య, పరిశ్రమల రంగాలకు ఇవ్వనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి) ఈ భూములను ప్రైవేట్ డెవలపర్‌కు 99 ఏళ్లపాటు లీజుకు ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంటే.. ప్రభుత్వం రియల్ దందా చేసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తోంది.
 
 భూముల కేటాయింపులను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతోంది. మరోవైపు రియల్‌ఎస్టేట్‌లో భాగంగా ధనికవర్గాలకు జీ ప్లస్ 15 అంతస్థుల అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి 2,140 ఎకరాలను కేటాయించింది. ఈ భూమి కృష్ణా నదికి అభిముఖంగా ఉండాలని, అప్పుడే డెవలపర్‌ను, కొనుగోలు చేసుకునే వారిని ఆకర్షిస్తాయని ప్రణాళికలో పేర్కొన్నారు. అలాగే మధ్యతరగతి వర్గాల కోసం జీ ప్లస్ ఏడు అంతస్థుల భవనాల నిర్మాణం కోసం 9,435 ఎకరాలను కేటాయించారు. ఏ రైతులైతే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారో వారికీ ఇక్కడే ప్లాట్లను కేటాయిస్తారు. జీప్లస్ 7 అంతస్థుల నిర్మాణం రైతులు స్వయంగా చేసుకోలేరు కాబట్టి, వారు కూడా డెవలపర్లనే ఆశ్రయించాల్సి ఉంటుంది. కృష్ణానదికి అభిముఖంగా ప్రతిపాదించిన జీప్లస్ 15 కేటగిరీ ప్రాంతమే తొలుత డెవలపర్లను కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన భూములిచ్చిన రైతులకు ప్రతిపాదిస్తున్న జీప్లస్ 7 ప్రాంతం అభివృద్ధికి సంవత్సరాలపాటు నిరీక్షించక తప్పదు. దీన్ని పరిశీలిస్తే రాజధాని ప్రాంతంలో సామాన్యుడు కొద్ది స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు.
 
 స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలూ ప్రైవేటువే..
 
 పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుకు 847 ఎకరాలను, ప్రైవేట్ వర్సిటీల స్థాపనకు 1,037 ఎకరాలను కేటాయించారు. వీటన్నిటినీ ప్రైవేట్‌రంగంలోనే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయదని ఓ సీనియర్ మంత్రి తెలిపారు. అంటే.. ప్రభుత్వంలోని ఓ మంత్రి  కాలేజీల కోసం వందల ఎకరాలను కేటాయించేందుకేనని ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రజా రాజధాని అంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ, నూతన రాజధానిలో ఏ ఒక్క సామాన్యుడు గానీ, మధ్యతరగతి వర్గాలు గానీ సొంతంగా స్థలమో కొనుక్కోవ డం,అందులో ఇంటిని నిర్మించుకునే పరిస్థితే లేకుండా, డెవలపర్ ద్వారానే అభివృద్ధి చేసేలా నిబంధనలు విధించడం చూస్తే ఇది.. ముమ్మాటికీ ప్రైవేటు రాజధానే అని స్పష్టమవుతోంది.
 
 అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్ ఏమన్నారంటే...
 
 రైతుల పొట్ట కొట్టి భూసమీకరణ పేరుతో లాక్కున్న భూములను బడా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకేనని ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది మార్చి 20వ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో చర్చలో భాగంగా ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల భూములతో రియల్‌ఎస్టేట్ దందా చేసేందుకే ప్రభుత్వం వారి నుంచి పెద్దఎత్తున భూములను లాగేసుకుంటోందని అనుమానాలు వ్యక్తం చేశారు. రైతుల నుంచి ప్రైవేట్ సంస్థలే ఎక్కువ ధరకు కొనుగోలు చేసుకునేలా, ఆ లాభాలు నేరుగా రైతులకే అందేలా చూడాలని వైఎస్ జగన్ ప్రభుత్వానికి సూచించారు. రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములను వారికి తిరిగి ఇచ్చేయండని హితవు పలికారు.
 
 మొత్తం ప్రభుత్వం సమీకరిస్తున్న భూమి     54వేల ఎకరాలు
 ఇందులో ప్రభుత్వ భూమి (అటవీ, దేవాదాయ శాఖలకు చెందిన) 19వేల ఎకరాలు
 గ్రీనరీ, రోడ్లు, పార్కులు తదితరాలతోపాటు నివాసప్రాంతాలు, సీడ్‌కేపిటల్ మినహా డెవలపర్‌కు ఇచ్చేది     
 21,870 ఎకరాలు

ప్రత్యేక హోదా సాధించి తీరుతాం

Written By news on Sunday, August 2, 2015 | 8/02/2015


'ప్రత్యేక హోదా సాధించి తీరుతాం'
కిర్లంపూడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర విభజన బిల్లుపై నాడు చర్చలో పాల్గొన్న ప్రస్తుత కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా ఐదేళ్లు చాలదని, పదేళ్లు ఉండాలని వాదించారని, ఆ మాటలు ఇప్పుడేమయ్యాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు రాజకీయ స్వలాభం కోసం ఎన్డీయే ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు మైండ్‌గేమ్ ఆడుతూ ప్రజలను మోసం చేయడానికి కుయుక్తులు పన్నుతున్నారన్నారని విమర్శించారు.  సమస్యలను పక్కదారి పట్టించేందుకు అసెంబ్లీ సమావేశాలు కేవలం ఐదు రోజులే నిర్వహిస్తున్నారన్నారు.

ప్రజాసమస్యలను ప్రస్తావించేందుకు వీలుగా అసెంబ్లీ సమావేశాలను 15 రోజులకు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక  హోదా సాధన కోసం తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని, ఇందులో భాగంగా ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయనున్నామని తెలిపారు. దీంతోపాటు ‘మార్చ్ టు పార్లమెంట్ భవన్’ నిర్వహిస్తున్నామన్నారు.

Popular Posts

Topics :