05 January 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ప్రతి ఒక్కరూ వైఎస్సార్ ను గుండెల్లో పెట్టుకున్నారు

Written By news on Saturday, January 11, 2014 | 1/11/2014

'ప్రతి ఒక్కరూ వైఎస్సార్ ను గుండెల్లో పెట్టుకున్నారు'
చిత్తూరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సమైక్య శంఖారావంలో భాగంగా అరగొండ సభకు హాజరైన ఆయన ముందుగా వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. అనంతరం అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ప్రతి ఒక్కరి గుండెల్లో వైఎస్సార్ ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. పేదవాడి కొడుకు కలెక్టర్, డాక్టర్ కావాలని వైఎస్సార్ కలలు కన్నారని,  ఆ కలలు సాకారమయ్యే దిశగా పయనించాలని ఆయన తెలిపారు. పేదరికం చదువుకు అడ్డుకాకుడదని ఆ మహానేత భావించారని జగన్ ఈ సందర్భంగా  గుర్తు చేశారు.
 
పేదరికాన్ని వైఎస్సార్ అర్ధం చేసుకున్నట్లుగా ఎవరూ అర్ధం చేసుకోలేదన్నారు. రాముని రాజ్యం ఎలా ఉంటుందో ఎవరూ చూడకపోయినా, రాజన్న సువర్ణయుగాన్ని అందరూ చూశారన్నారు. ఆనాటి సువర్ణయుగాన్ని తిరిగి తీసుకొద్దామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Shobha Nagi Reddy press meet on 11th January 2014


వైఎస్సార్ చిన్ననాటి స్నేహితుడ్ని పరామర్శించిన జగన్


చిత్తూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి చిన్ననాటి స్నేహితుడు ప్రతాప్ రెడ్డిని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. జొన్నగురుకులలో నివాసం ఉంటున్న ప్రతాప్ రెడ్డిని పరామర్శించి ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జొన్నగురుకుల మీదుగా అరగొండ వెళ్లి వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
 
అంతకుముందు కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడిని జగన్ దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ....జగన్ కు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, పట్టువస్త్రంతో సత్కరించారు. కాగా జగన్ తో పాటు  స్వామిని దర్శించున్నవారిలో పార్టీ నేతలు మిధున్‌రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి ఉన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు జగన్‌తో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. కాగా సమైక్య శంఖారావం యాత్రను ఆయన ఈరోజు ఉదయం కాణిపాకం నుంచి ప్రారంభించారు.

సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న జగన్

సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న జగన్వీడియోకి క్లిక్ చేయండి
కాణిపాకం : వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ....జగన్ కు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, పట్టువస్త్రంతో సత్కరించారు. కాగా జగన్ తో పాటు  స్వామిని దర్శించున్నవారిలో పార్టీ నేతలు మిధున్‌రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి ఉన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు జగన్‌తో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. కాగా సమైక్య శంఖారావం యాత్రను ఆయన ఈరోజు ఉదయం కాణిపాకం నుంచి ప్రారంభించారు.

సమైక్యం అంటే జైల్లో పెడతారా ?

* ‘సమైక్య శంఖారావం’లో నిప్పులు చెరిగిన జగన్‌మోహన్‌రెడ్డి
నిన్న అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ
ఎమ్మెల్యేలు సమైక్య రాష్ట్రం కోసం నినదిస్తే వారిని సస్పెండ్ చేసి జైలుకు పంపారు
విభజనకు మేం వ్యతిరేకమని ఒక్క రోజులో  తేల్చిపారేయాల్సిన కిరణ్, చంద్రబాబు సాగదీస్తున్నారు
బిల్లుపై చర్చ జరిపించి విభజించేందుకు దొంగనాటకాలు ఆడుతున్నారు
వీళ్లిద్దరూ కూడా మన గడ్డ మీద పుట్టి మన గడ్డకే ద్రోహం చేస్తున్నారు..

 

 ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం కోసం మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చుతూ బిల్లు పంపించారు. ‘అసెంబ్లీలో తీర్మానం లేకుండా బిల్లుపై చర్చించడం అంటే విభజనకు అంగీకరించినట్టే. చర్చించడం కాదు.. తీర్మానం చేయండి, బిల్లు పెట్టండి, ఓటింగ్ జరపండి’ అని నిన్న అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు.. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆధ్వర్యంలో పట్టుపడితే వారిని సస్పెండ్ చేసి జైలుకు పంపారు. నాలుగు గంటలు జైల్లో పెట్టారు. ఎందుకు వారిని జైల్లో పెట్టారు? సమైక్యం అన్నందుకా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.
 
 చర్చ సాఫీగా జరిపించుకోవడం కోసం వైఎస్ విజయమ్మను, ఎమ్మెల్యేలను సస్పెండు చేశారని విమర్శించారు. విభజనకు మేం వ్యతిరేకం అని తీర్మానం చేసి, బిల్లును తిప్పి పంపి ఒక్కరోజులో తేల్చి పారేయాల్సిన చంద్రబాబు నాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంతకాలం అసెంబ్లీని సాగదీస్తూ.. చర్చ జరిపించి రాష్ట్ర విభజనకు అనుమతించడానికి దొంగనాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర చిత్తూరు జిల్లాలో మూడో విడత, ఆరో రోజు శుక్రవారం చంద్రగిరి, పూతలపట్టు నియోజకవర్గాల్లో కొనసాగింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల, పూతలపట్టులో జరిగిన బహిరంగ సభలకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
 
 ఈ అన్యాయాన్ని దేశమంతా చూసేలా చేయండి..
 ‘‘ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయ నాయకులు ఎలా దిగజారిపోతారో చెప్పడానికి రాష్ట్రమే ఒక ఉదాహరణ. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే కూడా ఎప్పుడూ కనీవినీ ఎరుగుని అన్యాయం జరుగుతోంది. ఇది మనందరం ఏకం కావాల్సిన సమయం. ఢిల్లీ కుట్రలను ఎదుర్కోవాల్సిన తరుణం. కానీ ఈ సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇద్దరూ దొంగనాటకాలు ఆడుతున్న తీరును చూస్తున్నాం. సోనియాగాంధీ గీచిన గీత దాటకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. నిలదీయాల్సిన చంద్రబాబు ప్యాకేజీలతో కుమ్మక్కయ్యారు. వీళ్లిద్దరూ కూడా మన గడ్డ మీద పుట్టి మన గడ్డకే ద్రోహం చేస్తున్నారు.
 
 చర్చించడమంటే.. విభజనకు అంగీకరించునట్టు కాదా!
 దేశంలో ఎక్కడైనా.. ఎప్పుడైనా ఒక రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వచ్చినప్పుడు మొదట ఏం చేస్తారంటే.. రాష్ట్రాన్ని విభజించండి అని చెప్పి మొత్తంగా శాసనసభ అంతా కలిసి ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. కేంద్రం దానిమీద చర్య తీసుకొని ప్రతిని రాష్ట్రపతికి పంపుతుంది. ఆయన ఆ ముసాయిదా బిల్లును మనకు పంపిస్తే దాని మీద తరువాత చర్చ అనేది జరిగితే అప్పుడు ఇలా కాదు, అలా చేయండని చెబితే సమాధానం దొరుకుతుంది. కానీ ఇవాళ రాష్ట్రం విషయంలో.. ఏకంగా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసేసుకుని ఆ బిల్లును రాష్ట్రపతి దగ్గర నుంచి మనకు పంపించి ఇక మీరు చర్చించుకోండి అని చెప్తున్నారు. చర్చించడం అంటే దాని అర్థం విభజనకు మనం ఒప్పుకున్నట్టే కదా..!
 
 అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చించండి..
 నేను ఇక్కడికి వచ్చే ముందు దారి వెంట చాలా మంది అక్కచెల్లమ్మలు నన్ను చూడటానికి వచ్చారు. ‘అన్నా గ్యాసు సబ్సిడీ ఇంత వరకు అందలేదన్నా.. రూ.1360 పెట్టి గ్యాస్ కొనుక్కుంటున్నాం’ అని చెప్పారు. నన్ను కలిసిన రైతన్నలను నీళ్ల పరిస్థితి ఎలా ఉందన్నా అని అడిగితే.. ‘వెయ్యి అడుగుల లోతుకు బోరు వేసినా నీళ్లు వస్తాయో.. రావో.. తెలియని పరిస్థితిలో ఉన్నామన్నా’ అని చెప్పారు. కరెంటు పరిస్థితి ఎలా ఉందన్నా అని అడిగితే.. ‘మూడు నాలుగు గంటలకు మించి ఇవ్వరన్నా’ అని చెప్తున్నారు. ఒక కొత్త రేషన్ కార్డు లేదు, ఒక కొత్త ఇల్లు లేదు, గాలేరి నగరి, సుజల స్రవంతి, హంద్రీనీవా ప్రతి ప్రాజెక్టునూ పూర్తి చేసుకోవాలని ఆలోచన చేసేవారే కరువయ్యారు. రాష్ట్రం ఐక్యంగా ఉన్నప్పుడే కృష్ణా నీళ్లు మహారాష్ట్ర, కర్ణాటక అవసరాలు తీరితే తప్ప కిందికి రాని పరిస్థితి. మధ్యలో ఇంకొక రాష్ట్రం తీసుకొని వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రపు నీళ్లు తప్ప మంచి నీళ్లు ఎక్కడ ఉన్నాయి? ఈ సమస్యలపై చర్చ పెట్టండి. వాటి మీద మాట్లాడండి అంటే వాటి గురించి మాట్లాడనే మాట్లాడరట. కానీ  రాష్ట్రాన్ని ఎలా విభజించాలని మాత్రం చర్చిస్తారట.
 
 ఢిల్లీ కోటను బద్దలు కొడదాం..
 రాష్ట్రాన్ని విభజించాలని ఉబలాటపడుతున్న సోనియాగాంధీ, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులకు ఒక్క మాట చెప్తున్నా. వీళ్లంతా ఎన్ని కుమ్మక్కులు, ఎన్ని కుయుక్తులు చేసినా మరో నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో ప్రజలందరం ఒక్కటవుదాం. ఒక్కటై 30 ఎంపీ స్థానాలను మనంతట మనమే తెచ్చుకుందాం. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతాం. కుమ్మక్కు రాజకీయాలను, ఢిల్లీ కోటను బద్ధలు కొడదాం. ఢిల్లీ కోటను మనమే పునర్నిర్మిద్దాం.’’
 
 జోరుగా జగన్ యాత్ర
 సాక్షి ప్రతినిధి, తిరుపతి: సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర శుక్రవారం చిత్తూరు జిల్లాలో జోరుగా సాగింది. చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువులో ఉదయం యాత్రను ప్రారంభించిన జగన్.. పాకాలలో విజయకుమార్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. తర్వాత బస్టాండ్ సెంటర్‌లో ప్రసంగించారు. తర్వాత సామిరెడ్డిపల్లెలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి.. పూతలపట్టులో జరిగిన సభలో ప్రసంగించారు. అనంతరం దిగువపాలకూర, మూర్తిగారిపల్లెల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. రాత్రి తిరువణంపల్లెలో బస చేశారు. యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి,  మాజీ ఎమ్మెల్యేలు అమర్‌నాథ్‌రెడ్డి, నాయకులు మిథున్‌రెడ్డ్డి, చెవిరెడ్డి, సునీల్ కుమార్, సుబ్రమణ్యంరెడ్డి తదితరులు ఉన్నారు.
 
 బాబు మాట విని  బాధనిపించింది..
 ‘‘పదేళ్లలో రాజధాని వదిలిపెట్టి వెళ్లాలని చెప్తున్నారు. చదువుకున్న పిల్లలు ఎక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేయాలని చంద్రబాబును అడిగితే ఆయన ‘ఏం పక్కన.. కర్ణాటక లేదా? చైన్నై  లేదా? మన పిల్లలు అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేసుకోలేరా?’ అని అన్నారట. చంద్రబాబు నోట ఇటువంటి మాటలు రావడం చూసి బాధనిపించింది. చంద్రబాబూ.. మీ కుప్పం నియోజకవర్గం పక్కనే తమిళనాడు ఉంది. మీరు  సామాన్యుడిగా ఒక్కసారి చెన్నై వెళ్లండి, అక్కడ ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ కారులో తిరగండి. వాళ్లు నిన్ను ఏ రకంగా చూస్తారో ఒక్కసారి చూడండి. ఒక్కసారి చెన్నైలో తమిళం మాట్లాడకుండా, కర్ణాటక వెళ్లి కన్నడం మాట్లాడకుండా తెలుగులో మాట్లాడితే అక్కడి వాళ్లు మనల్ని ఎలా చూస్తారో ఆలోచన చేయండి. భాష రాని చోటకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాలంటే ఎన్నెన్ని కష్టాలు పడాల్సి వస్తుంది.’’    
- వైఎస్ జగన్

త్వరలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ విస్తృతం

ఒంగోలు, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్‌ను త్వరలో విస్తృత పరచనున్నట్లు ఆ విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో పలువురు న్యాయవాదులతో ఆయన శుక్రవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన పేరుతో కాంగ్రెస్, టీడీపీలు రాజకీయాలు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ధ్వజమెత్తారు. ఆ పార్టీ నేతల కుట్రలను ఎండగట్టేందుకు న్యాయవాదులు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో లీగల్ సెల్ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కమిటీకి సంబంధించిన అంశాలపై న్యాయవాదులతో చర్చించారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని కాంగ్రెస్ పార్టీ.. రాష్ర్ట విభజన అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం.. ప్రజల అభీష్టానికి అండగా నిలవాల్సింది పోయి కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని ఆరోపించారు.
 
 ఈ నేపథ్యంలో ఉత్సాహం, ఆసక్తి ఉన్న న్యాయవాదులతో కలిసి త్వరలోనే జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తామని నాగేశ్వరరావు చెప్పారు. లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగిరెడ్డి మాట్లాడుతూ హైకోర్టులో సీమాంధ్ర న్యాయవాదులపై టీ న్యాయవాదుల దాడి అమానుషమన్నారు. అసెంబ్లీలో సమైక్యవాదం వినిపిస్తున్న గాదె వెంకటరెడ్డి చొక్కాను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పట్టుకోవడం విచారకరమన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర న్యాయవాదులు 180 రోజుల నుంచి కోర్టుకు హాజరు కాకుండా ఆందోళనలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సీమాంధ్ర న్యాయవాదుల శాంతియుత నిరసన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని నాగిరెడ్డి చెప్పారు. సమావేశానికి హాజరైన న్యాయవాదులను వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ ఎంవీవీఎస్ వేణుగోపాల్ పరిచయం చేశారు. సమావేశంలో న్యాయవాదులు చావలి రమేశ్, వి.కోటేశ్వరరావు, నక్కల వీరాంజనేయులు, కుంచాల వెంకటేశ్వర్లు, రవిశంకర్, వి.గ్రేస్‌కుమారి, వై.వెంకటేశ్వరరెడ్డి, ఈ.సురేంద్రబాబు, ఎన్.ఈశ్వరరావు, టి.బాలాజీ, ఎస్.రఘునాథరెడ్డి, డి.రామారావు, ఎం.రామకృష్ణారావు, జీవీ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

సహకార ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జయకేతనం

సహకార ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జయకేతనం
అనంతపురం జిల్లాలో సొసైటీల ఎన్నికల్లో రైతుల తీర్పు
ఏడింటిలో ఆరు పీఏసీఎస్‌లు కైవసం
జేసీ బ్రదర్స్, మంత్రి శైలజానాథ్ ఎత్తుల చిత్తు
కాంగ్రెస్-టీడీపీల దోస్తీకి చెంపపెట్టు

 
 సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లా సహకార ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీల కుయుక్తులకు చెంపపెట్టులా రైతులు తీర్పునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది క్రితం సహకార ఎన్నికలు జరిగిన విషయం విదితమే. అనంతపురం జిల్లాలో 116 ప్రాథమిక సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్)కు గానూ 109 సొసైటీలకు మాత్రమే నాడు ఎన్నికలు జరిగాయి. శాంతిభద్రతల సాకుచూపి తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు, వేములపాడు, శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు, రాప్తాడు నియోజకవర్గంలోని పి.యాలేరు, రామగిరి, కదిరి నియోజకవర్గంలోని తలుపుల, పెనుకొండ నియోజకవర్గంలోని బూదిలి పీఏసీఎస్‌ల ఎన్నికలను నాడు వాయిదా వేశారు. వాటికి శుక్రవారం ఎన్నికలు నిర్వహించగా.. ఏడింటికి ఆరు పీఏసీఎస్‌లను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు భారీ మెజారిటీతో చేజిక్కించుకున్నారు.
 
 జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారన్న వార్తల నేపథ్యంలో తమ నియోజకవర్గంలోని వేములపాడు, పెద్దవడుగూరు పీఏసీఎస్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు సొసైటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల విజయాన్ని అడ్డుకునే బాధ్యతను జేసీ ప్రభాకర్‌రెడ్డికి మంత్రి శైలజానాథ్ అప్పగించారు. ముందే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆ మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్-టీడీపీలు సంయుక్తంగా మద్దతుదారులను బరిలోకి దించాయి.
 
  డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు గ్రామాల్లో భయోత్పాతాన్ని సృష్టించారు. అయినప్పటికీ పుట్లూరు, పెద్దవడుగూరు సొసైటీలను వైఎస్సార్ సీపీ మద్దతుదారులు భారీ మెజారిటీతో గెలుచుకున్నారు. పెద్దవడుగూరులో 13 డెరైక్టర్ల స్థానాలుం డగా ఒక అభ్యర్థి చనిపోవడంతో ఆ స్థానానికి ఎన్నికలు జరగలేదు. వేములపాడు సొసైటీని సీపీఐ మద్దతుతో వైఎస్సార్ సీపీ చేజిక్కించుకోనుంది. జేసీ సోదరుల కోటలో ఈ గెలుపు అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమన్వయకర్త వి.ఆర్.రామిరెడ్డిని అభినందిస్తూ భారీ ఎత్తున ఊరేగింపు జరిపారు.
 
 టీడీపీ నేతల దౌర్జన్యం..: టీడీపీ ఎమ్యెల్యే పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి, పి. యాలేరు సొసైటీలకు జరిగిన ఎన్నికల్లో పోలీసుల సాయంతో సునీత సోదరుడు బాలాజీ భయోత్పాతం సృష్టించారు. వైఎస్సార్ సీపీ నేతలు ముకుందనాయుడు, అమర్‌నాథ్‌రెడ్డిలు ప్రయాణిస్తోన్న వాహనంపై రాళ్ల వర్షం కురిపించారు. అయినప్పటికీ పోలీసులు.. వైఎస్సార్ సీపీ నేతలనే అరెస్టు చేశారు. భయోత్పాతాని సృష్టించడం ద్వారా రామగిరి సొసైటీని టీడీపీ మద్దతుదారులు చేజిక్కించుకున్నారు. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప (టీడీపీ) సొంత మండలం గోరంట్ల పరిధిలోని బూదిలి పీఏసీఎస్‌ను వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు.

జనాభిమానం

జనాభిమానం
సాక్షి, తిరుపతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన మూడోవిడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రలో భాగంగా ఆరవరోజైన శుక్రవారం ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. దారిపొడవునా వేలాదిమంది హారతులు, మేళతాళాలు, కోలాటాలతో ఆహ్వానం పలికారు. దామలచెరువు నుంచి బయలుదేరిన ఆయన నాలుగు చోట్ల వైఎస్‌ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు.

పాకాలలో వైఎస్.రాజశేఖరరెడ్డి మృతికి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విజయకుమార్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. వారికి మనోధైర్యం కల్పించారు. దామలచెరువు నుంచి బండార్లపల్లెకు చేరుకుని అక్కడ వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.  గుమ్మడివారిపల్లెకు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి టపాకాయలు పేల్చి, హారతులతో ఆహ్వానం పలికారు.ఊట్లవారిపల్లెలో పూలహా రాలతో స్వాగతం పలికారు. తర్వాత పాకాల లోని కమతంలో విజయభాస్కర్‌రెడ్డి కుటుం బాన్ని ఓదార్చారు.

తోటపల్లె మీదుగా సామిరెడ్డిపల్లె చేరుకుని అక్కడ రోడ్‌షోలో పాల్గొని, వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ ఆయనకు పూల వర్షం కురిపించి స్వాగతించారు. తరువాత పూతలపట్టు నియోజకవర్గంలోకి ప్రవేశించి కరిణిపల్లెక్రాస్, పి.కొత్తకోట, గొల్లపల్లె, మిట్టూరు, రంగంపేట క్రాస్ ద్వారా పూతలపట్టుకు చేరుకున్నారు. పూతలపట్టులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కాణిపాకం క్రాస్ ద్వారా కిచ్చన్నగారిపల్లె చేరుకున్నారు. తర్వాత దిగువపాలకూరులో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గోపాలకృష్ణాపురం మీదుగా మూర్తిగానిపల్లెకు చేరుకుని అక్కడ వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

తర్వాత ఐరాల మండలంలోకి ప్రవేశించి, చిగరపల్లె ద్వారా తిరువణంపల్లె చేరుకుని రాత్రి అక్కడే బసచేశారు. పర్యటనలో పలువురు వృద్ధులు, వికలాంగులను జగన్‌మోహన్‌రెడ్డి పలుకరిస్తూ వచ్చారు. వేలాదిమంది అభిమానులు పంట పొలాల నుంచి రోడ్డు మీదకు చేరుకుని ఆయనకు ఆహ్వానం పలికారు. పాకాలలో జననేతను మాజీ తెలుగుదేశం నాయకుడు ఎల్‌బి.ప్రభాకర్ కలుసుకున్నారు. పాకాలలో ఓదార్పు ముగిసిన తర్వాత కుప్పం నియోజకవర్గం సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి క్యాలెండర్ తీసుకుని రాగా, దానిని ఆవిష్కరించారు.

వైఎస్‌ఆర్ సేవాదళ్ నాయకుడు చొక్కారెడ్డి జగదీశ్వరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డికి తెలుగుతల్లి విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు. యాత్ర చంద్రగిరి నియోజకవర్గం సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పూతలపట్టు కన్వీనర్ డాక్టర్ సునీల్‌కుమార్ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు మిథున్ రెడ్డి, పార్టీ నాయకులు తలుపులపల్లి బాబు రెడ్డి, ఆశాలత, శైలజా రెడ్డి, గోవిందరెడ్డి, దామినేడు కేశవులు పాల్గొన్నారు.

బిల్లుపై చర్చ జరగాలనటం అధర్మం

ఎందుకు వెనుకాడుతున్నారు?: అంబటి రాంబాబు
సమైక్యతపై బాబుకు, కిరణ్‌కు చిత్తశుద్ధి లేదని ధ్వజం
సిసలైన, నిఖార్సయిన సమైక్యవాద పార్టీ వైఎస్సార్‌సీపీయే...
భోగిమంటల్లో వేయాల్సిన బిల్లుపై చర్చిస్తారా? అని ఆగ్రహం

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి సంజీవనిలా ఉపయోగపడే సమైక్య తీర్మానాన్ని శాసనసభలో చేయకుండా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎందుకు వెనుకాడుతున్నారో సమాధానం చెప్పాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పటినుంచీ సమైక్య తీర్మానం చేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తూంటే పట్టించుకోకుండా.. ఈరోజు బిల్లుపై చర్చ వద్దన్నందుకు తమ పార్టీపై విభజన కోరుతున్నదనే విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విభజనకు నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్, అందుకనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ ఒక విధానమంటూ లేకుండా గందరగోళపడుతూ.. మరోవైపు తమ పార్టీని సమైక్యం ముసుగులో విభజన కోరుకుంటోందని ఎలా విమర్శిస్తాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అసలైన, సిసలైన, నిఖార్సయిన సమైక్యవాదం వినిపిస్తున్నది వైఎస్సార్‌సీపీయేనని చెప్పుకునేందుకు గర్వపడుతున్నామన్నారు. ‘‘కాంగ్రెస్, టీడీపీల విధానం పార్టీపరంగా ఒకటుంటే వారి ఎమ్మెల్యేలు కొందరు విభజనకు అనుకూలంగానూ, మరికొందరు వ్యతిరేకంగానూ ఉంటున్నారు.
 
 కాంగ్రెస్‌లో సీఎం తాను సమైక్యవాదినంటే అదే పార్టీలోని టీ-ఎమ్మెల్యేలు విభజనకు అనుకూలంగానూ, ఇతర ప్రాంతాలవారు వ్యతిరేకంగానూ మాట్లాడుతున్నారు. బాబు విభజనకు అనుకూలంగా లేఖ ఇస్తే ఆ పార్టీలోని రెండు ప్రాంతాల ఎమ్మెల్యేలు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. కానీ వైఎస్సార్‌సీపీలో మా అధ్యక్షుడు, రాయలసీమ, కోస్తా ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత నేతలు అందరూ సమైక్యవాదననే వినిపిస్తున్నారు. అలాంటి మా పార్టీని విభజనకు అనుకూలమైనదిగా విషప్రచారం చేసి నమ్మించాలని చూస్తే.. ప్రజలు నమ్మబోరు’’ అని అంబటి స్పష్టం చేశారు. కేంద్రమంత్రుల బృందం(జీవోఎం) ముందుకెళితే విభజనకు అంగీకరించినట్లేనని కొద్ది నెలలక్రితం చెప్పిన చంద్రబాబు ఇపుడు వారు పంపిన బిల్లుపైనే చర్చకు ఎందుకు అంగీకరిస్తున్నారని నిలదీశారు. బిల్లుపై చర్చకు అంగీకరించబోమని నిన్నటిదాకా తేల్చిచెప్పిన గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇపుడెందుకు మాటమార్చి చర్చకు సిద్ధమయ్యారని, ఆజాద్ హైదరాబాద్ వచ్చినపుడు టీడీపీ ఏమైనా ఒప్పందం కుదుర్చుకుందా! అని అనుమానం వెలిబుచ్చారు.
 
 బిల్లుపై చర్చ జరగాలనటం అధర్మం
 పునర్వ్యవస్థీకరణ బిల్లును భోగిమంటల్లో వేయాలని ఏపీఎన్జీవో నేతలు ఇచ్చిన పిలుపుపై అంబటి హర్షం వ్యక్తం చేశారు. వారి నిర్ణయాన్ని తాము ఆహ్వానిస్తున్నామని, అయితే భోగిమంటల్లో వేయాల్సిన బిల్లుపై ఎలా చర్చిస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై చర్చ జరగాలనడం పూర్తిగా అధర్మమన్నారు. అసెంబ్లీకి విభజన బిల్లు వస్తే ముట్టడి చేస్తామని, మెరుపు సమ్మెకు దిగుతామని ఈ నేతలు చెప్పిన మాటలేమయ్యాయన్నారు. బిల్లుపై చర్చలో పాల్గొనని వారి ఇళ్లను ముట్టడిస్తామన్న ఏపీఎన్జీవో నేతల వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘‘దయచేసి నిప్పుతో చెలగాటమాడొద్దు. అసలు సిసలు సమైక్యవాదులైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఇళ్లను నకిలీ సమైక్యవాదులతో కలసి ముట్టడించడమంటే నిప్పుతో చెలగాటమాడినట్లేనని గుర్తుంచుకోండి’’ అని హెచ్చరించారు. ‘‘బిల్లుపై చర్చ జరగాలని టీఆర్‌ఎస్ కూడా కోరుకుంటోంది. మరి ఆ పార్టీ కూడా సమైక్యవాద పార్టీయేనా? విభజనవాదులను మీరు సమైక్యవాదులని అంటారా?’’ అని అంబటి సూటిగా ప్రశ్నించారు.

ఇట్లు - ఢిల్లీ విశ్వాసపాత్రులు టీడీపీ, కాంగ్రెస్

ఇట్లు - ఢిల్లీ విశ్వాసపాత్రులు టీడీపీ, కాంగ్రెస్
  •  విభజన బిల్లుపై కాంగ్రెస్, టీడీపీల నుంచి సవరణల మాటే లేదు.. సమరం ఊసేలేదు
  •  క్లాజులపై అభిప్రాయాలు చెప్పి చేతులు దులుపుకున్న పాలక, ప్రధాన ప్రతిపక్షాలు
  •  ఆయా పార్టీల సీమాంధ్ర నేతల చర్యలతో సంతోషం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రాంత నేతలు
  •  అధిష్టానానికి కష్టం కలగకుండా అభిప్రాయాలు కూడా రాయని కిరణ్, బొత్స, చంద్రబాబు
  •  బిల్లులోని అన్ని క్లాజులను తొలగించాల్సిందేనంటూ సమైక్య స్వరాన్ని చాటిన వైఎస్సార్‌సీపీ
  •  ‘సమగ్రాభివృద్ధి బిల్లు’గా మార్చాలన్న సీపీఎం.. 
  •  ‘ఉమ్మడి రాజధాని’గా రెండేళ్లు చాలన్న ఎంఐఎం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తామని, వాటిపై ఓటింగ్ నిర్వహిస్తామని, బిల్లును ఓడిస్తామని మొదటినుంచీ ఘంటాపథంగా చెప్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సీమాంధ్ర ఎమ్మెల్యేలు.. చివరికి సవరణల మాట పక్కనపెట్టి బిల్లుపై అభిప్రాయాలు తెలియజేయటానికే పరిమితమయ్యారు. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సారథ్యంలోని టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు సైతం సవరణ అనే ఊసే ఎత్తలేదు.. కేవలం బిల్లులోని క్లాజులపై అభిప్రాయాలు తెలియజేసి చేతులు దులుపుకున్నారు. 
 
 సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలైతే.. అసలు బిల్లుపై సవరణ సంగతి దేవుడెరుగు.. కనీసం తమతమ అభిప్రాయాలను కూడా రాయలేదు. దీంతో రాష్ట్ర విభజనపై సమరం చేస్తామని.. బిల్లుకు సవరణలు పెట్టి ఓటింగ్ నిర్వహించి ఓడిస్తామని సీఎం కిరణ్ ఇతర నేతలు చెప్పిన మాటలన్నీ వట్టి బీరాలేనని తేలిపోయిందని రాజకీయ పరిశీలకులు, సమైక్యవాదులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. శాసనసభలో ప్రకటించినట్టుగానే పార్టీ సభాపక్ష నాయకురాలు వై.ఎస్.విజయమ్మతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా.. బిల్లులోని ఒక్కో క్లాజుకూ దాన్ని ‘తొలగించండి’ అంటూ స్పీకర్‌కు సవరణలు ప్రతిపాదించారు. 
 
 అసెంబ్లీలో చర్చకు ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు - 2013 ముసాయిదాలోని వివిధ అంశాలపై శాసనసభ్యులు శుక్రవారం లోగా నిర్దేశిత ఫార్మాట్‌లో తమ అభిప్రాయాలు, ప్రతిపాదిత సవరణలు, అందుకు కారణాలను తెలియజేయాలంటూ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమేరకు శుక్రవారం గడువు ముగియగాా.. కిరణ్, చంద్రబాబు, బొత్స మినహా మిగతా సభ్యులంతా ఏదో ఒక రూపంలో అభిప్రాయాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కిరణ్, బొత్సలు ఎలాంటి సవరణలు ప్రతిపాదించలేదని చెప్తున్నారు. 
 
 కాంగ్రెస్ సీమాంధ్ర ఎమ్మెల్యేలు సైతం ప్రధానంగా అభిప్రాయాలు చెప్పడానికే ప్రాధాన్యం ఇవ్వగా నామమాత్రంగా ఒకటీ అరా సవరణలు ప్రతిపాదించి చేతులు కట్టుకున్నారు. బిల్లులోని 108 క్లాజులపై సవరణలు కోరతామని చెప్పిన టీడీపీ సీమాంధ్ర నేతలు చివరకు సవరణలు ప్రతిపాదించకుండా ఆయా క్లాజులపై అభిప్రాయం చెప్పడానికి మాత్రమే పరిమితమయ్యారు. దీంతో తెలంగాణ టీడీపీ నేతల్లో సంతోషం వ్యక్తమైంది. ఇక తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు.. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐలకు చెందిన తెలంగాణ ప్రతినిధులు మాత్రం బిల్లుకు ఎలాంటి సవరణలు కోరలేదు. కేవలం సలహాలు, సూచనలు మాత్రమే చేశారు. 
 
 బిల్లుపై సవరణలు కోరడం వల్ల భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తొచ్చన్న అనుమానాల మేరకు సవరణలు అన్న చోట సలహాలు, సూచనలను మాత్రమే చేయాలని ఈ పార్టీల నేతలు నిర్ణయించారు. ఆ మేరకే వాటిని స్పీకర్‌కు వేరువేరుగా అందజేశారు. సీపీఎం మాత్రం ఒకటో క్లాజు ‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు’ అన్నచోట ‘ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి బిల్లు’గా మార్చాలంటూ సవరణ ప్రతిపాదించింది. ఎంఐఎం బిల్లులో మొత్తంగా 15 సవరణలను కోరింది. 
 
 కొన్ని సవరించాలి.. కొన్ని తొలగించాలి!
 బిల్లుకు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల సవరణలివీ...
 విభజన బిల్లులో కీలకమైనవిగా భావిస్తున్న కొన్ని  క్లాజ్‌లకు సీవూంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సవరణలు ప్రతిపాదించారు. వీటిని తొలగించాలని ప్రతిపాదనలను స్పీకర్ నాదెండ్ల వునోహర్‌కు సవుర్పించారు. ఒకే రకమైన సవరణ ప్రతిపాదన కాపీలపై సీవూంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ పంపిణీ చేసి వారి సంతకాలతో స్పీకర్‌కు అందింపచేశారు. ప్రధానంగా 3, 4, 5, 8, 46, 84, 89, 90, 92, 93 క్లాజులతో సహా వురో రెండు క్లాజ్‌లకు సవరణ ప్రతిపాదనలు అందించారు. సీవూంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఈ ప్రతిపాదనలు చేయుడంతో పాటు కొందరు నేతలు వ్యక్తిగతంగా కూడా వురికొన్ని సవరణలను స్పీకర్‌కు అందించారు. వారందరు ప్రతిపాదించిన సవరణలు...
 బిల్లులోని 3, 4, 5 (1) క్లాజులను తొలగించాలి. 
 
 క్లాజ్ నెం 8 : ఉవ్ముడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ పర్యవేక్షణలోకి చేర్చడం సరికాదు. బిల్లులోని పార్ట్-2-8(1) టు (4) క్లాజ్ రాజ్యాంగంలోని 249వ అధికరణానికి ఇది పూర్తి భిన్నంగా ఉంది. ఉవ్ముడి రాజధానిగా హైదరాబాద్‌లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయూలకు, పరిపాలనా వ్యవహారాల కొనసాగింపునకు భవనాలు, ఇతర సదుపాయూల కేటారుుంపు అంశవుూ గవర్నర్‌కే అప్పగించడవుూ రాజ్యాంగ విరుద్ధమే. ఈ క్లాజ్‌ను తొలగించాలి.
 
 క్లాజ్ నెం 46: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదవుూడో ఆర్థిక సంఘం ఇచ్చిన అవార్డును జనాభా దావూషా, ఇతర పరిమితుల ప్రాతిపదికపై కేంద్రం ఇరు రాష్ట్రాలకు పంపకం చేయూలి. 
 
 క్లాజ్ నెం. పార్ట్ - 9 - 84 (1) (2) (3) లో నదీజలాలపై అత్యున్నతాధికార కమిటీ (అపెక్స్ కౌన్సిల్) ఏర్పాటు కూడా రాజ్యాంగస్ఫూర్తికి భిన్నమైనదిగా ఉంది. నదీజలాల నిర్వహణ, నియుంత్రణ, పంపిణీ తదితర అంశాలన్నీ పరీవాహక రాష్ట్రాల అధికార పరిధిలోనే ఉంటారుు. రాజ్యాంగం ఏడో షెడ్యూల్‌లో 17వ నిబంధన దీన్ని స్పష్టంగా చెబుతోంది. దీన్ని అపెక్స్ కౌన్సిల్‌కు అప్పగించడం రాజ్యాంగ విరుద్ధం. నదీజలాల నిర్వహణ బోర్డులతో ప్రాజెక్టుల నిర్వహణ సాధ్యం కాదు. 
 
 క్లాజ్ నెం 89 : కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ఇంతకువుుందు ఏ ట్రిబ్యునల్ చేయుయుపోరుునట్లరుుతే ప్రాజెక్టు వారీగా నిర్దిష్ట నీటి కేటారుుంపులు చేస్తుంది. నీటి ప్రవాహంలో తగ్గుదల ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా విడుదల చేయువలసిన నీటిని పర్యవేక్షిస్తుంది. ఈ క్లాజ్ వల్ల జలవివాదాలు పరిష్కారం కావు. ఈ క్లాజ్‌ను తొలగించాలి. మిగులు జలాలను వినియోగించుకొనే అవకాశం దిగువ రాష్ట్రాలకు ఉండేలా గతంలో కృష్ణా నదీజలాలపై ఏర్పాటైన రెండు ట్రిబ్యునళ్లు తీర్పులిచ్చారుు. రాష్ట్రంలో ఈ మిగులు జలాల ఆధారంగా అనేక ప్రాజెక్టులను చేపట్టారు. 
 
 క్లాజ్ నెం 90: పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు జాతీయు ప్రాజెక్టుగా ప్రకటించబడుతుంది. కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలను సంప్రదించి కేంద్రం ఈ ప్రాజెక్టు పనులను నిర్వహిస్తుంది. 
 
 క్లాజ్ నెం 92: బొగ్గు, చవుురు, సహజవాయుువు, విద్యుదుత్పత్తి, పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వూర్గదర్శకాలను అనుసరించి కొత్తగా ఏర్పడే రాష్ట్రాలు అవులు చేయూలి. ఈ క్లాజ్ కూడా అసవుంజసంగా ఉంది. తొలగించాలి. ఉవ్ముడి రాష్ట్ర వనరులతో అభివృద్ధి చేసిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆస్తులను ప్రస్తుత వూర్కెట్ విలువ ప్రకారం నిర్ణరుుంచి పంచాలి. కానీ దురదృష్టవశాత్తు బిల్లులోని 92 క్లాజ్ ఇందుకు విరుద్ధంగా ఉంది. ఉవ్ముడి జలాలను వినియోగించి ఉత్పత్తి చేసే జలవిద్యుత్తును ఎలా కేటారుుస్తారో బిల్లులో పేర్కొనలేదు. 
 
 క్లాజ్‌నెం 93: ఈ క్లాజ్ కూడా న్యాయుసవ్ముతంగా లేదు. విభజన అనంతరం విడిపోయే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అభివృద్ధి, వలిక సదుపాయూల కల్పనకు నిర్ణీత గడువు విధించలేదు. ఆ రాష్ట్ర అభివృద్ధి, వివిధ సంస్థల, కేంద్ర ప్రభుత్వ రంగ విభాగాల ఏర్పాటుపై కూడా స్పష్టత లేదు. ‘సాధ్యాసాధ్యాలను అనుసరించి పరిశీలిస్తాం’ అని పేర్కొనడం కూడా సరిగా లేదు. ఆర్థికాంశాలకు సంబంధించిన ఫైనాన్సియుల్ మెమొరాండాన్నీ బిల్లులో పొందుపర్చలేదు. ఎలాంటి స్పష్టత లేని ఈ క్లాజ్‌ను కూడా తొలగించాలి.

Today Jagan tour schedule

కాంగ్రెస్-టీడీపీలకు సమైక్యంపై చిత్తశుద్ధి లేదు

Written By news on Friday, January 10, 2014 | 1/10/2014


                                                                                         వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీలపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆ రెండు పార్టీలకు సమైక్యంపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్-టీడీపీలు కలిసి సాగిస్తున్న కుయుక్త రాజకీయాలను ఎండగట్టారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచేందుకు వారు ప్రయత్నించడం మానేసి, కొత్త నాటకానికి తెరలేపుతున్నారన్నారు. సమైక్య నినాదం వినిపించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేయడాన్ని తప్పుబట్టారు. కిరణ్ , చంద్రబాబులు కలిసి విభజనకు సహకరించడం కొరకే ఎమ్మెల్యేలపై వేటువేశారన్నారు. వైఎస్సార్ సీపీ మాత్రం ఎప్పటికీ సమైక్య బాటలోనే పయనిస్తుందని అంబటి తెలిపారు.

కాంగ్రెస్‌-టీడీపీలు కలిసి వైఎస్సార్ సీపీ విషప్రచారం చేస్తున్నాయన్నారు. సమైక్యవాదం వినిపిస్తున్న అసలుసిసలైన పార్టీ వైఎస్సార్ సీపీనే అని అంబటి తెలిపారు. విభజన బిల్లు ప్రతులను భోగి మంటల్లో వేసి తగలబెట్టాలని ఏపీఎన్జీవో నేతలు అంటున్నారని, అటువంటప్పుడు విభజన బిల్లుపై చర్చకు ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు.  విభజన బిల్లు అసెంబ్లీకి వస్తే అసెంబ్లీని ముట్టడిస్తామన్న నేతలు ఇప్పుడెందుకు ఆ పని చేయలేదని అంబటి నిలదీశారు. చర్చలో పాల్గొన్న వారే సమైక్య వాదులైతే...టీఆర్‌ఎస్ కూడా సమైక్యవాద పార్టీనేనా? అని అడిగారు. దయచేసి నిప్పులతో చెలగాటం ఆడొద్దన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గజినిలా మారారని అంబటి ఎద్దేవా చేశారు.

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు-కిరణ్ లు దొంగనాటకాలు


'అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు-కిరణ్ లు దొంగనాటకాలు'
చిత్తూరు:అసెంబ్లీ సాక్షిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలు దొంగనాటకాలాడుతున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.జిల్లాలోని పూతలపట్టు సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి  మాట్లాడారు. సోనియా గాంధీ ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని జగన్ విమర్శించారు. ఆమె గీసిన గీతను కిరణ్ దాటకుండా విభజనకు సహకరిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజనకు పూనుకుంటున్న సోనియాను చంద్రబాబు ప్రశ్నించకుండా,   ప్యాకేజీలంటూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఆయన నోట సమైక్యాంధ్ర అన్న మాటే రావడంలేదని, అసెంబ్లీలో రాష్ట్రాన్ని విడగొట్టడానికి చర్చ జరుపుతున్నారన్నారు.

దేశంలో ఎక్కాడా లేని విధంగా రాష్ట్రాన్ని విభజిస్తూ ప్రజలకు మరిన్ని సమస్యలు తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారని జగన్ అన్నారు.70 శాతం ప్రజలు ఒప్పుకోక పోయినా బిల్లును రాష్ట్రానికి పంపి, ఆ బిల్లుపై వీళ్లంతా చర్చించడం దురదృష్టకరమన్నారు. అన్యాయం అయిపోతున్న అక్కాచెల్లెళ్లపై అసెంబ్లీలో చర్చ జరగక పోవడం బాధాకరమన్నారు. రానున్న ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు గెలుచుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దామని జగన్ సూచించారు.

Samaikya Sankaaravam Yatra: YS Jagan's speech in Pakala

Ambati Rambabu lashes out at Mareppa comments on YS Jagan

YS Jagan Samaikya Sankharavam in Puthalapattu,Chittoor Dist

వైఎస్ ఉన్నంతకాలం ఎవరూ రాష్ట్రం జోలికే రాలేదు

వైఎస్ ఉన్నంతకాలం ఎవరూ రాష్ట్రం జోలికే రాలేదువీడియోకి క్లిక్ చేయండి
చిత్తూరు : వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంతకాలం ఎవరూ రాష్ట్రం జోలికే రాలేదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం పాకాల న్యూ బస్టాండ్ సర్కిల్ లో ప్రసంగించారు. 70 శాతం ప్రజలు ఒప్పుకోకపోయినా... కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తోందన్నారు. నేడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని జగన్ అన్నారు.

ఓట్లు, సీట్లు కోసం దిగజారి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. సోనియా తన కొడుకు పదవి కోసం విభజనకు దిగితే... ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సోనియాను ప్రశ్నించకుండా ప్యాకేజీలడుగుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని విభజించిన సోనియాకు చంద్రబాబు అమ్ముడుపోయారని విమర్శించారు.  కీలకమైన అంశంపై అసెంబ్లీలో దారుణంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కనపడకుండా డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు సీమాంధ్ర నేతలతో సమైక్యమనిపిస్తూ...మరోపక్క తెలంగాణ ప్రాంత సభ్యులతో విభజించమని కోరమంటున్నారన్నారు. బాబు, కిరణ్ లు ఈ గడ్డపై పుట్టి.... ఈ గడ్డ ప్రజలనే మోసం చేస్తున్నారని జగన్ అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉద్యోగానికి వెళితే... ఎన్నిక కష్టాలు పడాలో చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్రం కలిసున్నప్పుడే నీళ్ల కోసం కొట్టుకుంటున్నామని... విడిపోతే రైతుల పరిస్థితి ఏంటన్నారు.

అసెంబ్లీలో సమైక్య తీర్మానం కోరితే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమైక్యాంధ్ర అన్నందుకా జైల్లో పెట్టారన్నారు. చంద్రబాబు నాయుడు నోట సమైక్యమన్న మాటే రావటం లేదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గీసిన గీత దాటకుండా డ్రామాలాడుతున్నారని జగన్ మండిపడ్డారు.

గంగిరెద్దులా తల ఊపుతున్న కిరణ్

'గంగిరెద్దులా తల ఊపుతున్న కిరణ్'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి గంగిరెద్దులా తల ఊపి విభజనకు సహకరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు ఎద్దేవా చేశారు. శుక్రవారం వారు ఇరువురు అసెంబ్లీ మీడియా పాయింట్ ఎదుటు మాట్లాడుతూ... రాష్ట్ర విభజన అప్రజాస్వామికమని అందుకే అసెంబ్లీ నుంచి తామ పార్టీ సభ్యులు వాకౌట్ చేసినట్లు వివరించారు. విభజన బిల్లును తిరస్కరిస్తు స్పీకరుకు పత్రలు ఇచ్చినట్లు చెప్పారు.
 
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై భూమన, శ్రీకాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇరుప్రాంత ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు నైజమని వారు ఆరోపించారు. టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయన్నారు.

ఓటింగ్‌ పెడితే ఎవరు సమైక్యవాదో, ఎవరు ప్రత్యేక వాదో తెలుస్తుంది

రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ వెన్నుదన్నుగా నిలుస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి ఆరోపించారు.  ఆయన శుక్రవారమిక్కడ  అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఆ రెండు పార్టీలకు చెందిన ఇరు ప్రాంతాల నేతలు ఒక్కటై .... విభజన బిల్లును ముందుకు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. సమైక్య ముసుగులో టీడీపీ విభజన బిల్లును పాస్ చేయించేందుకు ప్రయత్నిస్తోందని భూమన  ధ్వజమెత్తారు. విభజన బిల్లుపై ముందు ఓటింగ్‌ పెడితే ఎవరు సమైక్యవాదో, ఎవరు ప్రత్యేక వాదో తేలిపోతుందని భూమన అన్నారు.

అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్

అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వాకౌట్ చేసింది. అంతకుముందు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అసెంబ్లీలో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన బిల్లులోని అన్ని అంశాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సభలో ఏకాభిప్రాయం లేనప్పుడు రాష్ట్రాన్ని ఏలా విభజిస్తారని ఆమె ప్రశ్నించారు.
 
రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని, ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరుగుతుందని ఆరోపించారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరగాలని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్-3 వినియోగంలో అన్యాయం చేస్తున్నారని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. అందుకు నిరసనగా తమ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు వైఎస్ విజయమ్మ సభలో ప్రకటించారు.

సమైక్య తీర్మానం చేయాలి... లేదా ఓటింగ్ పెట్టండి

శాసన సభలో సమైక్య తీర్మానం చేయాలి.. ఇది సాధ్యం కాకపోతే.. విభజన బిల్లుపై ఓటింగ్‌ పెట్టాలన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌తో అసెంబ్లీ శుక్రవారం దద్దరిల్లింది.  అయితే దీనిపై సందర్భాన్నిబట్టి వ్యవహరిస్తామని మాత్రమే చెబుతున్న స్పీకర్‌, ప్రభుత్వం.. ఓటింగ్‌ ఉంటుందో లేదో ఏమాత్రం స్పష్టత ఇవ్వడంలేదు.  

మరోవైపు.. కీలకమైన విభజన బిల్లుపై సభలో చర్చ జరుగుతున్నప్పటికీ..సీఎం, ప్రధాన ప్రతిపక్షనేత, శాసనసభా వ్యవహారాలశాఖా మంత్రి శైలజానాత్‌తోపాటు పలువురు మంత్రులు, సభ్యులు ఈ అంశాన్ని ఏమాత్రం సీరియస్‌గా తీసుకోవడంలేదు. ఈ ఉదయం తొమ్మిది గంటలకు సభ ప్రారంభమైనప్పుడు చాలా పల్చగా కనపడింది. 
నినాదాల మధ్య ప్రారంభమైన అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌ సీపీ సభ్యులు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టిసభను అడ్డుకోవడంతో సభ పట్టుమని మూడు నిమిషాలు కూడా సాగలేదు. సమావేశాలకు అంతరాయం కలగటంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను అరగంట వాయిదా వేశారు.

చర్చించడమంటే విభజనకు అనుకూలమని అభిప్రాయం వ్యక్తం చేయడం కాదా?

చర్చకు ముందే ఓటింగ్: విజయమ్మ
* సమైక్య తీర్మానం చేశాకే బిల్లు పెట్టాలని మేం ఎంత డిమాండ్ చేసినా వినలేదు: విజయమ్మ
ఏ తీర్మానమూ లేకుండానే బిల్లును సభలో ప్రవేశపెట్టేసి.. చర్చించమంటున్నారు
ఇప్పుడు చర్చ జరిగాక ఓటింగ్ పెడతారో లేదోనని భయంగా ఉంది
ఓటింగ్ లేకుండా చర్చించడమంటే.. మనం విభజనకు అనుకూలమని అభిప్రాయం వ్యక్తం చేయడం కాదా?
విజయమ్మ ప్రసంగానికి అడుగడుగునా అడ్డుతగిలిన కాంగ్రెస్, టీడీపీ సభ్యులు

 
 సాక్షి, హైదరాబాద్:  తెలంగాణ బిల్లుపై చర్చించటానికంటే ముందు ఓటింగ్ నిర్వహించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ శాసన సభలో గట్టిగా డిమాండ్ చేశారు. బిల్లుపై చర్చించడం అంటే.. విభజనకు అనుకూలమనే అభిప్రాయం వ్యక్తమవడం నిజం కాదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చ జరిగితే అది కేవలం అభిప్రాయ సేకరణకే పరిమితమవుతుందన్న మాటలు వినిపిస్తున్నందున ముందుగా ఓటింగ్ నిర్వహించి విభజనకు అనుకూలమా, వ్యతిరేకమా అన్న విషయాన్ని తేల్చాల్సి ఉందని కుండబద్దలు కొట్టారు. గురువారం ఉదయం ఆమె తమ పార్టీ పక్షాన ఉన్న అనుమానాలపై అసెంబ్లీలో మాట్లాడారు. ‘‘మేం చర్చకు వ్యతిరేకం కాదు, చర్చను అడ్డుకోవటానికి కాదు మేం పోరాడుతోంది.
 
  ఓ పద్ధతి, సంప్రదాయం అంటూ లేకుండా, కనీసం ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత సభలో లేని సమయంలో విచిత్రమైన పరిస్థితిలో బిల్లు ప్రవేశపెట్టడం మన దురదృష్టం. ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది.. ఇష్టమొచ్చినట్టు విభజన చేయటానికి కాదు. ఒక విధానం అనేది ఉండాలి. బిల్లు వచ్చినప్పుడు రాష్ట్ర సంబంధిత తీర్మానం ఉండాలని ఎన్నో కమిషన్లు చెప్పాయి. ఇవేవీ లేకుండా మనం అసెంబ్లీలో బిల్లు పెట్టుకున్నాం. పశ్చిమబెంగాల్‌లో బీసీరాయ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలోని బేరూబారూ అనే ప్రాంతాన్ని పాకిస్థాన్‌లో కలిపే అంశానికి సంబంధించి ఆ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అప్పుడు చేసిన తీర్మానం ఆధారంగా నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ సుప్రీంకోర్టు అభిప్రాయం తీసుకోవటంతో ఆ ప్రాంతం ఇప్పుడు మనదేశంలోనే అంతర్భాగంగా ఉండే పరిస్థితి వచ్చింది’’ అని విజయమ్మ గుర్తుచేశారు.
 
 తర్వాత ఓటింగ్ జరుగుతుందో లేదో..
 ‘‘ఇప్పుడు మన అసెంబ్లీలో మాట్లాడేవి కేవలం అభిప్రాయాలు మాత్రమేనని, తర్వాత ఓటింగ్ ఉండదని నాయకులు చెప్తున్న నేపథ్యంలో మా భయాలు మాకున్నాయి. అందుకే ముందు తీర్మానం పెట్టాలని చాలా పోరాడాం, బిల్లు రాకముందే అసెంబ్లీలో తీర్మానం చేద్దామని ముఖ్యమంత్రిని కోరాం. తీర్మానం చేసేలా చూడాలని రాష్ట్రపతికి కూడా విజ్ఞప్తి చేశాం. ఇలా అన్ని ప్రయత్నాలు చేశాం. కానీ తీర్మానం లేకుండానే బిల్లు పెట్టారు. ఇక తర్వాత ఓటింగ్ జరుగుతుందో లేదో నమ్మకం లేదు. సభ విభజనకు అనుకూలమా, వ్యతిరేకమా అనేది ముందే తెలుసుకోవాలని కోరుతున్నాం. మేం మాట్లాడకపోతే విభజనకు అనుకూలమని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు.
 
కానీ పదేళ్లు కలిసిండాలనో, రాజధాని ఎక్కడ అనో... ఇలాంటి అంశాలపై చర్చిస్తే దాని అర్థమేంటి అధ్యక్షా..? విభజనకు అనుకూలమని కాదా? అందుకే నేను అందరినీ అడుగుతున్నా, చేతులెత్తి అభ్యర్థిస్తున్నా. అభివృద్ధి చెంది మూడో స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని విభజించకుండా సమైక్యంగా ఉంచేలా చూడాలని కోరుతున్నా. మేం విభజనకు వ్యతిరేకం, సమైక్యంగా ఉండాలనే ముందుగా ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మేం చర్చలకు వ్యతిరేకం, అడ్డంకి కాదు. దీన్ని రికార్డ్ చేయాలని కోరుతున్నా’’అని పేర్కొన్నారు.
 
 అడుగడుగునా అడ్డు తగిలిన కాంగ్రెస్, టీడీపీ
 గురువారం సభ ప్రారంభం అవగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సభ్యులు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేయటంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదావేశారు. మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మళ్లీ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేయటంతో, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, ఇప్పటికే ఐదురోజుల సమయం వృథా అయిందని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేశారు. బిల్లుపై ఉన్న అనుమానాలపై మాట్లాడేందుకు తొలుత విజయమ్మకు అవకాశం ఇస్తానని పేర్కొనటంతో వారు శాంతించారు. వెంటనే విజయమ్మ లేచి మాట్లాడ్డం ప్రారంభించగానే ఇటు కాంగ్రెస్, అటు దేశం సభ్యులు గగ్గోలు పెడుతూ అడుగడుగునా అడ్డు తగ లటం ప్రారంభించారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు లేచి ఇదేం దారుణమంటూ నిలదీశారు. ఓ దశలో దేశం సభ్యుడు దయాకరరావు లేచి నేరుగా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. సభ మొత్తం గందరగోళంగా మారినా వెంటనే జోక్యం చేసుకోని స్పీకర్ అలా చూస్తుండిపోయారు.
 
 ఆ గందరగోళంలోనే విజయమ్మ మాట్లాడాల్సి వచ్చింది. పశ్చిమబెంగాల్‌లోని బేరూబారూ విషయాన్ని విజయమ్మ ప్రస్తావించినప్పుడు కూడా సభ్యులు ఆమెను మాట్లాడనీయలేదు. వారిని వారించాల్సిన స్పీకర్, కేవలం బిల్లుపై ఉన్న అనుమానాలను మాత్రమే ప్రస్తావించాలని, ఉపన్యాసం వద్దంటూ విజయమ్మను వారించే ప్రయత్నం చేయటం విశేషం. బిల్లు పెట్టినప్పుడు సభలో చంద్రబాబు లేరని విజయమ్మ పేర్కొనటంపై దేశం నేత పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందు చర్చించి ఆ తర్వాత ఓటింగ్ ద్వారా బిల్లును ఓడించాలని ఈ సందర్భంగా కేశవ్ అనటంతో టీఆర్‌ఎస్ సభ్యులు, తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు లేచి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కానీ తెలుగుదేశం తెలంగాణ నేతలు కిమ్మనకుండా కూర్చోవటం విశేషం.

పీలేరులో నీళ్ళూ కొనాల్సిందేనా!

పీలేరులో నీళ్ళూ కొనాల్సిందేనా!వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలో బిందె నీళ్లు మూడు రూపాయలకు కొనాల్సి వస్తోందా? అని వైఎస్సార్ సీపీ అ ధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన మూడో విడత చేపట్టిన సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్రలో భాగంగా ఐదో రోజైన గురువారం పీలేరులో భారీ జనసందోహం మధ్య ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో ప్రతి అంశానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. పీలేరులో బిందె నీరు ఎంతకు కొంటున్నారని అడిగితే కొంతమంది రెండు రూపాయలని, మరికొంతమంది మూడు రూపాయలని, మరికొంతమంది ఐదు రూపాయలని సమాధానమిచ్చారు.

ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా నీళ్లు కొనాల్సి వస్తోందని జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. మూడు నా లుగు గంటలు మాత్రమే రైతులకు కరెంటు ఇస్తున్నారని తెలిపారు. కరెంటు బిల్లు తాకితేనే షాక్ కొడుతోందన్నారు. ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడంతో, ప్రయాణమంటేనే ప్రజలు భయపడుతున్నారని తెలిపారు. దీనికి ప్రజలు అవునన్నారు. ఈ సభలోని వారి ప్రతి గుండెచప్పుడు జై సమైక్యాంధ్ర అని కోరుకుంటోందని అన్నారు. విభజన కు వ్యతిరేకంగా తీర్మానం చేయమని అడిగితే కాంగ్రెస్, టీడీపీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం నినదించే ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ  మాత్రమేనని తెలిపారు.

 ఒక్క తాటిపై నిలిచినందుకు శాసనసభ్యులను సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబా బు నాయుడు ఇద్దరూ శాసనసభకు వెళ్లకుండా, ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి, సీమాంధ్రులతో సమైక్యమని, తెలంగాణ వారితో తెలంగాణకు అనుకూలమని చెప్పుకుంటూ, సొంత పార్టీ నాయకులనే మభ్యపెడుతున్నారని తెలిపారు. ఇందుకు ప్రజల నుంచి అవునని స్పందన వచ్చింది. కేంద్రం నుంచి వ చ్చిన బిల్లును వెనక్కు పంపాల్సింది పోయి, శాసససభలో చర్చించాలని పట్టుబడుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్యాకేజీలు కోరుతున్నారు అనగానే ‘జై సమైక్యాంధ్ర’ అని ప్రజలు నినాదాలు చేశా రు. గురువారం సదుం, పీలేరు, దామలచెరువులో బహిరంగ సభలు జరిగాయి.

ప్రతి సభకూ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి జగన్‌మోహన్‌రెడ్డికి తమ మద్దతు తెలియజేశారు.  ఘనంగా స్వాగతం పలికారు. ఈ బహిరంగసభల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, ప్రవీణ్ కుమార్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, పార్టీ సమన్వయకర్తలు ఆర్‌కె.రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, షమీమ్ అస్లాం, మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి, నాయకులు వై.సురేష్, బాబ్‌జాన్, జీవరత్నం పాల్గొన్నారు.

ఓటింగ్ పెట్టాలని అడిగితే అరెస్టు చేస్తారా: విజయమ్మ

సమైక్యానికి సస్పెన్షన్
  • 15 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలపై వేటు
  •   చర్చను అడ్డుకుంటున్నారనే సాకుతో ఒక రోజు సస్పెన్షన్
  •   తర్వాత విభజన బిల్లుపై చర్చ కొనసాగించిన కాంగ్రెస్, టీడీపీ
  •   విభజనపై ముందడుగు పడిందంటూ వ్యక్తమైన ఆనందం
  •   ఎమ్మెల్యేలపై ఆద్యంతం దమనకాండ.. అరెస్టు, నిర్బంధం
  •   మీడియాతోనూ మాట్లాడనివ్వకుండా గొంతు నొక్కిన ఖాకీలు
  •   లాగి వాహనాల్లో పడేసి గోషామహల్ స్టేడియానికి తరలింపు
  •   ఓటింగ్ పెట్టాలని అడిగితే అరెస్టు చేస్తారా: విజయమ్మ ధ్వజం
  •   అంతకుముందు బిల్లుపై ఓటింగ్‌కు పట్టుబట్టిన గౌరవాధ్యక్షురాలు
  •   ఓటింగ్ కోరుతూ పోడియాన్ని చుట్టుముట్టిన పార్టీ ఎమ్మెల్యేలు
  •   స్పీకర్ ఆదేశాలతో వారందరినీ సభ నుంచి ఈడ్చుకెళ్లిన మార్షల్స్
 సాక్షి, హైదరాబాద్:  రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్ పెట్టాలని, లేదా దానిపై చర్చ చేపట్టడానికి ముందే సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం చేయాలని పట్టుబట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేశారు. ‘‘సమైక్యాంధ్రే మా లక్ష్యం. ఓటింగ్ జరగకుండా చర్చను కొనసాగిస్తే విభజనను అంగీకరించినట్టే. ముందు ఓటింగ్ జరపాల్సిందే. పూర్తి సమాచారం లేని అసమగ్ర బిల్లుపై చర్చ అర్థరహితం’’ అంటూ నిరసన వ్యక్తం చేసినందుకు గెంటేశారు. విభజన బిల్లుపై చర్చను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలని పట్టుదలతో ఉన్న ప్రభుత్వం.. సమైక్య నినాదాలతో ఉభయ సభల్లో పోడియాలను చుట్టుముట్టిన వైఎస్సార్‌సీపీ సభ్యులపై ఒక్క రోజు పాటు సస్పెన్షన్ వేటు వేసింది. మార్షల్స్‌ను పెట్టి మరీ వారిని సభల నుంచి బయటికి గెంటించింది. అలా ఐదుగురు ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసిన అనంతరం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ విభజన బిల్లుపై సభల్లో చర్చను కొనసాగించాయి.
 
పల్లె రఘునాథరెడ్డి (టీడీపీ), గండ్ర వెంకటరమణారెడ్డి (కాంగ్రెస్) అసెంబ్లీలో చర్చను కొనసాగించారు. వైఎస్సార్‌సీపీ సభ్యులను సస్పెండ్ చేసి చర్చను ముందుకు తీసుకెళ్లడం పట్ల తెలంగాణ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. పెద్దల సభ సంప్రదాయాలను తోసిరాజంటూ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి! దీన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మండలి అవరణలో ధర్నా చేశారు. నిన్నటిదాకా సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టి, బిల్లుపై చర్చ వద్దని డిమాండ్ చేసిన టీడీపీ ఇప్పుడు రాత్రికి రాత్రే వైఖరి మార్చి కాంగ్రెస్‌తో కుమ్మక్కై రాష్ట్ర విభజనకు సహకరిస్తోందంటూ ధ్వజమెత్తారు. రాత్రికి రాత్రే టీడీపీకి ఏం న్యాయం జరిగిందంటూ నిలదీశారు. తమ సభ్యుల సస్పెన్షన్‌ను వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తీవ్రంగా నిరసించారు. సమైక్యం కోసం గళమెత్తితే సభ నుంచి గెంటేయడం ఏమిటంటూ నిలదీశారు. తమ డిమాండ్‌ను పట్టించుకోకపోగా సస్పెండ్ చేసినందుకు నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు సస్పెన్షన్‌తో ఆగకుండా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కనీవినీ ఎరగని రీతిలో అణచివేత చర్యలకు దిగింది.
 
పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో సహా 21 మంది ఎమ్మెల్యేలను ఖాకీలు అమానుష రీతిలో అరెస్టు చేశారు. దాదాపు ఈడ్చుకెళ్లి మరీ బలవంతంగా వాహనాల్లోకి  ఎక్కించారు. కనీసం మీడియాతో మాట్లాడేందుకు కూడా వారికి అవకాశమివ్వలేదు. ఈ ఉదంతాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నించిన మీడియా సిబ్బందిని కూడా దురుసుగా అడ్డుకున్నారు. చేతికి అందిన వారినల్లా విసురుగా లాగిపడేశారు. వారెవరూ ఎమ్మెల్యేల సమీపానికి కూడా వెళ్లకుండా నిరోధించారు. అనంతరం ఎమ్మెల్యేలను గోషా మహల్ స్టేడియానికి తరలించారు. అసెంబ్లీ వాయిదా పడేదాకా వారిని గంటల తరబడి నిర్బంధంలోనే ఉంచారు. తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మధ్యాహ్నం సభ నుంచి సస్పెండైన అనంతరం అసెంబ్లీ ఇన్నర్ లాబీల వద్ద మొదలైన పోలీసుల అణచివేత, రవీంద్రభారతి చౌరాస్తా సమీపంలో ఎమ్మెల్యేలను అరెస్టు చేసేదాకా పకడ్బందీగా కొనసాగింది. అంతేగాక వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమాలకు ఎలాంటి కవరేజీ రాకుండా చూడటమే తమ ఉద్దేశమన్నట్టుగా పోలీసులు ఆద్యంతం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రభుత్వ దమనకాండను విజయమ్మ సహా ఎమ్మెల్యేలంతా తీవ్రంగా నిరసించారు. స్టేడియంలో ధర్నా చేశారు. అరెస్టు అమానుషమని, తమ ప్రజాస్వామిక హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు.

కుమ్మక్కైతే జగన్ జైల్లో ఎందుకుంటారు?

కుమ్మక్కైతే జగన్ జైల్లో ఎందుకుంటారు?
  • టీడీపీకి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రశ్న
 సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతోనో లేదా ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతోనో తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కుమ్మక్కయ్యారని విమర్శలు చేసే ముందు తెలుగుదేశం పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సూచించారు. ‘‘తమ పార్టీలో ఉంటే వైఎస్ జగన్ సీఎం లేదా కేంద్ర మంత్రి అయ్యేవారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్ చెప్పలేదా? ఆయన మాటల్ని బట్టే జగన్ కాంగ్రెస్‌ను ఎదిరించారన్న సంగతి అర్థం కావడం లేదా? కాంగ్రెస్‌కు సహకరించి ఉంటే 18 నెలల పాటు జైల్లో ఉండాల్సిన అవసరం జగన్‌కు ఏముంది? ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటున్నా టీడీపీకి అర్థం కావడం లేదా?’’ అని ప్రశ్నించారు.
 
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సహచర శాసన సభ్యులు కాపు రామచంద్రారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, గొల్ల బాబూరావు, కాటసాని రామిరెడ్డి, మేకపాటి చంద్ర శేఖరరెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, తెల్లం బాలరాజు, కొరుముట్ల శ్రీనివాసులు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలతో కలిసి గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. విభజన బిల్లు సమయంలో ఇరువైపులా ఎమ్మెల్యేలతో డ్రామాలు ఆడిస్తున్న చంద్రబాబు తన వైఖరిని ఏ విధంగా సమర్థించుకోవాలో తెలియని స్థితిలో తమ అధినేత జగన్‌పై విమర్శలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. 

విభజన కోసం చర్చ ఎందుకు?

* సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం
* కేంద్రం అడ్డగోలుగా విభజన నిర్ణయం తీసుకుని రాష్ట్రానికి బిల్లు పంపింది
* ఆ బిల్లు మాకొద్దని వెనక్కి పంపాల్సిన కిరణ్, బాబు నిస్సిగ్గుగా బిల్లుపై చర్చ జరిపిస్తున్నారు
* బిల్లుపై చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్టే
* కిరణ్, బాబులతో మాట్లాడి గులాంనబీ ఆజాద్ బిల్లుపై చర్చ జరిగేలా చేస్తున్నారు
ఓటింగ్ కోసం పట్టుబట్టిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు

 

 ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకొని ఆ బిల్లు మనకు పంపించారు. ఈ బిల్లు మాకు వద్దు అని చెప్పి వెనక్కి పంపించాల్సిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా బిల్లు మీద ఇవాళ చర్చ జరిపిస్తున్నారు. బిల్లు మీద చర్చ జరిగితే విభజన చేయడానికి కేంద్రానికి అనుమతిచ్చినట్టే అవుతుంది.. అందుకోసమే చర్చ జరగనే వద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పట్టుపడుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు కుమ్మక్కై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే తప్పని వేలెత్తి చూపించే సిగ్గుమాలిన పనికి ప్రయత్నిస్తున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. తాపీగా విభజన కార్యక్రమం పూర్తి చేసేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని అన్నారు. ఈ గడ్డ మీద పుట్టిన ఈ ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నాయకుడికి ఇంతకంటే  సిగ్గు ఏమైనా ఉందా? అని నిలదీశారు. ‘‘బీహార్‌లో కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైనపుడు అక్కడి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గట్టిగా నిలబడి ఎదుర్కొన్నారు.
 
 మీరెవరు మా రాష్ట్రాన్ని విడగొట్టడానికి? ఆ అధికారం మీకు ఎవరిచ్చారు? అని ఆ బిల్లును లాలూ ప్రసాద్ యాదవ్ వెనక్కి పంపించారు. మళ్లీ లాలూను ఒప్పించిన తరువాతే బీహార్‌ను విడగొట్టారు. మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు?’’ అని ప్రశ్నించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి  కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ యాత్ర చిత్తూరు జిల్లాలో మూడో విడత, ఐదో రోజు గురువారం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పీలేరులోను,చంద్రగిరి, పుంగనూరు నియోజకవర్గాల్లోనూ కొనసాగింది. సదుం, కల్లూరుల్లో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. సదుం మండల కేంద్రం, పీలేరు నియోజకవర్గ కేంద్రం, కల్లూరు, మాదలచెరువు గ్రామాల్లో జరిగిన బహిరంగ సభలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
 
 చర్చ అంటూ పట్టపగలు ప్రజల్ని మోసం చేస్తున్నారు
 ‘‘ఈ రోజు టీవీ ఆన్ చేస్తే మనకు అసెంబ్లీ సమావేశాలే కనిపిస్తున్నాయి. కానీ వాటిలో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం కనపడరు. ఇద్దరూ మోసగాళ్లే. ఇవాళ అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తుంటే దేశ చరిత్రలో ఇంత అన్యాయం ఎక్కడా జరగలేదేమో అనిపిస్తోంది. ఏ రాష్ట్రాన్నైనా విభజించాలని అనుకుంటే మొదట ఆ శాసన సభలో తీర్మానం చేయాలి. శాసన సభ్యులంతా అనుకూలమే అని చెబితే తప్ప విభజించడానికి వీలు లేదు. ఇవాళ రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు సమైక్యాన్ని కోరుకుంటున్నారు. శాసన సభలో మెజార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని విడగొట్టొద్దని చెప్తున్నారు. కానీ యూపీఏ ప్రభుత్వం మాత్రం ఎటువంటి తీర్మానం లేకుండా బిల్లును అసెంబ్లీకి పంపి ఇక విభజన అయిపోయింది, చర్చించుకోండి అని చెప్తోంది. ఇటువంటి అన్యాయం ఎక్కడైనా ఉందా? బిల్లు మీద చర్చ పెట్టి, పట్టపగలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరాహార దీక్షలు చేసింది. పార్టీ మొత్తం ఒక్కతాటి మీద నిలబడి, రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి అఫిడవిట్లు ఇచ్చి సమైక్యాంధ్ర కోసం నిలబడింది. చర్చ జరిగితే విభజనకు ఒప్పుకున్నట్టే అని, చర్చ కాదు ఓటింగ్ జరపండి అని పట్టుబట్టిన వైఎస్సార్ సీపీ శాసన సభ్యులను ప్రభుత్వం ఈ రోజు శాసనసభ నుంచి సస్పెండ్ చేయించింది. ఇవాళ పేపర్‌లో చదివా.. కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ మన రాష్ట్రానికి వచ్చారట. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయించి చర్చ సాగిస్తున్నారట. నిజంగా మీరు చేస్తున్న దిక్కుమాలిన రాజకీయాలు, రాక్షస పాలన అంతమయ్యే రోజులు త్వరలోనే వస్తాయి.

 విభజన కోసం చర్చ ఎందుకు?

 రాష్ట్రాన్ని విభజించడానికి మీరు అసెంబ్లీలో చర్చ ప్రారంభించారు. విభజన కోసం చర్చ ఎందుకు అని అడుగుతున్నా. ఒక్కరోజు శాసన సభ్యులందరినీ అసెంబ్లీకి పిలవండి, పిలిచి ఈ రాష్ట్ర విభజనకు మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా అని అడగండి. వాళ్లు చెప్పిన దాన్నే తీర్మానంగా చేయండి. అది చేస్తే సరిపోదా? అని అడుగుతున్నా. ఆ కార్యక్రమం చేయాలంటే మీకు మనసు రాదు. ఒక్కసారి ప్రజల వద్దకు రండి, ఆ ప్రజలను అడగండి. వాళ్లు ఏం చెప్తే అది చేయండి. నేను దారి వెంట వస్తూ చాలా మంది ప్రజలను అడిగా.. పీలేరు నియోజకవర్గ ప్రజలను కూడా అడిగా!  ‘గ్యాస్ సబ్సిడీ ఇంత వరకు అందలేదన్నా.. రూ.1,300 పెట్టి గ్యాస్ కొనుక్కుంటున్నాం’ అని చాలామంది అక్కా చెల్లెమ్మలు చెప్పారు. వ్యవసాయానికి ఎన్నిగంటలు కరెంటు ఇస్తున్నారని రైతన్నలను అడిగితే.. 3-4 గంటలకు మించి ఇవ్వలేదన్నారు. పీలేరులో తాగటానికి నీళ్లు లేవని అక్కాచెల్లెమ్మలు చెప్తున్నా రు, బిందెడు నీళ్లు రూ.3 నుంచి రూ. 5 పెట్టి కొనుక్కుంటున్నాం అని చెప్తున్నారు. ఈ సమస్యల మీద చర్చించకుండా రాష్ట్రాన్ని ఎలా విభజించాలని చర్చిస్తారట.
 
 కిరణ్.. ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని?
 అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఎప్పుడో జూలై 30న సీడబ్ల్యూసీ మీటింగ్‌లో సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజిస్తామని చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని నేను అడుగుతున్నా. ఎవరు ఆపుతున్నారయ్యా నిన్ను? ముఖ్యమంత్రి హోదాలో వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చెప్పి మేం అంతా కోరినా కూడా మీరు ఎందుకు తీర్మానం చేయలేదు? అంతెందుకు కనీసం ఇప్పుడైనా తీర్మానం చేయండి అంటే వెనకడుగు వేస్తున్నారు. సోనియా గాంధీ ప్రత్యేక విమానంలో బిల్లును పంపించారు. ఆ బిల్లు డ్రాఫ్టు అందిన 17 గంటలలోపే సంతకం చేసి దాన్ని అసెంబ్లీకి ఎందుకు పంపించారు? రాష్ట్రమంతటా సమైక్య ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉద్యోగస్తులు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అటువంటి ఉద్యోగులను ఎందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి భయపెట్టి దీక్షలు, ధర్నాలను విరమింపజేశారు? సోనియా గాంధీ విభజన చేయాలని చెప్తుంటే ముఖ్యమంత్రిగా నువ్వు మీ అధికారులకు చెప్పి ప్రతి అడుగులోనూ ఎందుకు సహకారం అందిస్తున్నావు?’’
 
 జగన్ వెంట యాత్రలో పాల్గొన్న వారిలో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రోజా, డాక్టర్ సునీల్‌కుమార్ తదితరులు ఉన్నారు.
 
 సమైక్యం కోసం మీరు ఏం చేశారు?
 ‘‘రాష్ట్రాన్ని విడగొట్టడానికిగాను బిల్లుపై చర్చ జరిపించేందుకు ఉత్సాహం చూపిస్తున్న నాయకులందరినీ నేను అడగదలుచుకున్నా. ఈ రాష్ట్రాన్ని విడగొట్టకూడదని ఏ రోజైనా మీరు నిరాహార దీక్షలు చేశారా? రాష్ట్రాన్ని విడగొట్టవద్దని ఎప్పుడైనా రాష్ట్రపతి వద్దకు వెళ్లి అఫిడవిట్లు ఇచ్చారా? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి అని కనీసం ఒక్క లేఖైనా ఇచ్చారా? అని అడుగుతున్నా. ఏ ఒక్కటీ కూడా వీళ్లు చేయలేదు. వీళ్లు చేస్తున్నదంతా ముసుగులో దొంగాట. వీళ్లంతా కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని విడగొట్టడానికి సిద్ధమయ్యారు. మీరు చేస్తున్న మోసాలను పై నుంచి దేవుడు చూస్తున్నాడు.
 
  రాష్ట్రంలోని ప్రతి ఒక్కరం ఒక్కటవుతాం. ఒక్కటైనప్పుడు ఉప్పెన లేస్తుంది. రాష్ట్రాన్ని విభజించాలని ఉబలాటపడుతున్న సోనియాగాంధీ, ఆమె గీచిన గీత దాటకుండా ప్రజలను మోసం చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు.. వీళ్లంతా ఆ ఉప్పెనలో కొట్టుకుపోతారు. వీళ్లంతా ఎన్ని కుట్రలు పన్నినా.. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతాయి. వాటిలో మనందరం ఒక్కటవుదాం. ఒక్కటై 30 ఎంపీ స్థానాలను మనంతట మనమే తెచ్చుకుందాం. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడదాం.’’

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై ఖాకీల దమనకాండ

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై ఖాకీల దమనకాండ
  • విజయమ్మ సహా అంతా అదుపులోకి
  •   నిరసనలతో హోరెత్తిన  అసెంబ్లీ లాబీలు
  •   సస్పెన్షన్‌ను నిరసిస్తూ  రోడ్డెక్కిన ఎమ్మెల్యేలు
  •   అరెస్టు చేసి గోషామహల్‌కు తరలింపు
  •   అసెంబ్లీ వాయిదా పడేదాకా నిర్బంధం




 
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశాక, వారిపై పోలీసుల అణచివేత చర్యలకు అసెంబ్లీ ఇన్నర్ లాబీల నుంచే తెర లేచింది. సస్పెండైన ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా లాబీల్లోకి తరలించారు. వారంతా మళ్లీ ఇన్నర్ లాబీల్లోకి వెళ్లే ప్రయత్నం చేయగా మార్షల్స్ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు తలుపులు మూసివేశారు. అందుకు ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అది పెనుగులాటకు, తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కనీసం నిరసన తెలిపేందుకు కూడా ఎమ్మెల్యేలకు పోలీ’జీలు ఏమాత్రమూ అవకాశం ఇవ్వలేదు. తమను సభ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారని, తాము లాబీల్లో, ఇన్నర్ లాబీల్లో ఉండవచ్చని సభ్యులన్నారు. ‘హైదరాబాద్ నుంచి మమ్మల్ని తరిమేస్తారా?’ అంటూ తలుపులను బలవంతంగా వాటిని తెరిచి ఇన్నర్ లాబీల్లోకి దూసుకెళ్లారు. వారు సభలోకి వెళ్తారనే అనుమానంతో టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ లింబారెడ్డి నేతృత్వంలో మార్షల్స్ విధులు నిర్వరిస్తున్న పోలీసులు ఇన్నర్ లాబీలోని మెట్ల వద్ద అడ్డుకున్నారు. మరోసారి చేతులపై ఎత్తుకుని బయటికి తరలించారు. దీన్ని నిరసిస్తూ ఎమ్మెల్యేలంతా 10 నిమిషాల పాటు లాబీల్లో బైఠాయించారు. సభ నుంచి వాకౌట్ చేసొచ్చిన విజయమ్మ వారితో కలిశారు. అక్కడి నుంచి తరలించేందుకు మార్షల్స్ ప్రయత్నించడంతో నిరసనగా విజయమ్మ నేతృత్వంలో అసెంబ్లీ బయట రవీంద్రభారతి చౌరస్తా దిశగా బయల్దేరారు.
 
సస్పెండైన ఎమ్మెల్యేలతో పాటు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా వీరిలో ఉన్నారు. అయితే వారిని ఖాకీలు అడుగడుగునా అడ్డుకున్నారు. సభా ప్రాంగణం నుంచి బయటికొచ్చి సమైక్యాంధ్రప్రదేశ్ ప్లకార్డులను పట్టుకుని బయటకు నిష్ర్కమిస్తున్న వారిని కూడా వదల్లేదు. ఎమ్మెల్యేలు రోడెక్కుతుండగానే, పోలీసులు పక్కా ప్రణాళిక ప్రకారం ఒక్క ఉదుటున అందరినీ చుట్టుముట్టారు. అసెంబ్లీ రెండో గేటు గుండా బయటికొస్తున్నఎమ్మెల్యేలను చిత్రించేందుకు ప్రయత్నించిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లను, విలేకరులను ఎక్కడికక్కడ లాగిపారేశారు. ప్రత్యేకంగా రోప్ పార్టీని ఏర్పాటు చేసి మరీ ఎమ్మెల్యేల దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా కట్టడి చేశారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు వద్దకు చేరుకోగానే వారిపై బలప్రయోగం చేశారు.
 
నిరసనగా రోడ్డుపై బైఠాయించిన కొరుముట్ల, గడికోటలను లాగిపడేశారు. విజయమ్మతో పాటు భూమా శోభా నాగిరెడ్డి, మేకతోటి సుచరిత, ధర్మాన కృష్ణదాస్, తెల్లం బాలరాజు, గొల్ల బాబూరావు, కె. శ్రీనివాసులు, ఆకేపాటి అమరనాథరెడ్డి, బాలినేని, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథ్‌రెడ్డి, కె.చెన్నకేశవరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి,  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, విశ్వరూప్, శ్రీకాంత్‌రెడ్డి, భూమన, కాటసాని రామిరెడ్డి, ఆదినారాయణరెడ్డిలను అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. దీన్ని నిరసిస్తూ వారంతా అక్కడే ధర్నాకు దిగారు. సభ్యులను అసెంబ్లీ వాయిదా పడేదాకా నిర్బంధంలోనే ఉంచి, మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున గోషామహల్‌కు తరలి వచ్చి ఎమ్మెల్యేలకు సంఘీభావం ప్రకటించారు.ఎమ్మెల్యేల అరెస్టుపై వైఎస్ విజయమ్మ విస్మయం వ్యక్తం చేశారు.

Popular Posts

Topics :