30 December 2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

'హెటిరో' వైఖరిని ఖండించిన వైఎస్సార్ సీపీ

Written By news on Saturday, January 5, 2013 | 1/05/2013

హెటిరో యాజమాన్య వైఖరిని వైఎస్‌ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు జనక్‌ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. విశాఖ హెటిరో డ్రగ్స్ పరిశ్రమలో శనివారం ప్రమాదం జరిగి చనిపోయిన కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు. ఆ పరిశ్రమలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిచాలన్నారు. మృతుల కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. హెటిరో డ్రగ్స్ సీ-బ్లాక్‌లో ప్రమాదం జరిగి ముగ్గురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=518125&Categoryid=14&subcatid=0

Sakshi Special Edition Sharmila-Housing

జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్సీ మల్లెల

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ మల్లెల లక్ష్మీనారాయణ శనివారం చంచల్‌గూడలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్‌-టీడీపీ కుమ్మక్కు కుట్రల ఫలితంగానే జగన్‌ను జైలులో ఉంచారన్నారు. జనం జగన్‌ వెంట ఉన్నారని, తాను కూడా పార్టీ కోసం కృషి చేస్తానని చెప్పారు.

లక్షకుపైగా సంతకాలు సేకరించిన గౌతంరెడ్డి

'జగన్ కోసం.. జనం సంతకం' కోటి సంతకాల సేకరణలో భాగంలో విజయవాడకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతంరెడ్డి లక్షకుపైగా సంతకాలు సేకరించారు. కేవలం 3 రోజుల్లోనే విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఆయనీ సంతకాలు పెట్టించారు. లోటస్‌పాండ్‌లో వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిసి 1.06 లక్షల సంతకాలతో ఉన్న పత్రాలను ఆయన అందజేశారు.

ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ సీపీ ఉద్యమం

విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. గత మూడేళ్లలో కరెంట్‌ ఛార్జీలు పేరుతో ఈ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని ఆ పార్టీ నేత జనక్‌ప్రసాద్‌ శనివారమిక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛార్జీల పెంపుపై ప్రతిపక్షం స్పందింకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. కరెంట్‌ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమిస్తుందని జనక్‌ప్రసాద్‌ తెలిపారు. దీనిపై తర్వలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

ధన్వాడ: విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం మరికల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. రెడ్డిగారి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. వెంటనే కరెంట్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నిరసనతో రాయిచూర్- మహబూబ్‌నగర్ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

YSRCP leader Janakprasad Press Meet on 5th Jan 2013

BC Leaders meets YS Jagan

జగన్ ను కలిసిన పలువురు నేతలు

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శనివారం పలువురు టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు చంచల్‌గూడ జైలులో కలిశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజక వర్గం, తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లుల లక్ష్మీనారాయణ, అదే జిల్లాకు చెందిన మరో బీసీ నేత, తణుకు మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చీర్ల రాధకృష్ణ జగన్‌ను కలిశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అమరచింత మాజీ ఎమ్మెల్యే సోమభూపాల్‌ రెడ్డి కుమారుడు శ్రీరాం భూపాల్‌ రెడ్డి కూడా జగన్‌ను కలిసిన నేతల్లో వున్నారు.

ఓదార్చడమే నేరమైందా?

‘రాజన్న రాజ్యం’ రావాలంటే పులివెందుల పులిబిడ్డ కటకటాలను ఛేదించి బయటకు రావాలి. ఆ బిడ్డ ఏం తప్పు చేశాడని జైలుపాలు చేశారు? మన రాజన్న ఇమేజ్‌ను దెబ్బతీయటానికి కాంగ్రెస్ పన్నిన పన్నాగం కాదా ఇది! వైఎస్సార్ మరణవార్త విని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఓదార్చటానికి వెళ్లటం తప్పా? జగన్ ఎవరి కోసం అంత రిస్క్ తీసుకున్నారు? మహానేత మనందరినీ విడిచి దేవుడి దగ్గరకు వెళ్లిన విషయం జగన్‌బాబు ఒక్కరికే తెలుసా? ఈ ప్రభుత్వానికి తెలియదా? ఓదార్పుయాత్ర చేసినందుకే కాంగ్రెస్ నుండి వైదొలగేలా చేస్తారా? అసలు సంగతి అదికాదని ప్రజలకు తెలుసు.

జగన్ ఒక మహానేతగా ఎదుగుతున్నాడన్న భయం! జగన్ కాంగ్రెస్‌లో ఉండి ఉంటే ఇన్ని అభియోగాలను ఆ పార్టీ ఆయనపై మోపేదా? న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసి ఉండేదా? రాజన్న ఉన్నప్పుడు సోనియాకు ఈ ఆస్తుల విషయాలు గుర్తు రాలేదా? అప్పుడు రాదులెండి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ నిలబడటానికి మూలస్తంభం మన రాజన్నే కదా! కన్నతండ్రిని పోగొట్టుకుని జగన్ బాధలో ఉంటే జైలుపాలు చేస్తుందా ఈ ప్రభుత్వం? ఆ బాధ నుండి వారు తేరుకోకముందే అర్థంలేని ఆరోపణలు గుప్పించి, జైలుపాలు చేయటం న్యాయమేనా? ఎమ్మెల్యే అని తెలిసి కూడా వైఎస్సార్ పార్టీ గౌరవాధ్యక్షురాలైన విజయమ్మని కూడా రోడ్డు మీదకు రప్పిస్తారా!

ఎలక్షన్ల ప్రచారానికి వెళుతున్న ఆమె సూట్‌కేసును మన పోలీసులు తనిఖీ చేస్తారా? ఇంతవరకూ ఏ రాష్ట్రంలోనూ మహిళా హోమ్‌మంత్రి లేరు. అలాంటిది మొట్టమొదట మనరాష్ట్రంలోనే సబితా ఇంద్రారెడ్డిని హోమ్‌మినిస్టర్‌గా రాజన్న నిలబెట్టారు. సబితమ్మా! రాజన్న చేసిన మేలు మర్చిపోయావా? ఆ కుటుంబం మీకు చేసిన అన్యాయమేమిటి? నువ్వు అన్న అనుకుని రాఖీ కట్టిన విషయం కూడా మర్చిపోయావా?

ఎవరు ఎలా మారిపోయినా, రాష్ట్రానికి తప్పకుండా మంచిరోజులు వస్తాయి. ఏ ఒక్కరూ బాధపడనవసరం లేదు. మన గురించి, రాష్ట్రం గురించి రాజన్న కన్న కలలన్నీ పులిబిడ్డ జగన్ నిజం చేసేరోజు దగ్గరలోనే ఉంది.

- ఇంటూరి శేషకుమారి, విజయవాడ

అధిష్టానాన్ని ఢీకొట్టినందుకు ఇన్ని కష్టాలా?!

మాది మధ్యతరగతి కుటుంబం. మాకు ఐదు ఎకరాల పొలం ఉంది. చంద్రబాబుగారు ఉన్నప్పుడు కరెంటుబిల్లు కట్టలేక పొలం వదిలేశాం. మేం కూలిపని చేసుకుంటూ ఓ పూట తిని మరోపూట పస్తుండేవాళ్లం. మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రి అవగానే రైతులకు ఉచిత కరెంటు ఇవ్వటంతో మా భూమిని పండించుకుంటూ మూడుపూటలా అన్నం తింటు న్నాం. మహానేత ఫొటో ఇంట్లో పెట్టుకుని పూజించుకుంటున్నాం. అంత మంచిమనిషి కుమారుడిని జైల్లో పెట్టడం మాకు బాధగా ఉంది. మాకు ఒక విషయం అర్థం కావడం లేదు... జగన్ ఏ తప్పు చేశాడని జైల్లో పెట్టారు? బహుశా నల్లకాలువ దగ్గర మహానేత మరణాన్ని తట్టుకోలేక గుండె ఆగిపోయి మరణించిన కుటుంబాలను వారి ఇళ్లకు పోయి ఓదారుస్తాను అని మాటిచ్చి, ఆ మాటమీద నిలబడినందుకా?

ఇచ్చినమాట నిలబెట్టుకునేందుకు విజయమ్మగారు, జగన్‌గారు ఢిల్లీ చుట్టూ తిరిగి ప్రాధేయపడినందుకా? మడమ తప్పనని పులివెందుల పులిబిడ్డ అధిష్టానాన్ని ఢీకొట్టినందుకా? 150మంది ఎమ్మెల్యేలు తనను సీఎంను చేయాలని సంతకాలు చేసినా జగన్ ఆ పదవిని తృణప్రాయంగా త్యజించినందుకా? వైఎస్సార్‌కి, జగన్‌కి ఉన్నది విశ్వసనీయత. నమ్మినవారికి ప్రాణాలనైనా ఇస్తారు. చంద్రబాబుగారిది నమ్మినవారిని వెన్నుపోటు పొడిచే బుద్ధి. మాటకోసం పదవులను త్యజించే బుద్ధి. పదవుల కోసం వెన్నుపోటు పొడిచే బుద్ధి. చంద్రబాబు, కాంగ్రెస్ బాబులు కలిసి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా అంతిమ విజయం జగన్‌దే!

- ఎస్.నారాయణరెడ్డి, సికింద్రాబాద్

వైఎస్ పాదయాత్రతో పోలికే లేదు

బాబు యాత్ర ప్రజల కోసమా, రికార్డుల కోసమా?

సాక్షి, హైదరాబాద్: సినిమా దర్శకులు, నటుల సలహాలు, సూచనలతో, సినీ పద్ధతిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బాబు యాత్రకు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మండుటెండల్లో చేసిన పాదయాత్రకు ఏ మాత్రం పోలికే లేదని పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ 52 డిగ్రీల ఎండలను కూడా లెక్క చేయకుండా ప్రజలతో మమేకమైతే బాబు మాత్రం మార్నింగ్, ఈవెనింగ్ వాకింగ్ మాదిరిగా చల్లటి సమయంలో యాత్ర చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ‘‘ప్రజల్లో ఎలా నటించాలో సినీ దర్శకులు చేసిన సూచనలను బాబు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారు. 

అంతేగాక సినిమా వారి మాదిరిగా 25 రోజులు, 50 రోజులు, 100 రోజుల పండుగలు నిర్వహిస్తున్నారు. కేకులు కట్ చేస్తున్నారు. రాష్ట్రానికి ఏదో వెలగబెట్టినట్టుగా బాబు తనకు తానే శిలాఫలకం వేయించుకోవడం సిగ్గుపడాల్సిన చర్య. ఏసీ బస్సుల్లో నిద్రిస్తూ, రోడ్డుపై ట్యాంకర్ల చేత నీళ్లు చల్లిస్తూ సాగించే యాత్రను కూడా పాదయాత్రే అంటారా?’’ అని ప్రశ్నించారు. బాబు యాత్ర ప్రజల కోసమా, తన రికార్డుల కోసమా స్పష్టం చేయాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. వైఎస్ పాదయాత్రను బాబు అధిగమించారంటూ టీడీపీ నేతలు పోల్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలకు అందుబాటులో లేకుండా అర్ధరాత్రి వేళల్లో నడక సాగించడాన్ని ఏమని అర్థం చేసుకోవాలో టీడీపీ నేతలే చెప్పాలన్నారు.

తొమ్మిదేళ్లు ఏం చేశావ్?

బాబు పచ్చి అవకాశవాది అని, ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని శ్రీకాంత్ మండిపడ్డారు. ఆయనకు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప ఒక్క నిజం పలకడం చేత కాదన్నారు. ‘‘తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఒక్క మేలైనా చేశావా? వారి బాగోగులను ఏనాడైనా పట్టించుకున్నావా? వృద్ధులకు మూడు నెలలకు ఒకసారి పెన్షన్లిచ్చావు. రైతులను జైల్లో పెట్టించావు. ఏ ముఖం పెట్టుకుని ప్రజల మధ్యకొస్తున్నావు? మళ్లీ నిన్ను గెలిపించి చీకటి పాలనను కొనితెచ్చుకోమంటావా?’’ అని బాబును ప్రశ్నించారు. అసలు బాబుకు కళ్లు మూసినా, తెరిచినా వైఎస్ కుటుంబమే కళ్ల ముందు కనిపిస్తుంటుందని, అందుకే ఎక్కడికి వెళ్లినా వారిని దూషిస్తున్నారని అన్నారు.

కడప, పులివెందులవాసులు తరిమికొడతారు!

పదేపదే కడప, పులివెందుల రౌడీలు అంటూ తమ ప్రాంత ప్రజల మనోభావాలను బాబు దెబ్బ తీస్తున్నారని శ్రీకాంత్ మండిపడ్డారు. తొమ్మిదేళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి ఇంగితజ్ఞానం కూడా లేకుండా ఒక ప్రాంత ప్రజలను చులకన చేసి మాట్లాడటం సబబా అని ప్రశ్నించారు. మరోసారి కడప, పులివెందుల అంటూ తమ ప్రాంత ప్రజలను అవమానపరిస్తే బాబును వారే తరిమికొడతారని హెచ్చరించారు.

న్యాయవాదులు లేరని సీబీఐ చెప్పడం శోచనీయం

జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు రానుందని ముందే తెలుసుకదా!
అయినా సీనియర్ న్యాయవాదులు లేరంటూ గడువు కోరడం గర్హనీయం
అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారీ సీబీఐ కుట్రపూరితంగా మోకాలడ్డుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. తాజాగా హైకోర్టులో విచారణకొచ్చిన బెయిల్ పిటిషన్‌పై సీబీఐ గడువు కోరడం గర్హనీయమని మండిపడ్డారు. శుక్రవారంనాడిక్కడ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీబీఐపై తాము మొదటి నుంచీ చేస్తున్న వ్యాఖ్యలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయని పద్మ వివరించారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడమేగాక బెయిల్ పిటిషన్‌పై కూడా సీబీఐ మోసపూరిత కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. 

‘హైకోర్టులో బెయిల్ పిటిషన్ సందర్భంగా వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులు లేరని సీబీఐ చెప్పడం శోచనీయం. కేసు విచారణకు రానుందని పదిరోజుల కిందటే తెలిసినప్పటికీ నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించింది. జగన్ పట్ల సీబీఐ మొదటి నుంచీ కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోంది. కాంగ్రెస్- టీడీపీ నాయకులు చెప్పిన మాదిరిగానే ముందుకెళ్తోంది’ అని పద్మ మండిపడ్డారు. సీబీఐ వ్యవహారశైలి ఒక దురుద్దేశ పద్ధతిలో, రహస్య ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లుగా ఉందన్నారు. మీడియాలో ఓ వర్గానికి లీకులిచ్చి, వారితో పుంఖానుపుంఖాలుగా జగన్‌పై అసత్య కథనాలు రాయిస్తోందన్నారు. తమ నేతను అక్రమంగా జైల్లో బంధించి 225 రోజులు గడుస్తున్నా బెయిల్ రాకుండా అడ్డుపడుతోందని దుయ్యబట్టారు. వ్యక్తులను బట్టి సీబీఐ వ్యవహారశైలి మారుతుంటుందని, అందుకు చంద్రబాబు పట్ల వారు వ్యవహరించిన వైఖరే ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు.

ప్రజాదరణ పొందడమే జగన్ చేసిన తప్పా?

రాష్ట్ర ప్రజల విశేష ఆదరాభిమానాలు పొందడమే జగన్ చేసిన తప్పా? కడప ఉప ఎన్నికల్లో 5.30 లక్షల మెజార్టీతో ప్రత్యర్థులను చిత్తు చేయడమే ఆయన చేసిన నేరమా? అని పద్మ సూటిగా ప్రశ్నించారు. న్యాయస్థానాల్లో జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారీ సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పడంలో నిజం లేదన్నారు. 26 జీవోలకు సంబంధించి అధికారంలో ఉన్న మంత్రులు, ఐఏఎస్ అధికారులు ప్రభావితం చేయలేనిది, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ఎలా చేయగలుగుతారని నిలదీశారు. న్యాయస్థానాలను, ప్రజాస్వామ్య వాదులను సీబీఐ పక్కదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతూ సీబీఐ వ్యవహరిస్తున్న ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని, అవకాశం వచ్చినప్పుడు తగినబుద్ధి చెప్తారన్నారు. అదే విధంగా కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కలిసి చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు న్యాయస్థానాల్లో కూడా బట్టబయలుకాక తప్పదని, ఆ రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు. మంచిపై చెడు నెగ్గలేదని, న్యాయస్థానాలపై తమకు నమ్మకముందని, అంతిమంగా న్యాయం గెలిచితీరుతుందని అన్నారు. 

సోదర భావంతో మెలగాలి..

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఒకవర్గం ప్రజల మనోభావాలను కించపరిచేలా మాట్లాడ్డాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పద్మ తెలిపారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎవరు ఎక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం ఏర్పాటైన తమ పార్టీ అన్ని మతాలు, వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. అన్ని మతాల వారు పరస్పరం గౌరవించుకొని ఒకరికొకరు సోదరభావంతో మెలగాల్సిన దేశంలో అక్బరుద్దీన్ కించపరిచేలా మాట్లడటం సరైందికాదన్నారు. ఆయన వ్యవహరించిన తీరుపట్ల తమ పార్టీ విచారం వ్యక్తం చేస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని పద్మ కోరారు.

‘బాబు’జిల్లాలో బీటలువారుతున్న టీడీపీ

ముఖ్యనేతల నిష్ర్కమణతో దిక్కుతోచని వైనం

సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో క్రమంగా ఆ పార్టీ ఖాళీ అవుతోంది. ప్రస్తుతం నాలుగు నియోజక వర్గాల్లో ఇన్‌చార్జ్‌లను నియమించుకోలేక ఉక్కిరి బిక్కిరవుతోంది. చంద్రబాబు నాయుడు కుమ్మక్కు రాజకీయాలను నిరసిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథరెడ్డి (పలమనేరు) ఎ.వి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(తంబళ్లపల్లె) గత నెలలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్న టీడీపీకి పీలేరులో మరో దెబ్బ పడింది. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబంతో నాలుగు దశాబ్దాలుగా రాజకీయ పోరు సాగిస్తున్న కుటుంబానికి చెందిన మాజీ శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి గురువారం టీడీపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణరుుంచడంతో పీలేరు నియోజకవర్గంలో సైతం టీడీపీకి నాయకత్వ సమస్య ఏర్పడింది.
నాలుగు దశాబ్దాల రాజకీయనేపథ్యం

వాల్మీకిపురం శాసనసభా స్థానం నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రి నల్లారి అమరనాథరెడ్డి మీద చింతల రామచంద్రారెడ్డి తండ్రి సురేంద్రరెడ్డి 1972లో స్వతంత్ర అభ్యర్థిగాను, 1978లో జనతా పార్టీ అభ్యర్థిగాను పోటీ చేసి ఓడిపోయారు. 1983లో టీడీపీ అభ్యర్థిగా సురేంద్రరెడ్డి పోటీ చేసి అమరనాథరెడ్డిని ఓడించారు. 1985లో మళ్లీ అమరనాథరెడ్డి గెలిచి 1988లో మరణించారు. దీంతో వాల్మీకిపురం స్థానానికి 1988లో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో 25 సంవత్సరాల వయస్సులోనే చింతల రామచంద్రారెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి అమరనాథరెడ్డి సతీమణి సరోజమ్మను ఓడించారు. 1989లో కిరణ్‌కుమార్ రెడ్డి మీద ఓడిన చింతల మళ్లీ 1994లో కిరణ్‌కుమార్ రెడ్డిని ఓడించారు. ఆ ఎన్నిక నుంచే కిరణ్‌కుమార్ రెడ్డి- చింతల రామచంద్రారెడ్డి రెండు వర్గాలకు నాయకులయ్యారు. 

అప్పటినుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి మీద చింతల రామచంద్రారెడ్డి రాజకీయ పోరాటం సాగిస్తూనే ఉన్నారు. 1995 నుంచి 1997 దాకా చింతల రామచంద్రారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 2004లో టీడీపీ టికెట్ దక్కక పోయినా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న రామచంద్రారెడ్డి 2009 ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే వాతావరణం కనిపించడంతో ప్రజారాజ్యంలో చేరారు. ఆ ఎన్నికల్లో పీలేరు స్థానం నుంచి పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధిం చారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయడంతో ఆ పార్టీలో ఇమడలేక, కిరణ్‌కుమార్‌రెడ్డి మీద పోరాటం చేయడానికి మళ్లీ టీడీపీవైపు మొగ్గుచూపారు. కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా టీడీపీ మారిన వైనం చూసి చింతల గత నాలుగు నెలలుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన మద్దతుదారుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. 

ముమ్మరంగా సాగుతున్న ‘జగన్ కోసం.. జనం సంతకం’

స్వయంగా అందజేయనున్న విజయమ్మ
ముమ్మరంగా సాగుతున్న ‘జగన్ కోసం.. జనం సంతకం’

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కూట్రపూరిత కేసులు, అక్రమ నిర్బంధానికి నిరసనగా ‘జగన్ కోసం- జనం సంతకం’ పేరుతో ఆ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అన్ని జిల్లాల్లో ముమ్మరంగా సాగుతోంది. సంతకాల కోసం పార్టీ నాయకులు జనం దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వారే స్వయంగా తరలివచ్చి సంతకాలు చేస్తున్నారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్‌పై అవగాహన ఉన్నవారు.. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్.కామ్, సాక్షి.కామ్, సాక్షిటీవీ.కామ్’’ వెబ్‌సైట్లలోకివెళ్లి సంతకాలు చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంకొందరు ఆ పార్టీ సైట్‌లో పత్రాలు డౌన్‌లోడ్ చేసుకుని.. జగన్‌కు మద్దతు తెలిపేవారితో సంతకాలు చేయించి హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి పంపుతున్నారని వివరించాయి.

మరికొందరు ‘సాక్షి’ పత్రికలో పార్టీ ఇచ్చిన ప్రకటనను జిరాక్స్ చేయించి వాటిపై సంతకాలు చేసి పంపుతున్నారని పేర్కొన్నాయి. కోటి సంతకాల సేకరణ పూర్తికాగానే వాటిని పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ స్వయంగా రాష్ట్రపతిని కలిసి అందజేయాలని నిర్ణయించారు. కోటి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా విజయమ్మ నాయకత్వంలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. జగన్ విషయంలో సీబీఐ మొదటి నుంచీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సాగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వివరిస్తూ రూపొందించిన వినతిపత్రంతో పాటు కోటి సంతకాలను స్వయంగా విజయమ్మ రాష్ట్రపతికి అందజేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరాలని నిర్ణయించారు.

వైఎస్ఆర్ కు చంద్రబాబుకు పోలికా?: గండ్ర

Written By news on Friday, January 4, 2013 | 1/04/2013

 వైఎస్‌ఆర్‌ పాదయాత్రతో చంద్రబాబు పాదయాత్రకు పోలికే లేదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌ పాదయాత్రకు జనం తండోపతండాలుగా తరలివచ్చారని ఆయన తెలిపారు. పార్టీ కార్యకర్తలు ఉన్నారో లేరో అని చూసుకుని బాబు పాదయాత్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైఎస్‌ఆర్‌ పాదయాత్రలో అమలు చేయగలిగిన హామీలనే ప్రజలకిచ్చారని ఆయన తెలిపారు. బాబు మాత్రం అమలు సాధ్యంకాని హామీలను ఇస్తున్నారని గండ్ర అన్నారు. 

YSRCP Condemns Owaisi Hate Speech

YSRCP Leader VasiReddy Padma Press Meet 4th Jan

Jagan kosam Janam Santakam' gets good response

YSRCP MLA Srikanth Reddy press meet in YSRCP Office 4th Jan 2013

న్యాయవ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని పక్కదోవ పట్టించేలా సీబీఐ

 వైఎస్‌ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణకు వచ్చిన ప్రతీసారి సీబీఐ ఉద్దేశపూర్వకంగా బెయిల్‌ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. సీబీఐ కక్షతో వ్యవహరిస్తున్న తీరు దారుణమని వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీబీఐ ఫ్యాక్షన్‌ ధోరణితో పనిచేస్తోందా అనే అనుమానం అందరిలో ఉంది అని అన్నారు. 

న్యాయవ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని పక్కదోవ పట్టించేలా సీబీఐ వ్యవహరిస్తోందని పద్మ ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సీపీకి న్యాయస్థానాలాపై నమ్మకం ఉందన్నారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలను వైఎస్ఆర్ సీపీ తీవ్రంగా ఖండిస్తోందని.. రాజ్యాంగ స్పూర్తికి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పేనని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.

'చంద్రబాబు పాదయాత్ర? మార్నింగ్ వాకా?

 చంద్రబాబు పాదయాత్ర రికార్డుల కోసమా.. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికా అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. హైటెక్‌ పోకడలతో చేస్తోన్న చంద్రబాబు పాదయాత్రను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. పాదయాత్రలో ప్రతిరోజూ వైఎస్ కుటుంబంపై విమర్శలు చేస్తున్న ఆయనకు వైఎస్ , వైఎస్ఆర్ సీపీ అంటే ఎంత భయమో అర్ధమవుతుందని ఆయన తెలిపారు. 

చంద్రబాబు పాదయాత్రకు .. వైఎస్ పాదయాత్రకు పోలికే లేదన్నారు. 9 ఏళ్లు తన హయాంలో ఏమీ చేయలేదని బాబు పాదయాత్ర చేస్తే మంచిదని ఆయన అన్నారు. చంద్రబాబు చేస్తున్నది పాదయాత్రా? లేక మార్నింగ్ వాకా అని తనకు అనుమానవస్తుందన్నారు. చంద్రబాబు మరోసారి ప్రాంతాల గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. చంద్రబాబు తన ప్రవర్తన మార్చుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

YS Jagan's Regular Bail plea adjourned to Jan 22nd

జగన్ బెయిల్ పై విచారణ 22కి వాయిదా

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా పడింది. సీనియర్ న్యాయవాదులు అందుబాటులో లేనందున విచారణను వాయిదా వేయాలని సీబీఐ కోర్టును కోరింది. దాంతో న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీం కోర్టుకు సీబీఐ లిఖితపూర్వకంగా తెలియజేసిన 3 నెలల గడువు ఈ రోజుతో ముగిసింది. 

ఈ క్రమంలో ఈరోజు ఉదయం బెయిలుపై విచారణ మొదలుకాగా... సీనియర్‌ న్యాయవాది తమకు అందుబాటులో లేరని, కాబట్టి ఈ నెల 18వ తేదీకి గానీ, 21వ తేదీకి గానీ వాయిదా వేయాలని సీబీఐ కోరింది. దీనికి జగన్‌ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

సీనియర్‌ న్యాయవాదులు చాలామంది ఉంటారని, ఒకరు కాకుంటే మరొకరిని తెచ్చుకోవాలి తప్ప ఆ కారణంతో బెయిలు రాకుండా చేయాలనుకోవటం సరికాదని చెప్పారు. ఇది బెయిలును జాప్యం చేసే ఎత్తుగడే తప్ప మరొకటి కాదన్నారు. అయితే రేపటి నుంచి కోర్టుకు సంక్రాంతి సెలవులు కనుక అనంతరం ఈ కేసుపై విచారణ జరగనుంది.

'సహకార ఎన్నికల్లోనూ కుమ్మక్కు'

కాంగ్రెస్-టీడీపీలు సహకార ఎన్నికల్లోనూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ ఆర్ సీపీ మద్దతుదారులు గెలవనివ్వకుండా కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. ఓటర్ల నమోదులో భారీ అక్రమాలకు జరిగాయని, వాటిపై విచారణ జరిపించాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజాయితీ ఉంటే తహసీల్దార్ స్థాయిలో ఓటర్ల పరిశీలన చేయించాలని ఆయన అన్నారు. అర్హులకు ఓటు హక్కు కల్పించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.

YS Jagan Mohan reddy's regular bail plea adjourned to Afternoon

బెయిల్ పిటిషన్ పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. దాంతో కేసు విచారణను న్యాయమూర్తి మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు సీబీఐ విజ్ఞప్తికి జగన్ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. జగన్ బెయిల్ పిటిషన్ వాదనలు త్వరగా వినాలని వారు న్యాయస్థానాన్ని కోరారు.

‘జగన్’ నాద రథం!


వస్తున్నది! ‘జగన్’నాద రథం!
వస్తున్నది వస్తున్నది ‘జగన్’నాద రథం!
రానున్నది రానున్నది రాజన్న సువర్ణయుగం!
ఎద ఎదలో మెదులుతున్న, ఎపుడెపుడా అని రగులుతున్న
జన జీవన చైతన్య రథం! పూరించిన సమర శంఖారావం!
కదలండిక కదలండిక చేయి చేయి కలిపి!
నడవండిక నడవండిక అడుగు అడుగు కలిపి!
రాజన్నకు, జగనన్నకు, విజయమ్మకు మద్దతుగా!
షర్మిలమ్మ మరో ప్రజాప్రస్థానం దిశగా!
ఏ శక్తులు ఆపలేవు, కుయుక్తులిక సాగబోవు!
కుత్సిత బుద్ధుల పెద్దల కుతంత్రాలు పారబోవు!
ప్రభుత్వం, ప్రతిపక్షం కుమ్మక్కై కుట్రలెన్ని చేసినా
అంతిమ విజయం మనదే! సత్యమేవ జయతే!
ఎండనకా వాననకా రేయనకా పగలనకా
ఆలుబిడ్డలను వదలి ఆకలి దప్పులనే మరచి
మడమ తిప్పనంటూ మాట తప్పనంటూ విశ్వసతనే చూపేందుకు!
ప్రజలతో మమేకమై... ప్రజలే తన లోకమై!
ఓదార్పును చేస్తుంటే... ఓర్వలేకపోయారు!
జగన్‌పై కన్నుకుట్టి... సీబీఐని రెచ్చగొట్టి
జగనన్నపై కక్ష కట్టి జైలుపాలు చేశారు!
దేవుడు చూస్తున్నాడనే మాటనే మరిచారు!
రాజన్న కొడుకునే రాచి రంపాన పెట్టారు!
తండ్రి లేని పిల్లవాణ్ని తల్లడిల్లేలా జేశారు!
భర్తను కోల్పోయిన విజయమ్మను బాధలెన్నో పెట్టారు!
ఎన్నడూ గడప దాటని తల్లిని బజారుకే లాగారు!
ప్రభుత్వం ప్రతిపక్షాలకు ధరావతులు పోయినా
చేవ చచ్చి జావగారి చతికిలపడిపోయినా
బిక్కచచ్చి బక్కచిక్కి బొక్కబోర్లా పడినా
వరుసగా ఒక్కొక్కరు మీ పార్టీలను వీడినా
దుకాణాలు సర్దుకునే సమయమే వచ్చినా!
ఓటుతో ప్రజలు మిమ్ము ఎన్నిసార్లు ఓడించినా
తలలు బొప్పి కట్టేటట్లు ఎన్నిసార్లు మొట్టినా సిగ్గు రాలేదా?
కాచుకుని ఉన్నారు ప్రజలు మిమ్ము కాటికి పంపేందుకు!
వేచి ఉన్నారు ప్రజలు మిమ్ము గోతిలోన పూడ్చేందుకు!
ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్నారు జనం
జగనన్నకు పట్టం కట్టేందుకు! మీకు గోరీ కట్టేందుకు!
కసికసిగా కదులుతున్న రాజకీయ చిత్రపటం!
వడివడిగా అడుగులేస్తూ కదులుతున్న జనం!
జగన్ వెంట జనం! జనం! జనం కాదు ప్రభంజనం!

- భారతుల సునీల్ భార్గవ్, గుంటూరు

కాంగ్రెస్ డ్రామా - చంద్రబాబు హైడ్రామా

తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతి పాలుజేసిన చంద్రబాబు పాలనకు చరమగీతం పాడటానికి ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న సమయంలో అన్నివర్గాలకు చెందిన ప్రజానీకానికి ఆత్మవిశ్వాసం కల్పించడానికి, సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తేవడానికి వై.ఎస్. చేసిన కృషి మరువరానిది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అభివృద్ధి మంత్రంతో కాంగ్రెస్ సర్కార్‌ను అధికారంలోకి తెచ్చినప్పటికీ, ఆయన అకాల మరణంతో రాష్ట్రం అంధకారంలో పడిపోయింది. ఏ రోజూ ప్రజల మధ్యకు వెళ్లని వృద్ధనేతలు కుర్చీకోసం ఆరాటపడి, ప్రజల కోసం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఖ్యాతిగాంచిన వై.ఎస్. కుటుంబాన్ని విస్మరించి, బురద జల్లించే ప్రయత్నాలు చేశారు.

ఈ నేపథ్యంలో తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి ముందుకొస్తున్న జగన్ వల్ల కాంగ్రెస్ లాభపడుతుందేమో గానీ తాము లాభపడలేమని భావించిన ముసలి నక్కలు కొన్ని, అధిష్టానం చెవులు కొరికి కొనసాగించిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. అదే అదనుగా - మామకు వెన్నుపోటు పొడిచి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు - కాంగ్రెస్‌తో కుమ్మక్కై కొనసాగిస్తున్న పాదయాత్ర డ్రామా ఏమిటో ప్రజలకు తెలిసిపోయింది. జగన్ జైల్లో ఉన్నప్పటికీ తెలుగు జాతి యావత్తూ తాము ఎదురుచూస్తున్న ప్రత్యామ్నాయం ఎప్పుడు వస్తుందన్న ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఆ కల నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది.

- మంజులారెడ్డి, పుత్తూరు

రెండేళ్లుగా టీడీపీ.. కాంగ్రెస్‌తో చెట్టపట్టాలేసుకుని....

* పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధ్వజం
* దానికి నిరసనగానే పార్టీని వీడుతున్నా.. వైఎస్సార్‌సీపీలో చేరుతున్నా

సాక్షి, హైదరాబాద్: టీడీపీ అవలంబిస్తున్న అవకాశవాద రాజకీయాలకు నిరసనగా ఆ పార్టీని వీడుతున్నట్లు చిత్తూరు జిల్లా పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రకటించారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన గురువారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌కు వెన్నుదన్నుగా నిలిచేందుకు పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.

రెండేళ్లుగా టీడీపీ.. కాంగ్రెస్‌తో చెట్టపట్టాలేసుకుని పనిచేయటం బాధ కలిగిస్తోందన్నారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్‌టీఆర్ పార్టీ స్థాపించిన నాటినుంచి సేవలందించిన కుటుంబాలు 30 ఏళ్ల తరువాత ఎందుకు బయటకు వెళుతున్నాయనే విషయాన్ని టీడీపీ నేతలు అవగతం చేసుకోవాలన్నారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ భూస్థాపితమైనట్లేనన్నారు. కాగా జగన్‌ను చంచల్‌గూడ జైల్లో కలిసిన వెంటనే చింతల రామచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు టీడీపీ మీడియాకు ఎస్‌ఎంఎస్ సమాచారం పంపింది.

చంద్రబాబు ‘తప్పు’టడుగులు.. !

చంద్రబాబు ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రపై టీడీపీ అంకెల గారడీ ప్రదర్శిస్తోంది. 2012 అక్టోబర్ 2న యాత్ర ప్రారంభించిన బాబు గురువారం నాటికి 94 రోజుల్లో 1,399.1 కిలోమీటర్లు నడిచారు. ఆయన ఏ రోజు ఎంత దూరం నడిచారన్న వివరాలను ‘సాక్షి’ ప్రతి రోజూ పాఠకులకు అందజేస్తూ వస్తోంది కూడా. కానీ టీడీపీ నాయకులు మాత్రం గురువారంతో బాబు పాదయాత్ర 1,500 కిలోమీటర్లకు చేరిందంటూ ప్రకటించేశారు. పైగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారుగూడలో శిలాఫలకం కూడా ఏర్పాటు చేశారు. 

తొలి రోజు నుంచీ పాదయాత్ర దూరాన్ని ఇష్టానుసారం లెక్కిస్తూ వచ్చిన టీడీపీ తమ్ముళ్లు, తాజాగా దాన్ని 1,500 కిలోమీటర్లకు ‘చేర్చారు’. అందుకోసం పొలాలు, పాఠశాలల్లోకి ఆయన వెళ్లిన దూరాలను కూడా యాత్ర లెక్కలో చేర్చడంతో పాటు, టీడీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లినా పాదయాత్ర ఖాతాకు కలపడం వంటి పలు విన్యాసాలు చేశారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్టు ప్రకటన రాగానే బాబు యాత్ర లెక్కలన్నింటినీ మార్చే ప్రక్రియ జోరందుకుంది. 

అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని సుగూరు ఆంజనేయస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించిన బాబు, జిల్లాలో 13 రోజుల పాటు 226.4 కి.మీ. నడిచారు. కానీ టీడీపీ నేతలు మాత్రం సుమారు 250 కి.మీ. నడిచారని ప్రకటించారు. ఉదాహరణకు అక్టోబర్ 9న కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నారాయణపురం క్రాస్ నుంచి ఉరవకొండ నియోజకవర్గం విరూపపల్లి దాకా బాబు 18.4 కిలోమీటర్లు నడిచారు. కానీ టీడీపీ నేతలు మాత్రం కళ్యాణదుర్గం, దొడగట్టల్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వేదికలు, వాల్మీకుల సదస్సు ఏర్పాటైన ప్రదేశం, మధ్యలో బాబు పొలంలోకి వెళ్లిన దూరం... ఇలా మరో 1.6 కిలోమీటర్లను జోడించి ఆ రోజు పాదయాత్రను 20 కి.మీ.కి పెంచేశారు. ‘బాబు రోడ్డుపై నడిచిన దూరాన్ని మాత్రమే మేము తొలుత పరిగణనలోకి తీసుకున్నాం. 

ఆయన చాలా గ్రామాల్లో రోడ్డు దిగి ఊళ్లోకి, పొలాల్లోకి, పాఠశాలల్లోకి వెళ్లారు. ఆ లెక్కన జిల్లాలో బాబు 250 కిలోమీటర్ల దాకా నడిచారు’ అంటూ వివరణ కూడా ఇచ్చుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు కూడా ఈ సూత్రాన్నే వర్తింపజేశారు! జిల్లాలో బాబు నడిచింది 193.6 కిలోమీటర్లయితే, దాన్ని 200 కిలోమీటర్లకు పెంచేశారు. ఇక కరీంనగర్ జిల్లాలో ఒకరిద్దరు పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి వ్యక్తిగత కార్యక్రమాల్లో బాబు పాల్గొంటే ఆ దూరాన్నీ యాత్ర ఖాతాలోనే జమ చేశారు. పలుచోట్ల బాబు శివార్ల నుంచి వెళ్లినా, గ్రామాల మధ్య దూరాన్ని పరిగణనలోకి తీసుకొని లెక్కలు పెంచేసుకున్నారు! నిజామాబాద్‌లో యాత్ర 115 కి.మీ. జరిగేలా పార్టీ వర్గాలు రూట్‌మ్యాప్ ఖరారు చేశాయి. కానీ బాబు కాళ్లకు బొబ్బలు రావడం, షుగర్ శాతం పెరగడంతో జిల్లాలో 111.6 కిలోమీటర్లే నడిచారు. డిసెంబర్ 3న బోధన్ మండలంలోని పాత సాలంపాడ్, కుమ్మన్‌పల్లి, కొప్పర్తి క్యాంపులకు వెళ్లలేదు. అలా 3.4 కిలోమీటర్లు తగ్గింది. 

టీడీపీ వర్గాలు మాత్రం బాబు గుళ్లకు, గ్రామంలో పలువురి ఇళ్లకు వెళ్లడాన్ని కూడా పాదయాత్ర ఖాతాకే కలిపి జిల్లాలో ఆయన 115.5 కిలోమీటర్లు పూర్తి చేసినట్టు పేర్కొన్నాయి! ఇక ఆదిలాబాద్ జిల్లాలో అయితే బాబు పాదయాత్ర 136 కిలోమీటర్లు ఉంటుందని పార్టీయే ప్రకటించింది. చివరికి మాత్రం జిల్లాలో ఆయన 146 కిలోమీటర్లు నడిచారని ప్రకటించింది. అందుకోసం బాబు రోడ్డు పక్కన ఉండే పొలాల్లోకి, వ్యవసాయ కూలీల వద్దకు 50, 150 మీటర్ల చొప్పున నడిచి వెళ్లిన దూరాలను కూడా కలిపి లెక్కించింది!

కాంగ్రెస్‌పార్టీ సదస్సు కోసం స్టేడియం ధ్వంసమా?

కాంగ్రెస్‌పార్టీ ప్రాంతీయ సమావేశం కోసం నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియాన్ని ధ్వంసం చేయడం సరికాదని వైఎస్సార్సీపీ నేత పి.గౌతమ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగంతో నిబంధనలకు విరుద్ధంగా స్టేడియంలో పార్టీ ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తోందన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో క్రికెట్ క్రీడాకారుడు సునీల్‌గవాస్కర్‌కు సన్మానం చేస్తామన్నా, రవిశంకర్ ఆధ్యాత్మిక కార్యమ్రాలు నిర్వహిస్తామన్నా కుదరదన్న నేతలు ఇప్పుడు పార్టీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. క్రీడలకు తప్ప ఇతర కార్యక్రమాలకు స్టేడియాన్ని వాడకూడదన్నారు. సమావేశాల కోసం స్టేడియంలోని వాకర్స్ ట్రాక్‌ను పూర్తిగా ధ్వంసం చేశారన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి తయారుచేసిన స్టేడియం పాడవుతోందని, అందువల్ల పార్టీ సమావేశాలు వేరోచోట నిర్వహించుకోవాలని సూచించారు. నిధులు లేకపోతే తమ పార్టీ తరఫున చందాలు వసూలుచేసి ఇస్తామని, అంతేగానీ గ్రౌండ్‌ను పాడుచేయవద్దని కోరారు.

సహకార సభ్యత్వంపై దర్యాప్తు జరిపించాలి

 గవర్నర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ నేత సోమయాజులు డిమాండ్
- 2007లో వైఎస్ హయాంలో ఎన్నికలు జరిగినపుడు పాలక మండళ్లను రద్దు చేశారు
- ఇప్పుడు రద్దు కాకపోవడంతో అధికారులు పై వారి కనుసన్నల్లో పనిచేస్తున్నారు
- అందుకే సభ్యత్వ నమోదులో అవకతవకలు జరుగుతున్నాయి
- వైఎస్ పాదయాత్రతో చంద్రబాబు యాత్రకు పోలికా? 

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సహకార ఎన్నికల ప్రక్రియ మోసపూరితంగా తయారైందని, గవర్నర్ నరసింహన్ వెంటనే జోక్యం చేసుకుని సభ్యత్వ నమోదుపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ. సోమయాజులు డిమాండ్ చేశారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సహకార సంఘాల సభ్యత్వ నమోదులో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. 

అసలు సహకార సంఘాల పాలక వర్గాలకు ఎన్నికలు ప్రకటించడానికి ముందు వాటి పాలక మండళ్లను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సహకార ఎన్నికలు నిర్వహించినపుడు పాలకవర్గాలను రద్దు చేసి అధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు. ఇపుడు పాలక మండళ్లు రద్దు కాకపోవడం వల్ల అందులో పనిచేసే అధికారులు పై వారి కనుసన్నల్లోనే పనిచేయాల్సి వస్తోందని, అందుకే సభ్యత్వ నమోదులో తీవ్ర స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

అంత ఎలా పెరిగింది!
ఎన్నికలు ప్రకటించడానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షలు మాత్రమే ఉన్న సభ్యత్వం 50 లక్షలకు ఎలా పెరిగిందని సోమయాజులు ప్రశ్నించారు. అందులోనూ పది లక్షల మంది సభ్యులు ఒకే రోజు చేరినట్లుగా రికార్డులున్నాయని, దీన్ని బట్టే ఈ ప్రక్రియ ఎలా జరుగుతోందో అర్థం అవుతోందని ఆయన అన్నారు. సహకార ఎన్నికలు నిలిపివేయాలని తాము కోరడం లేదని, అయితే నిజమైన సభ్యత్వంతో జరపాలని కోరారు. ఒకటి రెండు రోజుల్లో తమ పార్టీ గవర్నర్‌ను కలిసి సభ్యత్వంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతుందని ఆయన వివరించారు. 

ఇంత భారీగా సభ్యత్వం పెరగడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తే కౌలు రైతులకు అవకాశం కల్పించామని చెబుతున్నారని, ఇదెంత మాత్రం వాస్తవం కాదని విమర్శించారు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కౌలు రైతులు అధికంగా ఉంటే అక్కడ ఆ స్థాయిలో సభ్యత్వం పెరగలేదన్నారు. కౌలు రైతులు లేని జిల్లాల్లో సభ్యత్వం ఎక్కువగా నమోదైందని వివరించారు. చిత్తూరు జిల్లాలో అయితే పరిస్థితి మరీ విడ్డూరంగా ఉందని, అక్కడ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ రెండూ కలిసిపోయి తమకు అనుకూలమైన వారిని సభ్యులుగా చేర్చుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కు కావడం కొత్తేమీ కాదని, తాజాగా సహకార ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఒక్కటయ్యాయని పేర్కొన్నారు.

బాబు అబద్ధాల కోరు
టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు అని, ఆయన చెప్పినన్ని అబద్ధాలు మరెవ్వరూ చెప్పరని సోమయాజులు వ్యాఖ్యానించారు. మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా కోర్టులో కేసు వేశారు కదా, చూద్దాం ఏం జరుగుతుందో అని ఆయన సమాధానం ఇచ్చారు. అయితే టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఒవైసీ వ్యాఖ్యలను సాకుగా తీసుకుని వైఎస్సార్ కాంగ్రెస్‌ను నిషేధించాలని డిమాండ్ చేయడం గర్హనీయమన్నారు. సోమిరెడ్డి వ్యాఖ్యలను బట్టి వైఎస్సార్ కాంగ్రెస్ అంటే టీడీపీ నాయకులు ఎంత భీతిల్లుతున్నారో అర్థమవుతోందని అన్నారు.

తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ తన వెంట బైబిల్‌ను ఉంచుకోవడాన్ని సోమిరెడ్డి మళ్లీ వివాదం చేయాలనుకుంటున్నారని ఆయన తప్పు పట్టారు. మనోధైర్యం కోసం బైబిల్ తన వద్ద ఉంచుకున్నానని విజయమ్మ వివరణ ఇచ్చిన తరువాత కూడా అలా మాట్లాడ్డం తగదన్నారు. మనలో చాలా మంది ఇష్ట దైవం ఫోటోలను జేబుల్లో ఉంచుకుంటామని, అంత మాత్రాన దాన్ని తప్పంటామా అని ఆయన అన్నారు. చంద్రబాబు విషయానికి వస్తే ఆయన అసభ్యకరమైన మాటల ముందు వంద మంది ఒవైసీల వ్యాఖ్యలు కూడా చాలవన్నారు. దురదృష్టవశాత్తూ ఓ వర్గం మీడియా బాబు మాటలను పసిడి పలుకులుగా భావించి ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. 

వైఎస్ పాదయాత్రతో పోలికా?
చంద్రబాబు పాదయాత్రతో వైఎస్ రాజశేఖరరెడ్డి రికార్డును అధిగమించామని టీడీపీ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమని సోమయాజులు అన్నారు. క్రికెట్‌లో డాన్ బ్రాడ్‌మన్‌కు, అలాగే పాదయాత్రలో వైఎస్‌కు ఎవరూ సాటి రారన్నారు. ‘వైఎస్ రాజమండ్రిలో పాదయాత్ర చేసినప్పుడు 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. పాదయాత్ర అంటే అది. చల్లని వాతావరణం చూసి నడుస్తున్న చంద్రబాబుది పాదయాత్ర కాదు’ అని అన్నారు.

హత్యారాజకీయాలకు బాబు ప్రోత్సాహం: తోపుదుర్తి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ‘అనంత’లో హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ నాయకులు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. గురువారం అనంతపురంలో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పరిటాల శ్రీరామ్ విదేశాలకు వెళ్లి చదువుకుంటుంటే కేసులో ఇరికించారని టీడీపీ అధినేత మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. శ్రీరామ్‌ను కేసుల్లో ఇరికించడానికి పోలీసులు, వైఎస్సార్ పార్టీ నేతలు కుట్ర పన్నారని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పోలీసులను అనుకూలంగా మార్చుకునే స్థితిలో లేరన్నారు. చంద్ర శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రామగిరి పీఏసీఎస్ సీఈవో రవిచంద్ర ఆత్మహత్య బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వ్యక్తులనుబట్టి న్యాయం..

* పటాన్‌చెరు సభలో వైఎస్ విజయమ్మ 
* మంచం కింద కోట్లు దొరికినా చిరంజీవిపై కేసుల్లేవు
* కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నందునే చంద్రబాబుపై దర్యాప్తులుండవు
* ఎఫ్‌డీఐ బిల్లుకు బాబుకెంతముట్టిందో చెప్పాలి
* వైఎస్ చొరవ వల్లే హైదరాబాద్ అభివృద్ధి 
* చంద్రబాబు మాటలకు విశ్వసనీయత లేదు
* వైఎస్ స్వర్ణయుగాన్ని తెస్తానని చెప్పాలి
* ఎఫ్‌డీఐ బిల్లుకు ఎంతముట్టిందో వెల్లడించాలి 

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి (మెదక్): ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నందుకే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును అరెస్టు చేయడం లేదు. సీబీఐని అడ్డంపెట్టుకుని కాంగ్రెస్, బాబు రాజకీయాలు చేస్తున్నారు. ఇక పార్టీని రూ.80 కోట్లకు హోల్‌సేల్‌గా అమ్ముకుని, రూ.30 కోట్లు మంచం కింద దొరికినా చిరంజీవిపైన కేసులే లేవు. 

ఇక్కడ వ్యక్తులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన న్యాయం దక్కుతోంది...’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా పటాన్‌చెరులో మాజీ ఎంపీపీ గూడెం మహిపాల్‌రెడ్డి పార్టీలో చేరుతున్న సందర్భంగా మైత్రి క్రీడా మైదానంలో గురువారం జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ‘కోర్టుకు వెళ్లి జగన్‌పై సీబీఐ ఎంక్వైరీ వేయించారు. దివంగత సీఎం వైఎస్ పిలిస్తే పలకలేరని తెలిసీ ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు..’ అని విజయమ్మ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే..
‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్రలో చెప్పేవన్నీ అబద్ధాలే. ఆయన నడకలోనూ, నడతలోనూ విశ్వసనీయత లేదు. తన రాజకీయ జీవితంలో ఏ జిల్లాకు, ఏ వర్గానికీ మేలు చేయని బాబు... ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాలకు డిక్లరేషన్‌లు అంటూ మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎఫ్‌డీఐ బిల్లుకు వ్యతిరేకంగా ముగ్గురు టీడీపీ రాజ్యసభ సభ్యులు ఓటు వేయలేదు. ఆ బిల్లు ఆమోదానికి రూ.125 కోట్లు ఖర్చు పెట్టినట్లు వాల్‌మార్ట్ చెప్పింది. చంద్రబాబుకు అందులో ఎంత ముట్టిందో చెప్పాలని’ విజయమ్మ విమర్శలు గుప్పించారు. ‘ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ చంద్రబాబు కాంగ్రెస్‌తో ఇదే రకంగా కుమ్మక్కయ్యారు’ అంటూ ఎండగట్టారు. ‘చంద్రబాబు చెప్పింది జీవితంలో ఏనాడూ చేయలేదు. వైఎస్ చేపట్టిన పథకాలను కొనసాగిస్తానని ఆయన చెప్తున్నారు. వైఎస్ స్వర్ణయుగాన్ని తెస్తానని అంటే బాగుంటుంది’ అని సూచించారు.

హైదరాబాద్ అభివృద్ధి.. వైఎస్ చలవే...
‘హైదరాబాద్ అభివృద్ధి తన వల్లే జరిగిందని, సాఫ్ట్‌వేర్, ఐటీ, టూరిజం అభివృద్ధి తన వల్లేనంటూ బాబు ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన చేసిందల్లా ఐఎంజీకి రూ.50 వేలకు ఎకరం చొప్పున 800 ఎకరాలు కట్టబెట్టడం. హైదరాబాద్ నడిబొడ్డున ఎంఆర్ ప్రాపర్టీస్‌కు రూ.29 లక్షలకు ఎకరం చొప్పున 537 ఎకరాలు కేటాయించడం. రహేజాకు హైటెక్ సిటీ సమీపంలో 110 ఎకరాలు పప్పు బెల్లాలు పంచినట్లు పంచడం...అని ఎద్దేవా చేశారు. ఆల్విన్, రిపబ్లిక్ ఫోర్జ్ వంటి కంపెనీలు చంద్రబాబు హయాంలోనే మూత పడ్డాయని’ విజయమ్మ గుర్తు చేశారు. ‘పల్లెలతో పాటు హైదరాబాద్‌ను అదే స్థాయిలో వైఎస్ అభివృద్ధి చేశారు. ఎనిమిది లేన్లతో 160 కిలోమీటర్ల మేర అతిపెద్ద రింగు రోడ్డు నిర్మించారు. శంషాబాద్ విమానాశ్రయాన్ని కలిపేందుకు 11.6 కిలోమీటర్ల ఫ్లై ఓవర్, సిటీలో 14 ఫ్లై ఓవర్లు వైఎస్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి.

వైఎస్ ముందు చూపు వల్లే ఫ్యాబ్‌సిటీ ఏర్పాటైంది. వైఎస్ హయాంలోనే నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్‌కు 5.5 టీఎంసీల తాగు నీరు వచ్చిందన్న విషయాన్ని విజయమ్మ ప్రస్తావించారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కోటి ఎకరాలకు సాగు నీరు అందించడం, గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడం, ఆరోగ్య శ్రీ సమర్ధ నిర్వహణ, 104, 108 సర్వీసుల పునరుద్ధరణ, పిల్లలను బడికి పంపే తల్లి ఖాతాలో రూ.500 జమ. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య. రైతులకు రూ.3వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ వంటివి అమలు చేస్తామని’ విజయమ్మ పునరుద్ఘాటించారు. వైఎస్సార్ సీపీ మెదక్ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, నేతలు కొండా రాఘవరెడ్డి, రహమాన్, అంజిరెడ్డి, డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, విజయారెడ్డి పాల్గొన్నారు.

YS Jagan Bail petition today

టీడీపీది అవకాశవాద రాజకీయం: చింతల

Written By news on Thursday, January 3, 2013 | 1/03/2013

టీడీపీ అవలంభిస్తున్న అవకాశ వాద రాజకీయాలకు నిరసనగా ఆ పార్టీని వీడుతున్నట్లు చిత్తూరు జిల్లా పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. చంచల్‌గూడ జైల్లో వున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన గురువారం ప్రత్యేక ములాఖత్‌లో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కాంగ్రెస్‌తో చట్టాపట్టాలేసుకుని పనిచేయటం బాధ కలిగిస్తోందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు వైఎస్‌ జగన్ ఇబ్బందుల్లో ఉన్నందునే ఆయనకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వైఎస్‌ఆర్ సీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు.

చంద్రబాబుకు చిత్తశుద్ది ఉందా?: తోపుదుర్తి

 ఫ్యాక్షన్‌ అంతంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉందా అని వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఫ్యాక్షన్ ను రూపుమాపాలనుకుంటే పరిటాల కుటుంబాన్ని టీడీపీ నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. పరిటాల వర్గీయుల వెబ్‌సైట్‌ ముఠా కక్షలు ప్రేరేపించేలా ఉందని ఆయన అన్నారు. ఆ వెబ్‌సైట్‌పై పోలీసులు చర్యలు తీసుకోవాలని తోపుదుర్తి అన్నారు. ప్రత్యర్థులపైకి పరిటాల రవిని చంద్రబాబు ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు శ్రీరామ్‌కు నారా లోకేష్‌ మద్దతు ఇస్తున్నారని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. 

Vijayamma addressing Public Meeting at Patancheru near Hyd

మహానేత పథకాలకు తూట్లు: విజయమ్మ



 పటాన్‌చెరు:మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సర్‌చార్జీల పేరుతో పేదలపై భారం మోపుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయ్యింది, మద్యం ఏరులై పారుతుందని ఆమె అన్నారు. కార్మికుల సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు కూడా పేదలను ఏనాడు పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. చంద్రబాబు చలవ వల్ల ఆల్విన్‌లాంటి సంస్థలు మూతపడ్డాయని వైఎస్‌ విజయమ్మ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న అందరికి పేరుపేరునా స్వాగతం పలికారు. 







ఓటర్ల నమోదులో అక్రమాలు: సోమయాజులు

సహకార సంఘాల ఓటర్ల నమోదులో సర్కార్‌ అక్రమాలకు పాల్పడుతున్నట్టు వైఎస్‌ఆర్‌ సీపీ సీజీసీ సభ్యులు సోమయాజులు ఆరోపించారు. పాత తేదీలతో ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కిరణ్ సొంత జిల్లా చిత్తూరులో పరిస్థితి దారుణంగా ఉందని..అనర్హుల్నీ ఓటరుగా గుర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. సహకార సంఘాల నిర్వహణ అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని సోమయాజులు తెలిపారు.

YSRCP leader Somayajulu's press meet 3rd Jan

పటాన్‌చెరు సభలో పాల్గొననున్న విజయమ్మ!

పటాన్‌చెరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో వైఎస్‌ఆర్‌ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొననున్నారు. ఈ సభలోనే విజయమ్మ సమక్షంలో మాజీ ఎంపీపీ గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు కేఎన్‌ ఖాన్‌ కుమారుడు ఎమ్‌ఎమ్‌ ఖాన్‌, టీఆర్ఎస్వీ రాష్ట్ర సెక్రటరీ నవీన్‌ ముదిరాజ్‌ పార్టీలో చేరనున్నారు. 

అక్రమ కేసు బనాయించారు: బాలినేని

సహకార ఓట్లకు సంబంధించి సమాచారం అడిగితే ఇవ్వకుండా తనపై అక్రమ కేసు బనాయించారని ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ఉన్న తనను బాలినేని దూషించారంటూ డీసీఓ కొండయ్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు బాలినేనిపై కేసు నమోదు చేశారు.

'జగన్ పేరు వింటే బాబుకు వణుకు'

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే చంద్రబాబుకు గుండెల్లో వణుకు పుడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. జగన్ కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి బాబు ఓర్వలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ-కాంగ్రెస్ కలిసి జగన్ ను జైలులో పెట్టించారని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారని భూమన అన్నారు. జగన్ కు మద్దతుగా కోటి సంతకాల సేకరణ చేపడితే కోట్లాది మంది ప్రజలు సంతకాలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

జగన్ ను కలిసిన టీడీపీ నేత చింతల

చిత్తూరు జిల్లా టీడీపీ నేత చింతల రామచంద్రా రెడ్డి గురువారం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని చంచల్ గూడ జైల్లో కలుసుకున్నారు. ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ అధినేత చంద్రబాబు నుంచి, జిల్లాలోని ఆ పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న సహాయ నిరాకరణకు కలత చెంది ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు

జగన్ కోసం జనం ఎదురుచూపు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనమై కనీసం ప్రతిపక్ష స్థానాన్ని కూడా గెలుచుకోలేని దుస్థితిలో రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టి కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేసిన మహానేత డా॥వైఎస్సార్. రాష్ట్రంలో ఆయన వరుసగా రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కేంద్రంలో రెండుసార్లు యూపీఏ ప్రభుత్వం ఏర్పడేందుకు అత్యధిక సంఖ్యలో ఎంపీలను రాష్ట్రం నుండి గెలిపించారు. రాష్ట్రంలో ఏ సంక్షేమ అభివృద్ధి పథకం ప్రవేశపెట్టినా ఆ పథకాలకు ఇందిరమ్మ, రాజీవ్ గాంధీల పేర్లు పెట్టి దేశ ప్రజల మదిలో వాళ్ల పేర్లు నిలిచిపోయే విధంగా వైఎస్సార్ కృషి చేశారు. అటువంటి నాయకుడి మరణానంతరం, ఆయన తనయుడు జగన్ పట్ల, ఆయన కుటుంబం పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు బాధాకరం. 

సొంతంగా పది ఓట్లు కూడా సంపాదించుకోలేని, కనీసం ఒక సీటైనా గెలుచుకోలేని వృద్ధ నేతల సలహాలు తీసుకుని కాంగ్రెస్ అధిష్టానం జగన్ పార్టీని దూరం చేసుకుంది. అటువంటి పరిస్థితుల్లో తన తండ్రి మరణించిన నల్లకాలువ వద్ద రాష్ట్ర ప్రజలకు ఇచ్చినమాట కోసం, ఎంపీ పదవిని, కాంగ్రెస్‌ను విడిచిపెట్టి జగన్ ఓదార్పుయాత్ర చేపట్టారు. దీనిని సహించలేక, ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక సీబీఐని పావుగా వాడుకుని, అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేశారు. ఈ కేసులేవీ విచారణలో నిలబడవు. జగన్ నిర్దోషిగా విడుదలవుతారు. ఆయన విడుదల కోసం రాష్ట్ర ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జగన్‌ను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆయన రాకతోనే రాజన్న పాలన సాధ్యం. ఈ జైలు జీవితం తాత్కాలికమే. జగన్‌కు రాష్ట్ర ప్రజలంతా వెన్నుదన్నుగా ఉన్నారు.

- బి.ఆర్.శాలి, కావలి

విమర్శించినవారికి రాజకీయ సన్యాసం తప్పదు

ఒక గొప్ప లీడర్‌ని ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన తర్వాత ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయింది. ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఒక ప్రాంతం నాశనం అవుతుంది. కాని చరిత్రలో ఒక వ్యక్తి చనిపోతే ఒక రాష్ట్రమే నాశనం అయిన దాఖలాలు లేవు. వైఎస్సార్ చనిపోయాక ఆంధ్రప్రదేశ్ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవడం చూసి దేశం నివ్వెరపోతోంది. ప్రస్తుతం మనం అసమర్థపాలనలో ఉన్నాం. అందుకే ఈ రాష్ట్రానికి, మనకు ఒక లీడర్ కావాలి. ఆ లీడర్ జగన్. జనమంతా ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ప్రజల హృదయాల్లో ఉన్న యువనేత జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. జగన్‌ని విమర్శించిన నాయకులందరూ రేపటి రోజున రాజకీయ సన్యాసం తీసుకుంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. జగన్‌ని విమర్శించి ఇబ్బందిపెడుతున్న నాయకులకు, రాజకీయ పార్టీలకు త్వరలో ప్రజలంతా బుద్ధి చెబుతారు. 

- ఎం.అహమ్మద్, నరసరావుపేట, గుంటూరు

మీ రాకకై ఎదురుచూస్తోంది

మిత్రమా! ప్రజలు మీలో రాజన్న ప్రతిరూపాన్ని చూస్తున్నారు. ‘ఓదార్పుయాత్ర’లో మీ మానవీయ కోణాన్ని, మాటతప్పని, మడమ తిప్పని ఒక పోరాట యోధుణ్ని చూస్తున్నారు. ప్రజాసంక్షేమం కోసం నాన్నగారు అర్ధంతరంగా వదిలివెళ్లిన అభివృద్ధి పథకాలను మీరు తప్పక నెరవేరుస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు. రాజన్నను ప్రేమించే ప్రతి హృదయం మీరు ‘కడిగిన ముత్యం’లా బయటకు రావాలని, రాజన్న రాజకీయ వారసుడిగా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించి ప్రజాసంక్షేమాన్ని గాడిన పెట్టాలని కోరుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌ను ‘అన్నపూర్ణ’గా దేశంలోనే అగ్రతాంబూలాన నిలుపుతారన్న దృఢవిశ్వాసంతో మీ రాకకై నిరీక్షిస్తోంది.

- సిద్ధారెడ్డి వాసు, చిన్న ఓబినేనిపల్లి, ప్రకాశం

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com

పటాన్‌చెరులో నేడు వైఎస్సార్సీపీ బహిరంగ సభ

మెదక్ జిల్లా పటాన్‌చెరులో గురువారం వైఎస్సార్‌సీపీ బహిరంగసభ ఏర్పాటుచేశారు. ఈ సభలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పాల్గొననున్నారు. పటాన్‌చెరు మాజీ మండలాధ్యక్షుడు గూడెం మహిపాల్‌రెడ్డి తదితర నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేశారు. విజయమ్మ పటాన్‌చెరులోని మైత్రి గ్రౌండ్ కు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు.

పరిటాల శ్రీరాం కోసం గాలింపు

ఎమ్మెల్యే సునీత ఇళ్లలో సోదాలు 

విమానాశ్రయాలను అప్రమత్తం చేసిన పోలీసులు

 కాంగ్రెస్ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డిపై హత్యా యత్నం కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఎస్పీ షహనవాజ్ ఖాసీం ఏర్పాటు చేశారు. పోలీసులు బుధవారం పలు చోట్ల సోదాలు చేశారు. శ్రీరామ్ విదేశాలకు పారిపోకుండా చూసేందుకు విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. సుధాకర్‌రెడ్డిని చంపేందుకు వెళ్తున్న కిరాయిముఠాను డిసెంబర్ 30న అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ఎన్‌ఎస్ గేట్ వద్ద పోలీసులు అరెస్టు చేయడం, శ్రీరామ్ సహా 13 మందిపై కేసు నమోదు చేయడం తెలిసిందే. కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. 

సూత్రధారి శ్రీరామ్ కోసం బుధవారం తెల్లవారుజామున అనంతపురం జిల్లాలో పలుచోట్ల గాలించారు. రామగిరి మండలం వెంకటాపురంలోని సునీత ఇంట్లో తెల్లవారుజాము 4 నుంచి 5 గంటల వరకు సోదా చేశారు. పక్కనే ఉన్న గంగంపల్లిలోని సునీత సమీప బంధువుల ఇళ్లనూ గాలించారు. అనంతపురంలోని సునీత ఇంటినీ సోదా చేశారు. శ్రీరామ్ బెంగళూరులో బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారన్న సమాచారంతో అక్కడికి బృందాన్ని పంపారు. శ్రీరామ్ ధర్మవరం కోర్టులో లొంగిపోతారన్న వార్తల నేపథ్యంలో కోర్టు ఆవరణలో పోలీసులు మోహరించారు.


ఎక్కడైనా గాలిస్తాం: ఎస్పీ

హత్యా యత్నం కేసులో శ్రీరామ్ పాత్రపై మా వద్ద పూర్తి సాక్ష్యాధారాలున్నాయి. దీన్ని ఫ్యాక్షన్ కేసుగా పరిగణిస్తున్నాం. శ్రీరామ్‌తో పాటు మిగతా నిందితులను పట్టుకోవడానికి బుధవారం ఎనిమిది చోట్ల సోదాలు చేశాం. శ్రీరామ్‌ను అరెస్టు చేసి తీరతాం. ఆయన విదేశాలకు పారిపోతారనే విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశాం. నిందితుల కోసం ఎక్కడైనా గాలించే అధికారం పోలీసులకుంటుంది. వారిని మాకు సరెండర్ చేస్తే స్వాగతిస్తాం.

వైఎస్ఆర్ సీపీలోకి మహిపాల్ రెడ్డి

హైదరాబాద్ : పటాన్‌చెరువు మాజీ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి గురువారం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పార్టీలో చేరతారు. మహిపాల్‌తో పాటు టీఆర్‌ఎస్‌ యూత్ విభాగానికి చెందిన 500 మంది కార్యకర్తలు కూడా పార్టీలోకి చేరనున్నారు.

జగన్ రిమాండ్ 17 వరకు పొడిగింపు

తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 17 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌ఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా కోర్టు 17 వరకు పొడిగించింది. రిమాండ్ ముగియడంతో బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీరిని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. అలాగే చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శరత్‌చంద్రారెడ్డి, జైపాల్‌రెడ్డి, విజయలక్ష్మీ ప్రసాద్, చంద్రమౌళి, కార్తీక్, ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, మన్మోహన్‌సింగ్, శ్యామ్యూల్, నిమ్మగడ్డ ప్రకాష్‌లతోపాటు కంపెనీల ప్రతినిధులు కోర్టు ఎదుట హాజరయ్యారు.

http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=516644&Categoryid=14&subcatid=0

వైఎస్సార్‌సీపీలోకి కొనసాగుతున్న వ‌ల‌స‌లు

Written By news on Wednesday, January 2, 2013 | 1/02/2013

వైఎస్సార్‌సీపీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. రాజ‌న్న రాజ్యం కావ‌లంటూ అటు ప్రజ‌లు, ఇటు కార్యక‌ర్తలు ఎక్కువ‌మొత్తంలో వైఎస్సార్ పార్టీలోకి చేరుతున్నారు. ఈ నేప‌థ్యంలో కాకినాడ రూర‌ల్ స‌ర్పవ‌రంలో 500మంది కార్యక‌ర్తలు వైఎస్ఆర్‌సీపీలో చేరారు.

Roja addressing Media on 2nd Jan 2013

ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రభుత్వం: ఆది

కరీంనగర్: ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కిరణ్‌ ప్రభుత్వం పనిచేస్తోందని వైఎస్ఆర్ సీపీ నేత ఆది శ్రీనివాస్‌ విమర్శించారు. కాంగ్రెస్‌, టీడీపీలు కుమ్మక్కై జగన్‌ను జైల్లో పెట్టించారని శ్రీనివాస్‌ ఆరోపించారు. ప్రజలు స్వచ్ఛందంగా కోటి సంతకాల రూపంలో నిరసన తెలుపుతున్నారని ఆయన తెలిపారు. 

తప్పు చేసిన వారిని శిక్షించడంలో కూడా ఇంత జాప్యమా ?

 ఢిల్లీ ఘటనపై మన్మోహన్, సోనియా వ్యాఖ్యలు సిగ్గుచేటని వైఎస్‌ఆర్ సీపీ అధికారిక ప్రతినిధి రోజా వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారిని శిక్షించడంలో కూడా ఇంత జాప్యమా అని రోజా ప్రశ్నించారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై కిరణ్, బొత్స వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి సబిత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ కరువైందని...హోంమంత్రిగా సబిత కొనసాగడం ఎంత వరకు సబబు అని రోజా అన్నారు. మహిళల సమస్యపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని...దేశంలో మహిళా నేతలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలారని ఆమె తెలిపారు. ఢిల్లీ ఘటన దురదృష్టకరమని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. 

తిరుపతిలో కోటి సంతకాల సేకరణ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ బుధవారం తిరుపతిలో ఆపార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి కోటి సంతకాల సేకరణను చేపట్టారు. ఈ ప్రక్రియను తప్పుబడుతున్న వారికి త్వరలో ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. సంతకాల సేకరణ జగన్ బెయిల్‌ కోసం కాదని ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పడానికి ప్రజలు చేస్తున్న సంతకమని భూమన తెలిపారు.

sakshi

Recording Dances in TDP Party Office

జగన్ కోసం: 221 రోజులు

పాలకపక్షానికి తెలియదు... ముందుంది పోయే కాలం అని!

జైల్లో ఉన్నా, బయట ఉన్నా జగన్ జగనే. ఈ రోజు ఆయనను జైల్లో పెట్టామని ప్రధాన, ప్రతిపక్ష పార్టీలు, ఎల్లో మీడియా, సీబీఐ సంస్థలు చాలా సంబరపడుతున్నాయి. కానీ వాళ్లకి తెలియని నిజమేమంటే జగనన్న ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నాడని! మన ప్రియతమ నేత వైఎస్సార్ ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు- ‘ఏమి జరిగినా మన మంచికే అని అనుకుని ముందుకు సాగాలి’ అని. ఇదంతా చూస్తుంటే ఇప్పుడు నాకనిపిస్తుంది, జగనన్న మంచికే ఇదంతా జరుగుతోందని! కనిపించని దేవుళ్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరికీ మనం పూజలు చేస్తాం. కానీ కనిపించే దేవుడు మన వైఎస్సార్. అందుకే ఆయన మరణానంతరం ఈ రాష్ట్ర ప్రజలు ఆయన విగ్రహాలు, చిత్రపటాలను తమ ఊళ్లలో, ఇళ్లలో పెట్టుకుని పూజిస్తున్నారు. 

ఆయన కొడుకైన జగనన్న విలువలు, విశ్వసనీయతలకు కట్టుబడి, మానవత్వం ఇంకా బతికే ఉంది అని నమ్మకం కలిగేటట్లుగా, ఆనాడు నల్లకాలువ దగ్గర ఇచ్చిన మాటకు లోబడి, ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. కానీ జగనన్నకు పెరిగిపోతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోయారు. జగనన్నను జైల్లో పెట్టించారు. కానీ ఈ రాష్ట్ర ప్రజల మాట ఒక్కటే - ‘రాజన్న రాజ్యం, జగనన్నతోనే సాధ్యం’. ఇది జగమెరిగిన సత్యం. వైఎస్సార్ అంటే గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ జగనన్నకు తోడుగా, అండగా ఉంటారు. 


మరోవైపు- రాష్ట్రానికి సేవ చేయాల్సిన వ్యక్తి ‘ముందుంది మంచి కాలం’ అంటూ ఢిల్లీ పెద్దలకు సేవ చేస్తున్నాడు. కానీ ఈ పాలక పక్షానికి తెలియదు ‘ముందుంది పోయే కాలం’ అని! ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన వ్యక్తి. కానీ అదే ప్రభుత్వంతో కుమ్మక్కై మీడియాను అడ్డం పెట్టుకుని ‘వస్తున్నా మీకోసం’ అంటూ పాదయాత్ర చేస్తున్నాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, బాబు వస్తున్నది తమ కోసం కాదు, తన కోసమని! అంతేకాదు, నిష్కలంకమైన జగనన్నను, ఆయన వెన్నంటి ఉన్న ప్రజాబలాన్ని చూసి స్వచ్ఛందంగా వైఎస్సార్‌సీపీలో చేరుతున్న ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చడం చంద్రబాబు నీచ బుద్ధికి తార్కాణం.

చంద్రబాబు లాంటివాళ్లు ఎన్ని అపవాదులు, అపనిందలు వేసినా జగనన్న జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటికి వస్తారు. తిరుగులేని మెజారిటీతో 2014లో ముఖ్యమంత్రి అవుతారు.
- సూరసాని కిరణ్‌రెడ్డి, పాండురంగాపురం, పాల్వంచ, ఖమ్మం


జగనే ప్రజలు... ప్రజలే జగన్
స్వార్థపూరిత రాజకీయ నాయకులతో నడుస్తున్న ఈ ప్రభుత్వం, ప్రజలకేమి చెయ్యకపోగా పదవులు కాపాడుకునేందుకు చెయ్యరాని పనులెన్నో చేస్తూ రోజులు గడుపుకుంటోంది. ప్రజలె లా పోతే మాకేమిటి మా పనులు అయితే చాలని అనుకుంటూ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా వాటి ఖర్చులకు సరపడా సంపాదనలో పడ్డారు మన నాయకులు. కాని ప్రజలు గమనిస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా తగిన గుణపాఠం నేర్పడానికి ఎదురు చూస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రజల వల్ల గెలిచి, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఇద్దరే ఇద్దరు. అన్నగారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావుగారు, మహానేత శ్రీ వై.ఎస్.రాజశేఖరరెడ్డిగారు. మిగతా వాళ్లందరూ ఢిల్లీ నుండి సీల్డ్ కవర్‌లో నామినేట్ నాయకులే. ఆ నాయకులకు ఇప్పుడు జగన్ అంటేనే వణుకుపుడుతోంది. జగన్ ఒక వ్యక్తి కాదు, అది ఒక వ్యవస్థ. జగన్ ప్రజల మనిషి. ఆయనే ప్రజలు. ప్రజలే ఆయన. మనసున్న మనిషంటే గిట్టని ఈ స్వార్థపర రాజకీయ చతురులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. 

జగన్‌కు జరిగిన అన్యాయం చూస్తుంటే అసలు ప్రస్తుతమున్నది నేనెరిగిన గాంధీ, నెహ్రూ, ఇందిరమ్మ కాంగ్రెస్సేనా అనే అనుమానం వస్తోంది. ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనిపిస్తోంది. ఒకప్పుడు మేధావులైన కమ్యూనిస్టు, ఇతర పార్టీల నాయకులు ప్రజల కోసం ఎన్నో మాట్లాడేవాళ్లు. కాని అప్పటి ప్రభుత్వాలు ఎన్నడూ వారిని జైళ్లల్లో పెట్టలేదు. కానీ ఇదేమిటి? ‘నేను మాటమీద నిలబడి, మా నాన్నకోసం మరణించినవాళ్లను పరామర్శించాలి’ అనంటే అదొక తప్పన్నట్లు జగన్‌పై కేసులు పెట్టి జైల్లో పెట్టడం, మానసికంగా చిత్రవధ చేయడం ఏమిటో ఈ సమాజంలో అర్థం కాని ప్రశ్నగా నిలిచింది. ఏది ఏమైనా చివరికి భగవంతుడు, ప్రజలు నిర్ణయిస్తారు. సరైన సమయంలో జగన్ మన మధ్యకు వస్తారు. అతనొక ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం ఎన్నుకోబడిన నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడుపుతాడు. ఆ నమ్మకం మాకుంది.
- ఏకాంబరం, రిటైర్డ్ ఉద్యోగి, హైదరాబాద్

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=55247&Categoryid=11&subcatid=21

మందేసి, చిందేసిన ‘తెలుగు’ తమ్ముళ్లు


నూతన సంవత్సర వేడుకల్లో టీడీపీ కార్యకర్తలు మందేసి చిందేశారు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి ప్రకాశం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది. కొత్త సంవత్సర వేడుకలు వద్దని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఆయన మాటను గౌరవిస్తున్నట్లుగా సోమవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శనతో ఎన్‌టీఆర్ విగ్రం వరకు వెళ్లి, ఢిల్లీ గ్యాంగ్ రేప్ మృతురాలికి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో భారీ కేకు కటింగ్‌తో పాటు మందు, విందు, రికార్డింగ్‌డాన్స్ ఉండటంతో పార్టీ చోటా నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలోనే హాజరయ్యారు. పార్టీలో పాల్గొన్న ఓ ప్రముఖ నేత దగ్గరి బంధువు బాగా తాగి స్టేజీ మీదకు వెళ్లాడు. అక్కడ నాట్యం చేస్తున్న మహిళతో తాను కూడా డాన్సు చేస్తానని పట్టుబట్టడంతో వివాదం మొదలైంది. దీంతో ఒకరినొకరు తోసుకుంటూ నానా దుర్భాషలాడుకుంటూ రికార్డింగ్ డాన్సర్‌తో చిందులు వేశారు.

ఉచితానికి ఎసరు!

రెండున్నర ఎకరాలకు మించి మాగాణి ఉంటే బాదుడే
యూనిట్‌కు రూపాయిన్నర వరకు విద్యుత్ చార్జీ వసూలు చేసే యోచన
2004లో కూడా యూనిట్‌కు 50 పైసల చార్జీ నిబంధన ఉన్నా అమలు కాని వైనం
రూ. 20 సర్వీసు చార్జీ కూడా వసూలు చేయని వైఎస్ ప్రభుత్వం
పాత బకాయిలూ వసూలు చేసేందుకు ప్రస్తుత సర్కారు సిద్ధం!
మెట్ట రైతులకు కనెక్షన్లు కుదించే యోచన

సాక్షి, హైదరాబాద్: ఉచిత విద్యుత్‌కు మంగళం పాడే దిశలో ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తోంది. ఆంక్షలతో అన్నదాతను ఉచిత విద్యుత్‌కు దూరం చేసే యోచనలో ఉంది. పాత, ఇప్పటివరకు అమలుకాని నిబంధనలు తెరపైకి తెస్తోంది. అలాగే రెండున్నర ఎకరాల కంటే ఎక్కువ తరి పొలం (మాగాణి) ఉన్న రైతుల నుంచి యూనిట్‌కు ఏకంగా రూపాయి నుంచి రూపాయిన్నర వరకూ విద్యుత్ చార్జీలు వసూలు చేయాలని భావిస్తోంది. పాత బకాయిల వసూలుకూ సిద్ధమవుతోంది. మరోవైపు మెట్ట రైతులకు ఇచ్చే కనెక్షన్ల సంఖ్యను కుదించే యోచనలో ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరపు (2013-14) విద్యుత్ చార్జీల విధానంపై సర్కారు కసరత్తు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ నెలాఖరులోగానే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి సమర్పించాల్సి ఉంది. అయితే మరో పదిరోజులు గడువివ్వాలని విద్యుత్ సంస్థలు ఈఆర్‌సీని కోరాయి. 

మొత్తం మీద రూ.10 వేల కోట్ల రెగ్యులర్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధపడుతున్న ప్రభుత్వం... రైతులకు సరఫరా అవుతున్న ఉచిత విద్యుత్ పైనా కన్నేసింది. వాస్తవానికి ఇప్పటికే రెండున్నర ఎకరాల కంటే ఎక్కువ తరి పొలం ఉన్న రైతుల నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున విద్యుత్ చార్జీలు వసూలు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ వైఎస్ ప్రభుత్వం వీటిని అమలు చేయలేదు. దీంతో రైతులకు పూర్తి ఉచితంగా విద్యుత్ అందినట్టయింది. కానీ ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో ఇక నుంచి చార్జీల వసూలు పకడ్బందీగా జరగనుంది. అంతేకాదు వచ్చే ఏడాది నుంచి ఈ చార్జీని రూపాయి నుంచి రూపాయిన్నరకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

ఇక మెట్టరైతులకు ఇచ్చే కరెంటు కనెక్షన్లకూ పరిమితులు విధించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మెట్టరైతులకు ఇప్పటివరకు పొలం ఎంత ఉన్నది అన్న అంశంతో సంబంధం లేకుండా.. 3 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల వరకూ ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ కనెక్షన్లకు పరిమితులు విధిం చి కేవలం ఒకటి లేదా రెండు విద్యుత్ కనెక్షన్లకే దీనిని కుదిం చాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలావుండగా కేవలం 3 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన పంపుసెట్లు ఉన్న రైతులకే ఉచిత విద్యుత్ ఇచ్చే అంశంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

వైఎస్ హయాంలో అందరికీ లబ్ధి

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని 2004లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అమల్లోకి తెచ్చారు. కేవలం కార్పొరేట్, ఐటీ చెల్లించే రైతులు మినహా అందరికీ ఈ పథకంతో లబ్ధి చేకూరుతోంది. మొత్తం 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లలో 29 లక్షల కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందుబాటులో ఉంది. అయితే వైఎస్ మరణానంతరం ఈ పథకంపై ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఆంక్షలు విధిస్తోంది. ఉచిత విద్యుత్ రైతుల నుంచి నెలకు సర్వీసు చార్జీ రూపంలో రూ.20 వసూలు చేయాలని 2004లోనే నిబంధన ఉంది. అలాగే యూనిట్‌కు 50 పైసల నిబంధన ఉన్నప్పటికీ.. వైఎస్ ప్రభుత్వం ఏనాడూ రైతుల నుంచి ఆ మేరకు వసూలు చేయలేదు. గత ఏడాది ప్రభుత్వం ఈ సర్వీసు చార్జీని రూ.20 నుంచి రూ.30కి పెంచింది. ఆ మేరకు 2004 నుంచి ఉన్న బకాయిలను, అలాగే రెండున్నర ఎకరాల కంటే అధికంగా ఉన్న మాగాణి రైతుల నుంచి 2004 నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున ఉన్న బకాయిలను వసూలు చేయాలని సర్కారు భావిస్తోంది. ఉచిత విద్యుత్ విధానానికి స్వస్తి పలికే క్రమంలోనే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=515967&Categoryid=1&subcatid=33

Popular Posts

Topics :