అల్లూరు, న్యూస్లైన్ : మండలంలోని నార్తుమోపూరుకు చెందిన టీడీపీ సీని యర్ నేతలు పిడూరు పరమేశ్వరరెడ్డి, నూకలపాటి శివకుమార్రెడ్డి శుక్రవారం కావలి నియోజకవర్గ సమన్వయకర్త రా మిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో మరో 100 మంది అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు. ప్రతాప్కుమార్రెడ్డి పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
త్వరలో జ రుగబోయే సార్వత్రిక, సాధారణ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమర్థవంతంగా, ప్రజ లకు సుభిక్షమైన పాలనను అందించాలంటే రాష్ట్రానికి యువకుడైన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. జగన్మోహన్రెడ్డి మీదున్న నమ్మకంతో నే తనతో పాటు తన అనుచర వర్గమం తా వైఎస్సార్సీపీలో చేరామన్నారు.
గత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీలో తా ను సర్పంచ్ అభ్యర్థిని గెలిపించడంలో కీలకపాత్ర పోషించామన్నారు. ప్రస్తు తం వైఎస్సార్సీపీలో ఉన్న అందరిని క లుపుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థు ల విజయానికి కృషి చేస్తామన్నారు. పా ర్టీ సీనియర్ నాయకుడు మేడా అశోక్కుమార్రెడ్డి మాట్లాడుతూ భవననిర్మాణానికి పునాదులు ఎంతగట్టిగా ఉంటాయో పార్టీ నిలబడాలంటే కార్యకర్తలు అంతగట్టిగా ఉండాలన్నారు. పరమేశ్వరరెడ్డి పార్టీలో చేరడం ఎంతో సంతోషమన్నారు.
అందరూ కలిసికట్టుగా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి, యువజన విభాగ కన్వీనర్ మన్నెమాల సుకుమార్రెడ్డి, పార్టీనాయకులు బాలకృష్ణంరాజు, అక్కల రాఘవరెడ్డి, కేతిరెడ్డి కృష్ణారెడ్డి, ఊటు అశోక్రెడ్డి, కేతిరెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు.
కావలి: బోగోలు మండలం అనంతరాజువారింకండ్రిగకు చెందిన కొందరు టీ డీపీ నేతలు శుక్రవారం వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రా మిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. స్థానిక పుల్లారెడ్డినగర్ లో ఉన్న ప్రతాప్కుమార్రెడ్డి నివాసం లో వారికి పార్టీ కండువా వేసి ప్రతాప్కుమార్రెడ్డి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారిలో బాలకృష్ణ, హరి, వెంకటేశ్వర్లు, సురేష్, సురేంద్ర, శ్రీనాథ్, ప్రసా ద్, సిద్దయ్య, సుదర్శన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు రమణయ్యనాయుడు, కిషోర్బాబు, శ్రీను ఉన్నారు
బొమ్మనహాళ్, న్యూస్లైన్ : వైఎస్సార్సీపీలోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి. దర్గాహొన్నూరులో టీడీపీ, కాంగ్రెస్ నుంచి దాదాపు 400 మంది శుక్రవారం వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ శ్రీకాంత్రెడ్డి, ఆర్.వన్నప్ప, రమేష్ల అధ్వర్యంలో పూజారి చిన్నవన్నూరప్ప, శీనప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకులు వై.ఎల్లప్ప, చిన్నసిద్దప్ప, జలేంద్ర, ముత్యాలప్ప, పెద్దవన్నూరప్ప, రోగన్న, పాల్తూరు తిప్పేస్వామి, నాగరాజు, జి.వన్నూరప్ప, వన్నూరుస్వామి, వారి అనుచరులు పార్టీలో చేరారు.
వీరికి మాజీ ఎమ్మెల్సీ పాటిల్ వేణుగోపాల్రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పాటిల్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కణేకల్లు, బొమ్మనహాళ్ మాజీ ఎమ్పీపీలు రాజగోపాల్రెడ్డి, లాలుసాబ్, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనయుడు ప్రవీణ్కుమార్, హొన్నూరు రామక్రిష్ణ, నాగభూషణ, వన్నూరుస్వామి, సింగానహళ్ళి దేవణ్ణ, అంజినేయ, రామాంజినేయులు, తిప్పేస్వామి, కరెణ్ణ, ఉద్దేహాళ్ ఈశ్వర్రెడ్డి, శ్రీధరగట్ట చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మేదరమెట్ల, న్యూస్లైన్: వైఎస్ జగన్మోహనరెడ్డితోనే రాజన్న కోరుకున్న స్వర్ణయుగం వస్తుందని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మండలంలోని బొడ్డువానిపాలెంలో గతంలో పీఆర్పీ, టీడీపీల్లో ఉన్న 600 మందిని శుక్రవారం పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనికి ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్రెడ్డిని సీఎంగా చేయాలన్నారు. టీడీపీ, కాంగ్రెస్లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయని, రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలపునిచ్చారు. ముందుగా బొడ్డువానిపాలెంలోని వైఎస్సార్ విగ్రహం నుంచి కార్యకర్తలు, అభిమానులు బైకులపై ర్యాలీగా అద్దంకి రోడ్డులోని సీతారామస్వామి దేవాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పార్టీలో చేరిన వారిలో తిరుమల శెట్టి నాగేశ్వరరావు, చింతం అంజయ్య, నేరెళ్ల వెంకటేశ్వర్లు, నేరెళ్ల జానకీరామయ్య, ధర్మవరపు దుర్గారావు, పీ హనుమంతరావు, మందలపు అంకారావు, నేరెళ్ల సుబ్బయ్య, పెద్దిరెడ్డి శివారెడ్డి, అన్నెం అంజిరెడ్డి, ఎం హనుమారెడ్డిల ఆధ్వర్యంలో 600 మంది కార్యకర్తలు నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు
. కార్యక్రమంలో మండల కన్వీనర్ జజ్జర ఆనందరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కోయి అంకారావు, ఎస్సీ సెల్ నాయకులు రంపతోటి సాంబయ్య, ముత్తవరపు రమణయ్య, అన్నెం అంజిరెడ్డి, కోట శ్రీనివాసరావు, శానం చిన్న వెంకటేశ్వర్లు, జంపు ఆదిశేషు, ఈవూరి సోమారెడ్డి, ఆరుమళ్ల సామియేలు, రామిరెడ్డి అంజయ్య, మేకల అంజిరెడ్డి, రామిరెడ్డి వెంకటస్వామి, యర్రబాలెం సుధాకర్, సాదినేని శ్రీనివాసరావు, జ్యోతి రమేష్, స్థానిక మండల నాయకులు పాల్గొన్నారు.
అగళి,న్యూస్లైన్: జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీలోకి కాంగ్రెస్, టీడీపీల నుంచి వలసలు ప్రారంభం కావడంతో కోడిపల్లి పంచాయతీ గ్రామాల్లో కాంగ్రెస్కు గడ్డుపరిస్థితి ఏర్పడింది. ముక్కడంపల్లి, దాసేగౌడనపల్లి, జంగమరపల్లి, పూలపల్లి తదితర గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు సగం మంది ఆ పార్టీకి రాజీనామా చేశారు. పూలపల్లిలో మండల వైఎస్సార్సీపీ నాయకుడు డాక్టర్ దేవరాజు, కన్వీనర్ స్టూడియో శ్రీనివాస్, స్టీరింగ్కమిటీ సభ్యులు హనుమంతరాయప్ప, ఎస్సీసెల్ దేవన్న, మాజీ సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీలో చేరినవారిని బీసీసెల్ లింగరాజు, దేవరాజు, బసవేగౌడ్, గోవిందప్ప, సదాశివ, శ్రీనివాస్ పార్టీ కండువాలతో ఆహ్వానించారు. ముక్కడంపల్లి రామచంద్రప్ప, నాగభూషణ, గుండేగౌడ్, జంగమరపల్లి శివన్న, నాగరాజు, దొడ్డరంగప్ప, సిద్దరాజు, కోడిపల్లి రాఘవేంద్ర, దాసేగౌడనపల్లి గోవిందప్ప, రామిరెడ్డి, లోకేష్, నరసింహమూర్తి, కావాలప్ప వారి అనుచురులు మొత్తం 300 కుటుంబాలదాకా వైఎస్సార్సీపీలో చేరారు. నాయకులు నాగప్ప, మంజు, సతీష్, చంద్రప్ప, తిప్పేష్, సిద్దారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.