23 November 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ప్రజావ్యతిరేకపాలన: ఉమ్మారెడ్డి

Written By news on Saturday, November 29, 2014 | 11/29/2014


ప్రజావ్యతిరేకపాలన: ఉమ్మారెడ్డిఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 92 శాతం మంది రైతులు అప్పులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తారని చెప్పారు. బడ్జెట్ లో 5వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఏం సరిపోతుందని ఆయన అడిగారు.చంద్రబాబు మోసపూరిత హామీలు, ప్రజావ్యతిరేక విధానాలతో సాగిస్తున్న పాలనకు వ్యతిరేకంగా డిసెంబరు 5న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాలని పిలుపు ఇచ్చారు.
ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, సాగి ప్రసాద రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్, జిల్లా ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, బూడి ముత్యాలనాయుడు, గిద్ది ఈశ్వరి, రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయకృష్ణ రంగారావు పాల్గొన్నారు.

'తుపాను నిధుల్లో సగం బాబు జేబులోకే!


'తుపాను నిధుల్లో సగం బాబు జేబులోకే!'
విశాఖపట్నం : హుదూద్ తుపాను సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 460 కోట్లు విడుదలైతే.. అందులో అధికభాగం చంద్రబాబు జేబులోకే వెళ్లాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా తుపాను బాధితుల కోసం వచ్చిన విరాళాల వివరాలను స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం వల్లించి రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్నారు. టీడీపీలా ధనబలంతో కాకుండా.. ప్రజాబలంతో 2019 ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

క్షేత్రస్థాయిలో కమిటీలను నియమించి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుస్తామన్నారు. విశాఖపట్నం నగరానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎనలేని సేవలందించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఏమీ చేయని చంద్రబాబు మాత్రం విశాఖకు అతా తానే చేసినట్లు చెప్పుకొంటున్నారన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కంపెనీలను నష్టాల్లోకి నెట్టి, ప్రైవేటీకరణకుపూనుకున్నారని, ఐటీ, ఫార్మా, సినీ పరిశ్రమల అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని విశాఖలో ఏర్పాటుచేశామని ఆయన తెలిపారు. చంద్రబాబు పాలనలో నష్టాల్లోఉ న్న ప్రభుత్వరంగ సంస్థలను వైఎస్ఆర్ పాలనలో అభివృద్ధిలోకితెచ్చారని, పార్టీ కోసం ప్రతి ఒక్కరూ సేవ చేస్తే వారి సేవలను పార్టీ గుర్తిస్తుందని ఆయన చెప్పారు

రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకోండి: బుట్టా


రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకోండి: బుట్టా
సాక్షి, న్యూఢిల్లీ: తుంగభద్ర నదిపై హవేరీ జిల్లాలో మరో రిజర్వాయర్ నిర్మించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దానిని అడ్డుకోవాలని వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీ బుట్టా రేణుక కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కోరారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగితే దిగువన ఉన్న కర్నూలు జిల్లా రైతాంగ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈమేరకు ఆమె ఉమాభారతికి శుక్రవారం ఓ వినతిపత్రం సమర్పించారు.

ఇప్పటికే ఆలమట్టి డ్యాం ఎత్తు పెంచడంతో ఆగస్టు తర్వాత శ్రీశైలం డ్యాంకి వచ్చే నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోతోందని మంత్రి దృష్టికి తెచ్చారు. దీనివల్ల కర్నూలు జిల్లాలో వ్యవసాయానికి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతోందన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఎగువ తుంగభద్రపై మరో డ్యాం నిర్మిస్తే జిల్లా రైతుల ఇబ్బందులు మరింత పెరుగుతాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కొత్త ప్రాజెక్టు నిర్మించకుండా అడ్డుకోవాలని కోరారు.

‘పచ్చ చట్టమే’ చుట్టం!

‘పచ్చ చట్టమే’ చుట్టం!
  • కర్నూలు జిల్లాలో పోలీసుల ప్రతాపం
  •  అధికార పార్టీ సేవలో నిబంధనలకు తిలోదకాలు
  •  ప్రతిపక్ష నేతలను అణగదొక్కడానికి, కేసుల్లో ఇరికించడానికీ ప్రయత్నాలు
  •  అధికార పార్టీ నేతల అరెస్టుపై మీనమేషాలు..
 సాక్షి, కర్నూలు: చట్టాలను నిష్పక్షపాతంగా అమ లు చేయాల్సిన పోలీసు యంత్రాంగం కర్నూలు జిల్లాలో అధికార పార్టీ అక్రమ సేవలో చట్టవిరుద్ధంగా, న్యాయబాహ్యంగా, అధర్మంగా వ్యవహరిస్తోంది. అధికార పార్టీ నాయకుల కనుసన్నలలో మసలుతూ ప్రతిపక్ష నాయకులను ఇబ్బం ది పెట్టడానికి చట్టాలను తుంగలో తొక్కుతోంది. చట్టాలను అతిక్రమించినప్పటికీ అధికార పార్టీకి చెందిన వారైతే పోలీసులే వారికి చుట్టాలై కంటికి రెప్పలా కాపాడుతున్నారు.

చట్టాలు తమ చేతుల్లోకి తీసుకున్న అధికార పార్టీకి చెందిన వారిపై కేసులు పెట్టడానికి సైతం పోలీసులు వెనుకాడటమే కాకుండా వారి కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న వైనం సర్వత్రా విస్మ యం కలిగిస్తోంది. అదే ప్రతిపక్ష పార్టీకి చెందిన వారైతే వారిని వేధించడానికి, దారుణంగా అణగదొక్కడానికి, కేసుల్లో ఇరికించడానికీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కర్నూలులో గత కొద్ది రోజు లుగా పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ వారి వైఖరిలో మార్పు రావడం లేదు.

న్యాయస్థానం ఆదేశించినప్పటికీ విచారణ పేరు తో సాగదీస్తున్నారే తప్ప అధికార పార్టీ నేతలను అదుపులోకి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నేతల ఒత్తిళ్ల మధ్య జిల్లాలో కొద్ది రోజులుగా ‘పచ్చ చట్టమే’ చెల్లుబాటవుతోంది. గత నెల 31వ తేదీన నం ద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన సంఘటనపై ఆగమేఘాల మీద ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై కేసు పెట్టి అరెస్టు చేసిన పోలీసులు.. అదే సంఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచనపై కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ మీనమేషాలు లెక్కించడం వెనుక అధికార పార్టీ పెద్దల ఆదేశాలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఫిర్యాదులు ఉండీ కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోకపోగా ఆ నేతలు యధేచ్చగా జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భాల్లో పోలీసులు వారికి కట్టుదిట్టమైన బందోబస్తు కల్పించడం విస్మయం కలిగిస్తోంది.
 
కౌన్సిల్ మీట్‌కు భారీ భద్రత..

తాజాగా నంద్యాల మున్సిపల్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించాలని నిర్ణయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అసెంబ్లీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేసి.. ఏఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ శుక్రవారం రాత్రి మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఆయన ఆదేశాల మేరకు ఆ ప్రాంతాన్ని పోలీ సులు అధీనంలోకి తీసుకున్నారు. కౌన్సిలర్లు, మీడియా ప్రతినిధులు, అధికారులు మినహా ఇతరులు సమావేశంలోకి వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. నలుగురు సీఐలు, పదిమంది ఎస్‌ఐలు దాదాపు 100 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డు లు, మహిళా కానిస్టేబుళ్లు, ఏఆర్ కానిస్టేబుళ్లను బందోబస్తు విధులకు నియమించారు. గత నెల 31వ తేదీన మున్సిపల్ సమావేశంలో ఘర్షణల కు కారకులైన వారిని అరెస్ట్ చేయకుండానే మున్సిపల్ సమావేశానికి బందోబస్తును ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.  

నాన్ బెయిలబుల్ కేసులే అయినా..


మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి, దేశం సులోచనతో పాటు ఇతర టీడీపీ నేతలపై గత మున్సిపల్ కౌన్సిల్ ఘటనకు సంబంధించి నాన్-బెయిలబుల్ కేసులే నమోదయ్యాయి. శిల్పా మోహన్‌రెడ్డి, దేశం సులోచన, దేశం సుధాకర్ రెడ్డి, అమృతరాజు, పెదకండిగ సుబ్రమణ్యం, రంగాప్రసాద్, కష్ణ మోహన్ మరియు ఇతరులపై ఈ నెల 18వ తేదీన....సెక్షన్లు 120 (బి), 324, 307 ఆర్/డబ్ల్యు 34 ఐపీసీ మరియు సెక్షన్ 156(3) సీఆర్‌పీసీ కింద కేసులను నమోదు చేశారు. మరో కేసులో (227/14) దేశం సులోచన, వెంకట సుబ్బయ్య, గొల్ల లక్ష్మీనారాయణ, జాకీర్ హుస్సేన్, తెలుగు కష్ణమోహన్, అమీర్ బాషాలపై సెక్షన్లు...323, 354, 427, అట్రాసిటీ కేసులను నమోదు చేశారు.

ఇందులో 354, అట్రాసిటీ కేసులు... రెండూ కూడా నాన్-బెయిలబుల్ కేసులే. తెలుగు కృష్ణమోహన్‌పై నంద్యాల త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీటు కూడా ఉంది. అయినప్పటికీ వారికి వత్తాసు పలికేవిధంగా పోలీసుల చర్యలు ఉన్నాయి. కేసులో ఉన్న శిల్పామోహన్‌రెడ్డి ఈ నెల 22న బెంగళూరు నుంచి నంద్యాలకు రావడం, పురపాలక సంఘం చైర్-పర్సన్, టీడీపీ నేత దేశం సులోచన కూడా అదే రోజు జరిగిన స్వచ్ఛభారత్ లో పాల్గొన్నప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు.

దర్జాగా తిరుగుతున్న టీడీపీ నేతలు


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డిపై నమోదైన కేసులే టీడీపీ నేతలపై నమోదైనా.. టీడీపీవారు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. జెడ్పీ చైర్మన్, తెలుగుదేశం నేత మల్లెల రాజశేఖర్ ఏకంగా కల్తీ మద్యం కేసులో ఏ-5 నిందితుడిగా ఉన్నారు. ఆయనకు సంబంధించి పక్కా ఆధారాలున్నా అరెస్టుకు పోలీసులు వెనుకాడుతున్నారు. అంతేకాదు ఏకంగా సీఎం చంద్రబాబు నుంచే తనకు అభయం ఉందని ఆయన చెప్పుకొంటూ తిరుగుతున్నారు. కలెక్టరేట్‌లో గత శనివారం నిర్వహించిన విజిలెన్స్ మానిటరింగ్ సమావేశంలో ఆయన కలెక్టర్ పక్కనే కూర్చున్న సంగతి తెలిసిందే.

జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్ రాంపుల్లయ్యయాదవ్‌ను పదవి నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్న అధికార పార్టీ నేతలు.. అది సాధ్యంగాకపోవడంతో ఆయన ఆ సంఘం డెరైక్టర్ ను కిడ్నాప్  నాటకానికి తెర తీశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఇద్దరు డెరైక్టర్లను రాంపుల్లయ్యే కిడ్నాప్ చేశారంటూ ఆయన ఇంట్లో లేని సమయంలో శుక్రవారం రాత్రి పోలీసులు సోదాలు చేశారు. ఈ విధంగా అధికార పార్టీ జిల్లాలో ప్రతిపక్ష పార్టీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

తొలి సంతకం నిర్వచనం తెలుసా నీకు?

తొలి సంతకం నిర్వచనం తెలుసా నీకు?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తెలుగుదేశంపార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు తొలి సంతకం అనేదానికి నిర్వచనం తెలుసా? అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, త్రిసభ్య కమిటీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వేదికపైనే ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేస్తే అది మరుసటి రోజు నుంచే అమలైందని గుర్తుచేశారు. కేంద్రాన్ని ఒప్పించి మరీ రుణమాఫీ చేయించారన్నారు.

చంద్రబాబు మాత్రం రుణమాఫీపై తొలి సంతకం అంటూనే కోటయ్య కమిటీని వేశారని దుయ్యబట్టారు. ఆరునెలలైనా ఒక్క రూపాయి  కూడా మాఫీ చేయలేదని చెప్పారు. రుణమాఫీ చేస్తామంటూ రైతులను, డ్వాక్రా మహిళలను మోసగించి, పంట బీమా కూడా దక్కకుండా చేసిన టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ ఐదున కలెక్టరేట్ల ఎదుట తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

క్యాడర్ వైఎస్సార్‌సీపీవైపే ఉందని, సీనియర్ల నేతృత్వంలో పార్టీని పటిష్టం చేస్తామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం జిల్లా విస్తృతస్థాయి సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు సాగి దుర్గాప్రసాదరాజు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

యాజమాన్యాలు చట్టాల్ని ఉల్లంఘిస్తే చర్యలేవి?

  • లోక్‌సభలో కార్మిక చట్టం సవరణ బిల్లుపై ఎంపీ వరప్రసాద్‌రావు ప్రశ్న
సాక్షి, న్యూఢిల్లీ: కార్మిక చట్టంలో సంస్కరణలు తెచ్చేందుకు కేంద్రం చేస్తున్న సవరణల్లో ఉల్లంఘనలకు తగిన చర్యలేవీ లేవని వైఎస్సార్ సీపీ ఎంపీ వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం లోక్‌సభలో కార్మిక చట్టం(రిటర్నుల దాఖలు మినహాయింపు, రిజిస్టర్ల నిర్వహణ మినహాయింపు) సవరణ బిల్లు-2014పై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు.

‘‘ఈ బిల్లుపై రాజకీయ కోణంలో మాట్లాడదలుచుకోలేదు. నేను గతంలో తమిళనాడు రాష్ట్రంలో లేబర్ కమిషనర్‌గా పనిచేశాను. అందువల్ల కొన్ని అంశాలు ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నా. నేను ఈ బిల్లుకు వ్యతిరేకంగానూ లేను. మద్దతుగానూ లేను. కార్మిక చ ట్టాలకు సంబంధించి శాసన ప్రక్రియను సరీళకరించడానికి ప్రోత్సాహాన్నిచ్చే రీతిలో ఇది కనిపిస్తోంది. కానీ మీరు లోతుగా చూస్తే సంక్లిష్టత కనిపిస్తుంది. రిజిస్టర్లు, రిటర్నులు ఎలక్ట్రానిక్ రూపంలో పంపించవచ్చన్న ప్రక్రియ ఒక్కటే సరళతరంగా కనిపిస్తుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘2005లో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు స్టాండింగ్ కమిటీ దాదాపు 10 సార్లు సమావేశమైంది. తిరిగి 2011లో వచ్చినప్పుడు.. కొన్ని సవరణ ప్రతిపాదనలను తొలగించాలని స్టాండింగ్ కమిటీ చెప్పింది. కానీ ఈ బిల్లులో ఒక్క లైను కూడా మారలేదు. సంస్థలు రిటర్నులు, రిజిస్టర్లను నిర్వహిస్తే తప్ప కనీస వేతన చట్టం, బోనస్ చట్టం, వంటి కార్మిక సంక్షేమ చర్యలు అమలు కావు.. అందువల్ల సంఖ్య విషయంలో, జరిమానాల విషయంలో మార్పులు చేయాలి..’ అని వరప్రసాద్ డిమాండ్ చేశారు.

చిరు వర్తకులు రుణాలు పొందేందుకు అవకాశం ఉందా?

‘జన్‌ధన్’ ఖాతాదారులకు రుణాలిస్తారా?
  • లోక్‌సభలో ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని ప్రారంభించిన జన్‌ధన్ యోజన కింద బ్యాంకుల్లో ఖాతాలు తెరిచిన వారిలో చాలా వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిరు వర్తకులు ఉన్నారని, వారు రుణాలు పొందేందుకు అవకాశం ఉందా? అని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం లోక్‌సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ పథకంపై ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఒక ప్రశ్న వేశారు.

చిరు వర్తకులకు రుణాలు ఇచ్చేందుకు కేంద్రం ఏవైనా చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించగా.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించి ‘బీమా, ప్రమాద బీమా అందుబాటులో ఉంటుంది. అన్ని బ్యాంకింగ్ హక్కులు సదరు ఖాతాదారు కలిగి ఉంటాడు.ఈ ఖాతాదారులకు రుణాలు ఇచ్చే విషయంలో కాస్త ఉదారత, సరళత ప్రదర్శించాలని మేం బ్యాంకర్లను కోరాం. వారు అర్హతలను పరిశీలించి రుణాలు మంజూరు చేస్తారు..’ అని వివరించారు.

భిక్షమెత్తిన డబ్బుతో బాబు విహారయాత్రలు

Written By news on Friday, November 28, 2014 | 11/28/2014


భిక్షమెత్తిన డబ్బుతో బాబు విహారయాత్రలు: రోజా
శ్రీకాకుళం : హుండీల ద్వారా భిక్షమెత్తుతున్న డబ్బుతో చంద్రబాబు విహారయాత్రలు చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నాయకురాలు రోజా మండిపడ్డారు. ఎన్నికల హామీల నుంచి తప్పించుకోడానికి ప్రజల సొమ్మును ఫలహారంగా తింటూ విదేశాల్లో గడిపేస్తున్నారని విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సెటిల్ మెంట్లపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులపై లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో స్థూల ఉత్పత్తి 5.76 శాతం మాత్రమే ఉంటే.. వైఎస్ ఐదేళ్లలో స్థూల ఉత్పత్తి 9.56 శాతం ఉండేదని ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై అడుగడుగునా చంద్రబాబును నిలదీయాలని అన్నారు.

చంద్రబాబు తీరుతో రైతులు శాశ్వత రుణగ్రహీతలుగా మిగిలిపోతారని సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. ఆధునిక వ్యవసాయాన్ని అధ్యయనం చేయడానికి జపాన్ వెళ్లనక్కర్లేదని, బాపట్ల వ్యవసాయ కళాశాలలోనే తగినంత సమాచారం అందుబాటులో ఉందని ఆయన అన్నారు.

కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటాం


- చంద్రబాబు తీరును దుయ్యబట్టేందుకే కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు
- వైఎస్‌ఆర్‌సీపీ త్రిసభ్య కమిటీ సభ్యుడు విజయసాయిరెడ్డి

విజయనగరం మున్సిపాల్టీ/కంటోన్మెంట్: ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై  పోరాడతామని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, త్రిసభ్య కమిటీ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు.  మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మాట మార్చి ప్రజల్ని మభ్య పెడుతున్నారన్నారు. జరుగుతున్న మోసాన్ని తెలియజేసేందుకు, ప్రజల ఆవేదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు డిసెంబర్ 5న కలెక్టరేట్‌ల వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు.

విజయనగరం సమీపంలోని ఆర్‌కే టౌన్‌పిష్‌లో గురువారం జరిగిన జిల్లా పార్టీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి, చంద్రబాబుకు మధ్య ఎంతో తేడా ఉందన్నారు. జిల్లాలో 2.48 లక్షల ఎకరాలను సస్యశ్యామలం  చేసేందుకు తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనన్నారు. ఇందుకోసం రూ. 853 కోట్ల నిధులు విడుదల చేశారన్నారు.  అలాగే తారకరామ  తీర్థసాగర్  ప్రాజెక్టు ద్వారా రెండు టీఎంసీల తాగునీరు, 25వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిధులు విడుదల చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని చెప్పారు.  

రాజీవ్ క్రీడా మైదానం, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజీ నిర్మించారని, 15వేల మందికి ఇళ్లపట్టాలు మంజూరు చేసి, 4,04,972 ఇందిరమ్మ ఇళ్లు కట్టించారని చెప్పారు. అలాగే 20,033 ఎకరాలను నిరుపేదలకు పంచిపెట్టారన్నారు. వైఎస్ అధికారంలోకి రాకముందు  59 వేల పింఛన్లుంటే, ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత వాటి మొత్తాలను పెంచారన్నారు. అదనంగా 2.81లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారన్నారు. ఇన్ని చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డికీ, చంద్రబాబుకు ఎంతో తేడా ఉందన్నారు. జిల్లాలో వైఎస్ హయాంలో ఒకే ఒక జీఓతో రుణమాఫీ వర్తింపజేస్తే, చంద్రబాబు 3.20 లక్షల మందికి 1,157 కోట్ల రుణ మాఫీకి ఎన్నో వంకలు పెడుతున్నారని ఆరోపించారు.

సాధికారత సంస్థకు చంద్రబాబు రూ. 5వేల కోట్లు జమ చేశారని, ఆ సొమ్ము వడ్డీకి కూడా చాలదన్న విషయం గుర్తెరగాలన్నారు. రుణమాఫీ లబ్ధిదారుల్లో 45వేల మందిని తొలగించారన్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న ఫెర్రో  అల్లాయీస్, జూట్ పరిశ్రమలు మూతపడడంతో దాదాపు 30 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.   చంద్రబాబు  అసమర్థత  వల్లే ఇలా జరిగిందని విమర్శించారు. రెండు రూపాయలకు ఎన్టీఆర్ ఇచ్చిన బియ్యం ధరను చంద్రబాబు రెండు సార్లు పెంచితే,  వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చి కోటా బియ్యాన్ని కిలో రూపాయికి ప్రకటించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.     

కనిపించిన వారందరికీ రుణమాఫీ అని ప్రకటించిన చంద్రబాబు నాయుడు కేవలం అధికారం కోసమే తప్పుడు హామీలిచ్చారని  పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు.    కేంద్రంలో మోదీ ఉన్నారు,  నిధులు తెచ్చి రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు, ఎందుకు నిధులు అడగడం లేదో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రం విడిపోతే ప్రత్యేక ప్రతిపత్తిని ఐదేళ్ల పాటు కల్పిస్తామని కేంద్రం చెప్పినప్పుడు బీజేపీతో కలిసి ఐదు కాదు పదిలేదా పదిహేనేళ్లు కావాలని కోరిన బాబు ఇప్పుడు ఆ స్వయం ప్రతిపత్తి గూర్చి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులకు 87,612 కోట్ల రూపాయలు, డ్వాక్రా మహిళలకు రూ.14వేల కోట్లు మాఫీ చేస్తానన్న చంద్రబాబు అర్హత లేదని చాలా మంది రైతుల పేర్లను జాబితాల్లోంచి తొలగించారన్నారు.  

జపాన్‌లో పర్యటిస్తున్న  చంద్రబాబు ..తుపానులు రాకుండా నివారించేందుకు అక్కడ  స్టడీ చేస్తుండడాన్ని ప్రజలు హాస్యాస్పందంగా తీసుకుంటున్నారన్నారు.  ఇంటికో ఉద్యోగమిస్తామని, లేకుంటే  రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయ న్నారు. బ్యాంకులతో నిత్యం చక్కని లావాదేవీలు నడుపుతున్న మహిళలకు చంద్రబాబు ఇచ్చిన హామీలతో బ్యాంకులు, మహిళల మధ్య సత్సంబంధాలు పోయాయన్నారు.

గాంధీజీ విగ్రహం తొలగింపు అమానుషం

గాంధీజీ విగ్రహం తొలగింపు అమానుషం
* వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తెల్లం బాలరాజు
* కొయ్యలగూడెంలో గాంధీజీ విగ్రహానికి క్షీరాభిషేకం

కొయ్యలగూడెం : జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగించడం అమానుషమైన చర్య అని, టీడీపీ నాయకుల దాష్టీకానికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ కన్వీనర్ తెల్లం బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కొయ్యలగూడెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతిపితను యావత్ ప్రపంచం కూడా ఎంతో గౌరవిస్తుందని,  అటువంటిది పెదవేగి మండలం చోదిమళ్ల పంచాయతీ పరిధిలోని దొండపాడులో టీడీపీ నాయకులు జాతిపిత విగ్రహానికి ఘోర అవమానం తలపెట్టారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ చేస్తున్న అరాచకాలకు జరిగిన ఘోరం పరాకాష్టగా నిలిచిందని, ప్రజాస్వామ్యవాదులంతా పార్టీలకతీతంగా ఇటువంటి చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.

జరిగిన అవమానాన్ని శాసనసభ స్పీకర్, గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లనున్నామన్నారు. తొలగించిన చోటే మహాత్ముని విగ్రహాన్ని నిలబెట్టి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. అనంతరం బస్టాండ్ నుంచి గణేష్ సెంటర్ వరకు పాదయాత్ర చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెయిన్ సెంటర్‌లోని గాంధీ విగ్రహానికి బాలరాజు క్షీరాభిషేకం చేసి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. పట్టణ కన్వీనర్ మట్టా శ్రీనివాస్, జిల్లా సర్పంచ్‌ల ఛాంబర్ ఉపాధ్యక్షురాలు దేవీ గంజిమాల, జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్‌కుమార్‌లతో కలిసి ఎంపీటీసీ కొట్రా గంగారత్నం, జిల్లా ఎస్టీ సెల్ కన్వీనర్ కొవ్వాసి నారాయణరావు, డీసీసీబీ డెరైక్టర్ పొడియం శ్రీనివాస్, జిల్లా నాయకులు ఆరేటి సత్యనారాయణ, గంజిమాల రామారావు, చిన్నం గంగాధరం, కాసగాని గోఖలే, ఎస్‌కే బాజీ, దూలపల్లి కాంతారావు, సంకు కొండ, ఎస్‌కే నవాబ్, ఎస్‌కే వహాబ్ పాల్గొన్నారు.

ఉన్న మాట చెబితే ఉలుకెందుకు.. నోరు అదుపులో పెట్టుకో

ఉమా.. నోరు అదుపులో పెట్టుకో
విజయవాడ :‘ఉన్న మాట చెబితే ఉలుకెందుకు..  నోరు అదుపులో పెట్టుకో.. లేకుంటే మీకంటే ఎక్కువగా బండబూతులు తిట్టగలం..’ అంటూ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హెచ్చరించారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి ఉమా దుర్భాషలాడడాన్ని ఖండించారు.

గత ఎన్నికల్లో రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని నమ్మబలికి గద్దెనెక్కి ఆరు మాసాలైనా అమలు చేయకపోవడంతో వచ్చిన ప్రజాగ్రహాన్ని తమ పార్టీ అధినేత బయటకు చెప్పారని కొడాలి నాని వివరించారు. హామీలు అమలుచేయాలని ప్రజల తరఫున కోరుతుంటే  ఉమా సంస్కారహీనంగా మాట్లాడడం శోచనీయమన్నారు.

ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడకపోతే రాబో యే రోజుల్లో చంద్రబాబును కూడా  తిట్టేందుకు తాము వెనుకాడేది లేదని నాని హెచ్చరించారు. మానసిక రోగం తమ పార్టీ నేతకు లేదని, 66 ఏళ్లు దాటిన మీ నాయకుడు చంద్రబాబుకే ఉందన్నారు. అధికారం కోసం చంద్ర బాబు మామను చంపారని, ఎమ్మెల్యే పదవి కోసం దేవినేని ఉమా ఇంట్లో మనుషులను చంపారని దుయ్యబట్టారు.

 చంద్రబాబును ప్రజలు క్షమించరు : కె.పార్థసారథి
 పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కె.పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలుచేయకపోతే భవిష్యత్తులో రాళ్లతో కొడతారని తమ పార్టీ అధినేత అన్న మాటల్లో ఎటువంటి తప్పు లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబును ప్రజలు క్షమించరన్నారు.

మంత్రి ఉమా పిచ్చివాగుడు వాగుతూ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రుణమాఫీపై ఎన్ని మాటలు మార్చారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పింఛన్లకు రూ. 3,700 కోట్ల బడ్జెట్ కేటాయించి నిరుపేదలకు  ఎగనామం పెడుతున్నారని దుయ్యబట్టారు. ఈ సమస్యలపై నిలదీస్తున్న తమ పార్టీ అధినేతపై దుర్భాషలాడడం తగదన్నారు.

జిల్లాలో మంజూరైన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని గుంటూరుకు తరలించినా మంత్రి ఉమా దద్దమ్మలా నోరు మెదపకుండా కూర్చున్నారని విమర్శించారు. సంస్కారహీనంగా ప్రవర్తించవద్దని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మంత్రి ఉమాకు సారథి హితవు పలికారు. 

దేవినేని ఉమకు ఆ స్థాయి లేదు

Written By news on Thursday, November 27, 2014 | 11/27/2014


'దేవినేని ఉమకు ఆ స్థాయి లేదు'కొడాలి నాని(ఫైల్)వీడియోకి క్లిక్ చేయండి
విజయవాడ: ఏపీ మంత్రులు సంస్కారంలతో మాట్లాడాలని వైఎస్సార్ సీపీ నాయకులు కొడాలి నాని, కొలుసు పార్థసారధి సూచించారు. రాజీవ్ గాంధీ భిక్షతోనే చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించేస్థాయి దేవినేని ఉమకు లేదన్నారు.

కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇసుక మాఫియాను నడిపిస్తున్నది దేవినేని ఉమానే అని ఆరోపించారు. కృష్ణానది రిటైనింగ్ గోడ నిర్మించాలని ధర్నా చేసిన దేవినేని ఉమ.. నేడు ఆ టెండర్ ను రద్దు చేశారని తెలిపారు. ఎన్నికల హామీలపై దమ్ముంటే టీడీపీ నేతలు చర్చకు రావాలని సవాల్ చేశారు. డిసెంబర్ 5న వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న మహాధర్నా పోస్టర్ ను కొడాలి నాని, పార్థసారధి గురువారం విడుదల చేశారు.
 

చంద్రబాబుకు వంశంలోనే పిచ్చి: అంబటి


చంద్రబాబుకు వంశంలోనే పిచ్చి: అంబటి
హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, ఆ పార్టీ నాయకులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ కు మానసిక వ్యాధి ఉందంటూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుకు ఆయన వంశంలోనే పిచ్చి ఉందని, కానీ వైఎస్ వంశంలో మాత్రం ఎవరికీ లేదని చెప్పారు. మీ బావమరిది బాలకృష్ణ మానసిక స్థితి బాగోలేదని గతంలో వైద్యులు రిపోర్టు ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు. అలాగే మీ తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మతి స్థిమితంలేక ఆస్పత్రిలో ఉన్న విషయం కూడా వాస్తవం కాదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

వైఎస్ జగన్, చంద్రబాబు ఇద్దరికీ వైద్యపరీక్షలు చేయిద్దామని, చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యవంతుడని డాక్టర్లు ధ్రువీకరిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు చేశారు. అలాగే వైఎస్ జగన్ ఆరోగ్యవంతుడు కారని చెప్పినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు. టీడీపీ నేతలకు దమ్ముంటే ఈ సవాలు స్వీకరించాలని ఆయన చెప్పారు.

బొజ్జల, దేవినేని, కొల్లు రవీంద్ర, శిద్దా రాఘవరావు తమను జపాన్ తీసుకెళ్లలేదని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షం మీ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఎందుకంత కంగారని ప్రశ్నించారు. ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పోయి.. ఇతరులను దూషించడం సరికాదన్నారు.

తిరుగులేని శక్తిగా....


టీడీపీ మేనిఫెస్టోనే బోగస్
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

 వాకాడు : తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టో ఒక బోగస్‌ని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రజాకంటక ప్రభుత్వంపై ఏదో ఒక రోజు ప్రజలు తిరగబడతారన్నారు. వాకాడులోని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి నివాసంలో బుధవారం రాత్రి ఆ పార్టీ అనుబంధ మండల కమిటీల అధ్యక్షులను ప్రకటించారు. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డికి ప్రసన్నకుమార్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అనంతరం ప్రసన్న విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి నాయకులు, కార్యకర్తలే కొండంత బలమన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల తరపునపోరాటం చేస్తామన్నారు. ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం ఆ తరువాత మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. అధికారం చేపట్టి ఆరు నెలలు గడిచినా చంద్రబాబు ఇచ్ని వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పాలనపై ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామన్నారు. అధికారానికి కొంచెం దూరంలోనే వైఎస్సార్‌సీపీ నిలిచినప్పటికీ ప్రజల ఆదరణ ఇప్పుడు మరింతగా పెరిగిందన్నారు.

జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటించి అనుబంధ సంస్థల కమిటీలను నియమిస్తున్నామన్నారు. పార్టీని ఇంకా పటిష్ట పరిచి జిల్లాలో తిరుగులేని శక్తిగా చేస్తామని ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రకటించారు. అనుబంధ కమిటీ అధ్యక్షులంతా పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలన్నారు. రెండు నెలలకు ఒకసారి సమావేశం జరిపి అజెండాను రూపొందించుకుని ప్రజల తరపున పోరాడాలని సూచించారు. ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అనుబంధ సంస్థల కమిటీలు పూర్తయ్యాయన్నారు.

అనుబంధ సంస్థల కమిటీ సభ్యులందరూ  ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పద్మనాభరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ పటిష్టానికి మరింత ఉత్సాహంతో పని చేస్తామన్నారు. కొత్త రాజధాని కోసం పంటలు పండే భూములు లాగేసుకుని రైతులకు అన్యాయం చేస్తే ఆగోష్ఠ చంద్రబాబుకు తగులుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఏర్పాటు చేయబోయే కొత్త రాజధాని చుట్టూ చంద్రబాబు అనుచరులకు రూ.కోట్లు సంపాదించి పెట్టాలన్నదే చంద్రబాబు ఆలోచనని విమర్శించారు.

చంద్రబాబుకు ఎందుకు ఓట్లు వేశామాని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారన్నారు. జిల్లాలో సరైన సమయంలో ప్రసన్నకుమార్‌రెడ్డిని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం సముచిత నిర్ణయమన్నారు. వచ్చే నెల 5న  కలెక్టరేట్ ఎదుటజరగనున్న ధర్నాను విజయ వంతం చేసేందుకు అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సాసీపీ మండల అధ్యక్షుడు నేదురుమల్లి ఉదయశేఖర్‌రెడ్డి, కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి, నాయకులు పాపారెడ్డి మనోజ్‌కుమార్‌రెడ్డి, కొండారెడ్డి నందగోపాలరెడ్డి, పాపారెడ్డి పురుషోత్తమ్‌రెడ్డి, పిట్టు నాగరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు బత్తిన ప్రమీలా, కడూరు భాస్కర్, అజిత్‌కుమార్‌రెడ్డి, రవీంద్రనాయుడు, తుమ్మల మోహనాయుడు, దుష్యంతయ్యశెట్టి, రవిశేఖర్‌రెడ్డి, తీపలపూడి చెంగయ్య, ఎంబేటి సురేష్, నాగేంద్రరెడ్డి, జనార్దన్‌రెడ్డి, కోటేశ్వరరెడ్డి, పల్లంపర్తి గోపాలరెడ్డి, కాశీపురం శ్రీనివాసులు, కాటంరెడ్డి రామలింగారెడ్డి పాల్గొన్నారు.

సారా, విద్యావ్యాపారులు, సంచులు మోసేవారే!:రోజా


సారా, విద్యావ్యాపారులు, సంచులు మోసేవారే!:రోజారోజా
విజయనగరం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఆయన వెంట సారా వ్యాపారం, మనీ ల్యాండరింగ్, విద్యావ్యాపారం, సంచులు మోసేవారు తప్ప సంగతి తెలిసినవారు ఎవరూ లేరని వైఎస్ఆర్ సీపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని దౌర్భాగ్యస్థితిలో  చంద్రబాబు ఉన్నారని అన్నారు.

చంద్రబాబులా అబద్ధాలు చెబితే మొన్నటి ఎన్నికలలో వైఎస్ఆర్ సీపీకే అధికారం దక్కేదన్నారు. చంద్రబాబు మారారని ప్రజలు అనుకున్నారని, అయితే గతంలో కన్నా దారుణంగా, మోసగానిలా మారారన్న విషయం వారికి అర్ధమైపోయిందని చెప్పారు. చంద్రబాబు చేతకానితనం వల్లే రాష్ట్రం విడిపోవాలన్న ఆలోచన పుట్టుకొచ్చిందని రోజా అన్నారు.

ఆ టీడీపీ నేతలను అరెస్టు చేయాలి: వాసిరెడ్డి పద్మ


ఆ టీడీపీ నేతలను అరెస్టు చేయాలి: వాసిరెడ్డి పద్మ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ 
 సాక్షి, హైదరాబాద్ : అక్రమ మద్యం కేసులో నిందితుడైన కర్నూలు జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ గౌడ్, మాచర్లలో ఒక హత్య కేసులో నిందితునిగా ఉన్న టీడీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్‌ను తక్షణం అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఇలాంటి అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు.
 
 అధికారంలో ఉన్న టీడీపీ వారు పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని, వారిపై ఎలాంటి చర్యలూ ఉండటంలేదని తెలిపారు.ఇదేమి అరాచకమని, ఇదేమి న్యాయమని అన్నారు. టీడీపీ వారికైతే ఒక న్యాయం, వైఎస్సార్ సీపీ నేతలకైతే మరో న్యాయమా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అవాకులు చవాకులు పేలుతున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక మనిషిలాగా మాట్లాడ్డంలేదని చెప్పారు. ఆయన మాట్లాడే తీరు చూస్తే ఎవరో తరుముకొస్తున్నారనే భయం ఆయనలో కనిపిస్తోందని, ఆయన మానసిక వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిదని సూచించారు. అసలు ఒక మహా పాతకం నుంచి పుట్టిన నాయకుడు ఉమామహేశ్వరరావు అని, ఆ పాతక భయం ఆయన్ని వెంటాడుతున్నందునే అలా అసహజంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీని మూసేస్తారని మంత్రి పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఒక పార్టీని స్థాపించిన వ్యక్తిని నిలువునా చంపి ఆ పార్టీని లాక్కున్న చరిత్ర టీడీపీ నేతలదని పద్మ చెప్పారు.
 
 అందుకే టీడీపీని పదేళ్లపాటు రాష్ట్ర ప్రజలు అడ్రస్ లేకుండా చేశారని అన్నారు. పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన వారు జగన్‌పై విమర్శలు చేయడం తగదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎదిరించి సీబీఐ కత్తిని గుండెలపై పెట్టినా బెదరకుండా వైఎస్ ఆశయాల సాధన కోసం పార్టీ పెట్టిన జగన్‌కు దానిని ఎలా కాపాడుకోవాలో తెలుసునని చెప్పారు. అసలు వైఎస్సార్ సీపీ అంటే అధికారంలో ఉన్న వారు ఎందుకంత భయంతో గంగవైలెత్తి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. బాబు విదేశీ పర్యటనల వల్ల రాష్ట్రానికి చింతాకంత ప్రయోజనం కూడా లేదని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

చంద్రబాబుపై కేసులో మాత్రం సిబ్బంది లేరని చెప్పారు


అధికార పార్టీల చేతుల్లో సీబీఐ కీలుబొమ్మ
* లోక్‌సభలో స్పెషల్ పోలీసు సవరణ బిల్లుపై చర్చలో మిథున్‌రెడ్డి ధ్వజం
కొందరిని రాజకీయంగా అణగదొక్కేందుకు సీబీఐని వాడుకుంటున్నారు
వైఎస్ జగన్ కేసులో 22 బృందాలతో దర్యాప్తు చేశారు
అదే చంద్రబాబుపై కేసులో మాత్రం సిబ్బంది లేరని చెప్పారు

 
 సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐ అధికార పార్టీల చేతుల్లో కీలుబొమ్మగా మారుతోందని వైఎస్సార్ సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి లోక్‌సభలో ధ్వజమెత్తారు. సీబీఐ కేవలం రాజకీయ కక్ష సాధింపులకు ఉపకరణంగా మారుతోందన్నారు. సీబీఐ డెరైక్టర్ నియామకానికి సంబంధించిన బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.‘సీబీఐ డెరైక్టర్ నియామకానికి సంబంధించి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్(సవరణ) బిల్లు-2014కు మేం మద్దతిస్తున్నాం.
 
  ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకున్నప్పుడు.. నియామక కమిటీలో ప్ర తిపక్ష నేత సభ్యుడు అవ్వాలా? లేక విపక్షంలో ఉన్న అతిపెద్ద పార్టీకి చెందిన నేత సభ్యుడు అవ్వాలా? అన్నది అంత ముఖ్య విషయం కాదు. అధికార పార్టీల చేతుల్లో సీబీఐ ఒక కీలుబొమ్మగా మారుతోందన్నదే ఇక్కడ ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. అధికారంలో ఉన్న పార్టీలు కేవలం ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ందుకు, వాటిని నియంత్రించేందుకు,అణగదొక్కేందుకు సీబీఐని  ఉపకరణంగా వాడుకుంటున్నాయి.తమ రా జకీయ కక్షసాధింపు కోసం సీబీఐని వాడుకుంటున్నాయి’’ అని మిథున్‌రెడ్డి విమర్శించారు.
 
 సీబీఐ తీరును ‘సుప్రీం’ తప్పుబట్టింది
 ‘‘ఇటీవల హవాలా కేసు, తదితర ఇతర కేసుల్లో సీబీఐ తీరును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సీబీఐని ‘పంజరంలో ఉన్న చిలుక’గా సాక్షాత్తూ సుప్రీంకోర్టే అభివర్ణించింది. సీబీఐ ఎవరిపైనా పక్షపాత వైఖరి లేకుండా స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు చేసిన ఈ అభివర్ణనే చెబుతోంది. మా నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో లేకున్నా, ఆయన ఏ ఫైలుపైనా సంతకం చేయకున్నా... ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. కేవలం ఆయన అధికార పార్టీ నుంచి బయటకు వచ్చారన్న కారణంతోనే అది జరిగింది. అధికార పార్టీ ఆజ్ఞల మేరకే సీబీఐ నడుచుకుంది’’ అని ఆయన గుర్తుచేశారు. ‘‘మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు పై దర్యాప్తు జరపాలంటే తమకు సిబ్బంది కొరత ఉందని చెప్పిన సీబీఐ.. అదే సమయంలో జగన్‌మోహన్‌రెడ్డిపై 22 బృందాలతో దర్యాప్తు జరిపింది. ఇక్కడ సీబీఐ ద్వంద్వ ప్రమాణాలను అర్థం చేసుకోవచ్చు.అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మని అర్థం చేసుకోవచ్చు’’ అని అన్నారు.
 
 అధికార పార్టీలు ఉల్లంఘిస్తున్నాయి..
 ‘‘1999లో సుప్రీంకోర్టు ఒక కేసులో స్పష్టంగా ఆదేశించింది. దర్యాప్తు సంస్థల పరిధిలో జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.దీన్ని అధికార పార్టీలు ఉల్లంఘిస్తున్నాయి.సుప్రీంకో ర్టు చెప్పినట్టుగా.. ఈ సంస్థకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. స్వతంత్ర వ్యవస్థగా పనిచేయాలి. ఒక రాజకీయ ఉపకరణంగా కాకుండా ప్రజలకు న్యా యం చేసే సంస్థగా ఉండాలి. చట్టాన్ని పరిరక్షించేదిగా ఉండాలిగానీ చట్టాన్ని తయారు చేసే వారి చేతిలో ఒక ఉపకరణంలా ఉండకూడదు..’’ అని మిథున్‌రెడ్డి అన్నారు.

అడ్డగోలుగా వ్యవహరిస్తే ఆందోళనే

' రాజధాని ప్రాంతంలో వైఎస్సార్ సీపీ హక్కుల కమిటీ పర్యటన
శాఖమూరు, అనంతవరం, నెక్కల్లు పర్యటనలో రైతులు, కూలీలు, కౌలు రైతులకు భరోసా ఇచ్చిన నేతలు
రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదు.. రైతులకు సర్కారు అన్యాయం చేస్తే సహించం
రాజధాని పేరుతో భూ దందాను అంగీకరించం
చివరి వరకు రైతులకు అండగా ఉంటాం
అధికార పార్టీ నేతల అసత్య ప్రచారాలను నమ్మొద్దు
ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించాలి
అన్నదాతను నట్టేట ముంచుతావా అంటూ చంద్రబాబుపై మండిపాటు

గుంటూరు: రాజధాని భూసేకరణ విషయంలో ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తే ఆందోళన తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ రైతులు, రైతు కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ నేత కొలుసు పార్థసారథి హెచ్చరించారు. తాము రాజధానికి వ్యతిరేకం కాదని, ఆ నెపంతో ఆయూ ప్రాంతాల వారికి అన్యాయం చేయూలని చూస్తే సహించబోమని స్పష్టంచేశారు. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నియమించిన ఈ కమిటీ సభ్యులు మూడో విడత పర్యటనలో భాగంగా బుధవారం తుళ్ళూరు మండలంలోని శాఖమూరు, అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లో రైతులు, కూలీలు, కౌలు రైతుల అభిప్రాయాలు సేకరించారు.
 
 ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ రాజధాని పేరిట జరుగుతున్న భూ దందాను అంగీకరించబోమన్నారు. స్థానికులు బెంగ పడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను రైతులు నమ్మొద్దని చెప్పారు. భూములివ్వడానికి రైతులు సంతోషంగా ముందుకొస్తున్నారంటూ కొన్ని పత్రికలు రాస్తున్న కథనాలన్నీ వాస్తవ విరుద్ధమేనని తమ పర్యటన ద్వారా స్పష్టమైందని తెలిపారు. భూమికీ రైతుకూ ఉన్న అవినాభావ సంబంధాన్ని ఎవరూ డబ్బులతో తూచలేరని చెప్పారు. అనుభవజ్ఞుడివని నీకు ఓటేసిన పాపానికి అన్నదాతలను నట్టేట ముంచుతావా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. పచ్చటి పంటలతో అలరారే నేలను తీసుకుని.. నీరు, పైరు లేని సింగపూరులా తీర్చిదిద్దుతానని ప్రగల్భాలు పలకడమంత సిగ్గుచేటు ఇంకోటి లేదని అన్నారు. కేవలం రెండు బస్సుల్లో హైదరాబాద్ వెళ్ళిన రైతులు చెప్పిందే వేదం కాదని  వ్యాఖ్యానించారు. రైతులు, వ్యవసాయ కార్మికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. రైతు భూమినే పెట్టుబడిగా పెట్టి రాజధాని నిర్మించే యత్నాన్ని విరమించుకోవాలని హితవు పలికారు.
 
 అందరికీ న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని, ప్రభుత్వం మెడలు వంచుతామని పార్థసారథి హెచ్చరించారు. పొలాలపై ఆధారపడే రైతులు, కూలీలు, కౌలు రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందన్నదే తమ ఆవేదన అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెప్పారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో అందరి అభిప్రాయాలను తీసుకొని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. అవసరమైతే పార్లమెంట్ వరకు దీనిపై పోరుబాట పడతామన్నారు. చివరి వరకు రైతుల పక్షాన నిలబడి పోరాడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. రైతులందరి అభిప్రాయాలను క్రోడీకరించి, కార్యాచరణను రూపొందిస్తామని వివరించారు.
 
 బాబు చెప్తున్న దానికి చట్టబద్ధత లేదు...
 రాజధాని విషయంలో చంద్రబాబు చెప్తున్న ఏ అంశానికీ చట్టబద్ధత లేదని వైఎస్సార్ సీపీ రైతు సంఘం రాష్ట్ర నేత నాగిరెడ్డి చెప్పారు. ప్రజలను తరలించాలంటే భూసేకరణ చట్టం ఒక్కటే సరిపోదని  చెప్పారు. పునరావాసం, పునర్నిర్మా ణం చట్టాన్ని కూడా అమలు చేయాలని తెలి పారు. బాబు మొండిపట్టు విడనాడాలనీ, జరీ బు భూముల జోలికి రాకూడదని హితవు పలి కారు. దీనిపై అసెంబ్లీలోనే కాక అన్ని రాజకీయ పార్టీలతో ప్రజల సమక్షంలో బహిరంగంగా చర్చించాలని డిమాండ్ చేశారు.
 
 ముందు అనుమానాలు నివృత్తి చేయాలి..
 రాజధాని గ్రామాల రైతుల్లో ఉన్న అనేక అనుమానాలను నివృత్తి చేసిన తర్వాతే భూ సమీకరణ గురించి బాబు మాట్లాడాలని వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కత్తెర క్రిస్టీనా సూచించారు. ఈ పర్యటనలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తాఫా, జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవళ్ళ రేవతి, నాయకులు ఆతుకూరి ఆంజనేయులు, కొత్త చిన్నపరెడ్డి, సయ్యద్ మహబూబ్, మేరిగ విజయలక్ష్మి, సయ్యద్ హబీబుల్లా, కత్తెర సురేష్, సుద్దపల్లి నాగరాజు, పురుషోత్తం, తుమ్మూరు వరప్రసాద్‌రెడ్డి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Popular Posts

Topics :