ఏలూరు : రుణమాఫీపై చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వాలని, ఆయన రోజుకో మాట మాట్లాడటం మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి రుణం కూడా మాఫీ కాకపోయినా, అప్పుడే అంతా మాఫీ అయిపోయినట్లు అభూత కల్పనలు స్పష్టిస్తూ పండగ చేసుకుంటున్నారని విమర్శించారు.
ఉమ్మడి రాష్ట్రం విడిపోతే లోటు బడ్జెట్ ఉంటుందని ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తనకే తెలిసిందని, అలాంటిది తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఆ విషయం తెలియదా అని నాగేశ్వరరావు ప్రశ్నించారు. అన్నీ తెలిసి రుణమాఫీని మేనిఫెస్టోలో చేర్చింది మీరు కాదా అని ఆయన నిలదీశారు.
ఉమ్మడి రాష్ట్రం విడిపోతే లోటు బడ్జెట్ ఉంటుందని ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తనకే తెలిసిందని, అలాంటిది తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఆ విషయం తెలియదా అని నాగేశ్వరరావు ప్రశ్నించారు. అన్నీ తెలిసి రుణమాఫీని మేనిఫెస్టోలో చేర్చింది మీరు కాదా అని ఆయన నిలదీశారు.