09 March 2014 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

వైఎస్ జగన్ జనభేరికి జననీరాజనం

Written By news on Saturday, March 15, 2014 | 3/15/2014

వైఎస్ జగన్ జనభేరికి జననీరాజనం
ఏలూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చమగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్‌ జనభేరికి అపూర్వ స్పందన లభిస్తోంది. భీమవరంలో జగన్ కు అడుగడుగునా అభిమానులు ఘనస్వాగతం పలికారు. దివంగత మహానేత వైఎస్‌ఆర్ స్నేహితుడు వేగిరాజు రామకృష్ణంరాజును వైఎస్‌ జగన్  పరామర్శించారు.

అంతకుముందు పాలకొల్లులో  జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్‌ జగన్‌కి అండగా ఉండటానికి వేలాది మంది తరలిరావడం కనిపించింది. వైఎస్ జగన్‌ పయనించే ప్రతిదారి జన గోదావరి అయింది. తన కోసం వచ్చిన ప్రతి ఒక్కర్ని వైఎస్‌ జగన్ ఆప్యాయంగా పలకరించారు. కష్టాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చిన రాజన్న బిడ్డను ఆశీర్వదించి వెళ్లారు. తల్లులు తమ బిడ్డలను తీసుకొచ్చి జగన్‌ చేతిలో పెట్టి ఆశీర్వదించమని అడగటం కనిపించింది.  వైఎస్‌ జగన్‌ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో  పశ్చిమ గోదావరి జిల్లా మారుమోగుతుంది.

ప్రజాసేవ చేయడానికే వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారని  స్వాతంత్ర్య సమరయోధుడు సత్యనారాయణ బాబు చెప్పారు. వైఎస్‌ జగన్‌కు కోట్ల మంది ఆశీర్వాదం ఉందన్నారు. వైఎస్ఆర్‌ ఆశయాలను నెరవేర్చే శక్తి జగన్‌కే ఉందన్నారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన వృద్దులు.

బొత్సకు పెన్మత్స షాక్

బొత్సకు పెన్మత్స షాక్
హైదరాబాద్ : ఒకప్పటి తన రాజకీయ గురువు అయిన పెన్మత్స సాంబశివరాజును చిన్నచూపు చూసిన ఫలితం పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ.. ఉరఫ్ సత్తిబాబుకు ఇప్పుడు తెలిసొస్తోంది. నెల్లిమర్ల అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి కూడా నిరాకరించి, సాంబశివరాజును ఒకప్పుడు తీవ్రంగా అవమానించిన బొత్సకు ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నిన్న కాక మొన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేసి వైఎస్ఆర్ సీపీలో చేరితే, తాజాగా బొత్స మరో ప్రధాన అనుచరుడు, సన్నిహితుడు, జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ కూడా అదే బాటలో నడిచారు. వీరిద్దరి చేరిక వెనుక సాంబశివరాజే ఉన్నారని ఆ ప్రాంత వాసులు అంటున్నారు. విజయనగరం జిల్లా రాజకీయాల్లో కురువృద్ధుడి లాంటి సాంబశివరాజు ప్రస్తుతం విజయనగరం జిల్లా వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్లు ఇప్పించి, ఒక రకంగా విజయనగరం జిల్లా మొత్తమ్మీద తన కుటుంబ ఆధిపత్యాన్ని చాటాలన్న తపన బొత్స సత్యనారాయణకు చాలా రోజుల నుంచే ఉంది. జడ్పీ చైర్ పర్సన్ గా పనిచేస్తున్న ఆయన భార్య ఝాన్సీ లక్ష్మిని ఎంపీ పదవికి పోటీ చేయించాలని కాంగ్రెస్ పెద్దలు ఆదేశిస్తే, మళ్లీ జడ్పీ పదవిని తన కుటుంబానికే ఇవ్వాలన్న షరతుతో అప్పట్లో బొత్స అంగీకరించారు. అలాగే, చీపురుపల్లి స్థానాన్ని తనకు తానుగా ఇచ్చిన మీసాల నీలకంఠం నాయుడితో ఎచ్చెర్ల కూడా ఖాళీ చేయించారు. ఒకరకంగా ఆయనను అవమానించి, ఈసారికి పోటీ నుంచి తప్పిద్దామనుకున్న బొత్సకు.. నీలకంఠం నాయుడు గట్టి షాకే ఇచ్చారు.

పోటీ మాత్రమే విరమించుకుంటారనుకున్న నాయుడు ఏకంగా పార్టీనే వీడిపోవడంతో బొత్స తీవ్ర ఆందోళన చెందారు. కోల్పోతున్న పట్టును నిలబెట్టుకోడానికి తీవ్ర ప్రయత్నాలే చేశారు. నాయకులు పార్టీని వదిలి వెళ్లిపోతున్న విషయాన్ని తెలుసుకుని తెర వెనుక చాలా మంత్రాంగం నడిపారు. అటు మీసాల నీలకంఠంనాయుడిని, ఇటు బెల్లాన చంద్రశేఖర్, ఆయన అనుచరుల్ని నియంత్రించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. పిలిచి మాట్లాడారు. బంధుత్వం కలిపి ఒత్తిడి చేశారు. ఫోన్లు చేసి ప్రాధేయపడ్డారు. రకరకాలుగా ప్రలోభ పెట్టారు. అయినా ఫలితం లేకపోయింది. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను హుటాహుటిన చీపురుపల్లికి చేరుకుని, ప్రత్యేకంగా ఓ ఇల్లు తీసుకున్నారు. ఇక్కడే మకాం పెడతానని, అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, బొత్స సత్యనారాయణ ఇక్కడే పోటీ చేస్తారని నేతలతో ప్రెస్‌ మీట్ పెట్టి చెప్పించారు. వదిలి వెళ్లిన నేతలంతా తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. దానికీ ఏమాత్రం స్పందన కనిపించలేదు.

రేపటి జనభేరి

రేపటి నుంచి  జనభేరి
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించి, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి తెలిపారు. శుక్రవారం రాత్రి అమలాపురం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ‘జనభేరి’ పేరిట సాగే జగన్ జిల్లా పర్యటనకు గురించి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జగన్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కొవ్వూరు నుంచి రాజమండ్రిలో అడుగు పెడతారు. రాజమండ్రి కార్పొరేషన్  
 
పరిధిలో రోడ్ షో నిర్వహించి, రాత్రికి అమలాపురంలో బస చేస్తారు. 17న ఉదయం 9 గంటలకు అమలాపురంలో పలు వార్డుల్లో  రోడ్ షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ముమ్మిడివరం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు రామచంద్రపురంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
అనంతరం మండపేట నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. అదే రోజు రాత్రికి సామర్లకోట చేరుకుని అక్కడే బస చేస్తారు. 18న ఉదయం పిఠాపురంలో రోడ్ షో నిర్వహించి సాయంత్రం ఏలేశ్వరం నగర పంచాయతీలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆరు గంటలకు తుని చేరుకుని ప్రచారం నిర్వహిస్తారు. జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, పట్టణ, మండల కన్వీనర్లు, కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి, జగన్ పర్యటనను విజయవంతం చేయాలని చిట్టబ్బాయి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్ సీపీ అభ్యర్థులు రోడ్ షోలకు హాజరు కావాలన్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా ఎన్నికల నిబంధనలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. అమలాపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే జగన్ అమలాపురం మున్సిపాలిటీలో పర్యటించనుండడం అభ్యర్థుల్లో నూతనోత్సాహాన్ని నింపిందన్నారు. జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, లీగల్ సెల్ కన్వీనర్ మట్టపర్తి మురళీకృష్ణ, అమలాపురం మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు జక్కంపూడి తాతాజీలు మాట్లాడుతూ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.  స్టీరింగ్ కమిటీ సభ్యులు కుడుపూడి త్రినాథ్, పితాని చిన్న, నల్లా రమేష్, పంపన పద్మలత, వాసంశెట్టి తాతాజీ తదితరులు పాల్గొన్నారు.

హామీలివ్వడం, వాటిని విస్మరించడం ఆయన నైజం

ఏ హామీ నెరవేర్చారో చెప్పండి..: కొణతాల
చంద్రబాబును నిలదీసిన కొణతాల..
హామీలివ్వడం, వాటిని విస్మరించడం ఆయన నైజం
ప్రజలపై భారం మోపడం తప్ప చేసిందేమీ లేదు
స్థానిక సంస్థలను భ్రష్టుపట్టించింది బాబే

 
సాక్షి, హైదరాబాద్:  ప్రతి ఎన్నికల సందర్భంగా ఇష్టమొచ్చినట్టుగా అనేక వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత వాటిని విస్మరించడం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నైజమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నవరత్నాలు పేరిట పార్టీ ప్రణాళిక విడుదల చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రతి ఎన్నికలకు వాటి సంఖ్య మారుతోందే తప్ప బాబు అమలు చేసింది ఏ ఒక్కటీ లేదని ఆయన తెలిపారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబు ఎన్ని ఉచిత హామీలిచ్చినా ఫలితముండదని, అది 2009లో నిరూపితమైందని చెప్పారు. కొణతాల పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
 
-  తన తొమ్మిదేళ్ల పాలనలో ఫలానా వాగ్దానాన్ని నిలబెట్టుకున్నానని బాబు ధైర్యంగా చెప్పగలిగే అంశం ఒక్కటైనా ఉందా?
-  ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కిలో బియ్యం రూ.2 పథకానికి చంద్రబాబు తూట్లు పొడిచారు. ఖజానాపై నాలుగువేల కోట్ల భారం పడుతోందని తొలిసారి రూ.3.50కు ఆ తర్వాత రూ.5.25కు పెంచారు.
-  ఇది చాలదన్నట్టు పన్నుల పేరిట ప్రజలపై అదనంగా నాలుగువేల కోట్ల భారం మోపారు.
-  మద్యపాన నిషేధం విషయంలోనూ అలాగే వ్యవహరించారు. బెల్టు షాపులు పెట్టి ప్రతి కిళ్లీ కొట్టులో మద్యం లభించేలా చేశారు.
-  వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌ను ఎన్టీఆర్ హార్స్‌పవర్ రూ. 50కే అందజేస్తే దాన్ని రూ.650కి పెంచిన ఘనత బాబుది.
-  1999 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదు.
-  ఆడబిడ్డ పుట్టగానే రూ.5 వేలు డిపాజిట్ చేయడంతో పాటు ఉచితంగా విద్యను అందిస్తామన్నారు. మహిళలకు ఉచిత మంగళసూత్రాలు ఇస్తామన్నారు. చేనేతన్నలకు ఆధునిక మరమగ్గాలు, నాయూ బ్రాహ్మణులకు బ్యూటీ పార్లర్లు, రజకులకు దోబీఘాట్లు, కోటి మందికి ఉద్యోగాలంటూ వాగ్దానాల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చాక ఏకంగా 21 వేల మంది ఉద్యోగులను తొలగించారు.
-  జన్మభూమి కార్యక్రమం అంటూ రోడ్డు వేసుకోవాలంటే ప్రజలే వేసుకోవాలని, చెరువులు.. కాలువలు రైతులే తవ్వుకోవాలని, చివరకు గ్రామాల్లో దొంగలు పడుతుంటే ప్రజలే కాపలా ఉండాలంటూ చెప్పిన మహానీయుడు చంద్రబాబు.
-  ప్రత్యేక అధికారుల పరిపాలన తీసుకొచ్చి ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనతా బాబుదే. ప్రజా ప్రతినిధులకు చెక్‌పవర్ లేకుండా చేసి వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. అలాంటి వ్యక్తికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదు.

ప్రజాభిమానానిదే గెలుపు

ప్రజాభిమానానిదే గెలుపు
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: ప్రజాభిమానాన్ని ఎవరూ అడ్డుకోలేరని.. ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో దూరదృష్టితో అమలు చేసిన పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.

ఆ పథకాలు తిరిగి ప్రజలకు చేరువ కావాలంటే ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. తమ నాయకుడు అధికారంలోకి రాగానే అమ్మఒడి, రైతులకు రూ.3వేల కోట్లతో ప్రత్యేక నిధి, డ్వాక్రా మహిళల రుణాల రద్దు, పింఛన్ పెంపును అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు వైఎస్ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందన్నారు. రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలను నిలువునా చీల్చిన కాంగ్రెస్, టీడీపీలకు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఖాళీ అయిందని.. ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్‌తో రహస్య ఒప్పందాన్ని కొనసాగిస్తున్న టీడీపీ ఎన్నికల తర్వాత గల్లంతు కాక తప్పదన్నారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతో సీమాంధ్రకు తీరని నష్టం జరిగిందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీలో చోటు లేకపోవడంతోనే కాంగ్రెస్ నాయకులు టీడీపీలో చేరుతున్నారన్నారు. అంతమాత్రాన విభజన వాదులకు ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీలో సీమాంధ్ర నేతలు రాజకీయ ఆశ్రయం పొందడం సిగ్గుచేటన్నారు.

3 నియోజకవర్గాలకు సమన్వయకర్తలు

3 నియోజకవర్గాలకు సమన్వయకర్తలు
 శ్రీకాకుళం అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు. ఇచ్ఛాపురం అసెం బ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ ఏకైక సమన్వయకర్తగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నియమితులయ్యారు. అదే విధంగా శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా రెడ్డి శాంతిని నియమించారు.
ఇక ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా నర్తు నరేంద్రయాదవ్ నియ మితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీరిద్దరిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ధర్మాన ప్రసాదరావు జిల్లాలో 30 ఏళ్లుగా కీలక రాజకీయ నేతగా ఉన్నారు. 1989, 1999 ఎన్నికల్లో నరసన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా చేశారు. 2009 ఎన్నికల్లో కూడా ఆయన శ్రీకాకుళం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి వై.ఎస్. ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా కొనసాగారు. అనంతరం రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లో కూడా మంత్రిగా చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇక శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన రెడ్డి శాంతి కూడా జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందినవారే. ఆమె సీనియర్ నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం కుమార్తె. రెడ్డి శాంతి భర్త నాగభూషణరావు ఐఎఫ్‌ఎస్ అధికారిగా ఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన ఈమె ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా  నియమించింది. ఇచ్ఛాపురం ఏకైక సమన్వయకర్తగా నియమితులైన నర్తు నరేంద్ర ఇటీవలి వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పని చేశారు. మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావుతోపాటు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ధర్మా న ప్రసాదరావు, రెడ్డి శాంతి, నర్తు నరేంద్రల నియామకాలు వెంటనే అమలులోకి వస్తాయని పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారో ??

ఆ ఘనత వైఎస్సార్‌దే..
ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇస్తున్న తెలుగుదేశం పార్టీ గుంటూరు లోక్‌సభ అభ్యర్థి గల్లా జయదేవ్ ముందు తన తల్లి అరుణ చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారో చెప్పాలని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు వల్లభనేని బాలశౌరి డిమాండ్ చేశారు. 
25 ఏళ్ల పాటు వారి కుటుంబ సభ్యులు పదవులు అనుభవించి, ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించారో... అవి ఏమిటో గుంటూరు ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో బాలశౌరి విలేకరులతో మాట్లాడారు. ఇంట్లో కూర్చునే ఉద్యోగాలు ఇప్పిస్తానని గల్లా హామీలు ఇస్తున్నారని, అంటే ఎవరి అన్నం వారు వండుకోవడం, ఎవరి బట్టలు వారు ఉతు క్కోవడం వంటి ఉద్యోగాలేనా అని ఎద్దేవా చేశారు. ఎన్నికల అనంతరం ఇవే నేను మీకు ఇచ్చే ఉద్యోగాలని చెప్పి జయదేవ్ చంద్రగిరి వెళ్లిపోతారని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు  దివాళాకోరు రాజకీయాలను మానుకోవాలని బాలశౌరి హితవు పలికారు. ఆ పార్టీ నేతలు అత్యంత దౌర్భాగ్య పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 52 ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరిగితే  ఒక్క చోట కూడా గెలవలేక పోయారని చెప్పారు. చంద్రబాబు రాసిన రెండు లేఖల కారణంగానే పెద్దమ్మ సోనియాగాంధీ, చిన్నమ్మ సుష్మాస్వరాజ్‌లు రాష్ట్ర విభజనకు నాంది పలికారని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు పర్యటనకు వచ్చినా తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
 ఆ ఘనత వైఎస్సార్‌దే..
 రాష్ట్ర రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడిన ఘనత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. ఆ మహా నేతను రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌లో చూసుకుంటున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గుంటూరులో ఐటీ హాబ్ ఏర్పాటుకు పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని తెలిపారు. దీనిపై  ఇప్పటికే జననేత జగన్‌తో పలుమార్లు చర్చించానని చెప్పారు.
 
కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారు అనే అంశం ప్రభుత్వం నియమించే క మిటీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. సామాజిక వర్గాలను అడ్డుపెట్టుకుని ఎన్ని పార్టీలు ఏర్పడినా సాధించగలింది ఏమీ లేదన్నారు.
 సీట్లతో సంబంధం లేదు...
 అసెంబ్లీ సీట్ల కేటాయింపులో తనకు ఎటువంటి సంబంధం లేదని బాలశౌరి స్పష్టం చేశారు. సీట్లు విషయంలో తాను ఎటువంటి జోక్యం చేసుకోవటం లేదన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సర్వేల ఆధారంగా జిల్లాలో సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, రాతంశెట్టి సీతారామాంజనేయులు, థామస్ నాయుడులు తదితరులు పాల్గొన్నారు.

వైసీపీలోకి వలసల వెల్లువ

వైసీపీలోకి వలసల వెల్లువ
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ ఖాళీ కాగా.. తాజాగా టీడీపీ నుంచి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైసీపీలో చేరుతున్నారు. ముఖ్యంగా భీమవరం పట్టణంలో టీడీపీ ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే పలు వార్డులకు చెందిన టీడీపీ నాయకులు వైసీపీలో చేరగా తాజాగా ఒకటో వార్డు, 18వ వార్డులకు చెందిన టీడీపీ నాయకులు శుక్రవారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్, ప్రముఖ న్యాయవాది కామన నాగేశ్వరరావు, ముత్యాల వెంకట రామారావుల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు నియోజకవర్గ సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో చేరారు.
 
  కామన రాంబాబు, మేకా త్రినాథ్, వీరవల్లి సుబ్బారాయుడు, సామన భాస్కరరావు, పోలిశెట్టి ఏడుకొండలు, మేకా మధు, మట్టా సుబ్బారావు, మేకా నరసింహారావు, ముద్దే మధు, యాతం ఏసు, మణికంఠ సతీష్, నంది నాగరాజు, కఠారి చిన్ని, యాతం సురేష్, లక్ష్మణరావు, వేమవరపు శ్రీనివాసరావు, నక్కా శివశంకర్ తదితరులు వైసీపీలో చేరిన వారిలో ఉన్నారు. వారందరికీ గ్రంధి శ్రీనివాస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీపై ప్రజలు ఎనలేని ఆదరణ చూపిస్తున్నారన్నారు. రెండు కళ్ల సిద్ధాంతం పేరుతో చంద్రబాబునాయుడు రాష్ట్ర విభజనకు కారకులయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్, మద్దాల రమణ, వర్ధినీడి సత్యనారాయణ, షేక్ అన్సారీ, ఇంటి సత్యనారాయణ పాల్గొన్నారు.

కడలి తరంగం

కడలి తరంగం
`  వీధులన్నీ నిండిపోగా.. రోడ్లపై రాకపోకలు స్తంభించిపోయూరుు. వైఎస్సార్ జనభేరి పేరిట ఎన్నికల సమర శంఖారావం పూరించేందుకు శుక్రవారం నరసాపురం వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఆయనపై తమకు గల అభిమానాన్ని చాటుకున్నారు. స్టీమర్ రోడ్డులో నిర్వహించిన బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. నిజాయితి, విశ్వసనీయత అనే పదాలకు అర్థం తెలిసిన వాడే నాయకుడు. కార్యకర్తలు కాలర్ ఎగరేసి అతనే మా నాయకుడని గర్వంగా చెప్పుకునేలా మసలుకునే వాడే నాయకుడు. ఒక మాట చెబితే దానిని నిలుపుకోవడంలో మడమ తిప్పని వాడే నాయకుడనిపించుకుంటాడ’ని నాయకుడనే పదానికి వైఎస్ జగన్ నిర్వచనం చెప్పారు.
 
 ఆయన ప్రసంగించినంతసేపూ ప్రతి మాటకు జనం జయజయధ్వానాలు పలికారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇస్తున్న ఆల్ ఫ్రీ హామీల మర్మాన్ని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డివిడమరిచి చెబుతున్నప్పుడు జనం ఆసక్తిగా విన్నారు. బాబు బుర్రలో ఇన్ని కుట్రలున్నాయా అని ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తన సోదరుడు కొత్తపల్లి జానకిరామ్, వందలాది మంది అనుచరులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
 
 ఆప్యాయంగా పలకరిస్తూ...
 శుక్రవారం మధ్యాహ్నం గన్నవరం విమాశ్ర యం నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు బయలుదేరారు. హనుమాన్ జంక్షన్ వద్ద కని పించిన వృద్ధులను ఆప్యాయంగా పలకరిం చారు. అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లిగూడెం సమీపంలో వైఎస్సార్ సీపీ నేత చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఫామ్ హౌస్‌లో కొద్దిసేపు ఆగారు. అక్కడి నుంచి తణుకు, పెరవలి, పెనుగొండ మీదుగా నరసాపురం పయనమయ్యారు. అడుగడుగునా ఆయనకు అభిమాన ప్రవాహం అడ్డుపడింది. ప్రతి ఒక్కరినీ ఆగిమరీ ఆయన పలకరించారు. మార్టేరు, పాలకొల్లు సెంటర్లలో పెద్దఎత్తున ప్రజలు జననేతకు జేజేలు పలికారు. నరసాపురంలో అడుగుపెట్టే సందర్భంలో జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగ తం లభించింది. యువకులు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. పూలతో అలంకరించిన ఏడు పంచకల్యాణి ఆశ్వాలతో కూడిన రథంపై జగన్‌మోహన్‌రెడ్డిని ఎక్కించి సభావేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు జనభేరి బహిరంగ సభ మొదలైంది.
 
  వైఎస్ జగన్ ప్రసంగిస్తున్నంతసేపూ జనం పూల వర్షం కురిపించారు. చంద్రబాబులా సాధ్యం కాని హామీలు ఇచ్చి మాట తప్ప డం తనకు రాదని, చెప్పినవన్నీచేసి తీరుతానని, చెప్పనివి కూడా చేస్తానని జనానికి జగన్ కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన ప్రసంగం ఆద్యంతం ఆవేశాన్ని రగిలించేలా.. జనాన్ని ఆలోచింపజేసేలా సాగింది. సభానంతరం వేదిక దిగుతున్నప్పుడు కూడా సమీప భవంతులపై నుంచి అభిమానులు పూలు చల్లి వీడ్కోలు పలికారు. అంతకుముందు సభలో వైఎస్ జగన్‌ను కొత్తపల్లి సుబ్బారాయుడు, ఇతర నాయకులు గజమాలతో సత్కరించారు. పూల కిరీ టాన్ని జననేతకు అలంకరించేందుకు ప్రయత్నించగా జగన్ దానిని కొత్తపల్లి శిరస్సున ఉంచారు. అవినీతిపై రామబాణాన్ని ఎక్కుపెట్టినట్టు పూల ధనుస్సుతో బాణాన్ని జగన్ ఎక్కుపెట్టారు.
 
 
 సభ ముగించుకుని రాత్రి బసకు పాలకొల్లులోని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు నివాసానికి వెళ్లారు. జగన్‌మోహన్‌రెడ్డి వెంట పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్, ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు,  తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త అశోక్‌గౌడ్, పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్  ఇందుకూరి రామకృష్ణంరాజు, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, నిడదవోలు వైసీపీ నేత జీఎస్‌రావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజోలు మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజు, రాజోలు నియోజకవర్గ సమన్వయకర్త బొంతు రాజేశ్వరావు మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ, గుణ్ణం నాగబాబు, ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త కండిబోయిన శ్రీనివాస్, నరసాపురం పట్టణ, మండల అధ్యక్షులు నల్లిమిల్లి జోషప్, దొంగ గోపాలకృష్ణ, పార్టీ నాయకులు సాయినాథ్ ప్రసాద్, తదితరులు ఉన్నారు

జగన్‌ను ఎదిరించడమంటే సునామీకి ఎదురు వెళ్లడమే

జగన్‌ను ఎదిరించడమంటే సునామీకి ఎదురు వెళ్లడమే
నరసాపురం అర్బన్, న్యూస్‌లైన్ : విశేష ప్రజాభిమానంతో ముందుకు సాగుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం విషయంలో నిర్ధిష్ట లక్ష్యంతో ముందుకు సాగిపోతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదిరించడమంటే భయంకర సునామీలో సముద్రానికి ఎదురు వెళ్లడమేనన్న వాస్తవాన్ని అన్ని రాజ కీయ పక్షాలు గుర్తుంచుకోవాలని నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. శుక్రవారం నరసాపురం స్టీమర్ రోడ్‌లో నిర్వహించిన వైఎస్సార్ జనభేరి సభా వేదికపై వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్తపల్లి ఉద్వేగంగా ప్రసంగించారు. వైఎస్ జగన్ రాష్ట్రానికి బంగారు భవిష్యత్ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉం డాలన్న ఏకైక లక్ష్యంతో ఏ పార్టీ చేయని విధంగా ధైర్యం చేసి నిలబడ్డారని అన్నారు. ఆయనను విమర్శించే ముందు ప్రతిపక్షాలు తాము అవలంభిస్తున్న విధానాలను, తప్పుడు పద్ధతులను గుర్తు తెచ్చుకోవాలన్నారు.
 
 జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనానికి, ప్రజల నుంచి ఆయనకు లభిస్తున్న మద్దతు చూసి ఇతర రాజకీయ పార్టీలు ఓర్వలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం కొన్నినెలల క్రితం దుర్మార్గమైన ఆలోచన ఒకటి చేసిందని వివరించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరపకుండా, కేవలం పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే పెట్టాలని ఆలోచన చేసిందన్నారు.
 
 ప్రభుత్వంలో భాగంగా ఉన్న  తాను దానిని వ్యతిరేకించానని చెప్పారు. అతి చిన్న వయసులో పేదల కష్టాలను అవగతం చేసుకుని, ఒక మహోన్నత లక్ష్యంతో ముందుకు వెళుతున్న నాయకుడు దేశంలో వైఎస్ జగన్ తప్ప మరెవరూ లేరని అన్నారు. అందువల్లే తాను నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని పేర్కొన్నారు. ఈ పార్టీలోకి రావడం ఆనందంగానూ, గర్వంగానూ ఉందని పేర్కొన్నారు. ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయని, మే 7వ తేదీ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కంటిమీద కునుకు లేకుండా పనిచేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ గూడూరి ఉమాబాల తదితరులు మాట్లాడారు.
 

చెప్పిన ప్రతి పనీ, చెప్పని పనీ చేసి చూపిస్తా

* రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో తెలుసా?
చంద్రబాబు హామీలపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
పదవి కోసం ఏ గడ్డయినా తినే వ్యక్తి చంద్రబాబు
ఇంటికో ఉద్యోగమిస్తానని అబద్ధాలు చెబుతున్నారు
అంటే మూడున్నర కోట్ల ఉద్యోగాలిస్తారట..
అధికారంలో ఉండగా ఉద్యోగాలు పీకేశారు..
ఆయనకు విశ్వసనీయత లేదు
నేను చంద్రబాబులా దొంగ హామీలివ్వను..
వారసత్వంగా నాకు వచ్చింది విశ్వసనీయత..
చెప్పిన ప్రతి పనీ, చెప్పని పనీ చేసి చూపిస్తా
రాష్ట్రాభివృద్ధికి డబ్బులిచ్చే వారినే ప్రధానిని చేద్దాం
30 ఎంపీ స్థానాలు గెలుచుకుని మనమే సింగపూర్ కట్టుకుందాం
 సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘అధికారం పోయింది కదా.. చంద్రబాబులో ఏమైనా మార్పు వచ్చిందా అని చూస్తే.. ఇవాళ్టికీమార్పు అనేది లేకుండా పోయింది. ప్రజలను ఎలా మోసం చేయాలా అని ఆయన పన్నాగాలు పన్నుతున్నారు. ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు. అయ్యా చంద్రబాబూ.. రాష్ట్రంలో అసలు ఎన్ని ఇళ్లు ఉన్నాయో తెలుసా? అక్షరాలా మూడున్నర కోట్ల ఇళ్లున్నాయి. అంటే ఆయన మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటూ ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ‘‘ఇదే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేశారు. ఇదే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 23,500 మంది ప్రభుత్వోద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించారు. అంగన్‌వాడీ టీచర్లు జీతాలు పెంచాలని అడిగితే గుర్రాలతో తొక్కించారు.
 
 ఇప్పుడేమో ప్రజలను మోసం చేయడానికి ఇలా సాధ్యంకాని హామీలిస్తున్నారు. ఆ మనిషిని ఏమనుకోవాలి? ఇప్పటికీ కూడా అన్నీ ఫ్రీగా ఇస్తానని హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు కళ్లార్పకుండా ఒకే అబద్ధాన్ని వందసార్లైనా చెప్పగల సమర్థుడు. ఆయన వయసు 60 సంవత్సరాలు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. అందుకే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చెప్పి.. చివరకు ప్రజలకు వెన్నుపోటు పొడవడానికి కూడా ఆయన ఏమాత్రం వెనుకాడడం లేదు’’ అని ధ్వజమెత్తారు. శుక్రవారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం స్టీమర్‌రోడ్డులో నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ బహిరంగ సభలో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
 
 ఊరిలో ఒకరు చనిపోతేనే మరొకరికి పెన్షన్..
 వైఎస్ సువర్ణయుగానికి ముందు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఉండేవాడు. అవ్వాతాతలకు ముష్టి వేసినట్లు రూ.75 పెన్షన్ ఇచ్చేవారు. ఒక ఊళ్లో పెన్షన్ తీసుకుంటున్న వారిలో ఎవరో ఒకరు చనిపోతే కానీ కొత్తవారికి పెన్షన్ ఇవ్వలేమని అధికారులు చెప్పేవారు. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదివే పిల్లల ఫీజులు కట్టాలంటే.. తల్లిదండ్రులు ఉన్న పొలం, ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేది. గ్రామాల్లో హఠాత్తుగా ఏ పెద్దాయనకన్నా గుండెనొప్పి వచ్చి ఆస్పత్రికి తీసుకెళితే ఆపరేషన్ చేయడానికి రెండు లక్షలవుతుందని ఆ డాక్టర్ నిర్దాక్షిణ్యంగా చెప్పేవాడు. ఆ డబ్బు కోసం ఆ కుటుంబసభ్యులు ఐదు రూపాయల వడ్డీకైనా అప్పు తెచ్చి కట్టేవారు. ఆ డబ్బుతో ఆ పెద్దాయన ప్రాణాలు దక్కేవేమోకానీ ఆ అప్పు తీర్చడానికి ఆ కుటుంబ సభ్యులు జీవితాంతం ఊడిగం చేసిన రోజులు నాకు గుర్తున్నాయి. డ్వాక్రా మహిళలను ఎన్నికల సమయంలో చంద్రబాబు ఓట్ల కోసం వాడుకునేవారు. చంద్రబాబుకు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియదు.
 
 రుణ మాఫీ అంటూ చంద్రబాబు మళ్లీ అబద్ధాలు..
 అధికారం పోయిన తర్వాత కూడా చంద్రబాబులో మార్పు రాలేదు. ఆయన అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే రైతన్నల రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెబుతున్నారు. చంద్రబాబు రైతు రుణాలు మాఫీ చేస్తానంటున్నారు కదా మీరు కూడా అలా చెప్పండి సార్ అని చాలామంది నన్ను అడిగారు. రాష్ట్రంలో రైతన్నల రుణాలు లక్షా 27 వేల కోట్లున్నాయి. డ్వాక్రా రుణాలు రూ.20 వేల కోట్లున్నాయి. ఆయన ఉచిత హామీలు చాలా ఇస్తున్నారు. 2008లో దేశం మొత్తం మీద 28 రాష్ట్రాల్లో రూ.65 వేల కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేసింది. అందులో మన రాష్ట్రంలో అప్పులు కట్టలేక దివాలా తీసిన రైతులకు సంబంధించి రూ.12 వేల కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేశారు. కేంద్ర ప్రభుత్వమే రూ.65 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తే.. చంద్రబాబు రూ. లక్షా 27 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తానని చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యమనిపిస్తోంది. రాష్ట్ర బడ్జెట్ లక్షా 25 వేల కోట్లు. చంద్రబాబు మాఫీ కార్యక్రమాలు అమలు చేయాలంటే రూ.లక్షా 60 వేల కోట్ల దాకా కావాలి. పదవి కోసం ఏ గడ్డయినా తినేవాడెవరైనా ఉన్నారంటే అది బాబే.
 
 నేను దొంగ హామీలివ్వలేను.. చంద్రబాబు మాదిరిగా దొంగ హామీలైతే నేను ఇవ్వను. నేనిచ్చే ప్రతి హామీని చేసి చూపిస్తా. ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి నుంచి నాకు వారసత్వంగా వచ్చింది విశ్వసనీయత. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నాలుగు సంతకాలు పెడతా. ఆ నాలుగు సంతకాలు రాష్ట్ర చరిత్రను మార్చేస్తాయి. మొదటి సంతకం అక్కచెల్లెమ్మల కోసం పెడతా. మీ పిల్లల్ని బడికి పంపించండి. ప్రతి చిన్నారికి రూ.500 చొప్పున కుటుంబానికి ఇద్దరు పిల్లలకు రూ.వెయ్యి  మీ బ్యాంక్ అకౌంట్‌లో వేసే పథకం తెస్తా. అంతేకాదు ఆ అక్కచెల్లెళ్ల పిల్లల కోసం ప్రతి స్కూల్‌లోనూ ఇంగ్లిష్ మీడియం పెడతా. రెండోసంతకం అవ్వాతాతల కోసం చేస్తా. వారి పెన్షన్‌ను రూ.200 నుంచి రూ.700 పెంచేందుకు చేస్తా. మూడో సంతకం రైతన్నల కోసం పెడతా. ధాన్యానికి గిట్టుబాటు ధర, మద్దతు ధర కల్పించేందుకు రూ.మూడు వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం సంతకం పెడతా. నాలుగో సంతకం డ్వాక్రా అక్కచెల్లెమ్మల కోసం వారి రుణాలను మాఫీ చేసేందుకు పెడతా.’’
 
‘‘సీఎంగా నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేసే నాలుగు సంతకాలతోపాటు ఇంకోటి కూడా చేయాల్సి ఉందని చెబుతున్నా. చదువుకున్న ప్రతి పిల్లాడు ఉద్యోగం కోసం హైదరాబాద్ వైపు చూస్తాడు. ఇవాళ మన ఖర్మ ఏంటంటే హైదరాబాద్ మనదికాకుండా పోయింది. చంద్రబాబు హైదరాబాద్‌ను, రాష్ట్ర ప్రజలను అమ్మేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. చదువుకున్న ప్రతి పిల్లాడికీ నేను తోడున్నా. వారి కోసం ఐదో పని చేయాల్సి ఉంది. కలసికట్టుగా ఉందాం. 25, 30 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. మన రాష్ట్ర అభివృద్ధికి డబ్బులిచ్చే వ్యక్తిని ప్రధాని కుర్చీలో కూర్చోబెడదాం. చంద్రబాబు సింగపూర్, సింగపూర్ అని చెబుతాడు. డబ్బుంటే చంద్రబాబు మనకు అవసరం లేదు. జుట్టుంటే దాన్ని ఎలాగైనా ముడేసుకోవచ్చు. 30 ఎంపీ స్థానాలు గెలిచిన తర్వాత మనమే సింగపూర్ కట్టుకుందాం. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు మాట్లాడే అలవాటు నాకు లేదు. చెప్పిన పనులు, చెప్పని పనులు కూడా గొప్పగా చేసి చూపిస్తా.’’    
 - వైఎస్ జగన్
 
 వైఎస్సార్ సీపీలో చేరిన కొత్తపల్లి
 నరసాపురంలో నిర్వహించిన వైఎస్సార్ జనభేరి సభలో నరసాపురం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతించారు. తనతోపాటు వేలాది మంది వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు సుబ్బారాయుడు చెప్పారు. జగన్‌ను ఆపే శక్తి ఎవరికీ లేదని, ఆయనకు ఎదురెళ్లటం సునామీకి ఎదురు వెళ్లినట్టేనని కొత్తపల్లి పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల పెన్నిధిగా జగన్‌ను జనం చూస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని ధైర్యంగా చెప్పిన ఏకైక పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డేనని అన్నారు. పేదవాడికి పది రూపాయలు పెట్టాలంటే మనసు ఉండాలని, గుండె ఉండాలని, అటువంటి వ్యక్తి జగన్ అని చెప్పారు.
 
 అంతకుముందు కొత్తపల్లి సుబ్బారాయుడు, వైసీపీ నేత ప్రసాదరాజు జగన్‌ను గుర్రపు బండిపై ఎక్కించి పట్టణంలోకి తీసుకెళ్లారు. జనంతో నరసాపురం కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా జనమే కనిపించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగిన జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా నరసాపురం చేరుకున్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు, పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే చెరకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్, నేతలు పాతపాటి సర్రాజు, గ్రంధి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

పురపాలక సంఘంలో వైఎస్సార్‌సీపీ బోణీ

వైఎస్సార్‌సీపీ  బోణీ కొట్టింది!
గూడూరు పురపాలక సంఘంలో వైఎస్సార్‌సీపీ బోణీ కొట్టింది. ఎన్నికల నామినేషన్ ఘట్టం శుక్రవారంతో పూర్తయింది. 33 వార్డుకు వైఎస్సార్‌సీపీ తరపున ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఆ పార్టీ బోణీ కొట్టినట్లుగా చెప్పవచ్చు. పట్టణంలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న 33వ వార్డును జనరల్ మహిళకు కేటాయించారు. ఆ వార్డులో తాళ్ల సుబ్బమ్మ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
ఆమెకు డమ్మీ అభ్యర్థిగా రామాబత్తిన వాసవి నామినేషన్ దాఖలు చేసింది. స్క్రూట్నీ, ఉపసంహరణ అనంతరం ఆ వార్డు నుంచి తాళ్ల సుబ్బమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించడం లాంఛనమే. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి ఆ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆ వార్డు నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.

నరసాపురంలో వైయస్ఆర్ జనభేరీ









Jagan speech at narasapuram

Written By news on Friday, March 14, 2014 | 3/14/2014

కొత్తపల్లికి నా గుండెల్లో చోటిస్తున్నాను:జగన్

కొత్తపల్లికి నా గుండెల్లో చోటిస్తున్నాను:జగన్
నరసాపురం(ప.గో): వైఎస్సార్ సీపీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడికి పార్టీలోనే కాదు.. తన గుండెల్లో చోటిస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచార సభలో భాగంగా నరసాపురం విచ్చేసిన జగన్ సమక్షంలో కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్ సీపీలో చేరారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కొత్తపల్లికి తనపార్టీలోనే కాదు..గుండెల్లో చోటిస్తున్నానని స్సష్టం చేశారు. ఇదంతా ఎన్నికల సీజన్‌ అయిన కారణంగా రకరకాల నాయకులొచ్చి..రకరకాల మాటల చెప్పి ప్రలోభ పెట్టే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు హయాంలో పింఛన్లు అందని అవ్వా, తాతలు,ఫీజులు కట్టలేక చదువులు ఆపేసిన విద్యార్థులు తనకు ఇంకా గుర్తుకువస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మాట కోసం మడమ తిప్పని వాడు, విశ్వసనీయతకు అర్థం తెలిసినవాడు, నిజాయతీ ఉన్నవాడే అసలైన నాయకుడని జగన్ తెలిపారు. ఆ విశ్వసనీయత, నిజాయితీ ఉంది కనుకే  దివంగత నేత వైఎస్‌ఆర్‌ జనం గుండెల్లో ఉండిపోయారన్నారు.
 
రూ.2 కిలో బియ్యాన్ని రూ.5 చేసిన ఘనత బాబుకే దక్కుతుందని తెలిపారు. ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్పగలిగే ఏకైకవ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారన్నారు.అందుకే అన్నిచోట్లా చంద్రబాబు అబద్ధాలు చెబుతూ మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు వయసు 65 ఏళ్లని, ఆయనకివే చివరి ఎన్నికలని జగన్ ఎద్దేవా చేశారు. లక్షా 60వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తారని బూటకపు మాటలు చెబుతున్న బాబు అసలు మనిషేనా?అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇస్తారని కల్లిబొల్లి మాటలు చెబుతూ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఇళ్లున్నాయని, మూడున్నర కోట్ల మందికి ఉద్యోగాలను చంద్రబాబు ఎలా ఇస్తారని జగన్ నిలదీశారు. ఆయనలాగా దొంగ హామీలను తాను ఇవ్వలేనన్నారు.కాగా ఉభయ గోదావరులను కలిపే బ్రిడ్జిను మాత్రం నిర్మిస్తానని జగన్ హామీ ఇచ్చారు.

మాటకోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్:కొత్తపల్లి

మాటకోసం నిలబడే వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు స్ఫష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసాపురం సభకు విచ్చేసిన జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్ సీపీలో చేరారు. అనంతరం మాట్లాడిన సుబ్బారాయుడు.. మాటకోసం నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే..అది ఒక్క జగన్ మోహన్ రెడ్డేనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యం ఉంచేందుకు పోరాడిన ఏకైక నేత, మాట కోసం ప్రాణాలను సైతం కూడా లెక్కచేయని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
 
ముందుగా అక్కడికి చేరుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. రంగు రంగుల పూలతో అందంగా అలంకరించిన సప్తాశ్వ రథం(ఏడు గుర్రాల బండి)పై బస్టాండ్ సెంటర్ నుంచి ఊరేగిస్తూ రాజన్న తనయుడికి స్వాగతం పలికారు. గుర్రపు బండిలో ఎక్కిన యువనేత ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.దారిపొడవునా జననేతపై అభిమానులు పూల వర్షం కురిపించారు. జై  జగన్ నినాదాలతో హోరెత్తించారు. యువనేత రాకతో పులకించిపోయిన నరసాపురం వాసులు బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారీగా తరలివచ్చిన జనంతో నరసాపురం కిక్కిరిసింది.

నరసాపురంలో గుర్రపుబండిలో ప్రయాణించిన జగన్

http://www.sakshi.com/video/news/ys-jagan-in-seven-horse-buggy-in-narsapuram-12226?pfrom=home-top-videos

సప్తాశ్వ రథంలో రాజన్న తనయుడు

ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. రంగు రంగుల పూలతో అందంగా అలంకరించిన సప్తాశ్వ రథం(ఏడు గుర్రాల బండి)పై బస్టాండ్ సెంటర్ నుంచి ఊరేగిస్తూ రాజన్న తనయుడికి స్వాగతం పలికారు. గుర్రపు బండిలో ఎక్కిన యువనేత ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.

దారిపొడవునా జననేతపై అభిమానులు పూల వర్షం కురిపించారు. జై  జగన్ నినాదాలతో హోరెత్తించారు. యువనేత రాకతో పులకించిపోయిన నరసాపురం వాసులు బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారీగా తరలివచ్చిన జనంతో నరసాపురం కిక్కిరిసింది. కాగా, ప్రసాదరాజు వైఎస్సార్ సీపీ వదిలివెళతారని జరుగుతున్న ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ ఆయన యువనేత చెంతనే ఉన్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రసాదరాజు... రథంలో జగన్ కు ఇరువైపుల నిల్చున్నారు. మూడు రోజులపాటు పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు

గన్నవరంలో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం

గన్నవరం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి గన్నవరంలో ఘన స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా జగన్‌ సమక్షంలో  పెనుమలూరుకు చెందిన పలు పార్టీల కార్యకర్తలు వైఎస్‌ఆర్ సీపీలో చేరారు.
జగన్‌  నేటి నుంచి మూడు రోజులపాటు పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం నరసాపురంలో జనభేరి నిర్వహిస్తారు. ఈ సభలోనే  నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్‌ఆర్‌ సిపిలో చేరనున్నారు.  రేపు పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెంలో, ఆదివారం  కొవ్వూరులో  జగన్ ప్రచారం నిర్వహించనున్నారు.

చంద్రన్న రాజ్యం తెస్తామని ఎందుకు చెప్పడం లేదు?

చంద్రన్న రాజ్యం తెస్తామని ఎందుకు చెప్పడం లేదు?
హైదరాబాద్: చంద్రబాబు ప్రజల విశ్వసనీయతను కోల్పోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ విమర్శించారు. చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మడం లేదని, అందుకే 1999 నుంచి ఇప్పటివరకు టీడీపీ గెలవలేకపోయిందని గుర్తు చేశారు. గతంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని అన్నారు. రాజన్న రాజ్యం తెస్తామని తాము చెబుతున్నామని, చంద్రన్న రాజ్యం తెస్తామని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు.

తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో పాత హామీలనే మళ్లీ గుప్పించారని విమర్శించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని చెప్పారు. తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని కొణతాల రామకృష్ణ తెలిపారు

బొత్సకు ఎదురుదెబ్బ, వైఎస్ఆర్ సీపీలోకి బెల్లాని

మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విజయనగరం మాజీ జెడ్పీ ఛైర్మన్‌ బెల్లాని చంద్రశేఖర్‌ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  సమక్షంలో బెల్లానితో పాటు 40 మంది సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, సోసైటి అధ్యక్షులు పార్టీలో చేరారు. 
జగన్‌ వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్‌, టీడీపీలు వంచించాయని చంద్రశేఖర్ విమర్శించారు.  వైఎస్ జగన్ పోరాట పటిమ, నాయకత్వ లక్షణాలను చూసి పార్టీలో చేరినట్టు బెల్లాని ప్రకటించారు. అలాగే డీసీసీ కార్యదర్శి దేవభక్తుని సుబ్బారావు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సర్వేల పేరుతో టీడీపీ మోసం

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతినిధులుగా ఓటు అడిగే హక్కు తమకే ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని బాలశౌరి అన్నారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన టీడీపీకి ఎన్నికల్లో ఓటు వేయమని అడిగే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. విభజనకు సహకరించిన చంద్రబాబు నాయుడు కుట్రను ఊరూరా ప్రచారం చేస్తామని బాలశౌరి తెలిపారు.
సర్వేల పేరుతో టీడీపీ ప్రజలను మోసం చేస్తోందని ఆయన అన్నారు. సర్వలతో తనకు సంబంధం లేదని లగడపాటి రాజగోపాల్ తనతో చెప్పారని బాలశౌరి పేర్కొన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటమే వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. కాగా ఇటీవల లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వేల్లో టీడీపీ ముందంజలో ఉన్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే

వైఎస్ జగన్‌కే నా ఓటు : పోసాని

వైఎస్ జగన్‌కే నా ఓటు : పోసాని
కాకినాడ : రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే బాగుందని సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తన ఓటు అని అన్నారు. మెరుగైన సేవ చేసేవారికే  ఓటు వేస్తామన్నారు.
ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో చేరిన తాను ప్రస్తుతం ఓటరుగానే ఉండిపోయానని పోసాని తెలిపారు. ప్రస్తుతం ఆ పార్టీలేదని... అయితే తాను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లనని ఓటర్ గానే ఉంటానని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ పెట్టబోయే జనసేన పార్టీలో తాను చేరటం లేదని పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు

నేడు పశ్చిమలో వైఎస్ జగన్ పర్యటన

నేడు పశ్చిమలో వైఎస్ జగన్ పర్యటన
ఏలూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం వచ్చి, అక్కడినుంచి రోడ్డు మార్గంలో ఆయన నరసాపురం చేరుకుంటారు. ఈలోపు గన్నవరం రోటరీ క్లబ్బులో వైఎస్ జగన్ సమక్షంలో కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన కొంతమంది నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

శుక్రవారం సాయంత్రం నరసాపురం స్టీమర్ రోడ్డులో వైఎస్ఆర్ జనభేరి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో నరసాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు మరికొందరు నాయకులు కూడా పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

వైఎస్సార్‌సీపీలోకి ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ

బొత్స సన్నిహిత ఎమ్మెల్యే కూడా.. జగన్ సమక్షంలో పార్టీలోకి సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నేతలు కూడా పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సన్నిహితుడైన కాంగ్రెస్ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు(ఎచ్చెర్ల) గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నీలకంఠంను వెంట బెట్టుకుని వచ్చి జగన్ సమక్షంలో పార్టీలో చేర్చారు. విశాఖపట్టణం స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు కూడా పార్టీలో చేరారు.
 
  తంగేడు రాజుల కుటుంబానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు రాజా సాగి సీతారామరాజు, రాజా సాగి రామభద్రరాజు(ఏటికొప్పాక చక్కెర ఫ్యాక్టరీ మాజీ చైర్మన్)లు కలసి సూర్యనారాయణరాజును తోడ్కొని జగన్ వద్దకు వచ్చారు. ఆయనతో పాటు ఆ ప్రాంతానికి చెందిన పలువురు నేతలకు కూడా జగన్ కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. మరోవైపు ఇప్పటికే పార్టీలో చేరిన విశాఖపట్టణం(పశ్చిమ) ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీలోకి చేరారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన అల్లూరు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి కూడా 100 మందికిపైగా కార్యకర్తలు, నేతలతో కలిసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరారు.
 
 వైఎస్సార్‌సీపీలోకి కర్నూలు నేతలు: మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలుకు చెందిన మహ్మద్ పాషా(రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సభ్యుడు) ఎస్.చాంద్‌పాషా(జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్), అక్బర్ సాహెబ్ (జిల్లా వక్ఫ్ కమిటీ సభ్యుడు), హెచ్.కె.మనోహర్ (జిల్లా బ్రాహ్మణ సంఘం కార్యదర్శి), మైనారిటీ నేత అమీరుద్దీన్ గురువారం జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చి ఆయన సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన ఇల్లెందు నేత: 
ఖమ్మం జిల్లా ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ రవిబాబు నాయక్.. జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన్ను పార్టీలో చేర్చారు.

3,10,000+ లైక్స్.. సోషల్ మీడియాలో వైఎస్‌ఆర్‌సీపీ టాప్


3,10,000+ లైక్స్..  సోషల్ మీడియాలో వైఎస్‌ఆర్‌సీపీ టాప్
సోషల్ మీడియాలో వైఎస్‌ఆర్‌సీపీ టాప్ 
సాక్షి, హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్‌బుక్ పేజీ రికార్డు స్థాయిలో 3 లక్షల లైక్స్‌ను దాటింది. పార్టీ ఫేస్‌బుక్ లైక్స్(ఇష్టపడే వారి సంఖ్య) విషయంలో దేశంలోనే ప్రాంతీయ పార్టీలన్నిటిలోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అగ్రగామిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, వైఎస్‌ఆర్‌సీపీ ఆన్‌లైన్ కమ్యూనిటీ పోర్టల్‌లకు సంబంధించిన బృందం సభ్యులు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను గురువారం ఉదయం ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సోషల్ మీడియాలో మంచి కృషిని సాగిస్తున్నారంటూ బృందం సభ్యులను విజయమ్మ అభినందించారు. పార్టీ అధికారిక ఫేస్‌బుక్ పేజీ ప్రారంభించిన 10 నెలల్లోనే 3 లక్షల లైక్స్ (ఇష్టపడే వారి సంఖ్య) దాటడం నెటిజన్లలో జగన్‌పైన ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాల గురించి మరింత విస్తృతంగా ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా విజయమ్మ వారికి సూచించారు.
 
  వైఎస్ మరణానంతరం సంక్షేమ పథకాలు సరిగా అమలు కాకపోవడాన్ని నెటిజన్లకు అర్థమయ్యేలా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలన్నారు. ప్రత్యర్థులను విమర్శించడం కంటే వైఎస్‌ఆర్ చేసిన మంచి పనులు, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేయాలనుకుంటున్న సంక్షేమ పథకాలపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని ఆమె సూచించారు. పార్టీ  3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజునే అంటే మార్చి 12వ తేదీనే పార్టీ అధికారిక ఫేస్‌బుక్ పేజీ (www.facebook.com/ ysrcpofficial) 3 లక్షల లైక్స్‌ను పూర్తి చేసుకుంది. గురువారం ఉదయానికి ఈ సంఖ్య 3,10,000 వద్ద ఉంది. నెటిజన్లు విశేషంగా ఆదరిస్తుండడంతో ఇది క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు

అత్యంత శక్తిమంతుల జాబితాలో జగన్

అత్యంత శక్తిమంతుల జాబితాలో జగన్
  •  దేశంలో 100 మంది అత్యంత శక్తిమంతుల
  •   జాబితా రూపొందించిన ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’
  •   మన రాష్ట్రం నుంచి జగన్, కేసీఆర్‌లకే చోటు
  •   21వ స్థానంలో జగన్.. 2013లో 36వ స్థానం
  •   66వ స్థానంలో నిలిచిన కేసీఆర్
  •   4 నుంచి 57వ స్థానానికి పడిపోయిన ప్రధాని
  •   తొలిస్థానంలో మోడీ, తర్వాత రాహుల్
 
 సాక్షి, న్యూఢిల్లీ: అత్యంత శక్తిమంతులైన భారతీయుల జాబితాలో మన రాష్ట్రం నుంచి ఇద్దరికి చోటు లభించింది. ప్రముఖ దినపత్రిక ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రూపొందించిన ఈ జాబితాలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి 21వ స్థానంలో నిలిచారు. 2013లో 36వ స్థానంలో నిలిచిన జగన్..
 
ఈ ఏడాది 21వ స్థానానికి ఎగబాకారు. తొలిస్థానంలో నరేంద్ర మోడీ, రెండోస్థానంలో రాహుల్ గాంధీ, మూడో స్థానంలో సోనియా గాంధీ, నాలుగో స్థానంలో కేజ్రీవాల్, ఐదో స్థానంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆరో స్థానంలో జయలలిత(తమిళనాడు సీఎం), ఏడో స్థానంలో మమతా బెనర్జీ(బెంగాల్ సీఎం), ఎనిమిదో స్థానంలో మాయావతి(బీఎస్పీ), తొమ్మిదో స్థానంలో చీఫ్ జస్టిస్ పి.సదాశివం, పదో స్థానంలో మోహన్ భగవత్(ఆర్‌ఎస్‌ఎస్), 11వ స్థానంలో రాజ్‌నాథ్ సింగ్(బీజేపీ), 12వ స్థానంలో శరద్ యాదవ్(జేడీయూ), 13వ స్థానంలో సుష్మా స్వరాజ్(బీజేపీ) నిలిచారు. ఆ తరువాతి స్థానాల్లో అరుణ్ జైట్లీ, ఎల్.కె.అద్వానీ, రఘురాం రాజన్, పి.చిదంబరం, అమిత్‌షా, ముఖేశ్ అంబానీ, నవీన్ పట్నాయక్, జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారు. ఈ జాబితాలో ప్రధాని మన్మో హన్‌సింగ్ 57వ స్థానంలో నిలిచారు. ఆయన గత ఏడాది ప్రకటించిన జాబితాలో 4వ స్థానంలో ఉన్నారు.
 
 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ స్వీప్..
 
 వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంధ్రలో జగన్ స్వీప్ చేయనున్నారని, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌ల కంటే మెరుగైన ఫలితాలు సాధించి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనున్నారని ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. ఇతర పార్టీల నుంచి వైఎస్సార్ సీపీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారని పేర్కొంది. ఇక రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈ జాబితాలో 66వ స్థానం దక్కించుకున్నారు. గతేడాది జాబితాలో ఆయన పేరు లేదు. ఆయన ఈసారి తెలంగాణలో కింగ్ లేదా కింగ్‌మేకర్ అవుతారని ఆ దినపత్రిక పేర్కొంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినాన్ని ఘనంగా నిర్వహించిన కువైట్ సభ్యులు

Written By news on Thursday, March 13, 2014 | 3/13/2014

కువైట్: మలియా ప్రాంతములో జాయింట్  కో ఆర్డినేటర్ ముమ్మడి బాలిరెడ్డి గారి ఆధ్వర్యములో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 4వ ఆవిర్భావ దినాన్ని కమిటి సభ్యులు మరియు యన్ ఆర్ ఐ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కోడూరు చిన్నంపల్లె యూత్ భారీగా అభిమానులు తో కలిసి  కేక్ కట్ చేసినారు. 
ఈ సందర్భముగా బాలిరెడ్డి  గారు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ   పుట్టినప్పటి నుండి ప్రజా సంక్షేమం కోరకుప్రజల  పక్షనా పోరాడుతున్నా  ఏకైక పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని తెలుగు ప్రజలందరు కలిసి ఉండాలని రాష్ట్రం సమైక్యాముగా ఉండాలని నిబద్ధతో ఉద్యమం చేసిన పార్టీ వైయాస్సార్ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు నుంచి ప్రజలలో  లేకుండా చేయాలనీ ఎన్నో కుట్రలు డిల్లీ నుంచి గల్లి వరకు పాలక మరియు ప్రతిపక్షం ఎన్నో కుమ్మక్కు రాజకీయాలు చేసిన్నారు కానీ తెలుగు ప్రజలు వై యస్ కుటుంభానికి   అండగా నిలబడి ప్రతి ఎన్నికలలో అఖండ విజయాని వై యస్ కాంగ్రెస్ పార్టీ కి ఇచ్సినందుకు తెలుగు ప్రజలకు వై యస్ ఆర్ కాంగ్రెస్ కువైట్ తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నాము . అలాగే రాష్ట్రంలో జరిగే సార్వత్రిక, స్థానిక ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ముందుండి కృషి చేయాలి కార్య కర్తలకు పిలుపునించారు. నాయకుడు అంటే ఇలా ఉండాలి నాయకత్వం అంటే ఇలా ఉండాలి పార్టి అంటే ఇలా ఉండాలి నిత్యం ప్రజలతో ప్రజల తరుపున నిల్చివ్యక్తీ జగన్ గారు  సిమాంధ్ర అభివృద్ధి కొరకు తెలంగాణ పుణ నిర్మాణాకి  ప్రజా బలం గల వై.యస్. జగన్ గారి అధినాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవసరమన్నారు ఈ కార్యక్రమములో కార్య కర్తలు మరియు  అభిమానులుభారీగా పాల్గోన్నారు.

వైఎస్ఆర్ సిపిలోకి భారీగా వలసలు

వైఎస్ఆర్ సిపిలోకి భారీగా వలసలుఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, ఎమ్మెల్యే మీసాల నీలకంఠనాయుడు, విష్ణువర్ధన రెడ్డిలను పార్టీ కండువాలతో ఆహ్వానిస్తున్న వైఎస్ జగన్మోహన రెడ్డి
హైదరాబాద్ : వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతోంది.  కాంగ్రెస్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ గురువారం ఈ పార్టీలో చేరారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన సాధారణ కార్యకర్తలు, నేతలు కూడా పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సన్నిహితుడైన కాంగ్రెస్ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు (ఎచ్చెర్ల) గురువారం పార్టీలో చేరారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నీలకంఠంను వెంట బెట్టుకుని వచ్చి జగన్ సమక్షంలో పార్టీలో చేర్చారు.
 విశాఖపట్టణం స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు కూడా పార్టీలో చేరారు. తంగేడు రాజుల కుటుంబానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు రాజా సాగి సీతారామరాజు, రాజా సాగి రామభద్రరాజు (ఏటికొప్పాక చక్కెర ఫ్యాక్టరీ మాజీ ఛైర్మన్) ఇద్దరూ కలిసి సూర్యనారాయణరాజును వెంట తీసుకుని జగన్ వద్దకు వచ్చారు. ఆయనతో పాటు ఆ ప్రాంతానికి చెందిన పలువురు నేతలకు కూడా జగన్ కండువాలు వేసి పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పటికే పార్టీలో చేరిన విశాఖపట్టణం (పశ్చిమ) ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన నియోజకవర్గానికి చెందిన పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. విశాఖపట్టణం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ కూడా ఈ సందర్భంగా ఉన్నారు.

 కర్నూలు  నేతల చేరిక

 మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలుకు చెంది మహ్మద్ పాషా (రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సభ్యుడు) ఎస్.చాంద్‌పాషా(జిల్లా వక్ఫ్‌బోర్డు ఛైర్మన్), అక్బర్ సాహెబ్ (జిల్లా వక్ఫ్ కమిటీ సభ్యుడు), హెచ్.కె.మనోహర్ (జిల్లా బ్రాహ్మణ సంఘం కార్యదర్శి), మైనారిటీ నేత అమీరుద్దీన్ గురువారం జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చి ఆయన సమక్షంలో పార్టీలో చేరారు.

 ఇల్లెందు నేత చేరిక

 ఖమ్మం జిల్లా ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ రవిబాబు నాయక్, జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఖమ్మం లోక్‌సభా నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవిబాబును వెంట తీసుకుని వచ్చి పార్టీలో చేర్చారు.

మీ పాలనపై ప్రజలకు ఎందుకు చెప్పరు

మీ పాలనపై ప్రజలకు ఎందుకు చెప్పరు
హైదరాబాద్:టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు తన తొమ్మిదేళ్ల పాలన గురించి చెప్పకుండా ఎన్టీఆర్ పాలన తెస్తామంటూ ప్రచారం చేస్తుండాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు తన తొమ్మిది సంవత్సరాల పాలన తిరిగి తెస్తానని చెప్పే దమ్ము లేకనే ఎన్టీఆర్ పాలన అంటూ కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు. కిరణ, చంద్రబాబులు నవయువకుల్లా యువకుల వెంటపడగతున్నారని ఎద్దేవా చేశారు. అసలు యువతకు ఏంచేశారని పద్మ మండిపడ్డారు.
 
కడప ఉప ఎన్నికల్లో బీజేపీతో జగన్ పొత్తు పెట్టుకుంటారని దుష్ప్రచారం చేసిన బాబుకు ఆవిషయం మరిచిపోయి బీజేపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారన్నారు.ఎవరెన్నిక కుట్రలు చేసినా జగన్ ప్రభంజనాన్ని ఆపలేరన్నారు.కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీల వెనక ఎవరున్నారన్నది వైఎస్‌ఆర్‌సీపీ నిగ్గుతేలుస్తుందని తెలిపారు. కిరణ్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ఇప్పుడు మళ్లీ అధికారం ఇవ్వాలని అడుగుతున్నారని ప్రశ్నించారు.

Popular Posts

Topics :