03 April 2016 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు

Written By news on Friday, April 8, 2016 | 4/08/2016

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంవత్సర తొలి పండగ.. అందరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్థిల్లాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

ఏడాదంతా సకాలంలో వానలు పడి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. పాడి పంటలతో రైతులు వర్థిల్లాలని, పల్లెలు కళకళలాడాలని, సకల వృత్తులూ పరిఢవిల్లాలని అన్నారు. షడ్రుచుల ఉగాది తెలుగు వారి జీవితాల్లో వెలుగులు నింపి, ఆనందం తీసుకురావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

రాజధానిలో ఆగని కక్షసాధింపు చర్యలు


రాజధానిలో ఆగని కక్షసాధింపు చర్యలుసర్వేయర్లు పాతిన కర్రలను పీకేస్తున్న రైతులు
రైతుల అనుమతి లేకుండా సర్వేలు
సర్వే కర్రలు పీకేస్తున్న రైతులు

 
తాడేపల్లి రూరల్: రాజధాని గ్రామాలైన గుంటూరు జిల్లాలోని ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం తదితర ప్రాంతాల్లో భూసమీకరణకు భూములు ఇవ్వని రైతులను ప్రభుత్వం నిరంతరం ఏదో విధంగా భయభ్రాంతుల్ని చేస్తూనే ఉంది. బుధవారం కొత్తగా మళ్లీ ప్రైవేటు సర్వేయర్లను ఏర్పాటు చేసి సర్వే చేయించి కర్రలు పాతారు. ఈ తంతు అంతా రైతులు పొలాల్లో లేనప్పుడు మాత్రమే చేస్తున్నారు. ఇది తెలుసుకున్న రైతులు సర్వే చేసి కర్రలు పాతుతున్నవారిని అడ్డుకుని తమ పొలాల్లో కర్రలు ఎందుకు పాతుతున్నారని ప్రశ్నిస్తే సీఆర్‌డీఏ అధికారుల సూచన మేరకు సర్వేచేసి కర్రలు పాతుతున్నట్లు చెబుతున్నారు.

గ్రామాల్లోని సీఆర్‌డీఏ కార్యాలయ ఉద్యోగులను రైతులు ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని వారు సమాధానం ఇస్తున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు తమ పొలాల్లో ఏర్పాటు చేసిన సర్వే పుల్లలను పీకేస్తున్నారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని సుమారు 80 ఎకరాలకు సర్వే నిర్వహించి, కర్రలు పాతారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు వాటిని పీకేశారు. పెనుమాకలో రైతులు తిరగబడేందుకు సిద్ధమవడంతో సర్వేయర్లు వెళ్లిపోయారు.
 
పూలింగ్‌కు ఇవ్వని పొలాల్లో ఎలా సర్వే చేస్తారు?
రాజధానికి భూములు ఇవ్వకపోవడంతో మొదటి నుంచి ప్రభుత్వం రైతులను ఏదో విధంగా భయాందోళనలకు గురిచేస్తోంది. కొత్తగా ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ హైవే అంటూ పచ్చని పంట పొలాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. కరకట్ట వెంబడి పూలింగ్‌కు ఇచ్చిన పొలాలున్నాయి. వాటిలో రోడ్లు నిర్మించకుండా పూలింగ్‌కు ఇవ్వని పొలాల్లో రోడ్లు ఎలా నిర్మిస్తారు? ఎలా సర్వే చేస్తారు? సీఆర్‌డీఏ అధికారులే తేల్చాలి.
 - బత్తుల శంకర్, ఉండవల్లి
 
రైతులు తిరగబడేరోజు దగ్గర్లో ఉంది
రైతుల  సహనాన్ని సీఆర్‌డీఏ అధికారులు చేతగాని తనం అనుకుంటున్నారు. బ్యాంకుల్లో రుణాలు ఇవ్వకుండా వ్యవసాయాధికారులు సలహాలు ఇవ్వకుండా తప్పుడు కేసులు పెట్టి రైతులను అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం ఇలాగే ప్రవర్తిస్తే రైతులు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది.
 - విశ్వనాథరెడ్డి, పెనుమాక
 
అన్నదాత తెగబడతాడు
కోర్టులను ఆశ్రయించాం.. తీర్పు రైతులకు అనుకూలంగా ఇచ్చింది. అయినా ప్రభుత్వం రైతులను భయభ్రాంతుల్ని చేయడం మానడంలేదు. ఇలాగే ప్రభుత్వం చేస్తుంటే కడుపు మండిన అన్నదాత తెగబడతాడు. ప్రభుత్వం అది గమనించాలి. రైతుకు పంటలో నష్టం వస్తే తిరిగి మళ్లీ పంట వేస్తాడు తప్ప పొలాన్ని అమ్ముకోడు. అలాంటి మమ్ములను రాజధాని పేరుతో ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది.  
 - గాదె సాంబశివరావు, ఉండవల్లి

వైఎస్ జగన్‌కి ఘన స్వాగతం

Written By news on Tuesday, April 5, 2016 | 4/05/2016


వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
ఓడీ చెరువు/చిలమత్తూరు/గోరంట్ల / కదిరి  :  వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. సోమవారం ఆయన బెంగళూరు నుంచి పులివెందులకు రోడ్డుమార్గాన వెళ్లారు. మార్గమధ్యంలోని  కొడికొండ చెక్‌పోస్టు, కోడూరు, శెట్టిపల్లి క్రాస్ , గోరంట్ల, ఓడీసీ, కదిరి లో అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.  చిలమత్తూరు మండలం శెట్టిపల్లి వద్ద హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్, గోరంట్ల సమీపంలోని గుమ్మయ్యగారిపల్లి (వైఎస్సార్) సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు  ఘన స్వాగతం పలికారు.

ఓడీచెరువు మండల కేంద్రంలో పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి డీఎస్ కేశవరెడ్డి, జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.  ఇక్కడికి ఓడీసీ, అమడగూరు, నల్లమాడ మండలాల నుంచి వచ్చిన వందలాది మంది కార్యకర్తలు, నాయకులతో  వైఎస్ జగన్  కరచాలనం చేశారు.  కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల వద్ద ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌బాష తదితర నాయకులు జగన్‌కు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు జగన్‌ను కలిశారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరిస్తే తమకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిపై సీఎంను కలిసినా ఫలితం లేదన్నారు. జగన్ స్పందిస్తూ చంద్రబాబు ఇప్పుడు ప్రజల గోడు వినే పరిస్థితుల్లో లేరని, సమస్యపై అందరితో చర్చించి తగు నిర్ణయం తీసుకుందామన్నారు.

వైఎస్సార్‌సీపీని బలోపేతం చేద్దాం


వైఎస్సార్‌సీపీని బలోపేతం చేద్దాం
♦ పార్టీ శ్రేణులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపు
♦ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో దిశానిర్దేశం
♦ పార్టీ అధ్యక్షుడు జగన్‌తో ఓ సందేశం ఇప్పిద్దాం
♦ వైఎస్సార్ ఆశయాల సాధన కోసం పనిచేద్దాం

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని, అందుకు అందరూ కంకణబద్ధులు కావాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సోమవారం లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సందిగ్దతతో రకరకాల ప్రచారాలు, కామెంట్లు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.

ప్రచారాలు, అపోహలు సర్వసాధారణమని, దీనికి కార్యకర్తలు భయపడొద్దని, మనసు నొచ్చుకోవద్దని సూచించారు. దివంగత మహానేత వైఎస్సార్‌ని గుండెల్లో పెట్టుకున్న ప్రజలు ఉన్నారని, వారున్నంత వరకూ పార్టీ దిగ్విజయంగా ముందుకు నడుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, ప్రజలు ప్రధానంగా తాగునీటి సమస్యతో పాటు పలు సమస్యలు పరిష్కారంకాక అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. ప్రజలు నిరంతరం ఎదుర్కొనే సమస్యలపై పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు. ఈ నెల 8 తర్వాత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలసి, ఆయనతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఒక సందేశం ఇప్పిద్దామని అన్నారు. కష్టపడటం నేర్చుకుంటే, భవిష్యత్తులో నాయకులుగా ఎదిగే అవకాశం ఏర్పడుతుందన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేసి ఉండాల్సిందని, అయితే ఆనాటి రాజకీయ పరిస్థితుల కారణంగా పార్టీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయానికి శిరసావహించి, చివరి క్షణంలో పోటీ ప్రతిపాదన వెనక్కు తీసుకున్నామని చెప్పారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు చేయటానికి వెనకాడవద్దని సూచించారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలకు రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుందని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆశీస్సులు అందరికి ఉంటాయని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ఎడ్మా కిష్టారెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి పనిచేయాల్సి ఉందన్నారు.

పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ సమిష్టి నిర్ణయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్దామన్నారు. మరో ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ మాట్లాడుతూ పనిచేసే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు హెచ్‌ఏ రహమాన్, మతీన్, గ ట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్ రెడ్డి, జిన్నారెడ్డి మహేందర్ రెడ్డి, గున్నం నాగిరెడ్డి, వీఎల్‌ఎన్ రెడ్డి, జిల్లాల అధ్యక్షుడు ఆదం విజయ్ కుమార్, పి.సిద్ధార్థరెడ్డి, సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, బి. అనిల్ కుమార్, జీవీ శ్రీధర్ రెడ్డి, మహిళా నేతలు షర్మిలా సంపత్, అమృత సాగర్, శ్యామల, జులీ, క్రిష్టోలైట్, డాక్టర్ నగేష్, రాష్ట్ర కార్యదర్శులు ఎం భగవంత్ రెడ్డి, ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, కుసుమ కుమార్‌రెడ్డి, కుమార్ యాదవ్, ఇరుగు సునీల్ కుమార్, అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎన్ బిక్షపతి, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, వెల్లాల రామ్మోహన్, మల్లాది సందీప్ కుమార్, నాయకులు రఘురామిరెడ్డి తదితరులు
 పాల్గొన్నారు.

 14వ ఆర్థిక  సంఘం నిధులు గ్రామాలకే ఖర్చు చేయించాలి..
 కేంద్రం నేరుగా గ్రామపంచాయతీలకు విడుదల చేస్తున్న 14వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని పొంగులేటి ఆరోపించారు. గ్రామాలను బలోపేతం చేసేందుకు, మౌలిక సౌకర్యాల కల్పనకు, తాగునీటి, విద్యుత్ అవసరాలకు ఉద్ధేశించి ఈ నిధులను నేరుగా పంచాయతీలకే కేంద్రం కేటాయిస్తుం డగా, వాటిని ఇతరత్రా రూపాల్లో దారిమళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదన్నారు. ఈ నిధులను ఇతర పథకాలకు లేదా జిల్లా, మండల పరిషత్‌లకు మళ్లించకుండా, గ్రామ పంచాయతీలకే ఖర్చుచేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్పంచ్‌ల పవర్‌ను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవాలని చూడటం సరైంది కాదన్నారు.

పేదల ఇళ్లకు భారీ మొత్తంలో విద్యుత్ బిల్లులా?


ఎస్సీ, ఎస్టీల పట్ల ఇంత అన్యాయమా?
♦ పేదల ఇళ్లకు భారీ మొత్తంలో విద్యుత్ బిల్లులా?
♦ ప్రభుత్వ తీరుపై విపక్ష నేత వైఎస్ జగన్ ఆగ్రహం
♦ ఇంటికి రూ.10 వేల నుంచి 15 వేల బిల్లు వేస్తే ఎలా బతకాలి
♦ 50 యూనిట్లు ఉచితమంటూనే.. పేదల నడ్డి విరుస్తున్నారు
♦ ప్రభుత్వం స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం

 సాక్షి, కడప: ఒక ఇంటికి విద్యుత్ బిల్లు రూ.15,100, మరో ఇంటికి రూ. 14 వేలు, ఇంకో ఇంటికి రూ. 12,200.. ఇది ఫ్రిజ్‌లు, గీజర్లు, ఏసీలు వాడే ఇళ్లకు వచ్చే బిల్లు అనుకున్నారా? ఒక గిరిజన గ్రామంలో నిరుపేదలకు వచ్చిన బిల్లులు అంటే నమ్ముతారా? ఇది నమ్మాల్సిందే.. ఎందుకంటే ఆ గిరిజనులు తమకు వచ్చిన విద్యుత్ బిల్లులను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చూపించి.. ప్రభుత్వం తమకు చేస్తున్న అన్యాయాన్ని వివరించారు. సోమవారం సాయంత్రం వైఎస్ జగన్ పులివెందుల వచ్చారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో పులివెందుల మండలంలోని కనంపల్లె ఎస్టీ కాలనీకి చెందిన సుమారు 70 మందికిపైగా గిరిజనులు వచ్చి కలిశారు. విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఉచితమంటూనే అధిక కరెంటు బిల్లులు అందించి వేధిస్తున్న వైనాన్ని.. కరెంటు కట్ చేసిన తీరును వివరిస్తూ తమకు అండగా నిలవాలంటూ వైఎస్ జగన్‌కు మొరపెట్టుకున్నారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటూనే భారీగా బిల్లులు వేసి పేద ప్రజల నడ్డివిరుస్తున్నారని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 యూనిట్లపై ఒక్క యూనిట్ దాటినా కరెంట్ వాడకం మొదలు పెట్టినప్పటి నుంచి బిల్లు అంతా కట్టాలనడం దారుణమన్నారు. ఇలా అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వైఎస్ జగన్ హెచ్చరించారు.

ఈ విషయంపై సంబంధిత అధికారులతో మాట్లాడతామని.. న్యాయం జరిగే వరకు ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కొండ ప్రాంతంలో ఉన్న కనంపల్లెలో పట్టపగలే పాములు, తేళ్లు రోడ్లపై కనిపిస్తుంటాయని.. అలాంటి గ్రామంలో వీధిలైట్లను కూడా తొలగిస్తే ప్రజలు ఎలా జీవించాలని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కనంపల్లె గ్రామంలో దాదాపు 71 మీటర్లు ఉన్నాయని, ఒక్కొక్క మీటరును పరిశీలిస్తే రూ.10,500, రూ. 15,100, రూ. 12,200, రూ. 14 వేలు, రూ. 5 వేలు, రూ. 4,300, రూ. 10 వేలు, రూ. 10,220, రూ. 5,485, రూ. 4,030, రూ. 4,070 ఇలా బిల్లులు వచ్చాయని తెలిపారు. ఇన్ని వేల రూపాయలు బిల్లులు వస్తే కూలి పనులకు వెళ్లేవారు ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు.

 ఉచితమంటూనే భారీగా బిల్లులా..
 ఒక్కొక్క ఇంటికి 50 యూనిట్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు వైఎస్‌ఆర్ హయాం నుంచి ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇస్తోందని.. ఇపుడు చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నామంటూనే పేదల నడ్డి విరుస్తోందని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా 50 యూనిట్లు దాటి.. ఒక్క యూనిట్ అధికంగా వచ్చినా.. కరెంటు వాడకం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ బిల్లంతా కట్టాలని ట్రాన్స్‌కో అధికారులు చెప్పడం ఏమిటన్నారు.

ఏ మాత్రం ఆలోచన లేకుండా.. గ్రామంలో వీధిలైట్లను తొలగించి వెళ్లారని చెబుతుంటేనే బాధేస్తోందని.. విష పురుగులు కుట్టి గిరిజనులకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆయన నిలదీశారు. ఎస్సీ, ఎస్టీలపట్ల ఇంత అన్యాయంగా ప్రభుత్వం ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడతానని, రెండు రోజులపాటు ఇక్కడే ఉంటానని, ఈలోపు సరిదిద్దితే ఫర్వాలేదు.. లేకపోతే ఏమి చేయాలో ఆలోచన చేసి ఆందోళన చేద్దామని గ్రామస్తులతో వైఎస్ జగన్ చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వం స్పందించకపోతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిద్దామని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంలో ప్రతిపక్షనేత వెంట కడప ఎంపీ వైఎస్ అవినా్‌శరెడ్డి తదితరులు ఉన్నారు.

Popular Posts

Topics :