10 March 2019 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

మార్చి 15 వరకే ఓటరు నమోదు దరఖాస్తులు

Written By news on Sunday, March 10, 2019 | 3/10/2019

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత ఎన్నికల హడావిడి మరింత పెరిగింది.  ఓట్ల తొలగింపు వ్యవహారం ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయంపై ఏపీ చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆదివారం నుంచి ప్రతిపథకానికి కోడ్‌ అమలులో ఉంటుందని తెలిపారు. ఎన్నికలకు ఎక్కువ సమయం కూడా లేదని, మార్చి 15 వరకే ఓటరు నమోదు దరఖాస్తులు తీసుకుంటామని స్పష్టం చేశారు.  మార్చి 15 తర్వాత దరఖాస్తులు తీసుకోలేమని పేర్కొన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల 82 లక్షల 31 వేల 326 ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. ఫారం-7 ద్వారా మొత్తం 9 లక్షల 27 వేల 542 దరఖాస్తులు వచ్చాయని, అందులో 5,25914 దరఖాస్తులు తిరస్కరించామని, 1,58,124 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
ఇప్పటికే ఫేక్‌ ఫారం-7 సంబంధించి 446 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. పసుపు కుంకుమ పథకం మూడో చెక్కుపైన రిపోర్టును కేంద్ర ఎలక్షన్‌  కమిషన్‌కు పంపించామని , అది కేంద్ర ఎన్నికల కమిషన్‌ పరిశీలనలో ఉందన్నారు.  ఐదో విడత రుణమాఫీ జీవో కూడా పరిశీలిస్తామని, ఏపీలో మొత్తం 9,345 సమస్యాత్మకమైన ప్రాంతాలను గుర్తించామని, ఏపీలో 45,920 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఓటర్‌ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో అందరూ చెక్‌ చేసుకోవాలని సూచించారు.

ఏప్రిల్‌ 11న ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌

 అత్యంత ఉత్కంఠ భరితంగా మారిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. లోక్ సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, ఆరుణాచల్ ప్రదేశే్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలును విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలి విడతలోనే ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాలతో పాటు శాసనసభకు కూడా ఒకే రోజు ఎన్నికల షెడ్యూలు ఈసీ ప్రకటించింది. 
 
తొలిదశలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాల కోసం ఈ నెల 18 వ తేదీ సోమవారం నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 18 వ తేదీ నుంచి ప్రారంభమై 25 వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. 26న నామినేషన్ల పరిశీలన, 28 న ఉపసంహరణకు గడువు విధించారు. ఏప్రిల్ 11 వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అయితే, దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఓట్ల లెక్కింపు పూర్తి చేయడానికి వీలులేనందున దేశవ్యాప్తంగా ఓట్ల కౌంటింగ్ మే 23న నిర్వహిస్తారు.
  •  ఏపీలో 25 ఎంపీ స్థానాల్లో... 20 జనరల్‌, 4 ఎస్సీ, 1 ఎస్టీలకు కేటాయింపు
  • 175 అసెంబ్లీ స్థానాల్లో... 139 జనరల్‌, 29 ఎస్సీ, 7 ఎస్టీలకు కేటాయింపు 
4 జూన్ 2014 న ఏర్పడిన ప్రస్తుత లోక్ సభ పదవీ కాలం వచ్చే జూన్ 3 వ తేదీతో ముగుస్తోంది. అలాగే జూన్ 19, 2014 లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ పదవీ కాలం వచ్చే 18 జూన్ 2019 తో పూర్తవుతోంది. అలాగే ఒడిశా (11 జూన్ 2019), సిక్కిం (27 మే 2019), అరుణాచల్ ప్రదేశ్ (1 జూన్ 2019) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏకకాలంలో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

Popular Posts

Topics :