04 February 2018 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ప్రజాసంకల్పయాత్ర 83వ రోజు షెడ్యూల్‌

Written By news on Friday, February 9, 2018 | 2/09/2018


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 83వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర  షెడ్యూల్‌ను విడుదల చేశారు. శనివారం ఉదయం వైఎస్‌ జగన్‌ కావలి నియోజకవర్గం దుండిగం క్రాస్‌ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి దుండిగం, ఇతంపాడు క్రాస్‌రోడ్డు మీదుగా , మునుబోలుపాడు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్‌ జగన్‌ దివంగత నేత వైఎస్‌ఆర్‌ విగ్రహంతో పాటు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు.
మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. లింగాలపాడు క్రాస్‌ రోడ్డు మీదుగా బోదగుడి చేరుకుంటుంది.  దివంగత నేత వైఎస్‌ఆర్‌ విగ్రహం ఆవిష్కరించడంతో పాటు పార్టీ జెండాను ఎగురవేస్తారు. అనంతరం బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. రాత్రి అక్కడే బసచేస్తారు.

ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఆఫర్‌

ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష ఎమ్మెల్యేలను అధికార టీడీపీ ప్రలోభాలకు గురి చేస్తోందని కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఎంపీ వి. విజయసాయిరెడ్డి శుక్రవారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతి పాల్పడుతూ, ఆ సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోందన్నారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో కొంత మంది ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేయాలని కుట్ర పన్నుతోందని వెల్లడించారు.

‘మా పార్టీకి చెందిన 67 మంది ఎమ్మెల్యేల్లో 23 మందిని రూ. 10 నుంచి 20 కోట్లు ఇచ్చి టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిగతా 44 మందిలో కనీసం నలుగుర్ని కొనాలని ప్రయత్నిస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఆఫర్‌ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. రాజ్యసభ ఎన్నికల సమయంలో పోలింగ్‌ బూత్‌లను ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో పెట్టాలని, కేంద్ర బలగాలతో ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని కోరాం. తప్పుడు కేసులు పెట్టకుండా చూడాలని, ప్రత్యేక పరిశీలకుడిని నియమించి ఎన్నికలను పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశాం. గతంలో తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఇరుకున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వ చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కేంద్రం నిఘా పెట్టాలని కోరామ’ని విజయసాయిరెడ్డి తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ)కి రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి సమర్పించిన వినతిపత్రం



Popular Posts

Topics :