వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీతోపాటు అనుబంధ సంఘాలకు బాధ్యులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదంతో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదివారం ఈ జాబితాను విడుదల చేశారు. రాష్ట్ర కమిటీలో ఏడుగురు కార్యదర్శులు, 8 మంది సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు కార్యనిర్వహక సభ్యులకు చోటు కల్పించారు. రంగారెడ్డిజిల్లాకు చెందిన జి.ధనలక్ష్మి, బి.రఘోత్తమ్రెడ్డి, కుసుమ కుమార్రెడ్డి, టి.కుమారయాదవ్, ఎస్కే యేసుదాని, సామ యాదిరెడ్డి, జి.వెంకట్రెడ్డిలను కార్యదర్శులుగా నియమించారు. మెదక్ జిల్లాకు చెందిన కె.బాలకృష్ణారెడ్డి, ఆర్.చంద్రశేఖర్, కరీంనగర్కు చెందిన సెగ్గెం రాజేశ్, రంగారెడ్డి జిల్లాకు చెందిన డి.గోపాల్ రెడ్డి, సి.అరుణారెడ్డి, రమా ఓబుల్రెడ్డి, జె.వరలక్ష్మి, బసిరెడ్డి బ్రహ్మానందరెడ్డిలను జాయింట్ సెక్రెటరీలుగా నియమించారు. వీరితోపాటు హైదరాబాద్కు చెందిన కసిరెడ్డి ఉపేంద్రరెడ్డి, బ్రహ్మయ్యలను ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమించారు.
అనుబంధ సంఘాల్లోనూ నియామకాలు
తెలంగాణ రాష్ట్ర కమిటీతోపాటు అనుబంధ సంఘాల్లో 24 మంది బాధ్యులను ప్రకటించారు. పార్టీ ఐటీ వింగ్ అధ్యక్షునిగా ఎం.సందీప్కుమార్, గ్రీవెన్స్సెల్ అధ్యక్షునిగా మెరుగు శ్రీనివాసరెడ్డిని నియమించారు. ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శిగా బి.శ్రీవర్ధన్రెడ్డి, పబ్లిసిటీ అండ్ కల్చరల్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా జె.అమర్నాథ్రెడ్డి, ప్రోగ్రాం కో-ఆర్డినేషన్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా పి.సంతోష్ కుమార్, ట్రేడ్ యూనియన్ వింగ్ ప్రధాన కార్యదర్శులుగా ఎం.శివాజీ, డి.కృష్ణం నాయుడు, కార్యదర్శులుగా పి.మాధవ నర్సింహారెడ్డి, ఎ.రామమోహన్రెడ్డి, యువజన విభాగం ప్రధాన కార్యదర్శులుగా రేగళ్ల సతీష్రెడ్డి, డి.సత్యమూర్తి, ఠాగూర్ అమిత్ నారాయణ్సింగ్, కార్యదర్శిగా కేవీ కృష్ణారెడ్డి, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జుల్లే బెన్నేలా, సంయుక్త కార్యదర్శిగా నస్రీన్ కౌసర్, విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా గందె మోహన్, మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా హైదర్ అలీ, కార్యదర్శులుగా మహమ్మద్ బిన్ ఒమర్ బిన్ ఖలీఫా, ఎస్కే మౌసమ్, సంయుక్త కార్యదర్శిగా అబ్దుల్ వాజిద్, సేవాదళ్ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ అమన్ ఎస్. అలగ్, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా గుంజ వెంకట్రావు, ఎస్సీ సెల్ సెక్రెటరీగా ఎం.మైఖేల్, క్రిస్టియన్ మైనారిటీ విభాగం సెక్రెటరీగా క్రిసోలైట్ను నియమించినట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది.