2012 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Wish this new year will be for you and me

Written By news on Monday, December 31, 2012 | 12/31/2012









జగన్ కోసం... జనం సంతకం (One Crore Signatures For Jagan)












click above image for 
ONLINE SIGNATURE


తేదీ: 22 డిసెంబర్ 2012
మాన్యశ్రీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి...

ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేసుకుంటున్న విజ్ఞప్తి...

జగన్ కోసం... జనం సంతకం
     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, లోక్‌సభ సభ్యులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి మీద రాజకీయపరంగా బనాయించిన కేసును తీవ్రంగా గర్హిస్తున్నాం. నిజాలను నిర్థారించాల్సిన సీబీఐ సంస్థ- జగన్మోహనరెడ్డిని దోషిగా చిత్రీకరించటానికి అహర్నిశలు చేస్తున్న ప్రయత్నాలను, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా భావిస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్ళకు లొంగి, పక్షపాతంతో సీబీఐ చేస్తున్న దర్యాప్తు భారతదేశంలో అధికార వ్యవస్థల దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనమని మేమంతా భావిస్తున్నాం..

     ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నందుకు, అధికార పార్టీతో విభేదించి బయటకు వచ్చినందుకు వైయస్ జగన్మోహనరెడ్డిగారిని 200 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధంలో ఉంచటాన్ని మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కక్ష సాధింపులు ఆపాలని, ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని పెంచాలని కోరుతున్నాం.




మీరూ చేయికలపండి!

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి అక్రమ అరెస్టును నిరసిస్తూ 'జగన్ కోసం... జనం సంతకం' పేరిట ప్రారంభించిన కోటి సంతకాల సేకరణలో మీరూ పాలుపంచుకోండి. ఇందుకోసం ఈ కింద ఇచ్చిన ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సంతకాలు చేసిన తర్వాత ఫార్మ్‌లో తెలిపిన పార్టీ కేంద్ర కార్యాలయం చిరునామాకు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించగలరు.


Plot No.883-884, Road Number. 45
Jubilee Hills, Hyderabad - 500033
AndhraPradesh, India.
040-23609696 , 23609595 ,
http://www.ysrcongress.com/home/koti_santhakaalu.html

కుట్రకేసులో పరిటాల కుమారుడు శ్రీరామ్


అనంతపురం జిల్లాలో దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కుమారుడు శ్రీరామ్ పై ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సుధాకరరెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడి హత్య కు కుట్ర పన్నారన్న అభియోగం ఆయనపై వచ్చింది.దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు శ్రీరామ్ తో సహా పది మంది పై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. పరిటాల రవీంద్ర కుటుంబంలో మూడో తరం కూడా ఫ్యాక్షన్ కేసులో చిక్కుకున్నట్లయింది.శ్రీరామ్ తల్లి, పరిటాల రవి భార్య సునీత రాప్తాడు నియోజకవర్గానికి శాసనసభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

http://kommineni.info/articles/dailyarticles/content_20121231_10.php?fb_comment_id=fbc_486455864726717_5379042_486457161393254

ఈ హత్యకు రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కొడుకు శ్రీరాం, పలు హత్యకేసులలో నిందితుడిగా ఉన్న నాగూర్‌ హుస్సేన్, డ్రైవర్ రాము ఆయుధాలు సరఫరా చేశారని ధర్మవరం డీఎస్ పి నవాబ్‌జాన్ చెప్పారు. మొత్తం 8 మంది నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునిత పాత్రపై ఆరా తీస్తున్నట్లు ఆయన చెప్పారు.

YS Vijayamma Speaks to media on 'Jagan Kosam Janam Santakam'

Sakshi Special Edition on 'RAJAKIYAM 2012'

'Janam Santakam' campaign by YSRCP followers in AP

ఆంధ్రజ్యోతిపై హైకోర్టు ఆగ్రహం

ఆంధ్రజ్యోతి దినపత్రికపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనని మాటలు అన్నట్లుగా న్యాయమూర్తికి దురుద్దేశాలు ఆపాదిస్తూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించారు. కొంతకాలంగా తనను లక్ష్యంగా చేసుకుని దురద్దేశపూరిత కథనాలు ప్రచురిస్తున్నారని జస్టిస్ నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలని సీనియర్ న్యాయవాది 
రవిచందర్ కోరారు. ఈ విషయాన్ని బుధవారం పరిశీలిస్తామని న్యాయమూర్తి చెప్పారు. హైకోర్టు రిజిస్ట్రీ ద్వారా ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తామని న్యాయమూర్తి చెప్పారు.

జగన్ కోసం... జనం సంతకం (One Crore Signatures For Jagan)











click above image for 
ONLINE SIGNATURE


తేదీ: 22 డిసెంబర్ 2012
మాన్యశ్రీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి...

ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేసుకుంటున్న విజ్ఞప్తి...

జగన్ కోసం... జనం సంతకం
     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, లోక్‌సభ సభ్యులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి మీద రాజకీయపరంగా బనాయించిన కేసును తీవ్రంగా గర్హిస్తున్నాం. నిజాలను నిర్థారించాల్సిన సీబీఐ సంస్థ- జగన్మోహనరెడ్డిని దోషిగా చిత్రీకరించటానికి అహర్నిశలు చేస్తున్న ప్రయత్నాలను, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా భావిస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్ళకు లొంగి, పక్షపాతంతో సీబీఐ చేస్తున్న దర్యాప్తు భారతదేశంలో అధికార వ్యవస్థల దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనమని మేమంతా భావిస్తున్నాం..

     ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నందుకు, అధికార పార్టీతో విభేదించి బయటకు వచ్చినందుకు వైయస్ జగన్మోహనరెడ్డిగారిని 200 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధంలో ఉంచటాన్ని మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కక్ష సాధింపులు ఆపాలని, ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని పెంచాలని కోరుతున్నాం.




మీరూ చేయికలపండి!

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి అక్రమ అరెస్టును నిరసిస్తూ 'జగన్ కోసం... జనం సంతకం' పేరిట ప్రారంభించిన కోటి సంతకాల సేకరణలో మీరూ పాలుపంచుకోండి. ఇందుకోసం ఈ కింద ఇచ్చిన ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సంతకాలు చేసిన తర్వాత ఫార్మ్‌లో తెలిపిన పార్టీ కేంద్ర కార్యాలయం చిరునామాకు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించగలరు.


Plot No.883-884, Road Number. 45
Jubilee Hills, Hyderabad - 500033
AndhraPradesh, India.
040-23609696 , 23609595 ,
http://www.ysrcongress.com/home/koti_santhakaalu.html

ఒక్కొక్కరికి ఒక్కో రూలా..?


ఈ సంవత్సరంలోని చివరి రోజు ఈరోజు. మామ మరణం నుండి పూర్తిగా కోలుకోకమునుపే జరిగిన సంఘటన, మా జీవితాలను రెండేళ్ల పరిధిలో రెండవసారి అతలాకుతలం చేసిన ఘటన, జగన్ అరెస్టు ఈ సంవత్సరంలో జరిగింది. మామ చనిపోయినప్పుడు అత్తను ఓదార్చడానికి, షర్మికి ధైర్యం చెప్పడానికి జగన్ ఇంట్లో ఉన్నాడు. కాని ఈసారి కష్టంలో ఉన్న మాకు వున్న ఒక్క అండను కాంగ్రెస్, టిడిపి పెద్దలు, సీబీఐ అధికారులు జైలుపాలు చేశారు.

ఏడు నెలలు దాటింది - అసలు ఒక తప్పు జరిగిందా లేదా అని నిర్ధారణ లేకుండా ఇంతకాలం - ఏడు నెలలు ఒక మనిషిని జైలులో పెట్టారు. ఒక కుటుంబాన్ని, ముగ్గురు ఆడబిడ్డలను తీవ్ర మనఃక్షోభకు గురిచేశారు. ప్రజల స్వేచ్ఛను కాపాడడానికి, అధికారుల అధికార దుర్వినియోగం నుండి మాలాంటి వారిని కాపాడడానికి రాజ్యాంగాన్ని నిర్మించిన పెద్దలు పెట్టిన ప్రతి ఒక్క నిబంధనను నిలువునా సమాధి చేస్తూ, ఒక సభ్యసమాజం చూసి తల వంచుకునేలా ఒక మనిషిని వేధించారు. ఒక మనిషి స్వేచ్ఛను మింగివేశారు. అసలు దేవుడిచ్చిన జీవితాన్ని, మా స్వేచ్ఛను హరించడానికి వీళ్ళెవరు? అసలు ఒక నేరం జరిగిందో లేదో తెలియకుండానే ఇంతమందిని, ఇన్ని రోజులు జైలుపాలు చేశారు. వాళ్ల కుటుంబాలకు ఎడతెగని బాధ, శోకం కల్గించారు. ఇదేనా మనకున్న స్వాతంత్య్రం అని కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇలా అధికారం వుంది కదా అని, పదవిని అడ్డం పెట్టుకుని మనకు నచ్చని వారికి అన్యాయం చెయ్యడాన్ని దేవుడు మన్నించడు, ప్రజలు మెచ్చుకోరు.

ల్యాంకో శ్రీధర్‌కు ఒక రూలు, మ్యాట్రిక్స్ ప్రసాద్‌గారికి ఒక రూలు, మోపిదేవి గారికి ఒక రూలు, ధర్మానగారికి ఒక రూలు, రాజశేఖరరెడ్డి గారి కొడుకుకి ఒక రూలు, ములాయంగారి కోడలికి, సోనియగాంధి గారి అల్లుడికి ఒక రూలు. ఇది న్యాయమా? ధర్మమా? ఒకటే రాజ్యాంగం... చట్టాలకు అందరూ సమానులే. మరి ఎందుకీ వివక్ష?

అయినా జగన్ చేసిన తప్పేంటి? ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమా? లేక ప్రజలలో ఒకడిగా వుంటూ, వారి ప్రేమ, ఆప్యాయతలను సంపాదించుకోవడమా? మా మామగారు చేసిన తప్పేంటి? తన రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఉండకూడదనుకోవడమా? పేదవాడు పెద్ద ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలని అనుకోవడమా? డబ్బులు లేని కారణంగా విద్యార్థులు చదువులు ఆపకూడదు అనుకోవడమా? లేక ముసలివాళ్లకు మూడు పూటల తినడానికి అన్నం వుండాలనుకోవడమా? మామ ప్రేమ ప్రతి ఇంటిని, ప్రతి మనిషిని తాకింది. అందుకే ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మడం లేదు.

అసలు జగన్ అప్పుడు ఒక ప్రభుత్వ అధికారి కాదు, ఒక ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు. అబద్ధాలు మాట్లాడే నాయకులకు, కేసులను పక్కదోవ పట్టిస్తున్న సీబీఐ అధికారులకు అసలు ‘అవినీతి’ అనే పదం జగన్‌కు వర్తించదు అనే విషయం తెలుసు. అయినా వాళ్లకు నీతి, నియమాలుండవనుకుంటా, మంచి మానవత్వాలు తెలియవనుకుంటా! అందుకే ఇన్ని కుట్రలు, ఇన్ని అబద్ధాలు కలగలిపి మమ్మల్ని హింసిస్తున్నారు. అయినా ప్రజలు ఇవన్నీ గమనిస్తూ వున్నారు. వాళ్లకు అన్నీ తెలుసు. అందుకే జగన్‌ను జైలులో పెట్టి 7 నెలలు అయినా, వాళ్లు జగన్‌ను ప్రేమిస్తున్నారు, మాకు అండగా నిలబడుతున్నారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి గారు అన్నారు - ‘జగన్ జైలులో ఎందుకు ఉన్నాడు’ అని! ఆయనకు నేను చెబుతున్నా - జీవోలు ఇచ్చినందుకు కాదు జగన్ జైలులో వున్నది; కంపెనీలు స్థాపించి, షేర్లు అమ్మి, ఎవరి వాటా వారికి ఇచ్చినందుకు కాదు జగన్ జైలులో వున్నది; వాటాదారులకు లాభాలు ఆర్జించినందుకు కాదు జగన్ జైలులో వున్నది; 30 వేల పైచిలుకు మందికి ఉపాధి కల్పించినందుకు కాదు జగన్ జైలులో వున్నది, తనకు వచ్చిన లాభాన్ని తనకు భూములు అమ్మిన రైతులతో పంచుకున్నందుకు కాదు జగన్ జైలులో వున్నది... ఒక కొడుకుగా తన తండ్రి మరణవార్త విని చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చాలనుకున్నాడు కాబట్టి ఈరోజు జగన్ జైలులో వున్నాడు. తన తండ్రి నేర్పినట్టు మాట తప్పక, మడమ తిప్పక బతకాలని, ఇచ్చిన మాటకు కట్టుబడి వుండాలనుకున్నాడు కాబట్టి ఈరోజు జగన్ జైలులో వున్నాడు.

బైబిల్‌లో ఒక మాట ఉంది - ‘‘అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు’’ అని! జగన్ నాతో అప్పుడప్పుడు అంటూ ఉంటాడు - ‘‘పైనుండి దేవుడు గాని, నాన్నగాని నన్ను చూసినప్పుడు నా గురించి సంతోషించేలా, గర్వపడేలా బతకాలి’ అని! అందుకే ఈ నాయకులు, అధికారుల మాదిరి ప్రజలను వంచిస్తూ, నోటినిండా అబద్ధాలు, గుండెనిండా కుట్రలు పెట్టుకోవడం జగన్‌కు రాదు, చేయలేడు. అందుకే కొంతకాలం కష్టం వుండవచ్చు. కాని జగన్ అన్నట్టు పైనుండి చూసే మామ ఆశీర్వాదం, దేవుని దయ జైలు గోడలు బద్దలు కొట్టి జగన్‌ను బయటికి నడిపిస్తాయి. జగన్‌ను ప్రేమించే ప్రజల మధ్యకి, కుటుంబం దగ్గరికి దేవుడే నడిపిస్తాడు. ఇది నా నమ్మకం. ఇది నా ప్రార్థన!


- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్






sakshi

వైఎస్సార్ కాంగ్రెస్.. సంచలన విజయాలు

అధికార, ప్రతిపక్షాలు రెండూ కుమ్మక్కై జనం సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న తరుణంలో.. ప్రజాపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపైకి దూసుకొచ్చింది. ప్రజల తరఫున ఈ ఏడాది ఎన్నో పోరాటాలు చేసింది. నిరంతరం ప్రజల మధ్య తిరుగుతున్న పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని తప్పుడు కేసులతో నిర్బంధించినా వెరవకుండా పార్టీ శ్రేణులు, నాయకులు ఆత్మ విశ్వాసంతో ఈ ఏడాది ముందుకు నడిచారు. జగన్‌ను అరెస్టు చేస్తే పార్టీ ఉనికి కోల్పోతుందని కాంగ్రెస్, టీడీపీ పన్నిన పన్నాగాలు తలకిందులయ్యాయి. 

గత ఏడాది డిసెంబర్ 4న రైతులు, వ్యవసాయ కూలీల పక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై జగన్ మద్దతుదారులైన 17 మంది ఎమ్మెల్యేలు ఓట్లేసి అనర్హత వేటుకు గురైనా.. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తం 15 మంది గెలుపొంది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ చార్జిషీటులో పెట్టినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 2.90 లక్షల మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు.

జనం జగన్ వెంట లేరని, ఆయన పట్ల ప్రజలకు ఉన్న అభిమానం పాలపొంగులాంటిదని సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చిన నేతలకు ఈ ఫలితాలు దిమ్మ తిరిగేలా చేశాయి. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం శాసనసభలో కూడా బలీయమైన శక్తిగా ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ప్రజా సమస్యలపై అడుగడుగునా ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిజమైన ప్రతిపక్ష పాత్రను నిర్వహించింది. జగన్ జైలుకు వెళ్లినా బయట ఉన్న విజయమ్మ పార్టీ బాధ్యతలను మోస్తున్నారు. ఆమె చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిరిసిల్లలో చేనేత దీక్ష, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా అమలు చేయాలని కోరుతూ ఫీజు దీక్షను చేశారు. విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా విజయవాడలో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇలా అన్ని పోరాటాల్లోనూ ఆమె ముందుంటూ, రాష్ట్రమంతటా పర్యటిస్తూ పార్టీ శ్రేణులకు స్ఫూర్తి అందిస్తున్నారు. ద్రోహచింతనతో ఉన్న కాంగ్రెస్, విశ్వసనీయత కోల్పోయిన టీడీపీ వ్యవహార శైలితో బేజారెత్తిన పలువురు ఆ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రముఖ నేతలు.. ఆయా పార్టీలను వీడి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్న సందర్భంగా ఏర్పాటైన సభల్లో కూడా విజయమ్మ పాల్గొంటున్నారు. ఇక ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి జగన్ సోదరి షర్మిల ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద నుంచి అక్టోబర్ 18న ప్రారంభించిన పాదయాత్ర రాష్ట్రంలో ఒక హైలైట్‌గా నిలిచింది. ఆమె యాత్రలకు జనం విరగబడటాన్ని చూసి ఇతర రాజకీయ పార్టీలు హడలెత్తాయి. రంగారెడ్డి జిల్లాలో ఆమెకు ప్రమాదం సంభవించటంతో తాత్కాలికంగా యాత్రకు అంతరాయం కలిగింది.

భస్మాసుర ‘హస్తం’

ఉప ఎన్నికల్లో పరాజయాల పరంపర.. సీనియర్ నాయకుల మధ్య వర్గ పోరు.. మంత్రులు, సీనియర్ల అసమ్మతి రాజకీయాలు.. తెలంగాణ ఎంపీల ఆందోళనలు.. సీనియర్ ఎంపీల అలకలు.. కొందరు మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులు.. అన్నిటికీ మించి పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు.. 127 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి 2012 సంవత్సరం ముచ్చెమటలు పట్టించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై కక్ష సాధింపు కోసం కాంగ్రెస్ పన్నిన కుయుక్తులు భస్మాసుర హస్తంగా మారి ఆ పార్టీనే తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. జగన్ లక్ష్యంగా సాగుతున్న క్విడ్ ప్రో కో కేసులో సుప్రీంకోర్టు ఆరుగురు మంత్రులకు నోటీసులివ్వగా.. అందులో మోపిదేవి వెంకటరమణ జైలుపాలయ్యారు. మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేయాల్సి వచ్చింది.

అసమ్మతి సెగలు: అసమ్మతి రాజకీయాలకు కొదవే లేదు. ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు జానారెడ్డి, డి.ఎల్.రవీంద్రారెడ్డి వంటి నాయకులు ఏడాది పొడవునా సీఎంపై అసమ్మతి రాజకీయాలు నడిపారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలైతే అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనంతో ఈ ఏడాది మంత్రి పదవులు దక్కించుకున్న సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాసరావులలో రామచంద్రయ్య సీఎంకు వైరి వర్గంగా మారి అవసరమైనప్పుడల్లా అసమ్మతికి ఆజ్యం పోస్తూనే ఉన్నారు. 

24 స్థానాల్లో 22 ఘోర పరాజయం: ఈ ఏడాది మొత్తం 1 పార్లమెంట్, 24 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో ఘోర పరాజయంపాలైంది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దాదాపు 10 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేక చతికిలపడి రికార్డుల్లోకెక్కింది. తొలుత తెలంగాణ కోసం ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లగా కాంగ్రెస్ అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది. రాజీనామా చేసిన వారిలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు (జూపల్లి కృష్ణారావు, టి.రాజయ్య) కూడా ఉన్నారు. వీరిద్దరూ టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు. అవిశ్వాస తీర్మానం ఫలితంగా జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 16 స్థానాల్లో ఓటమి పాలైంది. మిగిలిన రెండు స్థానాల్లోనూ ప్రతిపక్ష టీడీపీ సహకారంతో విజయం సాధించి మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలను నిరూపించింది. ఇక జగన్ అరెస్టును నిరసిస్తూ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, సుజయ కృష్ణ రంగారావు, మద్దాలి రాజేష్ అధికార పార్టీకి రాజీనామా చేయటం కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టింది. కాగా మజ్లిస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవటం కాంగ్రెస్‌కు ఈ ఏడాది పెద్ద షాక్.

ఆరోగ్యశ్రీ కిరణ్‌కు అశ్రు తర్పణం

Written By news on Sunday, December 30, 2012 | 12/30/2012

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి పాలిచెర్ల కిరణ్‌కుమార్ రెడ్డి గొప్ప మానవతా వాది, స్నేహశీలి, కోట్లాది మంది ప్రజలకు అద్భుతమైన ఆరోగ్యశ్రీ పథకం అందించిన మహనీయుడు అని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో నివాళులర్పించారు. క్యాన్సర్ వ్యాధితో మృతి చెందిన కిరణ్ సంతాప సభ ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. పార్టీ శ్రేణులు, ఆయన కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ సభలో కిరణ్ అంకిత భావాన్ని, సేవా నిరతిని పలువురు నేతలు కొనియాడుతూ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. 

ఎం.పి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ చిన్న వయసులోనే కిరణ్ మృతి చెందడం దురదృష్టకరమన్నారు. కోవూరు, నెల్లూరు ఉప ఎన్నికల్లో ఆయన చేసిన కృషి ప్రశంసనీయమైందన్నారు. లక్షలాది మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన వ్యక్తి అర్థాయుష్సుతో మరణించడం కలచి వేస్తోందని అన్నారు. 

సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కిరణ్ ఏ పనైనా ఒక క్రమ పద్ధతిలో చేసే వారని బహుశా ఆయనకు ఆ లక్షణం తల్లి పెంపకం వల్ల వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఆయన లేక పోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లోటుగా భావిస్తున్నామని ఆయన అన్నారు. పార్టీలో తెర ముందుండి పనిచేసే వారు కొందరుంటే ఏ మాత్రం అధికార కాంక్ష లేకుండా తెర వెనుక ఉండి పనిచేసే వారిలో కిరణ్ ఒకరని సజ్జల అన్నారు. ఏదైనా ఒక పనిపై దృష్టి పెడితే దానిని చివరి వరకూ వదలని వ్యక్తి కిరణ్ అనీ ఒక నిజాయితీపరుడిని తాము కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

పీఏసీ సభ్యుడు డి.ఏ.సోమయాజులు మాట్లాడుతూ పేదల పట్ల నిజమైన కరుణామయుడు కిరణ్ అని శ్లాఘించారు. ఆస్ప్రో, అనాసిన్ వంటి మాత్రలను కూడా కొనలేని నిరుపేదలకు ఖరీదైన ఆసుపత్రుల్లో చికిత్స పొందేలా చేసిన వ్యక్తి కిరణ్ అని ఆయన అన్నారు. పీఏసీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ వైఎస్సార్ అడుగుజాడల్లో నడచిన వ్యక్తి వాడు కిరణ్ అని పేర్కొన్నారు. నాగదేశి రవికుమార్, మేడపాటి వెంకట్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కిరణ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఎక్కడో ఒక చోట ప్రతిష్టించాలని సూచించారు. కిరణ్ ద్వారా గతంలో ప్రభుత్వ సహకారం పొందిన యాసిడ్ బాధితురాలు అరుణ టెలిఫోన్ ద్వారా వ్యక్తం చేసిన సంతాపాన్ని పార్టీ సేవాదళం రాష్ట్ర కమిటీ సభ్యురాలు సభకు తెలియజేశారు.

మాతృ విలాపం
కిరణ్ తల్లి 74 ఏళ్ల లీలా చంద్రారెడ్డి ‘నీవు లేని మాట నిజమా...నాన్నా కిరణ్... ఇది జోల పాటు కాదురా తండ్రీ! జోహార్,జోహార్ అని పలవరించే అంతిమ గీతిక’ అంటూ గద్గద స్వరంతో చదివిన కవిత అందరినీ కంట తడి పెట్టించింది. కుమార్తె ఐక్య ‘తల్లి ఒడిలో ఆడుకోరా హాయిగా కన్నా...’ అని పాడిన పాట కూడా కలచి వేసింది. మేనకోడలు దివ్యదీప్తి మాట్లాడుతూ తన మేనమామ మృత్యువుకు సమీపిస్తున్న తరుణంలో కూడా ఆసుపత్రిలో షర్మిల పాదయాత్ర ఎలా సాగుతోందో, జగన్ జైలులో ఎలా ఉన్నాడో అని ఆరా తీసే వారని కన్నీటి పర్యంతమై చెప్పారు. 

పార్టీ అధికార ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్ నిర్వహించిన ఈ సంతాప సభలో మాజీ మంత్రి ఎం.మారెప్ప, గట్టు రామచంద్రరావు, బి.జనార్థన్‌రెడ్డి, వి.ఎల్.ఎన్.రెడ్డి, కె.శివకుమార్, వంగపండు ఉష, నాగిరెడ్డి (లీగల్ సెల్) ప్రసంగించారు. కిరణ్‌కుమార్ రెడ్డి దశదినకర్మ జనవరి 5వ తేదీన మణికొండ సమీపంలోని అల్కాపురి వద్ద ఆయన స్వగృహంలో జరుగుతుందని జనక్ ప్రసాద్ ప్రకటించి అందరూ హాజరు కావాలని కోరారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు 2013 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ..

వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని ఏడు నెలలుగా అక్రమ నిర్బంధంలో ఉంచినందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు 2013 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని పార్టీ అగ్రనేతలు పిలుపు నిచ్చారు. పార్టీ ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డి.ఏ.సోమయాజులు, బాజిరెడ్డి గోవర్థన్, అధికార ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ఏడు నెలలుగా జైల్లో ఉన్న జగన్ వివిధ కోర్టుల్లో ఎనిమిది సార్లు బెయిల్ పిటిషన్ వేస్తే కుట్ర బుద్ధితో సీబీఐ అడ్డుకున్నదని విమర్శించారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక నిర్బంధంలో ఉంచి తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ పన్నిన కుట్రలను ఛేదించేందుకు పార్టీ కార్యకర్తలు 2013 జనవరి ఒకటో తేదీన ‘జగన్ కోసం జనం సంతకాలు’ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేపట్టాలని వారు కోరారు. మేకపాటి మాట్లాడుతూ ఇది పార్టీ నిర్ణయం ఎంత మాత్రం కాదని పార్టీలోని పెద్దలు కూర్చుని చేసిన ఆలోచన అని వివరించారు. డిసెంబర్ 21వ తేదీన జగన్ జన్మది

నం నాడు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటికి 30 లక్షల సంతకాలను కార్యకర్తలు చేపట్టారని త్వరలో కోటి సంతకాలను పూర్తి చేసి రాష్ట్రపతికి అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో వచ్చే కొత్త సంవత్సరాలన్నీ బాగుంటాయని పార్టీకి మంచి రోజులు ఉంటాయని అయితే 2013 జనవరి 1వ తేదీని మాత్రం నిరసన దినంగా పాటించాలని కార్యకర్తలు మరింత పట్టుదలతో సంతకాల సేకరణ విసృ్తతంగా చేయించాలని ఆయన కోరారు. 

జగన్‌కు జైలు... సహ నిందితులకు స్వేచ్ఛా...! 
జగన్ కేసుల విషయంలో సీబీఐ కక్ష సాధింపుతో రాజకీయ దురుద్దేశ్యాలతో వ్యవహరిస్తోందని సోమయాజులు దుయ్యబట్టారు. ఈ కేసుల్లో నలభై సహనిందితులుగా ఉంటే జగన్‌ను మరొకరిని నిర్బంధించి మిగతా వారిని స్వేచ్ఛగా తిరుగనివ్వడంలో ఔచిత్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సహ నిందితుల్లో మంత్రులు, ఫైళ్లపై సంతకాలు చేసిన ప్రభుత్వ కార్యదర్శులున్నారని ఆయన అన్నారు. 2004-09 మధ్య కాలంలో ఏనాడూ ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా లేని జగన్ మాత్రం జైల్లో ఉంచారని ఆయన అన్నారు. మోపిదేవి వెంకటరమణారావును అరెస్టు చేసి ధర్మాన గురించి ఆలోచించడం లేదని ఆయన అన్నారు. అందరినీ అరెస్టు చేయాలని తాము డిమాండ్ చేయడం లేదని అయితే ఇదెంత అన్యాయమో ప్రజల దృష్టికి తెస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

శంకర్‌రావు వేసిన పిటిషన్‌ను పురస్కరించుకుని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లోని 52వ పేరాలో జగన్‌ను 52వ ప్రతివాదిగా ఉంటే ఆయనను తొలి ముద్దాయిగా సీబీఐ చేర్చిందని అందులోనూ తన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డితో కలిసి జగన్ నేరపూరితమైన కుట్రకు పాల్పడ్డారని అసంబద్ధమైన ఆరోపణలు చేశారన్నారు. క్విడ్ ప్రొ కో(ఫలానికి ప్రతిఫలం) అనేది ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో ఏమైనా అక్రమాలు జరిగి ఉంటే కదా అని ఆయన ప్రశ్నించారు. ఈ జీవోలు సక్రమమేనని ముఖ్యమంత్రి చెప్పారని, మరోవైపు సుప్రీంకోర్టులో రాష్ట్ర మంత్రులు వేసిన అఫిడవిట్లలో కూడా జీవోల్లో అక్రమం ఏదీ లేదని వివరించారని అన్నారు. జీవోలు అక్రమం కానపుడు ఇక క్విడ్ ప్రొకో ఎక్కడిదని ఆయన అన్నారు. సుమారు 15, 16 నెలలు దర్యాప్తు చేసిన సీబీఐ జగన్ ఆస్తుల విషయంలో కొత్తగా కనుగొన్నది ఏమీ లేదని ఆయన అన్నారు. 

జగన్ తన వ్యాపార సంస్థల గురించి పెట్టుబడుల వివరాలను ఆదాయపుపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌లకు సమర్పించారని ఆయన వెల్లడించిన దానికన్నా సీబీఐ ఒక్క విషయం కూడా కొత్తగా కనిపెట్టలేక పోయిందని ఆయన అన్నారు. జగన్‌పై కేసులు మొత్తం రాజకీయ ప్రేరేపితమైనవిగా ఆయన వ్యాఖ్యానించారు. కనిమొళి, రాజా, కల్మాడీలకు బెయిల్ వచ్చినపుడు జగన్‌కు రాకుండా సీబీఐ అడ్డుపడటంలో అర్థం లేదన్నారు. బెయిల్‌పై విడుదలైన వారు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో ఉన్నారని కేసులో సాక్షాలను వారు తారు మారు చేయలేరని భావించినపుడు ఎలాంటి పదవిలో లేని జగన్ చేయగలరా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. బయట ఉన్న రాష్ట్ర మంత్రులకు లేని అధికారం జగన్‌కు ఉందా అని కూడా ఆయన అన్నారు. 

బాజిరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ మోపిదేవిని అరెస్టు చేయడం, ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి లాంటి వారిని ఏమీ అనక పోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బెయిల్ పిటిషన్ వచ్చినపుడల్లా ఏదో ఒక డ్రామా చేసి సీబీఐ బెయిల్ రాకుండా అడ్డుకుంటోందని దీన్ని ప్రజా మద్దతు ద్వారా కార్యకర్తలు ప్రతిఘటించాలని ఆయన అన్నారు. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా, డీఎల్‌ఎఫ్ లావాదేవీల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని కూడా ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ మాత్రం నైతికత లేని జాయిండ్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ ద్వారా సీబీఐ దర్యాప్తు చేయిస్తోందని ఆయన విమర్శించారు. సీఈసీ సభ్యుడు కె.శివకుమార్ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

వేడుకలకు వైఎస్సార్ సీపీ దూరం


నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. జగన్‌ కోసం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు.

అవగాహనలేకే విమర్శలు: బాజిరెడ్డి

అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టత ఇచ్చిందని ఆ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. ఒక తండ్రిలా అందిరినీ సమన్యాయం చేయమనడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ ప్రకటనపై అవగాహన లేనివారు మాత్రమే అర్థంలేని విమర్శలు చేస్తున్నారని బాజిరెడ్డి అన్నారు.

sakshi news

Discussion: Books on YSR

YSRCP Away from New Year Celebrations

Aarogyasri Kiran's Condolence Meeting at YSRCP office

One Crore Signatures For Jagan's Release

More Response to One Crore Signatures For Jagan's Release

జగన్ కోసం... జనం సంతకం (One Crore Signatures For Jagan)











click above image for 
ONLINE SIGNATURE


తేదీ: 22 డిసెంబర్ 2012
మాన్యశ్రీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి...

ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేసుకుంటున్న విజ్ఞప్తి...

జగన్ కోసం... జనం సంతకం
     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, లోక్‌సభ సభ్యులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి మీద రాజకీయపరంగా బనాయించిన కేసును తీవ్రంగా గర్హిస్తున్నాం. నిజాలను నిర్థారించాల్సిన సీబీఐ సంస్థ- జగన్మోహనరెడ్డిని దోషిగా చిత్రీకరించటానికి అహర్నిశలు చేస్తున్న ప్రయత్నాలను, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా భావిస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్ళకు లొంగి, పక్షపాతంతో సీబీఐ చేస్తున్న దర్యాప్తు భారతదేశంలో అధికార వ్యవస్థల దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనమని మేమంతా భావిస్తున్నాం..

     ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నందుకు, అధికార పార్టీతో విభేదించి బయటకు వచ్చినందుకు వైయస్ జగన్మోహనరెడ్డిగారిని 200 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధంలో ఉంచటాన్ని మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కక్ష సాధింపులు ఆపాలని, ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని పెంచాలని కోరుతున్నాం.




మీరూ చేయికలపండి!

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి అక్రమ అరెస్టును నిరసిస్తూ 'జగన్ కోసం... జనం సంతకం' పేరిట ప్రారంభించిన కోటి సంతకాల సేకరణలో మీరూ పాలుపంచుకోండి. ఇందుకోసం ఈ కింద ఇచ్చిన ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సంతకాలు చేసిన తర్వాత ఫార్మ్‌లో తెలిపిన పార్టీ కేంద్ర కార్యాలయం చిరునామాకు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించగలరు.

Plot No.883-884, Road Number. 45
Jubilee Hills, Hyderabad - 500033
AndhraPradesh, India.
040-23609696 , 23609595 ,

జగన్‌ కోసం జనం సంతకం కార్యక్రమానికి పెద్ద ఎత్తున సంఘీభావం

 కుటిల రాజకీయాలపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జననేత వైఎస్ జగన్ ను తమ నుంచి దూరం చేయటాన్ని నిలదీస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో టీడీపీ, సీబీఐ కుమ్మక్కై చేస్తున్న కుట్రలపై మండిపడుతున్నారు. జగన్‌ కోసం జనం సంతకం కార్యక్రమానికి పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతున్నారు. 

*హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ చౌరస్తాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేపట్టిన జగన్‌ కోసం జనం సంతకం కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది.
*నారాయణగూడలో వైఎస్‌ఆర్ సీపీ నేతల ఆధ్వర్యంలో జగన్ కోసం జనం సంతకం కార్యక్రమానికి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

*గుంటూరు జిల్లా నరసరావుపేట ఏంజిల్‌ టాకీస్‌ సెంటర్‌ వద్ద చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభించింది. డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలిపారు.
*మాచర్లలో జగన్ కోసం జనం సంతకం కార్యక్రమాన్ని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ప్రారంభించారు. 
*గుంటూరు లాడ్జిసెంటర్‌లో నగర్ ఎస్సీ కన్వీనర్ విజయ్‌కిషోర్ ఆధ్వర్యంలో జగన్ కోసం జనం సంతకం ప్రారంభమైన కార్యక్రమానికి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్ తదితరులు హాజరయ్యారు. 

*వైఎస్‌ జగన్‌ను విడుదల చేయాలని కోరుతూ విద్యార్థి లోకం గొంతెత్తి నినదిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన కోటిసంతకాల సేకరణ శిబిరం యువతతో కిక్కిరిసి పోయింది. లక్షలాది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌తో ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించిన మహానేత తనయుడిని జైలుపాల్జేయటంపై యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొని జగన్‌ను తక్షణం విడుదల చేయాలని కోరుతోంది.

*వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. అన్ని వర్గాలు ప్రజలకు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ సంతకాలు చేశారు. ప్రజల ఆశీస్సులతో త్వరలోనే జగన్‌ బయటకు వస్తారని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

*జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. వర్షాన్ని సైతం లెక్కచేయని జనం... సంతకాలు చేయడానికి భారీగా క్యూకట్టారు. వైఎస్‌ జగన్‌ అండగా మేమున్నామంటూ పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు.

*వైఎస్‌ఆర్ సీపీ యువజన విభాగం నేత సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఒంగోలులో జగన్ కోసం జనం సంతకం కార్యక్రమం చేపట్టారు.

*వైఎస్‌ఆర్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో జగన్‌ కోసం జనం సంతకం కార్యక్రమంలో కడప మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. 

వైయస్‌ఆర్‌సిపిపై దాడులు చేస్తే తస్మాత్‌


తెలంగాణ ఉద్యమం నెపంతో టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ జేబు సంస్థలు కొన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, శ్రేణులపై దాడులకు ప్రయత్నిస్తున్నాయని వైయస్‌ఆర్‌ సిపి రీజినల్‌ కో ఆర్డినేటర్‌ జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోపించారు. తమ పార్టీ శ్రేణులపై అకారణంగా ఎవరైనా దాడి చేస్తే సహించేది లేదని ఆయన శనివారం ఇక్కడ హెచ్చరించారు.

ఉస్మానియా జెఎసి ముసుగులో కేసీఆర్ జేబు సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ కార్యకర్తలు కొందరు తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసేందుకు యత్నిస్తున్నారని బాలకృష్ణారెడ్డి మండిపడ్డారు. నిజంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం జేఏసీవారే వస్తే వారిని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ చర్చలకు ఆహ్వానిస్తుందని అన్నారు.

http://www.ysrcongress.com/news/news_updates/vaiyas_aar_sipipai_daaDulu_chaestae_tasmaat___jiTTaa.html

కాంతి కిరణం కడలి తరంగం


రాష్ట్ర రాజకీయ చరిత్రలో అలుపెరగని పోరాట ధీరుడు, చరిత్రను తిరగరాసిన వ్యక్తి జగన్. ఎందుకంటే నేను ఈ రోజు ఇలా పత్రికాముఖంగా రాస్తున్నానంటే, అంతా వైఎస్సార్‌గారి చలవే! ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ ద్వారా నేను బతికినవాణ్ని. మూడేళ్ల క్రితం నాకు ‘హార్ట్ స్ట్రోక్’ రావడం, ఆసుపత్రిలో చేరడం, ఆరోగ్యశ్రీ ద్వారా అన్నీ చకచకా అమరడం జరిగిపోయాయి. ఆ సమయంలో ఆ వార్డులో అందరూ నాలాంటి వాళ్లే. అందరూ ఆయన గురించి మాట్లాడుతుంటే, నా కళ్లు చెమర్చాయి. నాలాంటి వాళ్లందరూ కలిసి ఆయనకు కన్నీళ్లతో పాదాభిషేకం చేసినా రుణం తీరదు. కాని విధి ఆడిన వింత నాటకంలో ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఆ రోజు ఆయన పెట్టిన పథకాలన్నీ ఈరోజు తుంగలోనే తొక్కేస్తున్నారు నేటి రాజకీయ రాబందులు. అందుకే నేనున్నానంటూ ఓ కాంతి కిరణంలా, అల్లూరి సీతారామరాజులా, ఉవ్వెత్తున లేచిన కెరటంలా ప్రజలను ఓదార్చడానికి వస్తున్నానని జగన్ బయలుదేరితే, కొన్ని దుష్టశక్తులు దిగమింగుకోలేక, నానా రకాలుగా ఆయనను ఇబ్బందిపెట్టి, వేధింపులకు గురిచేసి ఆఖరికి జైలుకి పంపించారు.

కాని ఈ నాయకులు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. జగన్ సీఎం అయ్యే రోజు వస్తుంది. ఆ రోజుకోసం మాలాంటివాళ్ల వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాం. జగనన్నపై ప్రజల్లో ఉన్న ఆదరణకు ఈ రోజు షర్మిల పాదయాత్రకు లభిస్తున్న ఆదరణే సాక్ష్యం. ఆ తల్లి వేసిన ప్రతి అడుగూ నాయకుల గుండెల్లో దడ పుట్టించింది. అలాగే ఆమె వేయబోయే ఒక్కొక్క అడుగూ ప్రతి నాయకుడి గుండెనూ చీలుస్తుంది. ఇది నిజం. త్వరలోనే కాంగ్రెస్ నాయకులు పశ్చాత్తాప్పడే రోజు వస్తుంది. ఒక వ్యక్తిమీద ఇంత కక్ష్యా? ఇంత అమానుషమా? ఎందుకు? ఇంత కుళ్లు, కుతంత్రాలు ఎందుకు? ప్రతి పేదవాడి పక్షాన జగన్ నిలబడ్డాడు. సమయం వచ్చినప్పుడు అదే పేదవాడు ఆయనను అందలం ఎక్కిస్తాడు. ఆ పరిణామానికి ప్రతి రాజకీయనాయకుడు జగన్‌కు దాసోహం అనే రోజు ఎంతోదూరంలో లేదు.
- వాండ్రంగి ప్రసాద్, శ్రీకాకుళం

ప్రజాకోర్టులో జగన్ నిర్దోషి

గత ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కారణమైన ఏకైక వ్యక్తి వైఎస్సార్. దేశంలో ఏ ముఖ్యమంత్రీ అమలు చేయని సంక్షేమ పథకాలు ఆయన అమలు చేశారు. ఇతర ముఖ్యమంత్రులకు ప్రాయులయ్యారు. వై.ఎస్. హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచింది. దురదృష్టవశాత్తూ ఆయన మరణానంతరం రాష్ట్రం అన్నింట్లోనూ అథోగతి పాలై అథమ స్థానానికి దిగజారింది. ప్రజల కష్టసుఖాలు పట్టించుకునే నాథుడే కరువైనాడు. పాలక పక్షం, ప్రతిపక్షం రెండూ కలిసి జగన్‌ను జైలుకు పంపించేందుకు కుట్ర పన్నాయి తప్ప, ప్రజాసమస్యలపై దృష్టి పెట్టలేదు.

రాజ్యాంగపరంగా మనదేశంలో న్యాయవ్యవస్థకు అత్యున్నత స్థానం ఉంది. అటువంటి న్యాయ వ్యవస్థనే కాంగ్రెస్ నాయకులు తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేశారు. సీబీఐని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వం జగన్‌ని దోషిగా నిరూపించాలని ఎంత ప్రయత్నించినా గడిచిన ఉప ఎన్నికల్లో వై.ఎస్.జగన్ నాయకత్వం వహించిన వైఎస్సార్ పార్టీకి ప్రజలు (ప్రజాకోర్టులో) అఖండ మెజార్టీనిచ్చి, జగన్ నిర్దోషి అని నిరూపించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనదేశంలో ప్రజాతీర్పే శిరోధార్యం. ఎంతటివారైనా ప్రజాతీర్పుకు కట్టుబడాల్సిందే. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం విశ్వాసం ఉన్నా ప్రభుత్వం, ప్రతిపక్షం ఇకనైనా ప్రజాతీర్పుకు కట్టుబడి, వక్ర బుద్ధి మార్గాలు మాని, కళ్లు తెరవాలని కోరుతూ... త్వరలోనే రాజన్న రాజ్య స్థాపన కోసం జగనన్న నిర్దోషిగా బయటికి రావాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నాం.

- బలిరెడ్డి రామచంద్ర
బాట జంగాలపాలెం, సబ్బవరం, విశాఖపట్నం


చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.e-mail: ysjagankosam@gmail.com

వైఎస్సార్సీపీ అభిప్రాయాన్ని హర్షిస్తున్నాం

 తెలంగాణపై కేంద్ర హోంశాఖ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ వెల్లడించిన అభిప్రాయాన్ని తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు ప్రత్యేక ఆంధ్రసాధన సమితి పేర్కొంది. ఈ మేరకు ఆ సంస్థ కన్వీనర్ చేగొండి హరరామజోగయ్య శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఎవరికీ అన్యాయం జరుగకుండా త్వరగా ఈ సమస్యకు ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని చెప్పడాన్ని తాము హర్షిస్తున్నామన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల సమస్యలనే వైఎస్సార్సీపీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లుగా తాము భావిస్తున్నామని, సమస్యను జటిలం చేయకుండా వెంటనే ఓ పరిష్కారం కావాలనే వారి సంకల్పానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. 

‘జగన్ కోసం..’ సంతకాల వెల్లువ

కార్యక్రమానికి విశేష స్పందన

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు, సీబీఐ పక్షపాత ధోరణికి నిరసనగా ఆ పార్టీ ‘జగన్ కోసం.. జనం సంతకం’ పేరుతో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. మహానేత వైఎస్ మరణం, ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ కుట్రలు, కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కై ఉప ఎన్నికల ముందు హఠాత్తుగా జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేయించిన వైనం, ఆ తర్వాత సీబీఐ లీకులు, బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారీ అబద్ధపు కథనాల డ్రామాలను ప్రజలకు వివరించి.. జగన్ అక్రమ అరెస్టుకు నిరసనగా వారి వద్ద సంతకాలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమం తలపెట్టారు. అయితే ఈ విషయం తెలిసి జనమే స్వచ్ఛందంగా పార్టీ నేతలు, కార్యాలయాల వద్దకు వచ్చి సంతకాలు చేస్తున్నారు. 

తమ కుటుంబీకులను, సన్నిహితులను, స్నేహితులను తీసుకొచ్చి సంతకాలు చేయిస్తున్నారు. రోడ్లపై వైఎస్సార్ కాంగ్రెస్ జెండాతో నేతలెవరైనా కనిపిస్తే వచ్చి.. కోటి సంతకాల గురించి ఆరా తీస్తున్నారు. సంతకాలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఈ కార్యక్రమాన్ని మరింత చేరువ చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్.. ఇంటర్నెట్‌లో కూడా సంతకాల సేకరణ ప్రారంభించింది. www.ysrcongress.com సైట్‌లో ఈ సంతకాలకు ప్రత్యేకంగా లింక్ ఏర్పాటు చేసింది. ఈ సైట్‌లోకి వెళ్లి ‘జగన్ కోసం.. జనం సంతకం’ లోగో మీద క్లిక్ చేసి తర్వాత అక్కడ ఇచ్చిన సూచనలు అనుసరించడం ద్వారా ప్రజలు సంతకాలు చేయవచ్చు. 

లేదా www.ysrcongress.com/home/koti_santhakaalu.htm లింక్‌ను నేరుగా బ్రౌజర్‌లో ఓపెన్ చేయడం ద్వారా కూడా ఆ సంతకాల పేజీకి చేరుకోవచ్చు. అడుగున ఉండే రెండు ఆప్షన్లలో (1. కోటి సంతకాల ఫామ్ డౌన్‌లోడ్ చేసుకుని సంతకం చేసి వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయానికి పంపడం, 2. ఆన్‌లైన్‌లో నేరుగా సంతకం చేయడం) ఏదో ఒక దాని ద్వారా సంతకం చేయవచ్చు. జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినమైన డిసెంబర్ 21న మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో కోటి సంతకాలు పూర్తయిన తర్వాత.. ఆ పత్రాలను పార్టీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపాలని నిర్ణయించింది.

జననేత కోసం రెహమాన్ నెత్తుటి సంతకం

జననేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైఎస్సార్‌సీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రెహమాన్ జోస్యం చెప్పారు. జగన్ నిర్బంధాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీసెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెహమాన్ తన రక్తంతో సంతకం చేసి సంతకాల సేకరణను ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ముస్లింలకు ఉన్నత విద్యలో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడం, ఉపకార వేతనాలు ఇప్పించడంతో ప్రస్తుతం ఎందరో మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారన్నారు. అందువల్ల ఆయన తనయుడైన జగన్‌కు రాష్ట్రంలోని మైనారిటీలు అండగా ఉన్నారన్నారు.

మహిళా రక్షణ చట్టాలను సమీక్షించాలి

దేశ రాజధానిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతి నిర్భయ మృతి నేపథ్యంలో మహిళలకు రక్షణ కల్పించే చట్టాల సమీక్షకు తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. శనివారమిక్కడ ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బాధితురాలి కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. దేశంలో మహిళల రక్షణకు పెనుమార్పులు తేవాల్సిన ఆవశ్యకతను ఈ ఉదంతం చాటిచెబుతోందన్నారు. 
యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరు అత్యంత గర్హనీయమని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న యువతను ఎలా అదుపు చేయాలనే ప్రభుత్వం ఆలోచిస్తోందని, మహిళల రక్షణపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. శాంతి భద్రతల కోణంలో ఆలోచించే విషమ పరిస్థితిలో ఉన్న నిర్భయను ఢిల్లీ నుంచి సింగపూర్‌కు తరలించారన్నారు. బాధితురాలిని తరలించవద్దని వైద్యులు సూచించినా పట్టించుకోలేదంటే ఇందులో రాజకీయ కోణం ఉందని సోనియా నివాసమైన 10 జన్‌పథ్‌లో ఈ నిర్ణయం జరిగినట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మహిళలు అర్థరాత్రి పూట ఎందుకు తిరగాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటాన్ని చూస్తుంటే స్త్రీల పట్ల ఆయనకు ఎంత చులకన అభిప్రాయం ఉందో అర్థమవుతోందన్నారు. నిరసనలో పాల్గొంటున్న వారిని ఉద్దేశించి రాష్ట్రపతి కుమారుడు అభిజిత్ చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. 

నిర్భయకు వైఎస్సార్ సీపీ నివాళులు

సింగపూర్‌లో చికిత్స పొందుతూ బాధితురాలు నిర్భయ మృతి చెందినట్లు తెలిసిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. వాసిరెడ్డి పద్మతోపాటు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకురాలు గాయత్రి, పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పార్లమెంట్‌ను సమావేశపర్చాలి: వాసిరెడ్డి

Written By news on Saturday, December 29, 2012 | 12/29/2012

దేశ రాజధానిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతి నిర్భయ మృతి నేపథ్యంలో మహిళలకు రక్షణ కల్పించే చట్టాల సమీక్షకు తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. శనివారమిక్కడ ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 13 రోజులపాటు మృత్యువుతో పోరాడి చనిపోయిన బాధితురాలి కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. దేశంలో మహిళల రక్షణకు పెనుమార్పులు తేవాల్సిన ఆవశ్యకతను ఈ ఉదంతం చాటిచెబుతోందన్నారు. యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన తీరు అత్యంత గర్హనీయమని మండిపడ్డారు.

జగన్ కోసం... జనం సంతకం (One Crore Signatures For Jagan)











click above image for 
ONLINE SIGNATURE


తేదీ: 22 డిసెంబర్ 2012
మాన్యశ్రీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి...

ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేసుకుంటున్న విజ్ఞప్తి...

జగన్ కోసం... జనం సంతకం
     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, లోక్‌సభ సభ్యులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి మీద రాజకీయపరంగా బనాయించిన కేసును తీవ్రంగా గర్హిస్తున్నాం. నిజాలను నిర్థారించాల్సిన సీబీఐ సంస్థ- జగన్మోహనరెడ్డిని దోషిగా చిత్రీకరించటానికి అహర్నిశలు చేస్తున్న ప్రయత్నాలను, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా భావిస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్ళకు లొంగి, పక్షపాతంతో సీబీఐ చేస్తున్న దర్యాప్తు భారతదేశంలో అధికార వ్యవస్థల దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనమని మేమంతా భావిస్తున్నాం..

     ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నందుకు, అధికార పార్టీతో విభేదించి బయటకు వచ్చినందుకు వైయస్ జగన్మోహనరెడ్డిగారిని 200 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధంలో ఉంచటాన్ని మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కక్ష సాధింపులు ఆపాలని, ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని పెంచాలని కోరుతున్నాం.




మీరూ చేయికలపండి!

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి అక్రమ అరెస్టును నిరసిస్తూ 'జగన్ కోసం... జనం సంతకం' పేరిట ప్రారంభించిన కోటి సంతకాల సేకరణలో మీరూ పాలుపంచుకోండి. ఇందుకోసం ఈ కింద ఇచ్చిన ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సంతకాలు చేసిన తర్వాత ఫార్మ్‌లో తెలిపిన పార్టీ కేంద్ర కార్యాలయం చిరునామాకు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించగలరు.


Plot No.883-884, Road Number. 45
Jubilee Hills, Hyderabad - 500033
AndhraPradesh, India.
040-23609696 , 23609595 ,
http://www.ysrcongress.com/home/koti_santhakaalu.html

Popular Posts

Topics :